non bailable warrant
-
13 ఏళ్లకు పట్టుబడ్డాడు!
సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆచూకీ 13 ఏళ్లుగా చిక్కలేదు... కోర్టు నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా జాడ దొరకలేదు... దీంతో పోలీసులు ఆ కేసు మూసేయాలని భావించారు... ఈ సమయంలో రంగంలోకి దిగిన నార్త్జోన్ టాస్్కఫోర్స్ టీమ్ నిందితుడిని పట్టుకుంది. అతగాడిని తదుపరి చర్యల నిమిత్తం మహంకాళి పోలీసులకు అప్పగించినట్లు టాస్్కఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్ర శుక్రవారం వెల్లడించారు. చైతన్యపురి ప్రాంతానికి చెందిన కె.భరద్వాజ్ రావు అలియాస్ గోపాల్రెడ్డి మరో ఇద్దరితో కలిసి 2011లో భారీ కుట్ర పన్నాడు. వీరిలో ఒకరి ద్వారా పుణే కేంద్రంగా కార్యకలాపాలు సాగించే రమెలెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెక్కు చోరీ చేయించాడు. అదే ఏడాది ఆగస్టు 22న సికింద్రాబాద్, ఎస్డీ రోడ్లోని ఎస్బీఐ బ్రాంచ్లో తన వివరాలు, ఫొటో ఆధారంగా గోపాల్రెడ్డి పేరుతో ఓ సేవింగ్స్ ఖాతా తెరిచాడు. ఆపై పుణే సంస్థ చెక్కుపై గోపాల్రెడ్డి పేరు రాసి రూ.90 లక్షలకు సిద్ధం చేశాడు. దీన్ని బ్యాంక్కు తీసుకువెళ్లిన భరద్వాజ్ అధికారులకు అందించి తాను గోపాల్రెడ్డి పేరుతో తెరిచిన ఖాతాలోకి నగదు మళ్లించాడు. ఆపై ఆ ఖాతాకు సంబంధించిన సెల్ఫ్ చెక్ ఇచ్చి ఆ మొత్తం డ్రా చేసుకోవాలని ప్రయతి్నంచాడు. అయితే ఆ ఖాతా కొత్తగా తెరిచింది కావడంతో పాటు ఒకేసారి భారీ మొత్తం డ్రా చేసే ప్రయత్నం చేయడంతో బ్యాంకు సిబ్బందికి అనుమానం వచి్చంది. నగదు ఇవ్వడానికి కొంత సమయం కోరిన వారు అప్పటికి భరద్వాజ్ను పంపేశారు. ఈ విషయాన్ని ఫ్యాక్స్ ద్వారా పుణే సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సదరు సంస్థ తమ చెక్కు చోరీ అయిందని, ఆ మొత్తం డ్రా చేసుకోనీయ వద్దని సమాధానం ఇచ్చారు. దీంతో బ్యాంకు అధికారులు గోపాల్రెడ్డిగా చెప్పుకున్న భరద్వాజ్పై మహంకాళి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు భరద్వాజ్తో సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భరద్వాజ్ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. అప్పటి నుంచి కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో కోర్టు 2018లో ఆ కేసు నుంచి భరద్వాజ్ను వేరు చేసి, మిగిలిన ఇద్దరినీ విచారించింది. న్యాయస్థానం భరద్వాజ్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఇతడిపై ఉన్న కేసును లాంగ్ పెండింగ్ కేటగిరీలో మూసేయాలని అధికారులు భావించారు. ఆ సమయంలో నార్త్జోన్ టాస్్కఫోర్స్ దృష్టికి ఈ విష యం వచ్చింది. ఇన్స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో ఎస్సైలు పి.గగన్దీప్, సి.రాఘవేంద్రరెడ్డి, శ్రీనివాసులు దాసు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలను బట్టి భరద్వాజ్ కొత్తపేటలో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే అనేక చోట్ల ఇళ్లు, ఫోన్ నెంబర్లు మార్చిన అతగాడిని చాకచక్యంగా పట్టుకున్నారు. -
ఒక దొంగ... తొమ్మిది వారెంట్లు!
సాక్షి, హైదరాబాద్: సొత్తు సంబంధిత నేరాల్లో నిందితుడిగా ఉండి మూడున్నర ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న రాజస్థాన్ వాసి ప్రదీప్ను సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇతగాడిపై మూడు పోలీసుస్టేషన్ల పరి«ధిలో తొమ్మిది నాన్–బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ) పెండింగ్లో ఉన్నట్లు క్రైమ్స్ డీసీపీ కె.నర్సింహ్మ సోమవారం తెలిపారు. రాజస్థాన్లోని బిచౌలా గ్రామానికి చెందిన ప్రదీప్ కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. నిర్మాణరంగంలో కార్మికుడిగా పని చేసిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం దొంగగా మారాడు. కన్స్ట్రక్షన్ కంపెనీలు, నిర్మాణ స్థలాలను టార్గెట్గా చేసుకున్న ఇతగాడు వాటి నుంచి ఇనుము, అల్యూమినియం తదితర వస్తువులు చోరీ చేసి అమ్మేవాడు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇతడిపై కొల్లూరు, మోకిలా, నార్సింగి పోలీసుస్టేషన్ల పరిధిలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఓ సందర్భంలో మారణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2021లో ఇతగాడిని కొల్లూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై బయటకు వచ్చిన ప్రదీప్ తన స్వస్థలానికి వెళ్లిపోయారు. ఈ తొమ్మిది కేసుల్లోనూ కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానాలు ఎన్బీడబ్ల్యూలు జారీ చేశాయి. మూడున్నరేళ్లుగా ఇతగాడి ఆచూకీ ఎవరికీ లభించలేదు. దీంతో ప్రదీప్ అరెస్టు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సైబరాబాద్ సీసీఎస్ అధికాలు రాజస్థాన్కు పంపారు. ముమ్మరంగా గాలించిన పోలీసులు శనివారం రాజస్థాన్లో పట్టుకున్నారు. అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచిన అధికారులు పీటీ వారెంట్పై ఇక్కడకు తీసుకువచ్చారు. కొల్లూరు పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. మిగిలిన ఎనిమిది కేసుల్లోనూ ఇతడిని అరెస్టు చూపించనున్నారు.నిద్రించడానికి స్థలం లేదని వాహనాలకు నిప్పంటించాడు -
యడ్యూరప్పపై అరెస్టు వారెంట్
బెంగళూరు: లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం(పోక్సో) కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప(81)పై బెంగళూరు కోర్టు గురువారం నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే ఆయనకు సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ, యడ్యూరప్ప హాజరు కాకపోవడంతో సీఐడీ బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. యడ్యూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, తిరిగివచి్చన తర్వాత సీఐడీ ఎదుట హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన తన కుమార్తెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అకృత్యానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యడ్యూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐసీసీ సెక్షన్ 354 కింద ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరు సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గంటల వ్యవధిలోనే కర్ణాటక డీజీపీ ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. తనపై వచి్చన ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యడ్యూరప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ గత నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు అంతకుముందే రికార్డు చేశారు. పోక్సో కేసులో యడ్యూరప్పను సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర చెప్పారు. దీనిపై సీఐడీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. -
పాత నేరస్తుల పని పడుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తులను, నిందితులను తెలంగాణ సీఐడీ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి తీసుకువస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పారిపోయిన మోసగాళ్లను సైతం కటకటాల వెనక్కి నెడుతున్నారు. గత 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నాన్బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) అమలు కోసం తెలంగాణ సీఐడీ విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ టీం సత్ఫలితాలిస్తోంది. 2023 ఫిబ్రవరిలో ఈ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొత్తం 212 నాన్బెయిలబుల్ వారెంట్లను పరిష్కరించారు. రూ.కోట్లలో అమాయకులను మోసగించి దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరస్తులపై ఎస్పీ రామ్రెడ్డి నేతృత్వంలోని ఈ ఎన్బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ బృందం ఫోకస్ పెట్టింది. ఫలితంగా పాత కేసులలోనూ చిక్కుముడులు వీడుతున్నాయి. మొత్తంగా ఏడాదికాలవ్యవధిలో 156 ఎన్బీడబ్ల్యూల సమాచారం ప్రత్యేక బృందం సేకరించింది. 56 మంది పాత నేరస్తులను అరెస్టు చేసింది. ఇటీవల అమలు చేసిన ఎన్బీడబ్ల్యూ కేసులు కొన్ని.. ► మంచిర్యాల టౌన్లో 1995 నమోదైన ఒక డెకాయిటీ కేసులో 29 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అప్పల సత్తయ్య అనే నేరస్తుడిని ఈ ఏడాది జనవరి 24న కరీంనగర్లో అరెస్టు చేసింది. ► ఆన్లైన్ ఓఎల్ఎక్స్ మోసం కేసులో ఎనిమిదేళ్లుగా సీఐడీ సైబర్క్రైం పోలీసులకు చిక్కకుండా ఉన్న సోహాల పొద్దార్ అనే పాత నిందితుడిని ముంబైలో ఈ ఏడాది జనవరి 29 ఎన్బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ టీం అరెస్టు చేసింది. ► కృషి బ్యాంకు కుంభకోణం కేసులో 22 ఏళ్లుగా పరారీలో ఉన్న ఆ బ్యాంకు డైరెక్టర్ కాగితాల శ్రీధర్ను గతేడాది సెప్టెంబర్ 25న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అరెస్టు చేసింది. సాంకేతికత వినియోగంతో సమాచారం కూపీ లాగుతారు.. మోసాలు చేయడంలో దిట్ట అయిన సదరు పాత నేరస్తులను గుర్తించేందుకు తెలంగాణ సీఐడీ ఎన్బీడబ్ల్యూ స్పెష ల్ ఎగ్జిక్యూషన్ టీం సాంకేతికతను వినియోగిస్తోంది. నేర స్తుల సీడీఆర్ (కాల్ డీటెయిల్డ్ రికార్డ్), బ్యాంకు ఖాతాల కు లింక్ అయిన ఉన్న మొబైల్ నంబర్ల ఆధారంగా, అదేవిధంగా స్విగ్గీ, ఓయో, ర్యాపిడో, అమెజాన్ డాటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. సైకాప్స్ అప్లికేషన్ ద్వారా కూడా వివరాలు విశ్లేíÙస్తున్నారు. గ్యాస్ కనెక్షన్, మొబైల్ నంబర్కు ఇచ్చే ఆధారాలు, సోషల్ మీడియా ఖాతాల్లో ఫో న్ నంబర్లు ఇలా...అన్ని కోణాల్లో సదరు నిందితుల సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడున్నాడనేది స్పష్టత వచి్చన తర్వాత క్షేత్రస్థాయిలో ఆపరేషన్ చేపడుతున్నారు. -
జయప్రదను అరెస్ట్ చేయండి..
రామ్పూర్(యూపీ): గత లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినపుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసులో మాజీ ఎంపీ, నటి జయప్రదను అరెస్ట్చేయాలని అక్కడి రామ్పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అరెస్ట్చేసి మార్చి నెల ఆరోతేదీన తమ ఎదుట ప్రవేశపెట్టాలని సూచించింది. 2019లో ఎన్నికల ప్రవర్తనానిబంధనావళి ఉల్లంఘనపై కేమారి, స్వార్ పోలీస్స్టేషన్లలో జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయమై తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక ఎంపీ – ఎమ్మెల్యే కోర్టు జయప్రదకు సూచించింది. అయినా ఆమె రాకపోవడంతో ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ – బెయిలబుల్ వారెంట్లు జారీఅయ్యాయి. ఇంత జరిగినా ఆమె కోర్టుకు రాకపోవడంతో జయను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా జడ్జి ప్రకటించారు. -
జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి
లక్నో: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తర్ప్రదేశ్లోని ఓ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై ఇదివరకే రెండు కేసులు నమోదు కాగా, ఆమె విచారణకు హాజరు కావడం లేదు. అందుకే ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది. జయప్రద 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా తరఫున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. -
సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ క్రికెటర్పై నాన్ బెయిలబుల్ వారెంట్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒకనాటి సహచరుడు, టీమిండియా మాజీ ఆటగాడు ప్రశాంత్ వైద్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో నాగ్పూర్ పోలీసులు (బజాజ్ నగర్) వైద్యను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు వైద్యను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా.. పూచికత్తుపై అతన్ని విడుదల చేశారు. నాగ్పూర్కు చెందిన ఓ వ్యాపారిని చీట్ చేసిన కేసులో పోలీసులు ఈ మాజీ క్రికెటర్ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నాగ్పూర్కు చెందిన వ్యాపారి నుంచి వైద్య 1.9 కోట్లు విలువ చేసే స్టీల్ కొనుగోలు చేసి, అందుకు బదులుగా చెక్లకు ఇచ్చాడు. అయితే చెక్లు బౌన్స్ కావడంతో సదరు వ్యాపారి వైద్యను పలు మార్లు నగదు చెల్లించాల్సిందిగా కోరాడు. డబ్బు చెల్లించాలని వైద్యను ఎన్ని సార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో ఆ వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు పలు నోటీసులు ఇచ్చిన అనంతరం వైద్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన బజాజ్ నగర్ పోలీసులు వైద్యను అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. 56 ఏళ్ల ప్రశాంత్ వైద్య 1995-96 మధ్యలో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలతో కలిసి 4 వన్డే మ్యాచ్ల్లో (4 వికెట్లు) టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అప్పట్లో వైద్య భారత జట్టులో ఉత్తమ ఫాస్ట్ బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వైద్య మహారాష్ట్రకు చెందినప్పటికీ బెంగాల్ తరఫున దేశవాలీ క్రికెట్ ఆడాడు. వైద్య తన ఫస్ట్క్లాస్ కెరీర్లో 56 మ్యాచ్లు ఆడి 171 వికెట్లు పడగొట్టాడు. వైద్య ప్రస్తుతం విదర్భ క్రికెట్ అసోసియేషన్ డెవలప్మెంట్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నాడు. -
ఎన్సీటీఈ డిప్యూటీ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలున్నప్పటికీ విచారణకు గైర్హాజరు కావడం పట్ల జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) డిప్యూటీ కార్యదర్శిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)) జారీ చేసింది. ఆయనను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. తమ కాలేజీ గుర్తింపును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్మెన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ పీడీ చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. గత విచారణ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ.. గుర్తింపు రద్దు కోసం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చామని, అయినా కూడా ఆ వివరణను పరిగణనలోకి తీసుకోకుండా గుర్తింపు రద్దు చేస్తూ జూలై 7, 2020లో ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీనిపై ఎన్సీటీఈ ముందు ఆన్లైన్లో అప్పీల్ దాఖలు చేశామని, చట్టం నిర్దేశించిన ఫీజు కూడా చెల్లించామన్నారు. అలాగే పోస్టు ద్వారా వినతిపత్రం కూడా పంపామని తెలిపారు. అయితే తమ ముందు ఎలాంటి అప్పీల్ దాఖలు చేయలేదని ఎన్సీటీఈ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్సీటీఈ డిప్యూటీ కార్యదర్శి ఈ నెల 18న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన విచారణకు డిప్యూటీ కార్యదర్శి రాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కొట్టేసిన న్యాయమూర్తి డిప్యూటీ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. -
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు ఊహించని షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఊహించని షాక్ తగిలింది. ఇమ్రాన్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ మేరకు లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఇమ్రాన్ఖాన్ సహా ఆయన పార్టీ పీటీఐ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. వివరాల ప్రకారం.. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో పీటీఐ పార్టీ నేతలు పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మే 9న జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇమ్రాన్ సహా పీటీఐ నేతలపై రెండు కేసులు నమోదు చేశారు. అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ కార్యాలయం, ఓ కంటైనర్పై దాడి చేసి, తగలబెట్టారన్న ఆరోపణలపై లాహోర్ పోలీసులు మే 10వ తేదీన ఇమ్రాన్ సహా పీటీఐ నాయకులపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఈ క్రమంలో రెండు కేసుపై లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అబెర్ గుల్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్తో పాటు మరో ఆరుగురు పార్టీ నేతలపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. వారెంట్లు జారీ అయిన వారిలో ఇమ్రాన్ సహా.. పీటీఐ నేతలు హసన్ నియాజీ, అహ్మద్ అజార్, మురాద్ సయూద్, జంషెడ్ ఇక్బాల్ చీమా, ముసరత్ చీమా, మియాన్ అస్లాం ఇక్బాల్ ఉన్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో, ఇమ్రాన్ను మరోసారి పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. ఇది కూడా చదవండి: చైనా ఓవరాక్షన్.. భారత్, అమెరికాకు భంగపాటు -
ఇమ్రాన్కు ఊరట
ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాన్బెయిలబుల్ వారెంట్ను కోర్టు రద్దు చేసింది. శనివారం ఆయన ఇస్లామాబాద్లోని జిల్లా కోర్టులో హాజరయ్యారు. చేరుకున్నారు. పరిస్థితులు తీవ్రంగా ఉద్రిక్తంగా మారడంతో ఇమ్రాన్ హాజరైనట్టు కోర్టు ఆవరణలో వాహనంలోనే సంతకం తీసుకున్నారు. కోర్టు కాంప్లెక్స్లోకి ఇమ్రాన్ మద్దతుదారులు రాళ్లు రువ్వగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో విచారణ సాగదన్న జడ్జి, ఇమ్రాన్పై జారీ అయిన నాన్బెయిలబుల్ వారెంట్ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి అభియోగపత్రం లేకుండానే అక్కడి నుంచే తిరిగి వెళ్లేందుకు ఆయన్ను అనుమతించారు. విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు. ఇమ్రాన్ ఇస్లామాబాద్లో ఉండగానే లాహోర్లోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు జరిపారు. 20 రైఫిళ్లు, పెట్రోల్ బాంబులు దొరికాయన్నారు. విచారణకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇమ్రాన్ కాన్వాయ్లో మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. -
నటి జయప్రదకు షాక్, మాజీ ఎంపీపై నాన్ బెయిలబుల్ వారెంట్
సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాంపూర్ ప్రత్యేక కోర్టు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులకు సంబంధించి ఆమెకు వారెంట్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది అమర్నాథ్ తివారీ తెలిపారు. వివరాలు.. 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియయావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై వేర్వేరుగా రెండు కేసు నమోదయ్యాయి. చదవండి: తొలిసారి కూతురిని చూసి ఎమోషనలైన సింగర్ రేవంత్, వీడియో వైరల్ ఈ కేసుల విచారణ సమయంలో జయప్రద వరుసగా కోర్టుకు హాజరుకాకపోవడం కోర్టు ఆమె తీరుపై ఆగ్రం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే జయప్రదపై తాజాగా రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. అంతేకాదు వచ్చే మంగళవారం విచారణ సందర్భంగా జయప్రదని కోర్టులో హజరుపరచాలని రాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోర్టు ఆదేశించినట్లు న్యాయవాది అమర్నాథ్ తెలిపారు. ఇక ఈ కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచిన విజయ్.. తలైవాను అధిగమించాడా? కాగా 2019 ఏప్రిల్ 18న పిపారియా మిశ్రా గ్రామలో జరిగిన ఓ బహిరంగ సభకు సంబంధించి వీడియో నిఘా బృందం ఇన్ఛార్జ్ కుల్దీప్ భట్నాగర్ నమోదు చేశారు. అలానే.. స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్పూర్ గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో 2019 ఏప్రిల్ 19న ఫ్లయింగ్ స్క్వాడ్ మేజిస్ట్రేట్ నీరజ్ కుమార్ జయప్రద మీద మరో కేసు నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జయప్రద.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అజం ఖాన్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. -
అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు మంత్రులకు నాన్ బెయిలబుల్ వారెంట్!
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర శాసనసభా స్పీకర్, ఇద్దరు మంత్రులు సహా మొత్తం 9 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. నాన్ బెయిలబుల్ వారెంట్ అందుకున్న వారిలో స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, కేబినెట్ మంత్రులు గుర్మీత్ సింగ్ మీట్ హేయర్, లల్జిత్ సింగ్ భుల్లార్ సహా పలువురు ఆప్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సరిహద్దు జిల్లాలైన అమృత్సర్, తరన్ తరన్లో కల్తీ మద్యం మరణాలకు వ్యతిరేకంగా 2020, ఆగస్టులో నిరసనలు చేపట్టారు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. దీనికి సంబంధించి పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ప్రస్తుత స్పీకర్, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కేసులో భాగంగా కోర్టుకు హాజరుకావాలని ఇటీవలే ఆదేశించింది న్యాయస్థానం. అయితే, వారు హాజరుకాకపోటంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. మరోవైపు.. కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్(ఈఎన్ఏ) అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు ఎక్సైజ్, టాక్సేషన్ శాఖ మంత్రి హర్పల్ సింగ్ చీమా. రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి.. రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈఎన్ఏ రవాణాను నియంత్రించాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ‘ఆప్ ఎమ్మెల్యేలతో బేరమాడింది ఎవరు?’ -
చిక్కుల్లో నవనీత్ కౌర్ దంపతులు.. మళ్లీ అరెస్టుకు అవకాశం!
ముంబై: హనుమాన్ చాలీసా చాలెంజ్తో జైలుపాలై.. బెయిల్ మీద విడుదలైన ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు మళ్లీ చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జంటకు బెయిల్ రద్దు చేయాలంటూ ముంబై పోలీసులు సోమవారం స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే.. షరతుల్లో ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దన్న కూడా స్పష్టం చేసింది. ఒకవేళ మాట్లాడితే గనుక బెయిల్ దానంతట అదే రద్దు అయిపోతుందని హెచ్చరించింది కూడా. ఈ నేపథ్యంలో.. వాళ్లు మీడియాతో మాట్లాడినందుకుగానూ బెయిల్ రద్దు చేయాలని, అంతేకాదు వాళ్లమీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు తమ అభ్యర్థన పిటిషన్లో ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ముంబై పోలీసుల దరఖాస్తుపై స్పందించాలంటూ నవనీత్ కౌర్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. హనుమాన్ చాలీసా ఛాలెంజ్తో సీఎం ఉద్దవ్ థాక్రేకు ఎదురెళ్లిన ఈ ఇండిపెండెంట్ ప్రజా ప్రతినిధుల జంట.. రెచ్చగొట్టే చర్యల మీద అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. అయితే వీళ్ల బెయిల్ను సవాల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. ఈ లోపు.. ఢిల్లీలో ఈ జంట వరుసబెట్టి ప్రెస్ మీట్లు పెడుతోంది. పైగా సీఎం ఉద్దవ్ థాక్రేకు చాలెంజ్లు విసిరింది. మీడియాతో మాట్లాడడమే కాకుండా.. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నందుకుగానూ బెయిల్ రద్దు చేయాలంటూ ఖర్ పోలీస్ స్టేషన్ ఎస్సై.. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘారత్ ద్వారా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ జంట ప్రెస్ మీట్లకు సంబంధించిన వీడియోలను కోర్టు సైతం పరిశీలించినట్లు సమాచారం. దీంతో నవనీత్ కౌర్, ఆమె భర్త గనుక సరైన వివరణ ఇవ్వకుంటే మాత్రం వెంటనే అరెస్ట్ దిశగా కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: దమ్ముంటే పోటీ చేయ్.. ఉద్దవ్కు నవనీత్ సవాల్ -
సోనాక్షిపై నాన్ బెయిలబుల్ వారెంట్, స్పందించిన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైందని, తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సోనాక్షి స్పందించిన సోనాక్షి వాటిని ఖండించింది. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు వచ్చిన కథానాల్లో ఎమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రకటన ఇచ్చింది. ‘నాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. నాపై కావాలనే అబ్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చదవండి: రాధేశ్యామ్ షూటింగ్లో ప్రభాస్తో గొడవ, క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే దీనిపై నా స్టెంట్మెంట్ కూడా తీసుకోలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర చేస్తున్నాడు. కాబట్టి అన్ని మీడియా హౌజ్లు, జర్నలిస్టులకు నా వినతి ఏమిటంటే. ఈ కల్పిత వార్తను ప్రసారం చేయవద్దు. ఒకరి వ్యక్తిగత అజెండాకు వేదిక కల్పించవద్దు. సదరు వ్యక్తి ప్రచారం కోసం, నా నుంచి డబ్బును రాబట్టేందుకు.. ఎన్నో ఏళ్లుగా నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలపై దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ అంశం మురాదాబాద్ కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. చదవండి: కండోమ్ టెస్టర్గా రకుల్, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే.. కోర్టు ధిక్కారం కింద సదరు వ్యక్తిపై నా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుంది. కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఈ అంశంపై నా వివరణ ఇదే’ అంటూ సోనాక్షి తెలిపింది. కాగా ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న సోనాక్షి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా ఈవెంట్ నిర్వాహకుడు అడగడంతో సోనాక్షి మేనేజర్ నిరాకరించినట్లు అతడు ఆరోపించాడు. దీంతో సోనాక్షిపై కేసు నమోదైంది. -
చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా వివాదంలో చిక్కుకుంది. చీటింగ్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న దబాంగ్ నటి ఆ కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. దీంతో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడిగినా అందుకు సోనాక్షి మేనేజర్ తిరస్కరించాడు. ఈ విషయంపై సోనాక్షిని స్వయంగా సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమెపై చీటింగ్ కేసు దాఖలు చేశాడు. కేసు విచారణ నిమిత్తం సోనాక్షి మొరాబాద్కు రావాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. దీంతో స్థానిక కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. బలరాం నాయక్, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిలకు ప్రజా ప్రతినిధుల కోర్టు వారెంట్లు జారీ చేసింది. విచారణకు హాజరుకానందున కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హన్మకొండలో అనుమతి లేకుండా ప్రదర్శన చేశారని 2018లో కేసు నమోదైంది. ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీతో బలరాం నాయక్ కోర్టుకు హాజరయ్యారు. బలరాం నాయక్పై నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు ఉపసంహరించింది. విచారణను వచ్చేనెల 3కి ప్రజా ప్రతినిధులు కోర్టు వాయిదా వేసింది. ఇవీ చదవండి: Indira park: లవర్స్కు షాక్, వెంటనే వెనక్కి తగ్గిన అధికారులు Hyderabad: బైక్పై చలాన్లు చూసి షాకైన పోలీసులు -
ఐఏఎస్ ఎండీ ఇంతియాజ్కు నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావులకు హైకోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్(ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. ఈ వారెంట్ను అమలు చేసి ఇద్దరినీ కోర్టు ముందు హాజరుపరచాలని విజయవాడ పోలీస్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్ చేయూత పథకానికి తాము అర్హులమైనా, ఆ పథకాన్ని తమకు వర్తింపజేయడం లేదంటూ కృష్ణా జిల్లా, చందర్లపాడుకు చెందిన పలువురు మహిళలు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు, వారికి వైఎస్సార్ చేయూత పథకాన్ని వర్తింపజేయాలంటూ ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల మేరకు 2020–21 సంవత్సరానికి నిధులు విడుదల చేశారు. అయితే 2019–20 సంవత్సరానికి నిధులు ఇవ్వకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు రాగా, ఇంతియాజ్, శ్రీనివాసరావులు కోర్టు ముందు స్వయంగా హాజరు కాలేదు. వారి తరఫు న్యాయవాదులు కూడా హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఆ అధికారులిద్దరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
సుశీల్పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ... గత పదకొండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిపై ఢిల్లీ కోర్టు నాన్బెయిలబుల్ వారంట్లను జారీ చేసింది. మే 4వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియం ఆవరణలో జరిగిన గొడవలో 23 ఏళ్ల యువ రెజ్లర్ సాగర్ రాణా ధన్కడ్, అతని ఇద్దరు మిత్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తర్వాత కనిపించకుండా పోయిన సుశీల్ ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గత సోమవారం ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. సుశీల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేయడంతో పోలీసులు అతని ఆనవాళ్లు కనిపెట్టడంలో విఫలమయ్యారు. హరిద్వార్లోని విఖ్యాత యోగా గురువుకు చెందిన ఆశ్రమంలో సుశీల్ తలదాచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సుశీల్కు నోటీసులు జారీ చేశాం. కానీ అతను స్పందించలేదు. సుశీల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. సుశీల్ మిత్రుల ఇంటిపై కూడా దాడులు నిర్వహించినా ఎలాంటి సమాచారం లభించలేదు. దాంతో సుశీల్ ఆచూకీ చెప్పినవారికి తగిన రివార్డు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కేసులో బాధితుల నుంచి తీసుకున్న స్టేట్మెంట్స్లో అందరూ సుశీల్ పేరు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సుశీల్ అనుచరుడు అజయ్ ప్రభుత్వ వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అజయ్పై డిపార్ట్మెంటల్ చర్య తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశాం’ అని ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 37 ఏళ్ల సుశీల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్లో (2010, 2014, 2018) స్వర్ణ పతకాలు నెగ్గిన సుశీల్ 2010లో సీనియర్ విభాగంలో ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఏకైక భారత రెజ్లర్ కావడం విశేషం. ప్రాణాలు తీసేంత తప్పేం చేశాడు... నా కొడుకు సాగర్ ఛత్రశాల్ స్టేడియంలో ఎనిమిదేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాడు. 2017 ఆసియా, ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సుశీల్ను, అతని మామ సత్పాల్ సింగ్ను సాగర్ ఎంతో ఆరాధించేవాడు. సాగర్ తప్పు చేసి ఉంటే అతడిని నాలుగు చెంప దెబ్బలు కొట్టాల్సింది. లేదంటే ఛత్ర శాల్ స్టేడియం నుంచి బయటకు పంపించాల్సింది. ప్రాణాలు తీసేంత తప్పు పని నా కొడుకు చేశాడా? ఈ కేసుతో సంబంధం ఉన్న వారు చాలా పెద్ద వ్యక్తులు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు నాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారు తమ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. –అశోక్ (సాగర్ తండ్రి), ఢిల్లీ పోలీసు హెడ్కానిస్టేబుల్ -
బాలయ్య నిర్మాతకు షాక్ ఇచ్చిన కోర్టు
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా BB3. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా BB3 సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఈయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏడేళ్ల క్రితం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాను రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సమయంలో తనను మోసం చేసి అగ్రిమెంట్ను లెక్కచేయకుండా వేరే వారికి రైట్స్అమ్మేశారని ఓ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ ఆరోపించారు. తన వద్ద నుంచి తీసుకున్న 50 లక్షలను తిరిగి చెల్లించలేదని, దీని వల్ల తాను చాలా నష్టపోయానని పేర్కొంటూ రవీందర్రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టారు. కొన్నాళ్లుగా జరుగుతున్న వాదోపవాదాల అనంరం కేసు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేస్తూ ప్రతిపాడు మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 19న కోర్టుకు హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో బోయపాటి దర్శకతం వహించిన జయ జానకీ నాయక చిత్రాన్ని రవీందర్ రెడ్డి నిర్మించారు. కాగా ప్రస్తుతం బాలకృష్ణ ఈయన నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. చదవండి : (మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య) (కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు) -
ఇద్దరు ఐఏఎస్లకు వారెంట్లు
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో తామిచ్చిన ఆదేశాల మేరకు తమ ముందు హాజరు కానందుకు ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వారెంట్లను అమలు చేసి ఐఏఎస్ అధికారులైన బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ బి.రామారావులను తమ ముందు హాజరుపరచాలని విజయవాడ పోలీస్ కమిషనర్, గుంటూరు ఎస్పీలను ఆదేశించింది. ఈ నెల 19లోపు వారెంట్లను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా పరిధిలోని బీసీ హాస్టల్ ఉద్యోగి చంద్రమౌళికి పదోన్నతి కల్పించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయలేదంటూ చంద్రమౌళి కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఇందులో ప్రవీణ్కుమార్, రామారావులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. గతంలో దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఇరువురు అధికారులను మార్చి 5న తమ ముందు హాజరు కావాలని ఆదేశాలిచ్చారు. ఈ ధిక్కార వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా ప్రవీణ్కుమార్, రామారావు హాజరు కాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేశారు. దీన్ని కొట్టేసిన న్యాయమూర్తి.. ఇద్దరు అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ఇదే వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్లాల్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తిలను ఏప్రిల్ 6న తమ ముందు హాజరవ్వాలని ఆదేశించారు. విచారణను ఆ మేరకు వాయిదా వేశారు. చదవండి: అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు -
దిగ్విజయ్ సింగ్పై నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. ఎంఐఎం నాయకుడు హుస్సేన్ అన్వర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ను జారీచేసింది. 2016లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన దిగ్విజయ్ సింగ్ ఎంఐఎం నేతలపై పలు ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ ఆ పార్టీ నాయకుడు హుస్సేన్ అన్వర్ స్థానిక కోర్టులో పరువ నష్టం దావా వేశారు.ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన్నప్పటికీ పలుమార్లు ఉల్లంఘించారు. దీంతో తాజాగా అరెస్ట్ వారెంట్జారీ అయ్యింది. అనారోగ్యం కారణంతో నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా దిగ్విజయ్సింగ్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తొసిపుచ్చింది. విచారణను మార్చి 8కి వాయిదా వేసింది. -
టూల్కిట్ వివాదం: నికితాపై నాన్బెయిలబుల్ వారెంట్
సాక్షి,న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ ట్వీట్తో రాజుకున్న టూల్ కిట్ వివాదం మరింత ముదురుతోంది. 'టూల్కిట్ కేసు'లో దిశా రవిని అరెస్టు చేసిన ఢిలీ పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు. ముంబై హైకోర్టు న్యాయవాది, కార్యకర్త నికితా జాకబ్, శాంతనులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం స్పెషల్ సెల్ బృందం నికితా ఇంటికి వెళ్లినపుడు, ఆమె ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరిశీలించినట్లు తెలిపారు. కానీ ఆ రోజు సమయాభావం వల్ల నికితను ప్రశ్నించలేదు. మళ్లీ వస్తామని చెప్పామనీ, అప్పటినుంచి నికిత పరారీలో ఉందని ఆరోపిస్తూ వారెంట్ ఇష్యూ చేశారు. నికితా జాకబ్, దిశా రవి ఇతరులు పాల్గొన్న ఒక జూమ్ సమావేశంలో రైతు ఆందోళనకు సంబంధించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు, నిరసన కారుల్లో ఆందోళనన పెంచేందుకు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశా రవి అరెస్ట్ను ఖండించారు. ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అని వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతు ఇవ్వడం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే థన్బర్గ్పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవిని ఆదివారం అరెస్ట్ చేశారు. దేశద్రోహ కుట్ర కేసు నమోదు చేసి ఐదు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. బెంగళూరు ఐటీ సిటీకి చెందిన దిశా రవి రైతు ఆందోళనకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు సపోర్ట్ చేస్తూ గ్రెటా థన్బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్ను దిశా రవి అప్లోడ్ చేశారు. దీని వెనుక ఖలిస్థాన్ అనుకూల సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే టూల్కిట్ డాక్యుమెంట్లోని రెండు లైన్లను మాత్రమే తాను ఎడిట్ చేశానని దిశా పోలీసు విచారణలో వెల్లడించారు. డాక్యుమెంట్లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్బర్గ్ను కోరారని వివరణ ఇచ్చారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో కీలక వ్యక్తిగా దిశ ఉన్నారు. దిశా రవి అరెస్టుపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా కేంద్రం తీసుకొచ్చి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సుదీర్ఘంగా సాగుతోంది. ఈ క్రమంలో రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసకు దారితీసింది. ఎర్రకోటపై జెండా ఎగురవేయడం వివాదాన్ని రేపింది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా గ్రెటా ట్వీట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులు టూల్ కిట్ని రూపొందించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. (రైతు ఉద్యమం : దీప్ సిద్దూ అరెస్టు) చదవండి : రైతు ఉద్యమం : వారికి భారీ ఊరట Arrest of 21 yr old Disha Ravi is an unprecedented attack on Democracy. Supporting our farmers is not a crime. — Arvind Kejriwal (@ArvindKejriwal) February 15, 2021 -
మద్యం మత్తు.. నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో చిక్కి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ‘నిషా’చరుడు సయ్యద్ అమీరుద్దీన్కి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసి అరెస్టు చేయించింది. చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు ఆ నిందితుడిని శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు.. అమీరుద్దీన్కు 5 రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఓ మందుబాబుపై ఎన్బీడబ్ల్యూ జారీ కావడంతో ట్రాఫిక్ పోలీసుల చరిత్రలో తొలిసారని చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31 రాత్రిని జీరో యాక్సిడెంట్ నైట్గా చేయడానికి సిటీ ట్రాఫిక్ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అంబర్పేటకు చెందిన ప్లంబర్ సయ్యద్ అమీరుద్దీన్ మద్యం తాగి యాక్టివా వాహనంపై వస్తూ చార్మినార్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. బ్రీత్ అనలైజర్ యంత్రంతో పరీక్షించిన నేపథ్యంలో బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) 141గా తేలింది. ఈ కౌంట్ 30 దాటితే వారిపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. దీంతో చార్మినార్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, వివరాలు నమోదు చేసుకుని, వాహనం స్వాధీనం చేసుకుని పంపారు. ఇలా చిక్కిన మందుబాబులు నిర్ణీత తేదీల్లో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సెలింగ్కు హాజరుకావాలి. ఆపై కోర్టుకు వెళ్లి న్యాయమూర్తి విధించిన శిక్ష పూర్తి చేయడం లేదా జరిమానా కట్టడం చేసిన తర్వాత తమ వాహనం తీసుకువెళ్లాలి. అయితే అమీరుద్దీన్ మాత్రం కౌన్సెలింగ్కు, కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నాడు. దీంతో చార్మినార్ పోలీసులు అతడిపై న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. దీని ఆధారంగా కోర్టు అమీరుద్దీన్కు రెండుసార్లు సమన్లు జారీ చేసినా అతను బేఖాతరు చేశాడు. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన కోర్టు అతడిపై ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. -
సీతక్కపై నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకానందున ఆమెకు కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈనెల 9లోగా ఈ వారెంట్ను అమలు చేయాలని ములుగు పోలీసులను కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా, వేర్వేరు కేసుల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డిలకు సమన్లు జారీ కాగా, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, మచ్చా నాగేశ్వరరావులు కోర్టుకు హాజరయ్యారు. -
'రోబో' డైరెక్టర్కు నాన్ బెయిలబుల్ వారెంట్
చెన్నై: బ్లాక్బస్టర్ హిట్ 'ఎంథిరన్' సినిమా వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకుడు శంకర్కు కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అరూర్ తమిళ్నాడన్ అనే వ్యక్తి తను రాసిన 'జిగుబా' కథను కాపీ చేసి 'ఎంథిరన్'గా తీశారంటూ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేశాడు. తనకు న్యాయం జరగాలంటూ కొన్నేళ్ల క్రితం కోర్టుకెక్కాడు. అయితే సంవత్సరాలు గడిచిపోతున్నా శంకర్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రెండో కోర్టు అతడికి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. (చదవండి: రామ్చరణ్, యశ్తో శంకర్ మల్టీస్టారర్!) కాగా తమిళ్నాడన్ రాసిన 'జిగుబ' కథ 1996లో ఓ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది. తర్వాత 2007లో 'ధిక్ ధిక్ దీపిక ధీపిక' అనే నవలగా ప్రచురితమైంది. ఈ కథను కాపీ కొట్టి శంకర్ 'ఎంథిరన్' తెరకెక్కించాడని, ఇది కాపీరైట్స్ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించాడు. తన స్వంత కథతో ఎంథిరన్ టీమ్ మొత్తం లాభం పొందిందని పేర్కొన్నాడు. ఇక ఎంథిరన్ తెలుగు, హిందీలో 'రోబో'గా డబ్ అవగా ఇక్కడ కూడా అఖండ విజయం సాధించింది. ఇందులో తలైవా రజనీకాంత్ డబుల్ యాక్షన్ చేయగా ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా నటించింది. 2010లో రిలీజైన ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: దూసుకొస్తున్న ఖిలాడి.. రిలీజ్ డేట్ ఫిక్స్) -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్కు ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ 2012 కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన ఆందోళనలో దాస్యం వినయ్ భాస్కర్తో పాటు పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ ఘటనలో వినయ్ భాస్కర్తో పాటు మరో 8 మందిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాకపోవడంతో తొమ్మిది మందికి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
ఒవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఒవైసీ విచారణకు హాజరు కాకపోవడంతో స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ మీర్చౌక్ పీఎస్ పరిధిలో కాంగ్రెస్ షబ్బీర్ అలీ కారులో వెళ్తుండగా అడ్డగించిన కొందరు వ్యక్తులు.. కారులో ఉన్న షబ్బీర్ అలీపై దాడి చేశారు. ఘటనలో ప్రధాన నిందితుడిగా అసదుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదేళ్లుగా ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: లైంగిక వేధింపులు: ఉరికి వేలాడిన మహిళా ఎస్సై -
ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేతకు ఈడీ షాక్
సాక్షి, హైదరాబాద్: ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుకేష్ గుప్తాకు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కోర్టు సోమవారం షాక్ ఇచ్చింది. కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న సుకేశ్ గుప్తాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా పరారీలో ఉన్న సుఖేశ్ గుప్తా ఇండియా నుంచి దుబాయ్కి పారిపోయి తలదాచుకున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా 275 కోట్ల రూపాయల స్కాం లో సుకెష్ గుప్తా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై గతంలో సుఖేశ్ గుప్తాకు ఈడీ అధికారులు సమన్లు కూడా జారీ చేశారు. కాగా ఈడీ ఇచ్చిన సమన్లపై సుఖేశ్ గుప్తా హైకోర్టును ఆశ్రయించి స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ సుఖేశ్ గుప్తా పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అప్పటినుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న సుఖేశ్ గుప్తాకు ఈడీ కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
రోడ్డుపై ధర్నా: మంత్రికి అరెస్ట్ వారెంట్
డెహ్రాడూన్ : రోడ్డును బ్లాక్చేసి ప్రజలకు ఇబ్బందికరంగా వ్యవహరించిన ఓ మంత్రిని అరెస్ట్ చేయాలని ఉత్తరాఖండ్లోని దిగువ న్యాయస్థానం స్థానిక పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు మంత్రి అరవింద్ పాండేపై రుద్రపూర్ జిల్లాకోర్టు శుక్రవారం మంత్రిపై నాన్ బెయిబుల్ వారెంట్ను జారీచేసింది. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్లో అప్పటి ప్రతిపక్ష బీజేపీ అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు జాతీయ రహదారిని దిగ్భందించింది. దీంతో స్థానిక పోలీసులు నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది స్థానిక నేతలపై కేసు నమోదు చేశారు. ఆయా కేసులను తాజాగా విచారించిన రుద్రపూర్ జిల్లా కోర్టు న్యాయమూర్తి వారందరినీ దోషులుగా తేల్చారు. ప్రజా వ్యవస్థకు ఆటంకం కలిగే విధంగా వ్యవహరించారని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. వీరిలో ప్రస్తుత మంత్రి అరవింద్ పాండేతో పాటు అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హర్భజన సింగ్, రాజ్కుమార్, ఆదేశ్ చౌహాన్, మాజీ ఎంపీ బల్రాజ్ పాసీలు ఉన్నారు. కోర్టు ఆదేశాలను అందుకున్న స్థానిక ఎస్పీ రాజేష్ భట్.. నిందితులను అరెస్ట్ చేయడానికి స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. అక్టోబర్ 23లోపు వారందరినీ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపర్చాలని వెల్లడించారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉందన్నారు. -
డాక్టర్ ఆత్మహత్య.. ఎమ్మెల్యే అరెస్ట్కు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఓ డాక్టర్(52) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ వేధింపులు భరించలేకనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు డాక్టర్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. గత నెలలో జరిగిన ఈ ఘటనపై ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అలాగే ఎమ్మెల్యే అనుచరడైన కపిల్నగర్పై కూడా కేసు నమోదైంది. వీరిద్దరి అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జర్వాల్ కనిపించకుండా పోవడంతో పోలీసులు అతని తండ్రి, సోదరుడిని విచారిస్తున్నారు. (చదవండి : సీనియర్ నేత మృతి.. విచారణకు కాంగ్రెస్ డిమాండ్) కాగా, తనకు ఈ ఆత్మహత్యతో సంబంధమే లేదని, గత 10 నెలల్లో డాక్టర్ను ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ చెప్పుకొచ్చారు.‘సూసైడ్ నోట్లో నా పేరు ఉందని మీడియా ద్వారా తెలిసింది. ఆయన నా పేరు ఎందుకు రాశాడో అర్థకావడం లేదు. గత 8-10 నెలల్లో నేను అతన్ని కలిసిన సందర్భాలు కూడా లేవు. గతంలో కూడా నన్ను చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. గతంలో నిర్దోషిని అని నిరూపించుకున్నట్లే, ఇప్పుడు కూడా రుజువు చేసుకుంటా. ఎలాంటి దర్యాప్తులోనైనా పోలీసులతో సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ అన్నారు. (చదవండి : ‘రైళ్లను అనుమతించడం లేదు.. ఇది అన్యాయం’) కాగా, 52 ఏళ్ల డాక్టర్ ఏప్రిల్ 18న ఉరేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆయన ఓ సూసైడ్ నోట్ రాశాడు. ఎమెమ్యే ప్రకాశ్ జర్వాల్, ఆయన అనుచరుడు తనను డబ్బులు డిమాండ్ చేశాడని, దానికి నిరాకరించడంతో తన వ్యాపారాలు దెబ్బతీసేపనికి ఒడికట్టారని ఆరోపించారు. డాక్టర్కు ఢిల్లలో మంచి నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. 2007 నుంచి ఆయన ఈ బిజినెస్ను కొనసాగిస్తున్నారు. -
జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్
లక్నో: సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు రాంపూర్ కోర్టు ఆమె నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కాగా గతంలో సమాజ్వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన జయప్రద.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాషాయ పార్టీ తరఫున రాంపూర్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జయప్రద.. ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు లక్ష ఓట్ల తేడాతో పరాజయం చెందారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ అప్పట్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శనివారం ఆమెకు స్థానిక కోర్టు వారెంట్ జారీ చేసింది. కాగా ఎన్నికల ప్రచారంలో ఆజంఖాన్ జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘అమ్రపాలి (నృత్యకారిణి), నాచ్ నే వాలీ’అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జయప్రద పార్టీ మారిన సమయంలో.. ‘జయప్రదను నేనే రాంపూర్కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. A non bailable warrant has been issued by a Rampur court against veteran actor and BJP leader Jaya Prada in a violation of model code of conduct case of 2019. Next hearing is on April 20. (file pic) pic.twitter.com/CA3xesRwlU — ANI UP (@ANINewsUP) March 7, 2020 -
కేంద్ర మాజీ మంత్రి రేణుకపై వారెంట్ ఎత్తివేత
సాక్షి, ఖమ్మం : ఖమ్మం కోర్టుకు హాజరైన కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరిపై గత నెలలో జారీ చేసిన నాన్బెయిలబుల్ వారెంట్ను ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎత్తివేసింది. గతంలో రేణుకా చౌదరిపై నమోదైన ఒక ప్రైవేట్ కేసుకు సంబంధించి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో గత నెల 29న ఖమ్మంకోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి సోమవారం రేణుకాచౌదరి ఖమ్మం రెండో అదనపు జూనియర్ సివిల్జడ్జి కోర్టులో హాజరయ్యారు. కేసు వివరాలు పరిశీలించిన అనంతరం రేణుకాచౌదరిపై గతంలో జారీ చేసిన నాన్బెయిలబుల్ వారెంట్ను జడ్జి ఎత్తివేస్తూ రీకాల్ చేశారు. వచ్చే నెల 17వ తేదీకి కేసు వాయిదా వేశారు. -
హీరో సుదీప్కు అరెస్ట్ వారెంట్
బెంగళూరు : కన్నడ హీరో, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాఫీ ఎస్టేట్ వివాదంలో కోర్టుకు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చిక్మంగళూరు కోర్టులో వరుస వాయిదాలతో అవకాశమిచ్చినా ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాకపోవడంతో సుదీప్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు చిక్మంగళూరు జెఎంఎఫ్సీ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. మే 22వ తేదీ లోగా సుదీప్ ఆచూకి తెలుసుకొని కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా కర్ణాటక పోలీసులను ఆదేశించిందిజ ప్రస్తుతం ఆ వార్త శాండల్వుడ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్గా నిలిచింది. కర్ణాటక చిక్మంగళూరులోని కాఫీ ప్లాంటేషన్ యజమాని దీపక్ పటేల్ ఫిర్యాదు మేరకు నటుడు సుదీప్, కన్నడ టీవీ రియాలిటీ షో సుదీప్కు చెందిన ప్రొడక్షన్ హౌస్ కిచ్చా క్రియేషన్స్పైనా, డైరెక్టర్ మహేష్లపై కేసు నమోదైంది. 2016లో కన్నడ టీవీ షో వారసదార షూటింగ్ కోసం తన ఎస్టేట్ను అద్దెకు తీసుకొన్నారు. ఇందుకు కోటి 80 లక్షల రూపాయలను చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ రూ. 50 వేలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్మును ఎగ్గొట్టారని, అలాగే తన కాఫీ తోటల్ని, మరికొంత వారసత్వ ఆస్తిని ధ్వంసం చేశారని దీపక్ ఆరోపించారు. ఒప్పందానికి భిన్నంగా లోపల ఒక సెట్ను కూడా నిర్మించారనీ, తనకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా మోసం చేశారంటూ మొదట జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. అయితే ఇది సివిల్ వివాదం కావడంతో ఎస్పీ సలహా మేరకు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు కాఫీ ఎస్టేట్ ఓనర్ దీపక్. ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడనేది ప్రధాన ఆరోపణ. -
‘ఐదు మొక్కలు నాటు.. అరెస్టు వారంట్ రద్దు చేస్తా’
ఘజియాబాద్: ఐదు మొక్కలు నాటితే అరెస్ట్ వారంట్ రద్దు చేస్తానని ఓ నిందితుడికి ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్ కోర్టు ఆఫర్ ప్రకటించింది. దీనికి అనుగుణంగా అఫిడవిట్ సమర్పించాలని ఘజియాబాద్ జిల్లా అదనపు ప్రభుత్వ కౌన్సెలర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం నమోదైన కిడ్నాప్ కం రేప్ కేసులో ప్రధాన నిందితుడు రాజు అలియాస్ కల్లు 6 నెలల నుంచి విచారణకు హాజరుకావడం లేదు. దీంతో ఫాస్ట్ట్రాక్ కోర్టు స్పెషల్ జడ్జి రాకేష్ వశిష్ట నాన్బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేశారు. ఇది తెలిసిన నిందితుడు రాజు తనపై జారీ చేసిన నాన్బెయిలబ్ వారంట్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు, నిందితుడికి ఐదు మొక్కలు నాటాలని సూచించింది. అలాగే సరైన విధంగా విచారణకు సహకరిస్తానని అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. -
పీఎన్బీ స్కామ్ కేసు మోదీకి నాన్ బెయిలబుల్ వారెంట్
-
నీరవ్ మోదీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
సాక్షి, ముంబయి : పీఎన్బీ స్కామ్ కేసుకు సంబంధించి బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్కు చెందిన మొహుల్ చోక్సీలకు సీబీఐ కోర్టు ఆదివారం నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. తప్పుడు పత్రాలతో వీరు పీఎన్బీ నుంచి భారీ మొత్తంలో రుణాలు పొంది వాటిని దారిమళ్లించిన వ్యవహారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో పీఎన్బీ ముంబయి బ్రాంచ్ అలహాబాద్, యాక్సిస్ బ్యాంక్ హాంకాంగ్ బ్రాంచ్లకు జారీచేసిన హామీ పత్రాల (ఎల్ఓయూ)పై నీరవ్ మోదీ ఇతరులు రూ 280.7 కోట్లు మోసపూరితంగా పొందినట్టు తేలడంతో ఈ భారీ స్కాం బయటపడింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం డైమండ్ ఆర్ యూఎస్, సోలార్ ఎక్స్పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్ల తరపున ఎల్ఓయూలు జారీ అయ్యాయి. కుంభకోణం వెలుగుచూసిన అనంతరం నీరవ్ మోదీ ఇతర నిందితులపై మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద కూడా కేసు నమోదైంది. -
నటికి నాన్బెయిలబుల్ వారెంట్..
