కలకలం: రోడ్డుపై కరెన్సీ నోట్ల ముక్కల సంచులు.. | Nizamabad: Bags of Cut Currency Notes pics On National Highway | Sakshi

నిజామాబాద్‌: రోడ్డుపై కత్తిరిచ్చిన కరెన్సీ నోట్ల ముక్కల సంచులు

Published Thu, Dec 30 2021 8:44 AM | Last Updated on Thu, Dec 30 2021 10:48 AM

Nizamabad: Bags of Cut Currency Notes pics On National Highway - Sakshi

సాక్షి, బాల్కొండ: నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిపై కత్తిరిచ్చిన కరెన్సీ నోట్ల ముక్కల సంచులు పడి ఉండటం కలకలం రేపింది. ఇందులో కొత్త 500, 2000 నోట్లను ముక్కలుగా చేసి సంచుల్లో నింపారు. ఆర్మూర్‌ నుంచి నిర్మల్‌ వైపు వెళ్లే దారిలో వీటిని పడేశారు. నోట్ల ముక్కల సంచులపై నుంచి వాహనాలు వెళ్లడంతో చెల్లా చెదురుగా రోడ్డుపై ఎగిరి పడ్డాయి. రవాణా చేస్తుండగా వాహనంలో నుంచి పడి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: HYD: ఇక్కడ అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు?  

సమాచారం అందడంతో ఏఎస్సై మురళీధర్‌ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. శాంపిళ్లను సేకరించి, ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. బుస్సాపూర్‌ వద్ద జాతీయ రహదారి పక్కన ఆరేళ్ల కిందట కూడా ఇలాంటి నోట్ల ముక్కలే పడేశారు. ఒకే గ్రామంలో రెండు సార్లు కరెన్సీ నోట్ల ముక్కలు పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కరెన్సీ ముక్కలను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో తెలుసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.  
చదవండి: న్యూ ఇయర్‌ వేడుకలకు గ్రీన్‌ సిగ్నల్‌.. అరకొరే...అయినా హుషారే... 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement