trs mla
-
ప్లాట్స్ ఎలా అమ్ముతావో చూస్తా.. రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎమ్మెల్యే వార్నింగ్
సాక్షి, బోథ్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.. బెదిరింపుల ఆడియో బయటకు లీక్ అవడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బోథ్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఎమ్మెల్యే బెదిరింపులకు గురిచేశాడు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే బాపురావు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద మధ్యవర్తి సాయంతో కొంత భూమి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరణ్.. సదరు మధ్యవర్తిని భూమికి సంబంధించి రూ.28 లక్షలు ఇవ్వాలని కోరారు. దీంతో, అతను ఎమ్మెల్యే బాపురావును ఆశ్రయించడంతో ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కిరణ్కు బెదిరింపులకు గురిచేశాడు. వెంచర్ ఎలా వేశావ్.. ప్లాట్లు ఎలా అమ్ముతావో చూస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చాడు. ఇక, ఎమ్మెల్యే బెదిరింపుల అనంతరం రియల్ ఎస్టేట్ కిరణ్.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులు కోరినట్టు సమాచారం. అయితే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే చర్చ నడుస్తోంది. -
రోహిత్రెడ్డి ఈడీ విచారణలో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి – ఈడీ కేసులో కొత్త ట్విస్ట్. ఎమ్మెల్యేలకు ఎర కేసులోనే తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిందని రోహిత్రెడ్డి చెప్పిన 24 గంటల్లోనే ఈడీ అధికారులు ‘7 హిల్స్ మాణిక్చంద్’ పాన్ మసాలా యజమాని అభిషేక్ ఆవాలకు నోటీసులు జారీచేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్గోయల్ స్పష్టం చేశారు. 2015 నుంచి అన్ని బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లు, ఏయే సంస్థల్లో డైరెక్టర్గా ఉన్నారు, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్ తనను రూ.1.75 కోట్ల మేరకు మోసం చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో అభిషేక్ ఈనెల రెండోవారంలో ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. అభిషేక్, రోహిత్రెడ్డి సోదరుడి మధ్య రూ.7.75 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ లావాదేవీలు ఏ సందర్భంగా జరిగాయి? ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు? రోహిత్రెడ్డితో ఉన్న సంబంధాలపై పూర్తిస్థాయిలో కూపీ లాగేందుకు అభిషేక్కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రెండురోజులపాటు ఈడీ విచారణను ఎదుర్కొన్న రోహిత్రెడ్డి తనను ఎమ్మెల్యేల ఎర కేసులోనే విచారించారని, ఈ కేసులో తాను ఫిర్యాదుదారుడిగా ఉన్నా.. దోషులను వదిలిపెట్టి తనను విచారణకు పిలవడం ఏమిటో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ అధికారులు మాత్రం ‘7 హిల్స్ మాణిక్చంద్’ పాన్ మసాలాకు సంబంధించిన లావాదేవీలపై రోహిత్రెడ్డిని ఎక్కువగా ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాన్మసాలా కేసులోనే రోహిత్రెడ్డిని విచారించినట్లు స్పష్టమవుతోంది. 2015లోనే సొంత బ్రాండ్పై... మాణిక్చంద్ గుట్కాకు హైదరాబాద్ కేంద్రంగా ప్రధాన పంపిణీదారుగా ఉన్న అభిషేక్ ఆవాల 2015లో సొంత బ్రాండ్తో పాన్ మసాలా తయారీని ప్రారంభించారు. బీబీనగర్ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ఓ యూనిట్ స్థాపించి ‘7 హిల్స్ మాణిక్చంద్’ పేరుతో పాన్ మసాల, జర్దా తదితరాలను ఉత్పత్తి చేసి విక్రయించడం మొదలెట్టాడు. ఆపై గుజరాత్ నుంచి గుట్కా తెచ్చి అక్రమంగా అమ్మకాలు సాగించినట్లు సమాచారం. ఆ దందాలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందుకుమార్ కూడా కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. అభిషేక్, నందుకుమార్ సంయుక్తంగా వే ఇండియా టుబాకో ప్రైవేట్ లిమిటెడ్, 7 హిల్స్ మాణిక్చంద్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 7 హిల్స్ మార్కెటర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, డబ్ల్యూ3 హాస్పిటాలిటీస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్నారు. డబ్ల్యూ3 సంస్థలో రాజేశ్వర్రావు కల్వకుంట్ల కూడా ఓ డైరెక్టర్గా ఉన్నారు. ఈ సంస్థను ముగ్గురూ కలిసి 2015 నవంబర్ 6న ఏర్పాటు చేశారు. ‘7 హిల్స్ మాణిక్చంద్ పాన్ మసాలా’ ఉత్పత్తులకు సంబ«ంధించిన ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్స్, సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు ఇస్తానంటూ అభిõÙక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒడిశా, పశి్చమబెంగాల్లోని అనేక మందిని మోసం చేశారన్న అభియోగాలున్నాయి. ఈ వ్యవహారాల్లోనూ నందుకుమార్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయ్యప్ప దీక్షను విరమించిన రోహిత్రెడ్డి తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అర్ధాంతరంగా అయ్యప్ప దీక్ష విరమించారు. ఆయన అన్న కుమారుడు శశాంక్రెడ్డి మంగళవారం అర్ధరాత్రి బషీరాబాద్ మండలం ఇందర్చెడ్ గ్రామంలో మృతిచెందారు. దీంతో అయ్యప్ప దీక్షలో కొనసాగడం మంచిది కాదని, విరమించినట్లు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: 'ఫోన్ 10 సార్లు ఎందుకు మార్చారు కవిత? వాళ్ల ఇంటికి ఎందుకెళ్లారు?' -
డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం అదనపు డైరెక్టర్ దేవేందర్ కుమార్ సింగ్ పేరుతో, 15వ తేదీతో (గురువారం) ఈ సమన్లు ఉన్నాయి. 2015 నుంచి రోహిత్రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, ఐటీ, జీఎస్టీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్మెంట్స్, స్థిరచరాస్తులతోపాటు రుణాల వివరాలు తీసుకురావాలంటూ ఈడీ స్పష్టం చేసింది. ఆధార్, పాన్కార్డు, పాస్పోర్టు కాపీలు తీసుకురావాలని పేర్కొంది. అతడి కుటుంబీకులకు సంబంధించిన పూర్తి బయోడేటాను అందించాలని కోరిన ఈడీ దాని నమూనాను నోటీసులతో జత చేసింది. రోహిత్రెడ్డిపై తొమ్మిది కేసులు రోహిత్ రెడ్డి 2018లో నామినేషన్తోపాటు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనపై మొత్తం 9 కేసులు ఉన్నాయి. ఇవన్నీ 2017–18 మధ్య తాండూరుతోపాటు బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో నమోదయ్యాయి. వీటిలో అత్యధికం ఎన్నికల సంబంధిత నేరాలే. ఒక్క కేసులో మాత్రమే మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులోనూ రోహిత్రెడ్డి పేరు వినిపించింది. నిర్మాత శంకరగౌడ్ బెంగళూరులో గతేడాది ఇచ్చిన పార్టీకి రోహిత్రెడ్డి హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి. నైజీరియన్ అరెస్టుతో గుట్టురట్టయిన ఈ వ్యవహారంలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్ విదేశాల నుంచి వచ్చినట్లు అక్కడి నార్కోటిక్ అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబం«ధించి ఇప్పటికే హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చిన బెంగళూరు పోలీసులు విచారించారు. వీరిలో కొందరు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులను ఆ పార్టీకి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమేయంపై వార్తలు వెలువడ్డాయి. ఆ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రోహిత్రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిందో తెలియాల్సి ఉంది. ఏ కేసు ప్రస్తావన లేకుండా ఈడీ ఇచ్చిన నోటీసులపై రోహిత్రెడ్డి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఈడీ ఎలాంటి కేసులను దర్యాప్తు చేస్తుంది? ఈడీ అధికారులు రెండు చట్టాలకు సంబంధించిన కేసులను మాత్రమే దర్యాప్తు చేస్తుంటారు. పీఎంఎల్ఏతో పాటు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద మాత్రమే కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటుంది. ఫెమా చట్టాన్ని ఈడీ అధికారులే నేరుగా వినియోగించవచ్చు. విదేశీ మారకద్రవ్యాలకు సంబంధించిన లావాదేవీలున్న అంశాలనే ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు చేస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, విచారణకు నోటీసులు అందుకున్న వారు ఏదో ఒక కోణంలో విదేశీ కరెన్సీ లావాదేవీలు చేసి ఉండాలి. అయితే పీఎంఎల్ఏ కింద ఈడీ అధికారులు ఓ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలంటే మాత్రం నేరుగా కుదరదు. అప్పటికే ఏదో ఒక పోలీసుస్టేషన్ లేదా సీబీఐ వంటి ప్రత్యేక విభాగంలో కేసు నమోదై ఉండాలి. ఆ ఎఫ్ఐఆర్ ఆ«ధారంగానే ఈడీ పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేస్తుంది. ఏదైనా కేసులో ఓ వ్యక్తి నిందితుడు కాకపోయినప్పటికీ... నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విచారణలో పేరు వెలుగులోకి రావడమో, వారి వాంగ్మూలాల్లో ప్రస్తావన ఉండటమో జరిగినా ఈడీ నోటీసులు ఇచ్చి విచారించే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఏదో ఒకచోట నమోదైన కేసు ఆధారంగానే రోహిత్రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. మరోసారి రకుల్కు నోటీసులు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్కు ఈడీ అధికారులు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈమెను సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. టాలీవుడ్ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసుకు సంబం«ధించి ఇప్పటికే ఈడీ రకుల్ను ఓసారి విచారించింది. ఎక్సైజ్ అధికారులు 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. అయితే అప్పట్లో ఎక్కడా రకుల్ పేరు బయటకు రాలేదు. తర్వాత ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన ఓ డ్రగ్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ విచారణలో బయటపడిన అంశాల ఆధారంగానే రకుల్ను గత సెప్టెంబర్ 3న ప్రశ్నించింది. తాజాగా రకుల్ను ఏ అంశాలపై, ఎవరితో సంబంధాలపై, ప్రశ్నిస్తారనే ఉత్కంఠ నెలకొంది ఇదీ చదవండి: హైదరాబాద్ నుంచి విదేశాలకు డ్రగ్స్ -
రూ.100 కోట్లు తీసుకుని హ్యాపీగా ఉండేవాణ్ణి.. కానీ.. తాండూరు కోసమే..
బషీరాబాద్: నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ‘ఎమ్మెల్యేల ఎర కేసు’లో తాను పెద్ద రిస్క్ తీసుకున్నానని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలం మల్కన్గిరి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ గ్రామ యువకులు కొందరు వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దీక్ష చేస్తున్న బాలకృష్ణ అనే యువకుడితో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ‘తాండూరు అభివృద్ధి కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నా. లేకుంటే వాళ్లు ఇచ్చే వంద కోట్ల రూపాయలు తీసుకొని నేను హ్యాపీగా ఉంటాను కదా. కానీ నేను మన కోసం రిస్క్ తీసుకున్నా. మీ గ్రామం అభివృద్ధికి ఏమేమి కావాలో నాకు లెటర్ రాయండి. మీ గ్రామం డెవలప్మెంట్ నేను చూసుకుంటా. సమస్యను నా దృష్టిలో పెట్టుకుంటా. ప్రభుత్వం ముందు ప్రపోజల్ చేస్తా..’అని తెలిపారు. నా కోసం దీక్ష విరమించాలని కోరారు. కాగా వారం రోజుల్లో మల్కన్గిరి గ్రామానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు దీక్ష చేస్తున్న యువకులు చెప్పారు. రిలే దీక్షలు విరమిస్తున్నట్లు తెలిపారు. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
బుల్లెట్లతో ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏకే 47 రైఫిల్ బుల్లెట్లతో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ జవాన్. మొత్తం 62 బుల్లెట్లతో ‘జై బాల్క సుమన్’ అని టవల్పై ఇంగ్లిష్ అక్షరాలతో రాసి ఉన్న ఫొటో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చెన్నూరులో టీఆర్ఎస్ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్లో ఈ ఫొటో పెట్టుకున్నాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం తెలిసింది. చెన్నూరుకు చెందిన వంగాల సంతోష్ సీఆర్పీఎఫ్ జవాన్. ప్రస్తుతం బీజాపూర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తన వద్ద ఉన్న బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు రాసి ఫొటో తీసి, వాట్సాప్లో పంపించాడు. దీన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు స్టేటస్గా పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే.. -
చీకోటితో ఏమిటి సంబంధం?
సాక్షి, హైదరాబాద్: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్కుమార్ వ్యవహారంలో మనీలాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన మంచిరెడ్డిని అధికారులు రాత్రి వరకు ప్రశ్నించారు. చీకోటితో ఏమిటి సంబంధం? మనీలాండరింగ్కు పాల్పడ్డారా? తరలించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకోసం తరలించాల్సి వచ్చింది? అన్న అంశాలపై స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలిసింది. చీకోటితో ఆయన కుటుంబసభ్యులకున్న ఆర్థిక లావాదేవీలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. కాగా, మంచిరెడ్డిని 9 గంటల పాటు విచారించి ఇంటికి పంపించిన ఈడీ అధికారులు, బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని సూచించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి.. క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారంటూ చీకోటిని రెండు నెలల క్రితం ఈడీ ప్రశ్నించింది. ఆయనతో సంబంధాలున్నట్టుగా అనుమానాలున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను సైతం విచారించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చీకోటితో 2015 నుంచి మంచిరెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. 2015–16లో ఇండోనేసియాలోని పెట్టుబడులు పెట్టేందుకు చీకోటి నెట్వర్క్ ద్వారా మంచిరెడ్డి భారీగా డబ్బును హవాలా రూపంలో తరలించినట్టు అనుమానిస్తోంది. ఇందులో ఫెమా నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కిషన్రెడ్డిని ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది. క్యాసినోల్లోనూ మంచిరెడ్డి పెట్టుబడులు క్యాసినోలోనూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి లావాదేవీలున్నట్టుగా ఈడీ కీలక ఆధారాలు గుర్తించింది. ఇండోనేసియాలోని బాలి, నేపాల్, గోవాలోని క్యాసినోల్లో చీకోటితో పాటు మంచిరెడ్డి కొంతమేర పెట్టుబడి పెట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో కిషన్రెడ్డితో పాటు ఆయన కుటుంబీకుల్లో ఒకరికి చీకోటి ప్రవీణ్తో ఆర్థిక లావాదేవీలున్న విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మంచిరెడ్డిని ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది. ఇలావుండగా మంచిరెడ్డి తర్వాత జాబితాలో ఎవరున్నారన్నదానిపై చర్చ జరుగుతోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ మంత్రికి ఈడీ తాఖీదులు తప్పవని తెలుస్తోంది. -
ఇంటికే వస్తా అంటే రమ్మంటిని, కానీ, ఎక్కడా?: జూపల్లి
సాక్షి,నాగర్ కర్నూల్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం విష్ణువర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లతో కొల్లాపూర్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు. అయితే, చర్చలో పాల్గొనేందుకు జూపల్లి ఇంటికి బీరం ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే బీరం నిరాధార ఆరోపణలను జూపల్లి మీడియా ఎదుట ఎండగట్టారు. చదవండి👉🏼 విరాట పర్వం.. 30 ఏళ్ల కిందట పేలిన తూటా శంకరన్న చేతిలో సరళ బలి రాత్రి నుంచి చూస్తున్నా.. ఎక్కడా? ‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామన్న. కాని చర్చకు ఇంటికే వస్తా అంటే స్వాగతం పలుకుతానని చెప్పా. నీ మాట ప్రకారమే రాత్రి నుంచి ఎదురుచూస్తున్నా. కానీ, ఎమ్మెల్యే రాలేదు. మూడున్నరేళ్లు ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అరెస్టు చేయించుకుని తప్పించుకుని పోయినవ్.. ముఖం చాటేసుకున్నవ్. ఎమ్మెల్యే మాట మార్చాడు. నేను మాట మార్చలేదు. హుస్సేన్ సాగర్ కారు ప్రమాదం, ఫ్రుడెన్షియల్ బ్యాంకు వ్యవహారాలపై ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. అప్పు తీసుకుని వ్యాపారం చేసాం, ఇది తప్పు అన్నట్లుగా మాట్లాడితే ఎట్లా!. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని సహచర మంత్రులే సూచించినా నేను వెనక్కి తగ్గలేదు. మిగతా మంత్రులపై ఒత్తిడి వస్తుంది వద్దన్నారు. వెయ్యి కోట్లిచ్చినా అమ్ముడు పోయే వ్యక్తిని కాను. నాది మచ్చలేని చరిత్ర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కోర్టులో కేసు వేసిందెవరు? నా పై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బీరంపై పరువు నష్టం దావా వేస్తా’అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. చదవండి👉🏼కొల్లాపూర్లో హై టెన్షన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ -
రంగారెడ్డి: టీఆర్ఎస్ నేతల్లో పీకే ఫీవర్!
అధికార పార్టీ నేతలకు ప్రశాంత్ కిషోర్(పీకే) ఫీవర్ పట్టుకుంది. కొంత మంది సిట్టింగ్లపై భూ కబ్జాలు, అక్రమ సంపాదన, అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలకు తోడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపు అత్యంత కష్టమని అధినేత కేసీఆర్కు నివేదిక అందడమే ఇందుకు కారణం. ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో పలువురు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు ద్వితీయ శ్రేణి లీడర్లు అవకాశం కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సొంత పార్టీలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజికవర్గం, బంధువులు, పార్టీ శ్రేణులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములు ఇలా ఎవరు ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా.. వెంటనే వాలిపోతున్నారు. అంతర్గత కుమ్ములాట చేవెళ్ల నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నంల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది. భూ కబ్జాలు, అక్రమ ఆస్తులు, అధికార దుర్వినియోగం, అవినీతిపై వీరిరువురూ బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రజల్లో పార్టీపై నమ్మకం సన్నగిల్లింది. కల్వకుర్తిలోనూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఎల్బీనగర్లోనూ ఇదే తంతు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున గెలుపొంది.. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రామ్మోహన్గౌడ్ మధ్య అంతర్గత ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాజేంద్రనగర్లో సిట్టింగ్ స్థానంపై మంత్రి కుమారుడితో పాటు ఎంపీ కన్నేశారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఎవరికి వారు పార్టీ శ్రేణులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వీరు స్థానికంగా ఉన్న సామాజికవర్గం బంధువులు, ముఖ్య నేతలను తరచూ కలుస్తుండటంతో కేడర్లో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇరువురూ విఫలమవుతున్నారు. మొత్తానికి తమపై ఎలాంటి రిపోర్ట్ అందిందోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ‘పట్నం’ దాటని జిల్లా సారథి ప్రత్యర్థులు బలపడకుండా చూడటంతో పాటు పార్టీకి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి తన నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నం దాటడం లేదు. నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్య నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలేవీ చేయడం లేదు.గ్రామ,మండల,వార్డు, డివి జన్, మున్సిపాలిటీ,కార్పొరేషన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ..జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించలేదు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పార్టీ పదవులను ముట్టుకుంటే తేనెతుట్టెను కదిపినట్లేననే భావనలో నేతలు ఉన్నట్లు సమాచారం. చదవండి: గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..! -
బాధిత చిన్నారులను చూసి కంటతడి పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సింధే
నిజాంసాగర్/పిట్లం/పెద్దకొడప్గల్/బాన్సువాడ టౌన్/నిజామాబాద్ అర్బన్: అన్నాసాగర్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్సింథే అన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాదంలో తల్లులను కోల్పోయిన చిన్నారులను చూసి ఎమ్మెల్యే తీవ్రంగా చలించి కంటతడి పెట్టారు. చదవండి👉🏾 అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి.. ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరం అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలందరి గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు రైతు బీమాకు అర్హులని, మిగతావారు టీఆర్ఎస్ సభ్యత్వం కల్గిన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట సొసైటీ చైర్మన్ హన్ముంత్రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మరెడ్డి, సర్పంచ్ రమేష్, నాయకులు లచ్చిరెడ్డి, విజయ్, రహిమతుల్లా, విజయ్, విజయ్ దేయ్, పాల్గొన్నారు. చదవండి👉🏻 చదివింపులు.. రూ. అరకోటి! -
మానవత్వం చాటుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
అర్వపల్లి (నల్గొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని అటుగా వెళ్తున్న తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ గమనించి అప్పటికప్పుడు కారు, ఆటో ఏర్పాటు చేసి ఆస్పత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. సూర్యాపేట–జనగామ 365బీ జాతీయ రహదారిపై జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం వద్ద బుధవారం సూర్యాపేట నుంచి అర్వపల్లి వైపు వస్తున్న ఆటో, అర్వపల్లి నుంచి కుంచమర్తికి వెళ్తున్న బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై, ఆటోలో ప్రయాణిస్తున్న మేడి వినయ్, ఆకారపు మహేష్, మనుబోతుల నాగరాజు, కల్లెం సంతోష్, పత్తెపురం ముత్తమ్మ గాయపడ్డారు. కాగా మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అదే సమయంలో ఆ రోడ్డు గుండా వెళ్తూ క్షతగాత్రులకు చూసి వెంటనే ఆగారు. తన వాహన శ్రేణిలోని కారుతో పాటు మరో ఆటోలో క్షతగాత్రులను సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్కు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్సై మహేష్ తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ -
దమ్ముంటే రండి.. ప్రతిపక్ష నేతలకు ఎమ్మెల్యే సవాల్
-
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం..
సాక్షి, మెదక్: మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. అక్కన్నపేట రైల్వే గేట్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనకాల నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో పద్మాదేవేందర్ రెడ్డి వాహంలోనే ఉన్నారు. అయితే వాహనం వెనుకనుంచి వచ్చి ఢీకొట్టడంతో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసమైంది. మెదక్ పర్యటన అనంతరం రామాయంపేటలో జరిగే పెళ్లికి హాజరు కావడానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. చదవండి: రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయం.. 410 కిలోల గంజాయి స్వాధీనం -
జూబ్లీహిల్స్ ప్రమాదం.. కారులో ఎమ్మెల్యే కొడుకు కూడా
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. బాలుడి మృతికి కారణమైన బండిలో.. ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. రాహిల్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఏసీపీ సుదర్శన్ వివరాలను వెల్లడించారు.. ఫిలింనగర్ నుండి ఇన్ ఆర్బిట్ మాల్ మీదుగా తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఎంఎల్ఏ కొడుకు రాహిల్ ఉన్నాడు. రాహిల్ తో పాటు అఫ్నాన్, నాజ్ మొత్తం ముగ్గురు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పారిపోయారు. నిందితులు పారిపోయిన రూట్ లో సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించాం. అన్ని రకాల ఎవిడెన్స్ సేకరించాం. ప్రమాదం జరిగిన టైంలో కారు నడిపింది అఫ్నాన్. రాహిల్ పక్కనే ఉన్నాడు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కారు నడిపింది అఫ్నాన్ అని నిర్ధారించుకున్నాం. ప్రమాదానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ ప్రధాన కారణాలని ఏసీపీ వెల్లడించారు. గురువారం రాత్రి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు మహేంద్ర థార్ వేగంగా దూసుకొచ్చింది. ఆ టైంలో రోడ్డు దాటుతున్న కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా బోస్లేలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కాజల్ చౌహాన్ రెండు నెలల బిడ్డ కిందపడి.. మృతి చెందిన విషయం తెలిసిందే. బండిపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అహ్మద్ పేరుతో స్టిక్కర్ ఉండడంతో కేసు ఆసక్తికరంగా మారింది. కాజల్ చౌహాన్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆపై పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కారు నడిపింది ఎమ్మెల్యే కొడుకేనంటూ ప్రచారం మొదలైంది. అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారి మృతి చెందడంతో.. విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ కారు తమ బంధువులదని, ఓ ఫంక్షన్కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని, ఆ కారులో తన కొడుకు లేడని ఎమ్మెల్యే షకీల్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆ కారులో తమ బంధువులు మాత్రమే ఉన్నారని ఎమ్మెల్యే శుక్రవారం వివరణ ఇవ్వగా.. అందులో ఆయన కొడుకు కూడా ఉన్నాడంటూ తాజాగా పోలీసులు ప్రకటించడం విశేషం. -
మైక్ కట్ చేయడంతో ఎమ్మెల్యే రసమయి అసంతృప్తి
-
అనూహ్యంగా తెరపైకి పేరు.. గులాబీ బాస్గా ‘కల్వకుంట్ల’
సాక్షి, జగిత్యాల: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి అనూహ్యంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు దక్కింది. అనేకమంది ఆశావహులు కుర్చీ కోసం పోటీపడ్డారు. అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యాసాగర్రావుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇంతకాలం కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. గత సెప్టెంబర్లో తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. నిరాశలో ఆశావహులు.. కీలకమైన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తయ్యాక జిల్లా అధ్యక్ష పదవిలో ఎవరిని నియమిస్తారనే అంశాన్ని సీఎం కేసీఆర్కు అప్పగిస్తూ అప్పట్లోనే నిర్ణయించారు. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ నిలి చిపోయింది. గ్రామ, మండల, పట్టణ కమిటీల నియామకం పూర్తయ్యింది. ప్రస్తుతం టీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్రావును ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటన చేశారు. చదవండి: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే మంత్రి ఆశీస్సులు ఉన్నవారికే పదవులని.. ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్తోపాటు ఎమ్మెల్యేలకు అనుకూలమైన నాయకుల ఆశీస్సులు ఉన్నవారికే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని భావించారు. ఇందుకు భిన్నంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు అనూహ్యంగా ఆ కుర్చీ దక్కింది. ధర్మపురి జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, మల్యాలకు చెందిన మిట్టపల్లి సుదర్శన్, వెల్గటూర్కు చెందిన పునుగోటి శ్రీనివాస్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ఈ పదవిని ఆశించారు. వీరితోపాటు మరికొందరు నాయకులు పోటీపడ్డారు. మంత్రి, ఎమ్మెల్యేలు అందించిన నివేదికలోని పేర్లు, మరికొన్ని పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా జిల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్రావును ఎంపిక చేసినట్లు తెలిసింది. పార్టీ భవనం పూర్తి ధరూర్ క్యాంప్లోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి భర్తీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బయోడేటా పేరు : కల్వకుంట్ల విద్యాసాగర్రావు (ఎమ్మెల్యే, కోరుట్ల) జననం: 10 నవంబర్ 1953 జన్మస్థలం: రాఘవపేట విద్యార్హతలు: బీఏ రాజకీయ ప్రవేశం..:1977లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ 1997 అక్టోబర్లో టీడీపీలో చేరారు. 1998లో ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2001లో ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీగా గెలుపొందారు. 2003లో ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నియమితులయ్యారు.2008లో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తా జగిత్యాల/కోరుట్ల: ‘ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. ఇటీవల టీటీడీ బో ర్డు సభ్యుడిగా అకాశం కల్పించారు. తెలంగా ణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ సీఎం కేసీఆర్ నాకూ అనూహ్యంగా పదవి ఇచ్చారు. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది’ అని కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కల్వకుంట్ల విద్యాసాగర్రావు వెల్లడించారు. ఇంకా ఏమంటున్నారంటే.. సాక్షి : చాలామంది జిల్లా అధ్యక్ష పదవి ఆశించారు. సీఎం కేసీఆర్ మిమ్మల్ని నియమించారు. మీ స్పందన ఏమిటి? విద్యాసాగర్రావు : ఉద్యమ నాయకుడిగా, సీనియర్ ఎమ్మెల్యేగా నాకు ఈ పదవి అప్పగించారు. బాధ్యతగా ఈ పదవిని నిర్వర్తిస్తా. సాక్షి : ఆశావహులు నిరాశలో ఉంటారు, వారిని ఎలా కలుపుకుపోతారు? విద్యాసాగర్రావు : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు వెళ్తా. సాక్షి : చాలామంది నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు? విద్యాసాగర్రావు : జిల్లామంత్రి సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆశావహులకు న్యాయం చేస్తా. సాక్షి : రానున్న ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా ఎలాంటి చర్యలు చేపడతారు? విద్యాసాగర్రావు : టీఆర్ఎస్ ఇప్పటికే నంబర్వన్ స్థానంలో ఉంది. రానున్న ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో గెలుస్తాం. కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో వెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేస్తాం. సాక్షి : ఎమ్మెల్యేగా, టీటీడీ సభ్యుడిగా, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి.. వీటన్నింటికీ ఎలా న్యాయం చేస్తారు? విద్యాసాగర్రావు : ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నా. టీటీడీ సభ్యుడిగా భక్తులకు దైవ దర్శనం కల్పిస్తున్నాం. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ సమన్వయపరుస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. -
రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్ర అరెస్ట్..
-
‘జంతువుల కంటే హీనంగా వనమా రాఘవ ప్రవర్తిస్తున్నాడు’
-
‘జంతువుల కంటే హీనంగా వనమా రాఘవ ప్రవర్తిస్తున్నాడు’
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచలో కుటుంబం సజీవదహనం చేసుకున్న మండిగ రామకృష్ణ నివాసాన్ని మంగళవారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. ఈ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ను కఠినంగా శిక్షించాలని, రాఘవ ఎన్ని దురాగతాలు చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. సంబంధిత వార్త: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు? కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రామకృష్ణ కూతురిని చూసి చలించిపోయామని అన్నారు. జంతువుల కంటే హీనంగా వనమా రాఘవ ప్రవర్తిస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. వనమా రాఘవను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే షూట్ చేయాలని పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు. గతంలో ఎస్ఐ జ్యోతి, మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు కారణం వనమా రాఘవ అని అన్నారు. పోలీసుల ఈ కేసు విషయంలో స్పందించాలని డిమాండ్ చేశారు. -
పోలీసులపై నోరు పారేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
-
శృతిమించిన ఎమ్మెల్యే అనుచరుల వర్గపోరు
సాక్షి, ఖమ్మం: పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అనుచరుల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. టీఆర్ఎస్ మండలాల కమిటీల ప్రకటన సందర్భంగా గురువారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకుల మధ్య తోపులాట జరిగిన విషయం విదితమే. ఇక శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్తో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు అయిన ఆయన సతీమణి బేబీ హాజరయ్యారు. ఇదే సమావేశానికి సొసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు భార్య, సర్పంచ్ అరుణ కూడా వచ్చారు. చదవండి: 10 రోజులుగా పత్తాలేని పిల్లి.. అన్నం ముట్టని తల్లి.. స్కూల్కు వెళ్లని పిల్లలు, దాంతో.. ఇంతలోనే వెంకటేశ్వర్లు తన అనుచరులతో ఎంపీడీఓ కార్యాలయానికి వస్తుండగా, అప్పటికే కార్యాలయంలో మొహరించిన శేఖర్ అనుచరులు కార్యాలయ గేట్ వద్ద వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ పెరిగి పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకున్నా సీఐలు సతీష్, సత్యనారాయణరెడ్డి తమ సిబ్బందితో అక్కడకు చేరుకొని నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చదవండి: ‘ఎగబడి కరుస్తున్నాయ్.. కుక్కలే కదా చంపితే ఏమవుతుందిలే’ -
రేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి
-
సోనియమ్మకు థాంక్స్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘పార్టీలకతీతంగా ఈ రోజు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి (రూ.1,16,000) చెక్కులు పంపారు. ఎస్.. నేను సీఎంగా ఉన్నా.. మీ సాదకబాధకాల్లో ఉంటానని చెక్కులు పంపించారు. కేసీఆర్ తన, మన తేడా లేకుండా అందరి గురించి ఆలోచన చేసే సందర్భంగా అన్ని పార్టీలు కూడా ఆయన్ను ఆశీర్వదిస్తున్నాయి. రెండోసారి ముఖ్యమంత్రిని చేశాయి. మూడోసారి కూడా ముచ్చటగా ముఖ్యమంత్రి అవుతారనడంలో అతిశయోక్తిలేదు. ఇంత ఆలోచన చేశాక.. కేసీఆర్ గురించి మీరు కూడా ఆలోచించాలిగా.. ఎవరైనా, ఏ భావజాలంవారైన కావచ్చు’’ అని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ వ్యాఖ్యానించారు. ‘‘నక్సల్స్ అయినా కావచ్చు.. ఎన్టీ రామారావు ఏమన్నారు.. నక్సల్స్ కూడా దేశభక్తులే అన్నారు.. ఆయనకు నమస్కారం చేయాలి. ఎస్.. అది కరెక్ట్ భావజాలం. ఎక్కడైనా అభివృద్ధికి సపోర్ట్ చేయాల్సిందే. అమ్మ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఆమెకు థాంక్స్ చెప్పాలి’’ అన్నారు రాములునాయక్. మంగళవారం ఖమ్మం జిల్లాలోని బొక్కలతండాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. గతంలోనూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చదవండి: 'ఓటు వేస్తే డబ్బులు ఇస్తాం..భయపడాల్సిందేమీ లేదు' -
చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్కు జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్కు నాంపల్లి స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి ఆయనపై నేరం రుజువైనట్లు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తెలిపింది. అదే విధంగా ఈ కేసులో... వినయ్ భాస్కర్ సహా 18 మందికి న్యాయస్థానం రూ.3 వేలు జరిమానా విధించింది. అయితే, దాస్యం వినయ్ భాస్కర్ అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. కాగా టీఆర్ఎస్ తరఫున దాస్యం వినయ్భాస్కర్ ప్రస్తుతం పశ్చిమ వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కాజీపేట వద్ద రైలురోకో సందర్భంగా ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. -
Nalgonda: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ క్రైం : ఆ కుటుంబాన్ని కరోనా ఇంటికే పరిమితం చేసింది. మహమ్మారి బారిన పడి ఆ కుటుంబంలో ఓ వృద్ధురాలు మృతిచెందింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబానికి నల్లగొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అండగా నిలిచారు. మృతిచెందిన వృద్ధురాలికి అంత్యక్రియలు దగ్గరుండి ఆయనే చేయించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నల్లగొండలోని పాతబస్తీ వంటిస్తంభం ప్రాంతానికి చెందిన పూజారి కుటుంబానికి చెందిన కాంచనపల్లి భారతమ్మ (70) కరోనాతో మృతి చెందింది. మనుమరాలు సుమలత, ఆమె భర్త బొల్లోజు దుర్గాప్రసాద్, కుమారుడు మహేశ్కు ఈనెల 3వ తేదీన కరోనా పాజిటివ్ రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. గురువారం వృద్ధురాలు భారతమ్మను స్థానిక కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్ అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా తానుండలేనంటూ భయానికే ఇంటికి తిరిగి వచ్చి శుక్రవారం ఉదయం మరణించింది. కరోనాతో భయంతో ఉన్న కుటుంబానికి అంత్యక్రియలు చేయడం మరింత క్లిష్టంగా మారింది. దీంతో కౌన్సిలర్ శ్రీను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వృద్ధురాలికి హిందూపూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేయించారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులు కరోనాతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేమని చెప్పడంతో ఎమ్మెల్యే అంతా తానై అంత్యక్రియలు పూర్తి చేశారు. అవసరమైన మందులు , నిత్యావసర సరుకులను అందిస్తామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. -