సాక్షి, టీనగర్: పెళ్లి పేరుతో నటి శృతి పలువురిని మోసం చేసిన విషయం తెలిసిందే. అందుకు ఆమెపై ఏడాదిపాటు నాన్బెయిలబుల్ గూండా చట్టాన్ని ప్రయోగించారు. ఆమె తల్లి చిత్ర, తండ్రి ప్రసన్న వెంకటేశ్లపై కూడా శనివారం కోయంబత్తూరు పోలీసులు గూండా చట్టం నమోదు చేశారు. ఆడిపోనాల్ ఆవని చిత్రంతో నటిగా గుర్తింపు పొందిన శృతి మోసం కేసులో చిక్కుకుంది. తీగ లాగితే డొంగ కదిలినట్లు ఆమె మోసాల చిట్టా బయటపడింది. అనేక మందిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేయడం, వారి నుంచి అక్రమ వసూళ్లు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన తల్లిదండ్రులను కటకటాల్లోకి పంపారు. -
నీరవ్, చోక్సీలపై వారెంట్లు
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ను రూ.12,700 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల పై ఇక్కడి ప్రత్యేక కోర్టు శనివారం నాన్బెయిలబుల్ వారెంట్లు(ఎన్బీడబ్ల్యూ) జారీచేసింది. తమ ముందు విచారణకు హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే ట్(ఈడీ) మూడు సార్లు సమన్లు జారీచేసినప్పటికీ వీరిద్దరూ స్పందించకపోవడంతో ఆ సంస్థ ఫిబ్రవరి 27న కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈడీ విజ్ఞప్తి మేరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద న్యాయ స్థానం నిందితులపై ఎన్బీడబ్ల్యూను జారీచేసింది. -
నీరవ్,చోక్సీలకు బిగ్ షాక్!
సాక్షి,ముంబై: పీఎన్బీ కుంభకోణంలో డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సీలపై చర్యలకు సీబీఐ, ఈడీ వేగంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం వీరువురికీ ముంబై స్పెషల్ కోర్టు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విదేశాల్లో వ్యాపార వ్యవహారాల నిమిత్తం విచారణ హాజరుకాలేనని మొండికేసిన నీరవ్ మోదీకి వచ్చే వారం కచ్చితంగా విచారణకు హాజరు కావల్సిందేనంటూ ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఎ కోర్టు కొరడా ఝళిపించింది. ఈ మేరకు హైకమిషన్ను సంప్రదించాలని మోదీ, చోక్సీలను సీబీఐ కోరింది. వారి ప్రయాణ కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. దాదాపు 12వేలకోట్ల రూపాయల కుంభకోణం కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ మోదీ, చోక్సిల చుట్టూ ఉచ్చు బిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వేలకోట్లను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన నీరవ్మోదీ, చోక్సీలకు చెందిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతోపాటు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సిందిగా ఇప్పటికే సీబీఐ పీఎంఎల్ఎ కోర్టును కోరాయి. మరోవైపు ఈ కేసులో ఆరుగురు నిందితులను ముంబై కోర్టులముందు సీబీఐ హాజరు పర్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్నాథ్ శెట్టి, సహా ఆరుగురిని కోర్టుముందు హాజరుపర్చింది. కేసు మరింత విచారణ నిమిత్తం నిందితుల పోలీసు కస్టడినీ కోరింది. అలాగే నీరవ్ మోదీ, ఆయన భార్య, మెహల్ చోక్సి పాస్పోర్టులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
నీరవ్కు నాన్ బెయిలబుల్ వారెంట్?
సాక్షి, ముంబై: పీఎన్బీ కుంభకోణం కేసులో ప్రధాన నిందితులు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ అధినేత మొహుల్ చోక్సీకి వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు వేగంగా కదులుతున్నాయి. ఇటీవల జారీ చేసిన సమన్లపై వీరిరువురు స్పందించకపోతే ..త్వరలోనే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మోదీకి చెందిన విదేశీ ఆస్తులపై ఇప్పటికే దృష్టిపెట్టిన ఈడీ దర్యాప్తును మరింత విస్తరిస్తోంది. రూ. 11, 400 కోట్ల పీఎన్బీ స్కాంలో నీరవ్ మోదీ, అతని భార్య అమి, మెహల్ చోక్సిలను ముంబైలోని జోనల్ కార్యాలయంలో సోమవారం నాడు హాజరు కావలసి ఉంది. వారు హాజరు కాని పక్షంలో నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడానికి ప్రత్యేక పీఎంఎల్ కోర్టును ఈడీ సంప్రదించనుంది. డజనుకు పైగా దేశాలలో విదేశీ వ్యాపారాలు, ఆస్తులు ఈడీ పరిశీలనలోఉన్నాయి. దర్యాప్తులో భాగంగా బెల్జియం, హాంకాంగ్, స్విట్జర్లాండ్, అమెరికా, యూకే లాంటి దేశాలనుంచి అదనపు సమాచారాన్ని రాబట్టేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు న్యాయపరమైన అభ్యర్థనలను త్వరలో పంపనుంది. మరోవైపు గత వారంలో వరుస దాడుల్లో మోదీ, ఆయన కంపెనీకి చెందిన విలువైన ఆస్తులు, సంపదతోపాటు లగ్జరీ కార్లను, గడియాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా మోదీకి చెందిన ముంబై వడాలలోని ఇంటిలో ప్రఖ్యాత ఆర్టిస్టులకు చెందిన 150 పెయింటింగ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పీఎన్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె వి బ్రహ్మజీరావును సీబీఐ రెండో రోజుకూడా విచారించింది. -
కూర రాజన్నకు నాన్ బెయిలబుల్ వారంట్
సిరిసిల్ల: సీపీఐ(ఎంఎల్) జనశక్తి ఉద్యమ నిర్మాత కూర రాజన్న(70)కు రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. కోనరావుపేట మండలం సుద్దాలలో ఏనుగు ప్రభాకర్రావు హత్య కేసులో రాజన్న నిందితుడు. 2013 నాటి ఈ కేసులో రాజన్న కోర్టుకు హాజరు కాకపోవడాన్ని తప్పుపడుతూ తొమ్మిదో జిల్లా కోర్టు న్యాయ మూర్తి జి.శ్రీనివాసులు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. వేములవాడకు చెందిన కూర రాజేందర్ ఉరఫ్ కూర రాజన్న జనశక్తి ఉద్యమ నిర్మాత. ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
టాలీవుడ్ నిర్మాతపై నాన్బెయిలబుల్ వారెంట్
సాక్షి, రాజమండ్రి: ప్రముఖ సినీ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు కోర్టు ఆయనకు బుధవారం ఈ వారెంట్ జారీ చేసింది. ఓ ఫైనాన్షియర్కు రవీంద్రరెడ్డి ఇచ్చిన రూ. 50 లక్షల చెక్ బౌన్స్ అవ్వడంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి రవీంద్రరెడ్డికి కోర్టు పలు సార్లు నోటీసులు పంపింది. అయితే, కోర్టు నోటీసులపై రవీంద్రరెడ్డి స్పందించకపోవడంతో ఈ రోజు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. కాగా రవీంద్ర రెడ్డి. గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో, బోయపాటి డైరెక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక చిత్రాలను నిర్మించారు. -
ముజఫర్నగర్ అల్లర్ల కేసు : బీజేపీ నేతలకు వారెంట్లు
ముజఫర్నగర్ : ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ముజఫర్నగర్ అల్లర్ల కేసుల్లో అధికార బీజేపీకి చెందిన కీలక సభ్యులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. వారిలో ఉత్తరప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా కొనసాగుతోన్న సురేశ్ రాణా, కేంద్ర మాజీ మంత్రి సంజీవ్ బల్యాన్, ఎమ్మెల్యేలు సంగీత్ సోమ్, ఉమేశ్ మాలిక్ తదితరులున్నారు. 2013 ఆగస్టు-సెప్టెంబర్లో జరిగిన ముజఫర్నగర్ అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 60 మంది ప్రాణాలు కోల్పోగా, 40 వేల మంది నిరాశ్రయిలయ్యారు. రెచ్చగొట్టి.. ఉసిగొలిపారు : పైన పేర్కొన్న బీజేపీ నాయకులు.. ముజఫర్నగర్లో ఒక వర్గానికి చెందిన యువతను హింసకు పురిగొల్పేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించడమే కాక ప్రభుత్వ సిబ్బంది విధులకు ఆటంకం కల్పించారని అల్లర్లపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆరోపించింది. సిట్ వాదనతో ఏకీభవించిన మెజిస్ట్రేట్ మధు గుప్తా.. నిందితులు జనవరి 19న కోర్టుకు హాజరుకావాలని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ప్రజా ప్రతినిధులు కావడంతో : ముజఫర్నగర్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుల్లో అత్యధికులు ప్రస్తుతం చట్టసభ్యులుగా కొనసాగుతున్న దరిమిలా వారిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసికావడంతో సీఎం యోగి అంగీకరించారు. ప్రభుత్వ అనుమతి లభించిన దరిమిలా సదరు నేతల విచారణ ప్రక్రియ ముమ్మరం కానుంది. నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన బీజేపీ ప్రముఖుల్లో కొందరు.. -
మేవానీపై నాన్బెయిలబుల్ వారెంట్
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీపై నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జనవరిలో ఓ నిరసన కార్యక్రమంలో రాజధాని ఎక్స్ప్రెస్ రైలును అడ్డుకున్న కేసు విచారణకు ఆయన గైర్హాజరైనందుకే అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ఎస్ లాంగా మేవానీతో పాటు మరో 12 మందికి వ్యతిరేకంగా ఈ వారెంట్ జారీచేశారు. నామినేషన్ దఖాలు చేసే పనిలో బిజీగా ఉన్నందున జిగ్నేశ్ రాలేకపోయారని కోర్టుకు ఆయన తరపు న్యాయవాది షంషాద్ పఠాన్ విన్నవించారు. అయితే ఈ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది. వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు వ్యతిరేకంగా జనవరి 11న నిర్వహించిన రైల్ రోకో ఆందోళనలో భాగంగా అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో రాజధాని ఎక్స్ప్రెస్ను జిగ్నేశ్, ఆయన మద్దతుదారులు నిలిపివేశారు. ఈ కేసులో 40 మంది కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వాద్గామ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జిగ్నేశ్ పోటీచేస్తున్నారు. -
నన్ను టచ్ చేస్తే అంతే...
సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పటేళ్ల ఉద్యమ నేత హార్థిక్ పటేల్ బీజేపీకి చుక్కలు చూపుతున్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తే నిరసనలు మిన్నంటుతాయని హెచ్చరించారు. 2015లో బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి హార్థిక్ పటేల్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పటేళ్ల హక్కుల సాధన కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ ఏజెంట్నన్న బీజేపీ వాదనను తోసిపుచ్చారు. పటేళ్లలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హార్థిక్ ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ ఏజెంట్ను కాదు పటేల్ ఉద్యమ కార్యకర్తలు ప్రజల సమస్యలపై గళమెత్తడంతోనే తాము ప్రజా మద్దతు కూడగట్టగలిగామని చెప్పారు.తాను కాంగ్రెస్ ఏజెంట్నని బీజేపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని, దీనిపై బీజేపీకి స్పష్టత లేదని చెప్పారు. కాంగ్రెస్కు తాను ఏజెంట్నా లేక మొత్తం పటేల్ వర్గీయులంతా కాంగ్రెస్ ఏజెంట్లా అనేది బీజేపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశంపైనా బీజేపీ స్పష్టతతో మాట్లాడటం లేదని విమర్శించారు. తాను నితీష్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే వంటి ప్రముఖ నేతలను కలిశానని, త్వరలోనే రాహుల్ గాంధీతోనూ భేటీ అవుతానని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్పై... అహ్మదాబాద్ హోటల్లో తాను రాహుల్ తో భేటీ అయిన దృశ్యాలతో కూడిన సీసీ టీవీ ఫుటేజ్ను బీజేపీ విడుదల చేయడం పట్ల హార్థిక్ విస్మయం వ్యక్తం చేశారు.బీజేపీ గూఢచర్యం చేస్తోందని తప్పుపట్టారు. ఇది తన గోప్యతకు భంగకరమని అన్నారు. రాహుల్ బస చేసిన హోటల్ నుంచి తాను బ్యాగ్ను తీసుకువెళుతున్న దృశ్యాలపై బీజేపీ వ్యక్తం చేసిన సందేహాలను ఆయన తోసిపుచ్చారు. అడ్డంగా బుక్కయ్యారు బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలు తనకు రూ కోటి ఆఫర్ చేశారని పటేల్ నేత నరేందర్ పటేల్ చేసిన ఆరోపణలను హార్థిక్ ప్రస్తావించారు. నరేంద్రను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించి భంగపాటుకు గురైందని అన్నారు. వారు ఇతర నేతలను కొనుగోలు చేయడంలో విజయవంతమైనా ఇలాంటివి పునరావృతం కావని అన్నారు. గుజరాత్లో బీజేపీ తిరిగి విజయం సాధిస్తుందన్న ఒపీనియన్ పోల్స్ అంచనాలపై హార్థిక్ స్పందిస్తూ తనకు ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ పట్ల విశ్వాసం లేదన్నారు. ఇవి తప్పని పలుసార్లు రుజువైందన్నారు. పటేళ్ల ప్రయోజనాల కోసం పోరాడటాన్ని కొనసాగించడమే తన కర్తవ్యమన్నారు. -
హార్దిక్ పటేల్పై అరెస్ట్ వారంట్
గుజరాత్: పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్కు కోర్టు షాక్నిచ్చింది. 2015లో బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయం ధ్వంసం కేసుకు సంబంధించి రెండోసారి కూడా కోర్టుకు హజరుకాకపోవడంపై బుధవారం విస్నాగర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హార్దిక్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో మరో ఆరుగురికి కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ సెషన్స్ కోర్టు జడ్జి వీపీ అగర్వాల్ ఉత్తర్వులిచ్చారు. హార్దిక్ తరఫు లాయర్ వాదిస్తూ.. బిజీ షెడ్యూల్ కారణంగా హార్దిక్ కోర్టుకు హాజరు కాలేకపోతున్నారని, అందువల్ల ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు తిరస్కరించింది. -
ఇమ్రాన్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఛైర్మన్, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్కు కోర్టు ధిక్కరణ నేరం కింద పాక్ ఎన్నికల కమిషన్ గురువారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. కేసు విచారణకు పదేపదే గైర్హాజరు కావడంతో పాటు దీనిపై లిఖితపూర్వక క్షమాపణలు తెలుపనందుకు ఈసీ చర్యలు చేపట్టింది. పార్టీ అసంతృప్త నేత అక్బర్ ఎస్ బాబర్ దాఖలు చేసిన కేసు తదుపరి విచారణకు అక్టోబర్ 26న ఇమ్రాన్ను అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఈసీ ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను ఇస్లామాబాద్ హైకోర్టులో సవాల్ చేస్తామని పాక్ తెహ్రీక్ ఇన్సాఫ్ ప్రతినిధి నీముల్ హక్ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో కోర్టు ఇమ్రాన్కు బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. అంతకుముందు పలుమార్లు విచారణకు హాజరు కావాలని పలు మార్లు నోటీసులు పంపింది. అయితే తనపై కోర్టు ధిక్కరణ ప్రక్రియను చేపట్టేందుకు ఈసీకి ఉన్న చట్ట పరిధిలో ఉన్న అధికారాలపై ఇమ్రాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించే అధికారం తమకు ఉందని ఆగస్టు 10న పాక్ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. -
అగస్టా కేసు: నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు
సాక్షి,న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపీ చాపర్స్ కేసుకు సంబందించి ముగ్గురు యూరప్ దళారులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇదే కేసులో మాజీ ఎయిర్చీఫ్ ఎస్పీ త్యాగి సహా ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో దాఖలైన చార్జిషీట్ ఆధారంగా వారికి నాన్ బెయిలబుల్ వారెంట్లు, సమన్లు జారీ చేసినట్టు సీబీఐ తెలిపింది. యూరప్కు చెందిన దళారుల్లో కార్లో ఎఫ్ జెరోసా, క్రిస్టియన్ మైఖేల్,గిడో హష్కీ ఉన్నారు. యూపీఏ 2 హయాంలో 12 వీవీఐపీ హెలికాఫ్టర్ల కొనుగోలు ప్ర్రక్రియలో ముడుపులు స్వీకరించారనే ఆరోపణలపై త్యాగి సహా ఐదుగురు విదేశీయులతో పాటు తొమ్మిది మందిపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. రూ 3726 కోట్ల విలువైన వీఐపీ చాపర్ ఒప్పందానికి సంబంధించి దాదాపు రూ 2666 కోట్ల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని చార్జిషీట్ అంచనా వేసింది. ఎయిర్ మార్షల్ జేఎస్ గుజ్రాల్, త్యాగి కజిన్ సంజీవ్ త్యాగి, దళారి గౌతమ్ ఖైతాన్ల పేర్లు కూడా చార్జిషీట్లో నమోదయ్యాయి. -
గుట్కాపై గూండా యాక్ట్
♦ ఇక, ఉక్కు పాదం ♦ నాన్ బెయిలబుల్ కేసులు ♦ చెన్నై పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు గుట్కా, మావా, జర్దా వంటి మత్తు పదార్థాలను విక్రయించే వారి భరతం పట్టేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. ఇక, నాన్బెయిల్ వారెంట్తో కూడిన గుండా చట్టాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకు ఆదేశాలను నగర పోలీసు కమిషనర్ విశ్వనాథన్ జారీచేశారు. గస్తీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. నిఘా పెంచాలని సూచించారు. ఈనేపథ్యంలో ఆదివారం పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు జోరందుకున్నాయి. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో గుట్కా, మావా, జర్దా, హాన్స్ వంటి పొగాకు వస్తువుల్ని నిషేధించి ఉన్నారు. ఈ నిషేధంతో రాష్ట్రంలోకి ఇటీవల గంజాయి ప్రవేశం మరింతగా పెరిగింది. అన్నిరకాల మత్తు పదార్థాలకు నిషేధం ఉన్నా, మార్కెట్లో మాత్రం యథేచ్ఛగా ఆ వస్తువులు లభిస్తుండడం గమనార్హం. చిన్న చిన్న దుకాణాల్లోనే కాదు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లోనూ గుట్కాలు జోరుగా లభిస్తుండటంతో యువత పెడదారి పడుతోందని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం, పోలీసుల బృందాల తనిఖీలు సాగుతున్నా, పట్టుబడేది మాత్రం గోరంతే అన్న విమర్శలు ఉన్నాయి. ఇక, గుట్కాల విక్రయాల వ్యవహారంలో పోలీసు బాసులు చేతివాటం సైతం ఉన్నట్టుగా ఇటీవల వెలుగులోకి వచ్చింది. మంత్రితో పాటుగా పోలీసు పెద్దల సహకారంతోనే రాష్ట్రంలోకి గుట్కాలు తరలి వస్తున్నట్టు, పాన్ మసాలాల అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు వెలుగులోకి వచ్చిన సమాచారం వివాదానికి దారితీసింది. వ్యవహారం కోర్టుకు సైతం చేరడంతో పోలీసు బాసులు తమ జాగ్రత్తల్లో పడ్డారు. ఇక, గుట్కాలు వంటి మత్తు పదార్థాలు విక్రయించే వారి భరతం పట్టే విధంగా నాన్ బెయిలబుల్ సెక్షన్తో కూడిన గూండా చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధం అయ్యారు. భరతం పడతారు జనవరి ఒకటో తేదీ నుంచి చెన్నై నగరంలో గుట్కా, గంజాయి వంటి మత్తుపదార్థాలు, పొగాకు వస్తువుల విక్రయాలకు సంబంధించి పోలీసులు 1120 కేసులు నమోదు చేసిన 1919 మందిని అరెస్టు చేశారు. ఈ ఏడు నెలల కాలంలో రూ.57 లక్షల 84 వేల 381 విలువ గల పొగాకు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 84 వేల గుట్కా ప్యాకెట్లు, 8 వేల కేజీల మేరకు గంజాయి ఉందని చెప్పవచ్చు. తమమీద ప్రసుత్తం ఆరోపణలు బయలుదేరిన నేపథ్యంలో ఇక, గుట్కా విక్రయదారుల భరతం పట్టే విధంగా చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఆయా స్టేషన్లకు ఉత్తర్వులను జారీచేశారు. ఆమేరకు ఇక, గుట్కా వంటి వాటిని విక్రయిస్తూ పట్టుబడే వారి మీద గూండా చట్టం నమోదు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల పరిసరాల్లోని చిన్న చిన్న దుకాణాల మీద నిఘా పెంచాలని సూచించి ఉన్నారు. అలాగే, ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వాహనాల మీద నిఘా వేయడంతో పాటుగా, ఎవరైనా గుట్కా నములుతూ కనిపించినా, వారిని పట్టుకుని , ఎక్కడ విక్రయిస్తున్నారో ఆరా తీసి, ఆయా దుకాణాల మీద చర్యలు తీసుకునే విధంగా గస్తీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఇక, పొగాకు వస్తువుల్ని విక్రయించినా, బయటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలిస్తూ పట్టుబడినా, ఉపేక్షించబోమని, గూండా చట్టం నమోదు చేయడం తథ్యమని కమిషనర్ హెచ్చరించడం గమనార్హం. దాడులు గుండా యాక్ట్ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాల్లో ఆదివారం తమ దూకుడు ప్రదర్శించారు. దుకాణా ల్లో విక్రయిస్తున్న పాన్ మసాలా, గుట్కా వంటివి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ దాడులు జోరందుకున్నాయి. కన్యాకుమారి జిల్లాలో అయితే, పెద్దఎత్తున గుట్కాలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.పది లక్షలుగా నిర్ధారించారు. -
హాంఫట్
►కబ్జాదారుల గుప్పిట్లో వక్ఫ్ ఆస్తులు 8,100 ఎకరాలు ►అన్యాక్రాంతం విలువ రూ.500 కోట్ల పైమాటే ►పాప కార్యంలో ముతవల్లులు, ముజావర్ల భాగస్వామ్యం ►వక్ఫ్ బోర్డును వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో వక్ఫ్ ఆస్తులకు రక్షణ కరువైంది. మసీదు, ఈద్గా, దర్గాల నిర్వహణ, పరిరక్షణ కోసం కేటాయించిన భూములు అక్రమార్కుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాలను తమ ఆధీనంలో పెట్టుకొని ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. వీటి విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుంది. అన్యాక్రాంత భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. సిబ్బంది కొరత కారణంగా ఆస్తులపై వక్ఫ్బోర్డు పర్యవేక్షణ కొరవడింది. ఇదే అదనుగా భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారు. వక్ఫ్ భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. కర్నూలు (రాజ్విహార్) : ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ తరువాత అత్యధికంగా ముస్లింలు ఉన్న జిల్లా కర్నూలు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు ఉన్నది కూడా ఈ జిల్లాలోనే. మసీదులు, ఈద్గా, దర్గాల నిర్వహణ కోసం నాడు పెద్దలు తమ భూములు, స్థలాలను ఇచ్చారు. వాటిని ఆయా సంస్థల పేరుతో బోర్డుకు స్వాధీనం చేశారు. వాటిని బోర్డు తమ భూములుగా పేర్కొంటూ వివరాలను గెజిట్లో పొందుపర్చింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,104 సంస్థలు వక్ఫ్బోర్డు పరిధిలో ఉన్నాయి. వీటిలో 741 సంస్థలు ఆస్తులు కలిగి ఉన్నాయి. వీటి పేర్లతో 22,599.89 ఎకరాల భూములు గెజిట్లో నమోదయ్యాయి. మరో పది వేల ఎకరాలు నమోదు కాలేదు. గెజిట్లో ఉన్న 3,099.35 ఎకరాలతో పాటు గెజిట్లో లేని మరో ఐదు వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. కోర్టులకెళ్లడంతో 639.84 ఎకరాలను బోర్డు కోల్పోయింది. అన్యాక్రాంత ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కఠిన చట్టాలున్నా.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కఠిన చట్టాలున్నా అక్రమార్కుల ఆగడాలు మాత్రం కొనసాగుతున్నాయి. వక్ఫ్ యాక్ట్ 52(1) అమెండ్మెంట్ 2013 ప్రకారం ఈ ఆస్తులు కొన్న, అమ్మిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. కానీ ఇప్పటి వరకు 50లోపే కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కరిపైనా చార్జిషీట్ దాఖలు కాలేదు. స్థలాలు అమ్ముతున్న ముతవల్లులు, ముజావర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. మసీదులు, దర్గాల నిర్వహణ చూసే ముతవల్లులు, ముజావర్లు ఆ భూములను సాగుచేసుకుంటూ వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని (వక్ఫ్ ఫండ్) ప్రతియేటా బోర్డుకు చెల్లించాలి. అయితే.. కొందరు సొంత భూముల్లా భావించి అమ్మేసుకుంటున్నారు. ప్రస్తుతమున్న భూముల నుంచి ఏటా రూ.25 లక్షలకు పైగా వక్ఫ్ఫండ్ రావాల్సి ఉండగా, రూ.12 లక్షల్లోపే వస్తున్నట్లు సమాచారం. వేధిస్తున్న సిబ్బంది కొరత వక్ఫ్బోర్డులో సిబ్బంది కొరత వేధిస్తోంది. రూ.వందల కోట్ల విలువైన వేలాది ఎకరాల భూములున్న ఈ జిల్లాలో కేవలం ఇద్దరితో కాలం గడుపుతున్నారు. ఇక ఇన్స్పెక్టర్, ఒక అటెండర్ మాత్రమే ఉండడంతో ఆస్తులపై పర్యవేక్షణ కొరవడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెలన్నరకు పైగా కార్యాలయానికి దూరంగా ఉన్న అజీమ్తో పాటు ఇష్టానుసారం విధులకు హాజరవుతున్న అల్తాఫ్ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్రమణకు గురైన భూముల వివరాలు ► కర్నూలు మండలం దిన్నేదేవరపాడు గ్రామం సర్వే నంబర్–19లో 59.59 ఎకరాల భూమి 20ఏళ్ల క్రితం ఆక్రమణకు గురైంది. ఇప్పుడు దీని విలువ రూ.40 కోట్లకు పైమాటే. ► కర్నూలు నగర శివారులోని జొహరాపురం రోడ్డులో సర్వే నంబర్లు 142, 154, 155, 162లో పాత బస్టాండ్లోని బుడాన్ఖాన్ మసీదుకు చెందిన 60 ఎకరాలు అన్యాక్రాంతమైంది. దీని విలువ రూ.35కోట్లకు పైగా ఉంటుంది. కంచే చేను మేసిన చందంగా ఓ రిటైర్డు తహశీల్దారు, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి హస్తం ఉందని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ►కర్నూలు గ్రామ సర్వే నంబర్ –62లో 5.32 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. ఇందులో పశువుల షెడ్డు ఏర్పాటు చేశారు. ► మునగాలపాడులోని సర్వే నంబరు 93, 146లో 19 ఎకరాలు ఆక్రమణకు గురైంది. దీని విలువ రూ. 5 కోట్ల వరకు ఉంటుంది. ►కల్లూరు పరిధి, కలెక్టరేట్ వెనుకాల ఉన్న రాయలసీమ క్రిష్టియన్ కళాశాల వద్ద సర్వే నంబరు 922లో 7.60 ఎకరాల భూమి అక్రమార్కుల గుప్పిట్లో ఉంది. దీని విలువ రూ.8కోట్లకు పైమాటే. నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం – ఇనాయత్, వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ వక్ఫ్ ఆస్తులను అనధికారికంగా అనుభవిస్తుంటే స్వచ్ఛందంగా వచ్చి స్వాధీనపర్చాలి. లేనిపక్షంలో ముందుగా నోటీసులిస్తాం. స్పందించకపోతే వక్ఫ్ చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపుతాం. ఇప్పటివరకు 50కి పైగా కేసులు పెట్టాం. ఈ విషయాన్ని ఆక్రమణదారులు గమనించాలి. -
రాందేవ్పై నాన్బెయిలబుల్ వారెంట్
రోహ్తక్: ‘భారత్ మాతాకీ జై’ నినాదం చేయడానికి వ్యతిరేకించే వారి తలలు నరికేయాలని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్పై నాన్బెయిలబుల్ వారెం ట్ జారీ అయింది. స్థానిక అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హరీశ్ గోయల్ ఈ వారెంట్ జారీచేస్తూ కేసు తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేశారు. మే 12న కోర్టు రాందేవ్పై బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. సమన్లు, బెయిలబుల్ వారెంట్ జారీచేసినా బుధవారం కోర్టులో హాజరవడంలో రాందేవ్ విఫలమైనందుకే నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని లాయర్ ఓపీ చుగ్ అన్నారు. -
నాన్బెయిలబుల్ వారెంట్లను అమలు చేయాలి
