![Non Bailable Warrant Has Been Issued To TRS MLA Vinay Bhaskar - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/27/MLA.jpg.webp?itok=wNIxeen0)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్కు ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ 2012 కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన ఆందోళనలో దాస్యం వినయ్ భాస్కర్తో పాటు పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ ఘటనలో వినయ్ భాస్కర్తో పాటు మరో 8 మందిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాకపోవడంతో తొమ్మిది మందికి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment