రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఆదివారం జారీ చేశారు.
జీఎంఆర్ విమానాశ్రయానికి సంబంధించి మాల్యా ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 10న విచారణ నిమిత్తం హాజరు కావాలని స్థానిక కోర్టు ఆయన్ను ఆదేశించింది. విచారణకు హాజరు కానందును మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు సమాచారం అందింది.