మృతురాలు వైద్య విద్యార్థిని తండ్రి డిమాండ్ కాకినాడ క్రైం : రాజమహేంద్రవరం జీఎస్ఎల్ మెడికల్ కళాశాల్లో రేడియాలజిస్ట్ కోర్సు విద్యాభ్యాసం చేస్తూ యాజమాన్యం వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న పీజీ వైద్య విద్యార్థిని మెర్ల శ్రీలక్ష్మి కేసులో కళాశాల ప్రతినిధులపై కోర్టు జారీ చేసిన నాన్బెయిలబుల్ వారెంట్లను పోలీసులు తక్షణం అమలు చేయాలని మృతురాలి తండ్రి భవాని శంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం జీఎస్ఎల్ కళాశాలలో ప్రొఫెసర్ల, కనీసం మౌలిక వసతుల కూడా లేకపోవడంతో యాజమాన్యాన్ని తమ కుమార్తె శ్రీలక్ష్మి ప్రశ్నించిందన్నారు. దాంతో కళాశాల యాజమాన్యం వేధింపులకు గురిచేసేదన్నారు. దీంతో 14 ఫిబ్రవరి 2014లో కాకినాడ గాంధీనగర్లో ఆత్మహత్య చేసుకుందన్నారు. తాను రాసిన లేఖలో తన మరణానికి కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ల వేధింపులే కారణమని పేర్కొందన్నారు. అప్పట్లో కళాశాలకు చెందిన 12 మందిపై కాకినాడ టూటౌన్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా రేడియాలజీ డిపార్టుమెంట్కి చెందిన హెచ్వోడీ అనిందిత మిశ్రాను అరెస్ట్ చేసి మిగతా వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. భవిష్యత్లో ఇటువంటివి పునరావృతం కాకుండా కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండేళ్ల క్రితం కాకినాడ కోర్టులో ప్రైవేట్ కేసు వేశామన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జీఎస్ఎల్ కళాశాలకు చెందిన వల్లభనేని మైత్రి ప్రియదర్శిని, కళాశాల ప్రిన్సిపాల్ ఏలేశ్వరపు వెంకటరామ శర్మ, సూపరింటెండెంట్ టీసీహెచ్ సత్యనారాయణ, కళాశాల చైర్మెన్ గన్ని భాస్కరరావు, చైర్మెన్ కుమారుడు గన్ని సందీప్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మే 31న కాకినాడ ఐదో అడిషనల్ జుడిషియల్ మెడిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్క్లాస్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసిందన్నారు. ఇప్పటికైనా పోలీసులు కోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు పెద్దింటి వెంకటేశ్వరరావు, బారుకల శేఖర్ పాల్గొన్నారు. -
సహారా చీఫ్కు ఊరట
న్యూఢిల్లీ సహారా కేసులో సహారా అధిపతి సుబ్రతారాయ్కి ఊరట లభించింది. ఆయన పై జారీ నాన్బెయిలబుల్ వారెంట్ను సెబీ కోర్టు రద్దు చేసింది. శుక్రవారం కోర్టు ముందు హాజరైన సహారా చీఫ్ సుబ్రతా రాయ్పై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను ముంబయి ప్రత్యేక సెబీ కోర్టును రద్దు చేసింది. తదుపరి అన్ని విచారణలకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ విచారణను మే 18కి వాయిదా వేసింది. ఆరోపణల పై వాదన ప్రారంభంకానున్నాయి. అయితే రాయ్ లాయర్ చార్జ్షీట్ ఇపుడే అందిందని రాయ్ తరపు న్యాయవాది అశోక్ సరోగి తెలిపారు. ఇన్వెస్టర్లకు రూ.20వేల కోట్లను చెల్లించడంలో విఫలమైన కేసులో కోర్టుముందు హాజరు కావడంతో సుబ్రాతారాయ్కు ఫిబ్రవరిలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ఎన్బీడబ్ల్యుని రద్దు చేయాలని రాయ్ మార్చ్ 31 న హైకోర్టును ఆశ్రయించారు. సెబీ రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్లకు చెందిన రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి, వందనా భార్గవ లకు సమన్లు జారీ చేసింది. సెక్షన్ 24 కింద సెబీ నిబంధనను ఉల్లంఘించినందుకు రాయ్ తో పాటు మరో ఐదురుగురిపై 2012 లో కేసు నమోదైంది. ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆగష్టు 31, 2012 న సుప్రీంకోర్టు సహారా గ్రూప్ రూ .17,400 కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కాగా సెబీ నిబంధనలకు విరుద్ధంగా సహార పరివార్, సహార హౌసింగ్ సంస్థలు వినియోగదారుల నుంచి కోట్లలో డిపాజిట్లు సేకరించిన కేసులో సుమారు రూ.20 వేల కోట్లను అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంది. అయితే దీనిపై కోర్టు తీర్పును ఉల్లంఘించినందుకు సుబ్రతా రాయ్ 2014 మార్చి 4 నుంచి 2016 మే 6 వరకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. తల్లి అంత్యక్రియలకు ఆయన పెరోల్పై విడుదలయ్యారు. సెబీకి డబ్బులు చెల్లించేందుకుగాను సుప్రీం కోర్టు ఆయన పెరోల్ను పలు మార్లు పొడిగించింది. దీంతో రూ.600 కోట్లను చెల్లించారు. అయితే మిగతా మొత్తం రూ.14,799 కోట్లకుగాను రూ.39 వేల కోట్ల విలువైన ఆస్తులను సుప్రీం కోర్టు అటాచ్ చేసింది. అనంతరం ఏప్రిల్17న సహారాకు చెందిన విలువైన ఆస్తి ఆంబే వాలీని వేలం వేయాల్సింగా ఆదేశించిడంతో పాటు, ఏప్రిల్ 28లోపు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. -
మళ్లీ చిక్కుల్లో సంజయ్ దత్
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ సంజయ్ సంజయ్ దత్ మరో కొత్త చిక్కు వచ్చి పడింది. 1993నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఎరవాడ జైలు గత ఏడాది విడుదలైన మున్నాభాయ్పై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నిర్మాత నిర్మాత షకీల్ నూరాని కేసులో ఈ వారెంట్ జారీ అయింది. విచారణకు సంజయ్ గైర్హాజరు అయినందున కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. సంజయ్ దత్ కు అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధం ఉందనీ, ఆయన ప్రోద్బలంతోనే తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించిన నూరాని ఈ మేరకు కేసు దాఖలు చేశారు. సంజయ్ తనతో ఒక చిత్రం చేసేందుకు 2002లో ఒప్పందం కుదుర్చుకుని దానిని ఉల్లంఘించారని నూరాని ఆరోపణ. దీనికి సంబంధించి సంజయ్ తనకు 50లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉందని, ఒప్పందం ఉల్లంఘన వల్ల తనకు 2కోట్లు నష్టం వాటిల్లిందని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా 1993 ముంబై బాంబుపేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నారన్న నేరంపై ఈ హీరోకు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు. 42 నెలల జైలు జీవితం గడిపిన ఆయన సత్ర్పవర్తన కారణంగా ఇంకా ఎనిమిది నెలల శిక్ష మిగిలి ఉండగానే బయటికివచ్చారు. అటు బాలీవుడ్ లో సంజయ్ దత్ బయో పిక్ రూపొందుంతోంది. రియల్ లైఫ్ స్టోరీని డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ తెరపైకి తీసుకురాబోతున్నాడు. 'దత్' బయోపిక్ రణబీర్ మేకోవర్ ఫోటోలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. -
హీరోయిన్కు అరెస్ట్ వారెంట్
థానె: 2 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి మమతా కులకర్ణి పీకల్లోతు కష్టాల్లో పడింది. థానెలోని ప్రత్యేక కోర్టు మమతా కులకర్ణితో పాటు అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ వికీ గోస్వామికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు వెలుగు చూసిన తర్వాత మమత, గోస్వామి అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని సమాచారం. డ్రగ్ రాకెట్ కేసులో మమత, గోస్వామికి సంబంధమున్నట్టు బలమైన ఆధారాలున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హీరే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులు వీరేనని, వీరిపై వారెంట్ జారీ చేయాలని కోరారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారని తెలిపారు. భారత్, కెన్యాలో డ్రగ్ రాకెట్ నడుపుతున్నారని, కెన్యాలోని ఓ హోటల్లో మమత, గోస్వామి, ఇతర నిందితులు సమావేశమైనట్టు విచారణలో తేలిందని చెప్పారు. వాదనలు విన్న అనంతరం కోర్టు.. మమత, గోస్వామికి వారెంట్ జారీ చేసింది. 2014 ఏప్రిల్లో థానె క్రైమ్ బ్రాంచ్ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గోస్వామికి, కెన్యాకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు ప్రమేయమున్నట్టు కనుగొన్నారు. ఆ తర్వాత విచారణలో చాలామంది పేర్లు వెలుగు చూశాయి. మమత కెన్యాలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. -
‘రేపిస్టు’ మంత్రిపై నాన్బెయిలబుల్ వారెంట్
లక్నో: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రజాపతి, మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు జారీచేసింది. ఆయన పాస్ పోర్టును నాలుగు వారాలపాటు ఆయన పాస్పోర్టుపై నాలుగువారాలపాటు నిషేధం విధించింది. మరోపక్క, అజ్ఞాతంలో వెళ్లిన ఆయనకోసం లుక్ ఔట్ నోటీసులు వేయాలని కూడా సర్క్యులర్ విడుదల చేశారు. తనపై, తన మైనర్ కూతురుపై ప్రజాపతి ఆయన సమూహం లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కూతురు ఆస్పత్రిలో కోలుకుంటోంది. తొలుత ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులు పెట్టేందుకు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ కేసులో కదలిక ఏర్పడింది. సుప్రీం చెప్పిన అనంతరం కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమేథిలోని మంత్రి ఇంట్లో సోదాలు చేశారు. ఆయన అంతకుముందే లక్నో వెళ్లినట్టు తెలుసుకున్న పోలీసులు లక్నోలోని మంత్రి బంగ్లాకు వెళ్లగా అక్కడ కూడా ఆయన లేరు. మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు లక్నో ఎస్పీ చెప్పారు. ఆయనను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఇప్పటికీ ఆయన జాడ తెలియకపోవడంతో నాన్బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రజాపతిని మంత్రివర్గం నుంచి తొలగించారు. ములాయం విధేయుడైన ప్రజాపతిని ఆయన సూచన మేరకు అఖిలేష్ మళ్లీ కేబినెట్లో చేర్చుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపతి ఎస్పీ తరఫున అమేథి నుంచి పోటీ చేస్తున్నారు. అఖిలేష్ ఇటీవల అమేథికి ప్రచారానికి వెళ్లినపుడు ప్రజాపతిని వేదికపైకి అనుమతించలేదు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాపతిని అఖిలేష్ మంత్రివర్గంలో కొనసాగించడంపై ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. -
లిక్కర్ కింగ్ మాల్యాకు మరో షాక్
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో షాక్ ఎదురైంది. ఆయనపై ముంబై కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి, మనీ లాండరింగ్కు పాల్పడిన కేసులో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ వారెంట్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) యూకేకు బదలాయించనుంది. బ్యాంకులకు దాదాపు 9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి, ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్న మాల్యాను భారత్కు పంపించాలని కోరుతూ.. నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద ఈ వారెంట్ను సీబీఐ యూకేకు పంపనుంది. ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టులో మాల్యా ఈ ఏడాది జూలైలో హాజరుకావాల్సి ఉంది. కానీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి, మాల్యా కోర్టు ముందు హాజరు కాలేదు. మార్చిలో దేశం విడిచిపారిపోయిన మాల్యా ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే ఆయనపై పలు చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి. చెక్ బౌన్స్ కేసులో ఓ సారి ఇప్పటికే ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీచేసింది. మరోసారి మాల్యాకు ముంబై స్పెషల్ కోర్టు షాకిచ్చింది. -
మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు
• న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేదని రెండు కోర్టుల వ్యాఖ్యలు • దేశానికి తిరిగి వచ్చే ఉద్దేశం లేనట్లు కనబడుతోందని ఆగ్రహం న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రుణ ఎగవేతల కేసులో దేశం నుంచి పారిపోరుు బ్రిటన్లో ఉంటున్న పారిశ్రామికవేత్త విజయ్మాల్యాపై స్థానిక మెట్రోపాలిటన్ కోర్టులు రెండు వేర్వేరుగా శుక్రవారం నాన్-బెరుులబుల్ వారెంట్లు జారీ చేశారుు. న్యాయవ్యవస్థ పట్ల ఆయనకు గౌరవం లేదని, ఆయనకు భారత్కు తిరిగి వచ్చే ఉద్దేశమూ లేనట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారుు. ఎటువంటి విచక్షణ లేకుండా మాల్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార ప్రతినిధులను ఆదేశించారుు. రెండు కేసులను వేర్వేరుగా చూస్తే... ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఫెరా (ఫారిన్ ఎక్సే ్ఛంజ్ రెగ్యులేషన్ యాక్ట్) నిబంధనల ఉల్లంఘనల కేసులో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమిత్దాస్ మాల్యాకు నాన్-బెరుులబుల్ వారెంట్ జారీ చేశారు. ఉత్తర్వు అమలు చేయాలని ఈడీని ఆదేశించిన కోర్టు, కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22వ తేదీకి వారుుదా వేసింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎరుుర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) దాఖలు చేసిన 2012 చెక్ బౌన్స కేసుల్లో మరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆనంద్ దాస్ తాజాగా మాల్యాపై ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు. వీటిని మాల్యాకు అందేలా చూడాలని హోమ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించారు. కింగ్ఫిషర్ రూ. కోటి రూపాయలు ఇవ్వాలంటూ డీఐఏఎల్ తాజా కేసు దాఖలు చేసింది. 2012 ఫిబ్రవరి 22న ఇచ్చిన చెక్కు ‘నిధుల లేక’ బౌన్స అరుు్యందని సంస్థ కేసు దాఖలు చేసింది. 2012 జూన్లో రూ.7.5 లక్షలను రాబట్టుకోడానికి సంబంధించి నాలుగు కేసులను డీఐఏఎల్ దాఖలు చేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 4వ తేదీకి వారుుదా వేసింది. -
అగ్రస్థానమే లక్ష్యం
⇔ కర్ణాటక వైమానిక పాలసీ సవరణకు మంత్రి మండలి ఆమోదం ⇔ రూ.14,520 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 33 ప్రతిపాదనలకు అంగీకారం ⇔ 10,584 ఉద్యోగాల సృష్టి’ ⇔ జీఎస్టీ’ ఆమోదానికి 14న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం బెంగళూరు: విమానయాన రంగంలో కర్ణాటకను దేశంలోనే అగ్ర స్థానంలో నిలపడమే లక్ష్యంగా కర్ణాటక వైమానిక విధానాల్లో సవరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మంత్రి మండలి ఆమోదం సైతం లభించింది. బుధవారమిక్కడి విధానసౌధలో సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మండలి సమావేశం అనంతరం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. కర్ణాటక రాష్ట్రం ఏరోస్పేస్ హబ్గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటక ‘వైమానిక పాలసీ 2013-23’కు సవరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం రూ.14,520 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 33 ప్రతిపాదనలకు మంత్రి మండలి అంగీకారం తెలిపిందని, తద్వారా రాష్ట్రంలో 10,584 ఉద్యోగాల సృష్టి జరగనుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న పారిశ్రామిక విధానంలో వ్యాపారులకు లభించే అన్ని సౌకర్యాలు, రాయితీలు నూతన వైమానిక పాలసీ ద్వారా ఈ రంగంలోని వ్యాపారులకు కూడా లభించనున్నాయని తెలిపారు. ఇక విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాల తయారీ కర్ణాటకలో ఎక్కువగా జరుగుతోందని అన్నారు. ఇదిలాగే కొనసాగితే కర్ణాటక ఏషియాలోనే ఏరోస్పేస్ హబ్గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు.... ⇔ ‘జీఎస్టీ’ బిల్లు ఆమోదానికి సెప్టెంబర్ 14న ఒక రోజు పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు మంత్రి మండలి అంగీకారం తెలిపింది. సెప్టెంబర్ 14న ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ⇔ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్యారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మంత్రి మండలి అనుమతించింది. ఒక్కో కళాశాలలో 320 సీట్లు అందుబాటులో ఉంటాయి. ⇔రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ మాజీ అధికారి చలపతిని సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారిగా నియమించేందుకు అంగీకారం ⇔పోలీసు శాఖలో 50 బస్సులు, 200 హొయ్సళ వాహనాల ఖరీదుకు గాను రూ. 14కోట్లను విడుదల చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. -
వణుకు పుట్టాలి
భూ ఆక్రమణదారులపై నాన్బెయిలబుల్ కేసులు నేరం రుజువైతే కఠిన శిక్షలు కర్ణాటక భూ ఆక్రమణల నిషేధ ప్రత్యేక న్యాయస్థానాన్ని ప్రారంభించిన సీఎం న్యాయస్థానాన్ని ప్రారంభిస్తున్న సీఎం తదితరులు బెంగళూరు: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. నగరంలోని రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన కర్ణాటక భూ ఆక్రమణల నిషేధ ప్రత్యేక న్యాయస్థానాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై నాన్బెయిలబుల్ కేసులను నమోదు చేయాలి, నేరం రుజువైతే కఠిన శిక్షలు విధించాలి. భూముల ఆక్రమణల్లో ఆక్రమణదారులకు కొందరు ప్రభుత్వ అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. వారికి కూడా శిక్షలు పడితేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి’ అని పేర్కొన్నారు. సభా సమితి నివేదిక ప్రకారం ఒక్క బెంగళూరు నగరంలోనే 34వేల భూముల ఆక్రమణల కేసులు నమోదు కాగా, కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని అన్నారు. ఇటీవలి కాలంలో రోజు రోజుకు భూముల ధరలు పెరిగిపోతుండడంతో భూములను కబ్జా చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతోందని పేర్కొన్నారు. ‘భూ ఆక్రమణ దారులు తమ వద్ద ఉన్న డబ్బుతో ఏమైనా చేయవచ్చని భావిస్తుంటారు. ఏ వ్యవస్థనైనా తమ దగ్గర ఉన్న డబ్బుతో కొనేయవచ్చని, న్యాయమూర్తులను కూడా తమ డబ్బుతో కొనేయవచ్చని అనుకుంటూ ఉంటారు. అందుకే అలాంటి వారికి కనీసం జామీను కూడా లభించకుండా నాన్ బెయిలబుల్ కేసులను పెట్టాలి. ఈ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినపుడు కొంతమంది ఇందుకు అడ్డుపడేందుకు ప్రయత్నించారు. అలాంటి వారిలో ఇప్పుడిక వణుకు ప్రారంభమైంది’ అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. భూ ఆక్రమణలకు సంబంధించిన కేసులు ప్రత్యేక కోర్టులో త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఓ సమితిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆక్రమణదారులను శిక్షించడంతో పాటు నిరపరాధులను రక్షించాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. భూ ఆక్రమణలు పెద్ద మాఫియాలా రూపాంతరం చెందాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలోని కొన్ని లోపాలను ఇలాంటి వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోగలిగామని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, రెవెన్యూ శాఖ మంత్రి కాగోడు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. -
మాల్యాకు వార్నింగ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ రుణ ఎగవేతదారుడు, బ్రిటన్లో తలదాచుకుంటున్న కింగ్ఫిషర్ అధినేత విజయ్మాల్యాపై మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు పాటియాలా హౌస్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నవంబర్ 4న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. లండన్ లో ఉన్న మాల్యాకు వారెంట్ అందేలా చూడాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కోర్టుకు హాజరుకాకుంటే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఇప్పటికే పలు కోర్టులు మాల్యాకు బెయిల్ కు వీలుకాని వారెంట్లు జారీ చేశాయి. సుప్రీంకోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఆయన ఏ కోర్టులోనూ హాజరుకాలేదు. కాగా, ముంబైలోని కింగ్ఫిషర్ హౌస్ ను రూ.135 కోట్లకు వేలం వేసినా ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. -
ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కు
విజయ్కాంత్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య సాక్షి ప్రతినిధి, చెన్నై: పరువునష్టం దావా కేసుల్ని ప్రభుత్వాల్ని విమర్శించే వారిపై రాజకీయ అస్త్రాలుగా ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కని, విమర్శిస్తే పరువునష్టం దావాలు వేస్తారా? అంటూ అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఆయన భార్య ప్రేమలతలపై పరువునష్టం దావా కేసులో తిరుప్పూరు కోర్టు పీటీ వారెంట్పై గురువారం స్టే మంజూరు చేస్తూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. పరువునష్టం కేసులో హాజరుకాకపోవడంతో తిరుప్పూరు కోర్టు బుధవారం విజయకాంత్, ఆయన భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. జయలలితపై తప్పుడు ఆరోపణలు చేశారని, ప్రభుత్వ పనితీరును విమర్శించారంటూ నవంబర్ 6, 2015న తిరుప్పూరు జిల్లాకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు పెట్టారు. తమిళనాడు ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై ఇంతవరకు దాఖలు చేసిన పరువునష్టం దావాల జాబితాను రెండు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది. విమర్శలపై సహనం పాటించాలని, ఎవరైనా అవినీతి, అసమర్థ ప్రభుత్వం అని విమర్శిస్తే పరువునష్టం దావా వేయలేరని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్.ఎఫ్.నారిమన్ల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమిళనాడులో మాత్రమే ఎందుకు పరువునష్టం దావాలు వేస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు బనాయించడం లేదని, విమర్శించడం ప్రతిపక్షాలకు ఉన్న హక్కని సుప్రీం వ్యాఖ్యానించింది. తమిళనాడులో మాత్రమే ఇన్ని పరువునష్టం కేసులు ఎందుకు దాఖలవుతున్నాయని, తమిళనాడు ముఖ్యమంత్రి తరఫున ప్రభుత్వ న్యాయవాదులు ఎవరెవరిపై ఇంతవరకు దావాలు వేశారో ఆ జాబితాను రెండువారాల్లోగా కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం కేసును సెప్టెంబర్ 21కి వాయిదావేసింది. -
మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్
ముంబై: బ్యాంకుల రుణ ఎగవేతదారు విజయ్ మాల్యా మరో సమస్యలో ఇరుక్కున్నారు. ముంబై కోర్టు తాజాగా ఏఏఐ చెక్ బౌన్స్ కేసులో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఇష్యూ చేసిన రూ.100 కోట్ల విలువైన రెండు చెక్ల బౌన్స్కు సంబంధించి గతంలో ఈ కేసు వేసింది. జూలై 16(శనివారం) కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ రాకపోవడంతో బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. గాయత్రి డొమిసైల్కు రోడ్డు ప్రాజెక్టుల బదిలీ -
మాల్యాకు మరోసారి వారెంట్
ముంబై: మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు ముంబై కో్ర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారీ జారీ చేసింది. న్యాయమూర్తి హెచ్చరించినట్టుగానే చెక్ బౌన్స్ కేసులో కోర్టు మద్యం వ్యాపారి ,కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ అధిపతి విజయ్ మాల్యా కు ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. సబర్బన్ అంధేరీలోని మెట్రోపాలిటన్ కోర్టు శనివారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ (ఏఏఐ) దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ముందు హాజరుకావాలన్న ఆదేశాలను బేఖాతరు చేసిన మాల్యాపై మాజిస్ట్రేట్ ఏఏ లాల్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలైలో తదుపరి విచారణకు హాజరు కాని పక్షంలో నాన్ బెయిల బుల్ వారెంట్ జారీ చేస్తామన్న కావాలంటూ కింగ్ఫిషర్ ప్రమోటర్ విజయ్ మాల్యాను ఈ ఏడాది మే నెలలో కోర్టు ఆదేశించింది. విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారంట్ను జారీ చేయనున్నట్లు మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ ఏఏ లాల్కర్ హెచ్చరించిన మాల్యా గైర్హాజరు కావడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్.. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 100 కోట్ల రూపాయలు చెల్లించేందుకు రెండు చెక్కులను ఇచ్చింది. ఇవి బౌన్స్ కావటంతో ఏఏఐ.. మెట్రోపాలిటన్ కోర్టులో కేసు దాఖలు చేసింది. కేసు విచారణ సందర్భంగా విజయ్ మాల్యా కోర్టులో హాజరయ్యేందుకు ఇస్తున్న మినహాయింపులను పూర్తిగా రద్దు చేయాలంటూ ఏఏఐ కోర్టును కోరింది. బకాయిలు చెల్లించకుండా మాల్యా తప్పించుకు తిరుగుతున్నారని ఆయనపై అరెస్ట్ వారంట్ జారీ చేయాలని కోరింది. దీంతోపాటుగా ఏఏఐ న్యాయవాది వాదించిన సంగతి తెలిసిందే. -
భూమాపై నాన్బెయిలబుల్ వారెంట్
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 2015 మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో భూమా నాగిరెడ్డి, డీఎస్పీ దేవదానంకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భూమా డీఎస్పీని కులం పేరుతో దూషించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరస్టయిన భూమా బెయిల్ మీద బయటకు వచ్చారు. కాగా, కోర్టు కేసు విచారణకు దాదాపు రెండుమార్లు గైర్హాజరయ్యారు. సోమవారం మరోసారి విచారణకు రాకపోవడంతో మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. -
ఎర్రచందనం స్మగ్లర్లకు కఠిన శిక్షలు
- నాన్బెయిలబుల్ కేసులు - స్మగ్లర్ల ఆస్తుల జప్తు - అటవీ సవరణ చట్టం - 2016 నేటి నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్లకు ఇక కఠిన శిక్షలు పడనున్నాయి. స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లభించింది. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ఉద్దేశించిన అటవీ (సవరణ) చట్టం - 2016 బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈమేరకు అటవీ సవరణ చట్టం - 2016కు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం ఈనెల 19వ తేదీ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ చట్ట సవరణ వల్ల ఎర్రచందనం చెట్లు నరికిన, రవాణా చేసిన, దాచి ఉంచిన, స్మగ్లింగుకు సహకరించిన వారికి కఠిన శిక్షలు పడతాయి. గతంలో ఎర్రచందనం కేసులు బెయిలబుల్గా ఉండేవి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సవరణ చట్టం ప్రకారం ఇక నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. ఈ కేసుల్లో నిందితులకు పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 10 లక్షల వరకూ జరిమానా పడుతుంది. స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం 20 కిలోలకు మించి ఎర్రచందనం నిల్వ చేయరాదు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులను సత్వరం విచారించి దోషులకు శిక్షలలు విధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయనుంది. సాధారణ కోర్టుల్లో విచారణలు పూర్తికాకుండా కేసులు పెండింగులో ఉండిపోతున్నాయి. అందువల్ల ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం సవరణ చట్టంలో పేర్కొంది. ఈ చట్టం ప్రకారం పోలీసు శాఖ నుంచి డీఎస్పీ, అటవీశాఖ నుంచి ముఖ్య అటవీ సంరక్షణాధికారి స్థాయి వారు ఈ కేసులను విచారించే అవకాశం ఏర్పడింది. సవరించిన అటవీ చట్టం - 2016 బుధవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అశ్వనీ కుమార్ ఫరీడా ఉత్తర్వులు జారీ చేశారు. -
విజయ్ మాల్యా పాస్ పోర్టు రద్దు
బ్రిటన్లో ఉన్నట్లు భావిస్తున్న ‘ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు’ విజయ్ మాల్యా మరింత ఇరుకున పడ్డారు. విజయ్ మాల్యా డబ్బు లావాదేవీల్లో చట్టాన్ని ఉల్లంఘించారని, కేసు విచారణకు సరిగా సహకరించడంలేదని ఈ నేపథ్యంలో మాల్యా పాస్ పోర్టు రద్దు చేస్తున్నట్టు ఆదివారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. సెక్షన్ 10(3)(సీ) అండ్(హెచ్) ఆఫ్ పాస్ పోర్ట్ ఆక్ట్ ప్రకారం విజయ్ మాల్యా పాస్ పోర్టు ను రద్దు చేశామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మాల్యాను స్వదేశానికి రప్పించే డిపోర్టేషన్ ప్రక్రియ ప్రారంభించాలంటూ విదేశీ వ్యవహారాల శాఖను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఆశ్రయించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) వచ్చేలా సీబీఐ కి త్వరలోనే ఈడీ లేఖ రాయనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు తీసుకున్న రుణంలో మాల్యా 430 కోట్ల రూపాయల వరకూ విదేశాలకు మళ్ళించారన్నది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదన. మరోవైపు తొమ్మిదివేల కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసుకు సంబంధించి మాల్యాపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిపింది. తన విదేశీ ఆస్తుల వివరాలను అడిగే అధికారం బ్యాంకులకు లేదని, తన భార్యా, పిల్లలు ఎన్నారైలు కావడంతో తన ఆస్తుల వివరాలను వెల్లడించక్కర లేదని మాల్యా ఇప్పటికే సుప్రీం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. After having considered replies by @TheVijayMallya, MEA revokes his passport under S.10(3)(c) & (h) of Passports Act pic.twitter.com/Stb9rX63OV — Vikas Swarup (@MEAIndia) 24 April 2016 -
విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్
ఐడీబీఐ నుంచి రూ.900 కోట్ల రుణం కేసులో ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ముంబై: బ్రిటన్లో ఉన్నట్లు భావిస్తున్న ‘ఉద్దేశపూ ర్వక రుణ ఎగవేతదారు’ విజయ్ మాల్యా మరింత ఇరుకున పడ్డారు. ఆయన అరెస్టుకు ఇక్కడి ప్రత్యేక కోర్టు (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్పై ప్రత్యేక కోర్టు జడ్జి పీఆర్ భావ్కీ సోమవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. రూ.900 కోట్లు ఐడీబీఐ బ్యాంక్ రుణం కేసులో మూడుసార్లు సమన్లు పంపినా... మాల్యా పట్టించుకోలేదని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది. ఈడీ విజ్ఞప్తి మేరకు మాల్యా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను కేంద్రం నాలుగువారాల పాటు సస్పెన్షన్లో ఉంచిన సంగతి తెలిసిందే. కింగ్ఫిషర్ పిటిషన్ కొట్టివేత కాగా ఐడీబీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న రు.900 కోట్ల రుణంలో సగం మొత్తాన్ని విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు మాల్యా వెచ్చించినట్లు ఈడీ చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ... కింగ్ఫిషర్ దాఖలు చేసిన ఒక పిటిషన్ను కూడా ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషన్ను దాఖలు చేసిన వెన్వెంటనే కోర్టు దీనిని తోసిపుచ్చింది. మాల్యా తన, అలాగే తన కుటుంబ సభ్యుల దేశ, విదేశాల్లో ఆస్తుల వివరాలను ఈ నెల 21వ తేదీలోపు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు తదుపరి విచారణ 26వ తేదీన జరగనుంది. ఇవ్వాల్సిన మొత్తంలో రూ.4,000 కోట్లు చెల్లించడానికి సిద్ధమని మాల్యా చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకింగ్ గ్రూప్ విన్నవించిన నేపథ్యంలో సుప్రీం సంబంధిత ఉత్తర్వులు ఇచ్చింది. బ్యాంకులకు బకాయి వున్న రుణ మొత్తం రూ.6,903 కోట్లలో (వడ్డీకాకుండా) రూ. 4,000 కోట్లు తిరిగి చెల్లించేస్తానని గతంలో మాల్యా సుప్రీంకోర్టుకు విన్నవించారు. వివిధ వ్యాపార వివాదాలకు సంబంధించి తాము దాఖలు చేసిన కేసుల్లో రావాల్సివున్న మొత్తం వస్తే, మరో రూ.2,000 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదించారు. అయితే వడ్డీలతో కలిపి మాల్యా వివిధ బ్యాంకులకు రూ. 9.000 కోట్లు బకాయివున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు గతంలో విన్నవించింది. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాలకు సంబంధించిన వివాదాన్ని అర్థవంతమైన సంప్రదింపుల ద్వారా, పరిష్కరించుకోవడం పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ.. తగిన మొత్తాలను తన ముందు డిపాజిట్ చేయాలని కూడా మాల్యాను న్యాయస్థానం ఆదేశించింది. ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ కోరతాం: ఈడీ కాగా, నేడు ముంబై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ ఆధారంగా విజయ్మాల్యా అరెస్ట్కు ఇంటర్పోల్ వారెంట్ను కోరబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి గ్లోబల్ పోలీస్ సంస్థకు త్వరలో సీబీఐ ద్వారా ఒక లేఖ పంపుతామని ఆ వర్గాలు తెలిపాయి. మార్చి 2న దేశం నుంచి వెళ్లిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్లో ఉన్నట్లు భావిస్తున్నారు. -
'మాల్యాకు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్'
ముంబయి: భారీ మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేతకు పాల్పడిన మనీ లాండరింగ్ కేసులో విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా ముంబయి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈడీ మాల్యాకు దాఖలు చేసిన నోటీసులు సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టు(పీఎంఎల్ఏ) తోసిపుచ్చింది. ఈడీ చేసిన ఆరోపణలు సమర్థిస్తూ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మాల్యాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం విజయ్ మాల్యా లండన్లో ఉన్నారు. ఇప్పటికే మాల్యా పాస్ పోర్ట్ కూడా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. -
పోలీస్ వర్సెస్ దొంగ హైడ్రామా
► ఓ కేసులో కోర్టుకు హాజరైన నిందితుడు ► మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నం ► పోలీసులు, నిందితుడి కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం ► అరగంట సేపు జిల్లా కోర్టు సమీపంలో ట్రాఫిక్ జామ్ నెల్లూరు సిటీ : జిల్లా కోర్టు సమీపంలో సోమవారం పోలీస్ వర్సెస్ దొంగ హైడ్రామా నడిచింది. ఈ ఘటన కారణంగా దాదాపు అర్ధగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఓ కేసులో కోర్టుకు హాజరైన నిందితుడని మరో నాన్బెయిల్బుల్ కేసులో మూడో నగర పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నిం చగా పోలీసులు, నిందితుడి కుటుంబ సభ్యుల మధ్య తీవ్రవాగ్వాదం, పెనుగులాట జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని కుక్కలగుంట ప్రాంతానికి చెందిన అరవ రమేష్ 2011లో ఓ చోరీ విషయలో నిందితుడు. అప్పటి నుంచి రమేష్ పోలీసులు కళ్లుగప్పి తిరుగుతున్నారు. ఇతనిపై మూడో నగర పోలీసులు నాన్బెయిల్బుల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఒకటోనగర పోలీస్స్టేషన్లోని ఓ పెండింగ్ కేసులో అరవ రమేష్ జిల్లా కోర్టుకు హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మూడోనగర పోలీసులు కోర్టు నుంచి పాత జిల్లా జైలు మీదుగా వచ్చే రోడ్డు బయటకు వస్తుండగా రమేష్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో నిందితుడు రమేష్తో పాటు అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నిందితుడు పరారీ అయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు, నింది తుడు, అతని కుటుంబ సభ్యుల మధ్య తోపులాట, పెనుగులాట జరిగింది. దాదాపు అరగంటకు పైగా ఈ హైడ్రామాతో ఆ ప్రాం తంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఓ దశలో ఉద్రిక్తత పరిస్థితి నెల కొంది. అయితే చివరికి పోలీసులు ఆటోలో రమేష్ను బలవంతం గా ఎక్కించి పోలీస్స్టేషన్కు తరలించారు. సీఐ రామారావు ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
కేంద్ర మంత్రి సుజనాకు అరెస్టు వారంట్
హాజరు కావాలని ఆదేశించినా నిర్లక్ష్యం చేశారంటూ కోర్టు ఆగ్రహం తదుపరి విచారణ 26కు వాయిదా సాక్షి, హైదరాబాద్: మారిషస్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని మోసగించిన కేసులో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి, సుజనా సంస్థల అధినేత సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డానీ రూత్ గురువారం ఈ మేరకు వారంట్లు జారీ చేశారు. సహేతుకమైన కారణాలు లేకుండానే హాజరు నుంచి తప్పించుకోవాలని సుజనా చూస్తున్నారంటూ మారిషస్ బ్యాంకు తరఫు న్యాయవాదులు సంజీవ్కుమార్, కనకమేడల శాతకర్ణి చేసిన వాదనతో ఏకీభవించారు. ‘‘పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని మౌఖికంగా తెలుపుతూ మార్చి 22న హాజరు నుంచి సుజనా మినహాయింపు కోరారు. కానీ పిటిషన్లోమాత్రం పార్లమెంటులో పని ఉన్నందున కోర్టు ముందు హాజరు కాలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడేమో తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశించినా, మంత్రివర్గ సమావేశముందంటూ మరో కారణం చూపుతూ మినహాయింపు కోరుతున్నారు. సుజనా సహాయ మంత్రి మాత్రమే. సహాయ మంత్రులు మంత్రివర్గ సమావేశంలో పాల్గొనరు. అయినా ఆయన ఉద్దేశపూర్వకంగానే కోర్టుకు హాజరు కాకుండా రకరకాల కారణాలతో తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ రోజు (గురువారం) తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని ఏప్రిల్ 1వ తేదీనే కోర్టు ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మినహాయింపు కోరుతున్నారు. రకరకాల పిటిషన్లు వేయడం ద్వారా ఈ కోర్టు ముందు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను పాటించనందుకు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అరెస్టు వారెంట్లు జారీచేయండి’’ అంటూ వారు చేసిన విజ్ఞప్తి మేరకు సుజనాకు న్యాయమూర్తిఅరెస్టు వారెంట్లు జారీచేశారు. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ ఎండీ శ్రీనివాసరాజు, డెరైక్టర్ హనుమంతరావు కోర్టు ముందు హాజరై రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించారు. -
అవినీతిని ప్రశ్నిస్తే అంతేసంగతులు
తుని : ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై నాన్బెయిల్బుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గతంలో పలువురు వైఎస్సార్సీపీకి నాయకులపైనా కేసులు బనాయించిన విషయం తెలిసిందే. తాజాగా తుని మండలం టి.తిమ్మాపురం గ్రామానికి చెందిన పోల్నాటి ప్రసాదరావును కేసులో ఇరికించారు. ప్రసాదరావు కథనం ప్రకారం.. ఉపాధి హామీ పథకంలో గతేడాది చేసిన పనులు, పని చే సిన కూలీల వివరాలను ఇవ్వాలని బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రసాదరావు లిఖితపూర్వకంగా ఎంపీడీఓ కె.భీమేశ్వర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరాలను అందిస్తామని అధికారులు చెప్పడంతో తన గ్రామానికి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం పట్టణ పోలీస్స్టేషన్ కానిస్టేబుళ్లు తిమ్మాపురం వెళ్లి ప్రసాదరావును తీసుకువచ్చారు. ‘తనను ఎందుకు తనను తీసుకువచ్చారు’’ అని ప్రసాదరావు పోలీసులను ప్రశ్నించాడు. ‘మీపై ఉపాధి హామీ పథకం టెక్నికల్ సిబ్బంది ఫిర్యాదు చేశారు’’ అని చెప్పిన పోలీసులు సాయంత్రం వరకు అతడిని స్టేషన్లో ఉంచి కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. అవినీతిని ప్రశ్నించినందుకే.. గతేడాది గ్రామంలో జరిగిన ఉపాధి పనికి తాను వెళ్లకపోయినా పని చేసినట్టు నమోదు చేశారని, ఇందుకు సంబంధించిన పేసిప్పులు పంపారని, పని చేయకపోయినా ఎందుకు తన పేరును నమోదు చేశారని అధికారులను నిలదీయడంతో తనపై అక్రమ కేసు బనాయించారని ప్రసాదరావు తెలిపారు. తప్పుడు సర్వే నంబర్లతో అధికార పార్టీ వ్యక్తులు కొందరు కొబ్బరి మొక్కలు వేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి సొమ్మును స్వాహా చేశారన్నారు. ఒక్క తిమ్మాపురంలోనే సుమారు రూ. 50 లక్షల మేర ఉపాధి సొమ్మును వారు దిగమింగారన్నారు. ఈ పనుల వివరాలను అడిగినందుకే కేసు పెట్టారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ప్రసాదరావు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఉపాధి హామీ పథకం సెక్షన్కు వెళ్లి విధి నిర్వహణలో ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ సాయిని దుర్భాషలాడి, రూ.50 వేలు డిమాండ్ చేసినట్టు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పట్టణ సీఐ బోను అప్పారావు తెలిపారు. అయితే కేసు పెట్టిన టెక్నికల్ అసిస్టెంట్ సాయి ఎవరో ప్రసాదరావు తెలియక పోవడం ఇక్కడ విశేషం. -
మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఆదివారం జారీ చేశారు. జీఎంఆర్ విమానాశ్రయానికి సంబంధించి మాల్యా ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 10న విచారణ నిమిత్తం హాజరు కావాలని స్థానిక కోర్టు ఆయన్ను ఆదేశించింది. విచారణకు హాజరు కానందును మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు సమాచారం అందింది. -
మాజీ అధ్యక్షుడిపై నాలుగోసారి నాన్ బెయిలబుల్..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషరఫ్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటును ఇస్లామాబాద్ స్థానిక కోర్టు జారీచేసింది. అబ్దుల్ రషీద్ ఘాజీ అనే మతగురువు హత్య కేసు శనివారం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కేసును విచారించిన మేజిస్ట్రేట్ మాజీ సైన్యాధ్యక్షుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేస్తూ తీర్పిచ్చారు. అబ్దుల్ రషీద్ 2007లో మిలిటరీ చర్యల్లో భాగంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. మార్చి 16లోగా ఆయనను కోర్టులో హాజరుపరచాలని స్థానిక కోర్టు తన తీర్పులో పేర్కొంది. తనను ఈ కేసు నుంచి పూర్తిగా తప్పించాలని, తనకేం సంబంధం లేదంటూ ముషారఫ్ దాఖలు చేసిన పిటీషన్ ను మేజిస్ట్రేట్ కొట్టిపారేశారు. ఇప్పటివరకు జరిగిన 55 విచారణలలో ఒక్కసారి కూడా మాజీ అధ్యక్షుడు కోర్టుకు రాలేదని ధర్మాసనం మండిపడింది. కాగా, ప్రస్తుత వారెంట్ ముషారఫ్ పై జారీ అయిన నాలుగో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కావడం గమనార్హం. 2006లో అక్బర్ బుగ్తీ హత్యకేసులో ఆయనను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ముషరఫ్కు న్యాయస్థానం రెండువారాల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. కాగా ముషారఫ్ను చంపితే వందకోట్ల రూపాయలిస్తానని బలూచిస్తాన్ నేషనలిస్ట్ నాయకుడు నవాబ్ అక్బర్ బుగ్తీ కుమారుడు తలాల్ అక్బర్ బుగ్తీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 2007లో ముషారఫ్ ఆదేశాల మేరకు రషీద్ ను మిలిటరీ హతమార్చిందని ఆయన కుటుంబసభ్యులు 2013లో మాజీ అధ్యక్షుడిపై ఫిర్యాదు చేశారు. అయితే, అప్పటి నుంచి ఈ కేసు విచారణలో పెద్దమార్పు లేనప్పటికీ పదుల సంఖ్యలో విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. -
ధోనీపై నాన్బెయిలబుల్ వారెంట్
-
ధోనీపై నాన్బెయిలబుల్ వారెంట్
అనంతపురం: ఓ మేగజైన్ కవర్పేజీపై విష్ణుమూర్తి అవతారంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాన్ని ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన కేసు ధోనీని నీడలా వెంటాడుతోంది. బెంగళూరు కోర్టులో ఈ కేసు విచారణ సాగుతుండగా.. అనంతపురం కోర్టు ఇదే కేసులో ధోనీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నోటీసులు ఇచ్చినా ధోనీ హాజరుకాకపోవడంతో అనంతపురం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీహెచ్పీ నేత శ్యాంసుందర్ అనంతపురం కోర్టులో కేసు దాఖలు చేశారు. బెంగళూరులో మరో వ్యక్తి ధోనీపై కేసు పెట్టారు. మత విశ్వాసాలను కించపరిచేలా ఈ ప్రకటన ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ధోనీ తీరుపై బెంగళూరు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనల్లో నటించే ముందు పర్యవసానాల గురించి ఆలోచించాలని సూచించింది. -
క్రిమినల్స్కు రెక్కలు!
దుబాయ్కి పరారవుతున్న ఘరానా నేరగాళ్లు పొరుగు రాష్ట్రాల నుంచి మారుపేర్లతో పాస్పోర్ట్స్ మొన్న అయూబ్ ఖాన్, తాజాగా స్నాచర్ ఖలీఫా సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో అనేక నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న, నాన్-బెయిలబుల్ వారెంట్లు పెం డింగ్లో ఉన్న ఘరానా నేరగాళ్లు పరారవుతున్నారు. పొరుగు జిల్లాకో, రాష్ట్రానికో కాదు... ఏకంగా దేశం దాటేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మారుపేర్లతో పాస్పోర్టులు తీసుకొని ఎగిరిపోతున్నారు. మొన్నటికి మొన్న కాలాపత్తర్ రౌడీషీటర్ అయూబ్ ఖాన్ దుబాయ్ వెళ్లిపోగా... తాజాగా శాలిబండకు చెందిన ఘరానా స్నాచర్ ఖలీఫా కూడా అక్కడికే చేరుకున్నట్లు సిటీ కాప్స్ గుర్తించాయి. షెల్టర్ జోన్స్ నుంచి ‘గుర్తింపులు’... సిటీకి చెందిన అనేక మంది నేరగాళ్లకు మహారాష్ట్ర, కర్ణాటకల్లో షెల్టర్స్ జోన్ ఉన్నాయి. ఇక్కడ నేరం చేసినప్పుడో, పోలీసుల నిఘా/వేట ముమ్మరమైనప్పుడో అక్కడికి వెళ్లి తలదాచుకోవడం వీరికి పరిపాటి. ప్రధానంగా నాందేడ్, గుల్బర్గా తదితరా ప్రాంతాల్లో ఈ షెల్టర్లు ఉంటున్నాయి. కొంతకాలం క్రితం వరకు ఈ ప్రాంతాలను తలదాచుకోవడానికి వినియోగించుకున్న నేరగాళ్లు తాజాగా, నకిలీ పేర్లతో అక్కడి చిరునామాలతో గుర్తింపు పత్రాలు తీసుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకటి వస్తే చాలు ఇక అన్నీ... వివిధ రకాలైన గుర్తింపు పత్రాల జారీలో ఉన్న లోపాలు, పూర్తి స్థాయిలో క్రాస్ చెకింగ్ మెకానిజం లేకపోవడం ఈ నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్... ఇలా ఏ ఒక్క గుర్తింపు పత్రాన్ని తీసుకున్నా మిలినవి తీసుకోవడం చాలా తేలికగా మారిపోయింది. దీంతో ఒకదాని వెంట మరోటి చొప్పున గుర్తింపు పత్రాలను తీసుకుంటున్న నేరగాళ్లు వాటి ఆధారంగా బోగస్ పేర్లతో పాస్పోర్టులు సైతం పొందుతున్నారు. అక్కడి పోలీసు రికార్డుల ప్రకారం వీరు నేరగాళ్లు కాకపోవడం, ఇక్కడ నేరగాళ్లనే విషయం వారికి తెలియకపోవడంతో తేలిగ్గా వెరిఫికేషన్ సైతం పూర్తయి పాస్పోర్టులు నేరగాళ్ల చేతికి చేరుతున్నాయి. వీటిని వినియోగించే విదేశాలకు పారిపోతున్నారని నగర పోలీసులు అనుమానిస్తున్నారు. రౌడీషీటర్ అయూబ్ ఖాన్ విశాఖపట్నం నుంచి పాస్పోర్ట్ పొందాడని నిర్థారణ కాగా... ఖలీఫా ఉత్తరాది నుంచి తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. నగర పోలీసులు నేరగాళ్లు ఇలా ఎగిరిపోతున్న విధానంతో పాటు దుబాయ్ కేంద్రంగా వీరు సాగిస్తున్న కార్యకలాపాలనూ లోతు గా ఆరా తీస్తున్నారు. అయూబ్ ఖాన్: ఫతేదర్వాజా ప్రాంతానికి చెం దిన అయూబ్ ఖాన్ 1990లో హుస్సేనీఆలంలో నేరజీవి తాన్ని ప్రారంభిం చా డు. అదే ఏడాది దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. దీంతో 1991లో హుస్సేనీఆలం పోలీసులు హిస్టరీ షీట్ తెరి చారు. అయూబ్ కాలాపత్తర్లోని తాడ్బండ్కు మకాం మార్చడంతో ఈ షీట్ను ఆ ఠాణాకు బదిలీ చేశారు. హత్య, హత్యాయత్నం, దోపిడీ, బెదిరింపులు, అక్రమం గా ఆయుధాలు కలిగి ఉండటం తదితర ఆరోపణలపై నగరంలో వివిధ పోలీసుస్టేషన్లలో 48 కేసులు నమోదు కావడంతో గ్యాంగ్స్టర్గా మారాడు. ప్రస్తుతం దుబాయ్లో ఉంటూ బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖలీఫా: శాలిబండలోని అలియాబాద్కు చెందిన మహ్మద్ అఖీలుద్దీన్ అలియాస్ అఖీల్ అలియాస్ ఖలీఫా పేరు మోసిన స్నాచర్. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఇతడు ఇప్పటి వరకు 83 సార్లు పోలీ సులకు చిక్కి జైలుకెళ్లాడు. ఎస్సార్నగర్, పంజగుట్ట, టప్పాచబుత్ర, హుమాయూన్నగర్, ఛత్రినాక, సుల్తాన్బజార్, చిక్కడపల్లి, మలక్పేట, నల్లకుంట, అంబర్పేట, కాచి గూడ, సైదాబాద్, మహంకాళి, అఫ్జల్గంజ్, నాంపల్లి, ఆసిఫ్నగర్ పోలీసుస్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. బెయిల్పై బయటకు వచ్చిన ఇతగాడు దుబాయ్కి పారిపోయాడు. -
‘నాన్ బెయిలబుల్’గా పరిగణించడం లేదేం?
ఇసుక అక్రమ తవ్వకాలపై సర్కార్కు హైకోర్టు ప్రశ్న పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను విచారణార్హమైన(కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరాలుగా ఎందుకు పరిగణించడం లేదో వివరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇసుక అక్రమ తవ్వకాలను, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా వివరించాలని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని రెవెన్యూ, గనుల శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా మానవాళి మనుగడనే భయపెట్టే విధంగా ఉంటున్నాయి. నదులు ఎండిపోయి ప్రజలు నీళ్ల కోసం గగ్గోలు పెడుతున్నారు. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ నేరాల కింద ఇసుక అక్రమ తవ్వకాలను, రవాణాను పరిగణించి కఠిన చర్యలకు ఉపక్రమించకపోతే, జీవ సమతుల్యతకు, పర్యావరణానికి ముప్పు తప్పదు.’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇసుక రవాణా చేస్తున్న తమ వాహనాలను అధికారులు సీజ్ చేశారని, ఈ విషయంలో వారు చట్టం నిర్ధేశించిన ప్రక్రియను అనుసరించలేదని, తమ వాహనాలను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మెదక్ జిల్లాకు చెందిన బండారి పాపిరెడ్డి మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, వాహనాల విడుదల కోసం వారంలోపు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్లకు స్పష్టం చేశారు. ఆ దరఖాస్తులను పరిశీలించి వాహనాల విడుదలపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
సురేశ్బాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్
విజయవాడ: రెండు కేసుల విషయంలో విజయవాడ నగర ఎస్సై సురేశ్ బాబుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేసులకు సాక్ష్యం చెప్పేందుకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాకినాడ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. రెండు క్రిమినల్ కేసుల్లో మూడు వాయిదాలకు సాక్ష్యం చెప్పేందుకు రావాల్సిందిగా కాకినాడ మొబైల్ కోర్టు ఆదేశించింది. అయితే, వాటిని బేఖాతరు చేస్తూ ఎస్సై హాజరుకాకపోవడంతో నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది. -
లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకాకుండా లండన్లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విన్నపం మేరకు బుధవారం ప్రత్యేక పీఎమ్ఎల్ఏ న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. ఐపీఎల్ కమిషనర్గా పనిచేసిన కాలంలో మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఈడీ మోదీపై కేసు నమోదు చేసింది. కాగా ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురికావడం, కేసులు నమోదు కావడంతో మోదీ లండన్ పారిపోయారు. 2010 నుంచి మోదీ లండన్లోనే ఉంటున్నారు. విచారణకు హాజరు కావాలని గతంలో ఈడీ సమన్లు పంపినా.. తనకు భారత్లో ప్రాణభయం ఉందంటూ మోదీ రాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు వారెంట్ జారీ చేసింది.