ఆడియో కలకలం.. బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం
సాక్షి, నిజామాబాద్: బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఓ కిరాణా దుకాణం యజమానిని బూతులు తిడుతూ వేధిస్తున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంజాన్ పండుగకు ఆర్డర్ ఇచ్చిన తోఫా ప్యాకెట్లకు సంబంధించిన డబ్బులు అడిగిన దుకాణం యజమానిపై ఎమ్మెల్యే బూతు పురాణం మొదలెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బోధన్ ఎమ్మెల్యే షకీల్ రంజాన్ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కిరాణా వ్యాపారి అయిన రుద్రంగి మురళీధర్కు 6వేల తోఫా ప్యాకెట్లను ఆర్డర్ చేశారు. ఒక్కోటి రూ.600 రూపాయల చొప్పున 6000 వేల ప్యాకెట్లకు ఆర్డర్ ఇవ్వగా.. ఎమ్మెల్యే 36లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో షకీల్ అడ్వాన్స్గా 12 లక్షల రూపాయలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాత ఇస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా క్యాటరింగ్ నిమిత్తం మురళీధర్కు మరో 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇలా ఎమ్మెల్యే షకీల్, కిరాణా వ్యాపారికి 30లక్షల రూపాయల వరకు బాకీ పడ్డారు. తన డబ్బులు ఇప్పించాలని మురళీధర్ రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా ఆయన స్పందించడం లేదు. దీంతో బాధితుడు ఎమ్మెల్యే సన్నిహితుడి వద్ద బాధను చెప్పుకోగా ఆ వ్యక్తి ఎమ్మెల్యే షకీల్తో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడించాడు. ఈ నేపథ్యంలోనే మురళీధర్పై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీకు డబ్బులు ఇచ్చేది ఎక్కడిదిరా..’ అంటూ చెప్పుకోలేని రీతిలో దుర్భాషలాతుడూ కాల్ కట్ చేశారు. ఎమ్మెల్యే బూతు పురాణాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసిన బాధితుడు మీడియా ఎదుట తన గోడు వెళ్లిబోసుకున్నాడు. బ్యాంక్ రుణం తీసుకుని షాపు పెట్టుకున్నానని, ఎమ్మెల్యే కారణంగా ఈఎంఐలు కట్టలేకపోవడంతో అధికారులు తన షాపును సీజ్ చేశారని మురళీధర్ తెలిపాడు. తనకు న్యాయం చేయాలని బోధన్ ఏసీపీని ఆశ్రయిస్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యే కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని, తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. చదవండి: వీఆర్ఓపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం! ఆడియో టేప్ లీక్: ఖుష్బూ క్షమాపణ -
‘కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు’
సాక్షి, జనగామ: ‘పార్టీలో పదవులు రాలేదని చీటికిమాటికి కొట్లాటలు వద్దు. ఉద్యమ సమయం నుంచి నేను పార్టీలో కష్టపడి పనిచేసిన. అయినా నిన్నకాక మొన్న టీఆర్ఎస్లో చేరిన వారు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. దీనికి నేనేమైనా కొట్లాట చేశానా? అన్నింటికీ అధినేత సీఎం కేసీఆర్ ఉన్నారనే భరోసా ఉంది’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. వర్ధన్నపేట, పాలకుర్తి, ఉప్పల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. కేసీఆర్ను నమ్ము కోవడంతో జనగామ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చారన్నారు. మనకు మనం మనస్పర్థలకు వెళ్లి, పార్టీకి చెడ్డ పేరు తేవొద్దని హితవు పలికారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పినోళ్లకే పథకాలు వస్తాయని, కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు దక్కు తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ మాలోతు కవిత తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్కు ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ 2012 కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన ఆందోళనలో దాస్యం వినయ్ భాస్కర్తో పాటు పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ ఘటనలో వినయ్ భాస్కర్తో పాటు మరో 8 మందిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాకపోవడంతో తొమ్మిది మందికి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: అయోధ్యలో చేపట్టనున్న రామమందిర నిర్మాణానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వవద్దంటూ కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన గ్రామాల్లో రామాలయాలు ఉండగా అయోధ్య రామాలయం మనకెందుకు అంటూ ఆయన ప్రజలనుద్దేశంచి ప్రసంగించారు. రామమందిరం పేరుతో బీజేపీ నాయకులు బిచ్చమెత్తుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తామంతా శ్రీరాముడి భక్తులమేనని, బొట్టు పెట్టుకుంటేనే భక్తులమవుతామా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రతి హిందువు కల అని, ఇందులో భాగంగానే ప్రతి హిందువును భాగస్వామ్యం చేయాలని నిధులను సేకరిస్తున్నామని ఆయన వివరించారు. రామాలయం నిర్మాణ నిధి కోసం తాము ఎవరిని ఒత్తిడి చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో మందిర నిర్మాణానికి అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ నేతలు కలెక్షన్లు చేస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, గత కొంత కాలంగా రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇందుకు మరింత ఆజ్యం పోశాయి. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తుంటే, టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. -
ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా
సాక్షి, వికారాబాద్: ఇటీవల కాలంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఫైర్ అయ్యారు. తనకు రాజకీయాలు కొత్త అన్న మాజీ మంత్రిని ఉద్దేశిస్తూ.. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2018 ఎన్నికల్లో ప్రజలు తమ నాయకుడు కేసీఆర్పై నమ్మకంతో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని, మోదీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. గ్రామపంచాయతీల్లో రాష్ట్ర నిధులు లేవనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ని హిందువా అంటున్న బండి సంజయ్లో ప్రవహించేది హిందూ రక్తమే అయితే నాగార్జున సాగర్ ఎన్నికల్లో చూసుకుందామని ఛాలెంజ్ చేశారు. హిందువులకు, ముస్లింలకు వేరువేరు రక్తం ఉంటుందా అని ఆయన ఎద్దేవా చేశారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్పై అవాక్కులు చవాక్కులు పేలితే బడిత పూజ చేస్తామని హెచ్చరించారు. మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలను బీజేపీ ఇకనైనా మానుకోవాలని సూచించారు. గాలివాటంగా గెలిచిన స్థానాలను చూసుకొని బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నాడని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ క్లాస్ కి క్లాస్, మాస్ కి మాస్ అని, ఆయన తలచుకుంటే బీజేపీ నాయకులు రాష్ట్రంలో తిరగలేరని హెచ్చరించారు. -
నోముల అకాల మరణం : ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) అకాల మరణంపై నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులంటూ నోముల సేవలను గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నానంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్రావుకూడా నోముల మృతిపై విచారం వ్యక్తం చేశారు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత) కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస తీసకున్నారు. ఈ ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని టీఆర్ఎస్ శ్రేణులు విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి అకాల మరణం వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులు నోముల నర్సింహయ్య గారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/y6lm4KdxJQ — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 1, 2020 నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి ఆకస్మిక మరణం తీవ్ర దురదృష్టకరం. జీవితాంతం ప్రజలకోసం వారి హక్కుల కోసం పోరాడారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలకోసం నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి నర్సింహయ్యగారు. వారిమృతి పట్ల తీవ్రసంతాపాన్ని తెలుపుతూ.. వారి కుటుంభసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి pic.twitter.com/67iX9HXRF7 — Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) December 1, 2020 -
రసమయి బాలకిషన్ తిట్ల పురాణం!
సాక్షి, కరీంనగర్: అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఓ గ్రామస్తుడిపై నోరు పారేసుకున్నారు. తనను విమర్శించాడనే కోపంతో పరుష పదజాలంతో ఆయనపై విరుచుకుపడ్డారు. అయితే సదరు గ్రామస్తుడు సైతం.. ఎమ్మెల్యే తిట్ల దండకానికి అంతే దీటుగా బదులివ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. వివరాలు.. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తమ గ్రామంలో పర్యటించలేదంటూ బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామ సమస్యలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: టీఆర్ఎస్లో రచ్చ.. తన్నుకున్న నాయకులు) ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రసమయి, నేరుగా రాజశేఖర్రెడ్డికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారు. హఠాత్పరిణామంతో కంగుతిన్న రాజశేఖర్రెడ్డి.. తాను సైతం ఎమ్మెల్యేపై తిట్ల దండకం అందుకుని గట్టిగానే బదులిచ్చారు. వీరిద్దరి మధ్య నడిచిన తిట్ల పురాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రసమయి వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధి ఈ విధంగా మాట్లాడటం సరికాదంటూ కొంతమంది అభిప్రాయపడుతుండగా.. మరికొంత మంది మాత్రం ఎదుటి వాళ్లు రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించినందు వల్లే ఆయన ఇలా చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. -
నీ పేరు రాసి చస్తాం: ఎమ్మెల్యేతో మహిళలు
సాక్షి, హైదరాబాద్ : వరద పరిస్థితులను సమీక్షించటానికి బోటులో అధికారులతో వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఉప్పల్ ప్రాంతంలోని వరదల్లో పర్యటిస్తున్న ఆయనపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. వాగ్వివాదానికి దిగారు. వరదల్లో చిక్కుకున్న తమను సురక్షిత ప్రాంతానికి తరలించటం లేదంటూ మండిపడ్డారు. వరదల్లో ఇలాగే చిక్కుకుని చావాలా? అని ప్రశ్నించారు. నీటిలో చిక్కుకుని చనిపోయేటట్లయితే ‘నీ పేరు రాసి చస్తాం!’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా వేసుకోవటానికి దుస్తులు కూడా లేని పరిస్థితిలో ఉన్నామని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇలాంటి ప్రాంతంలో ఇళ్లేందుకు కట్టుకున్నారని ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించారు. ‘విపత్కర పరిస్థితి ఇది.. వర్షం సడెన్గా వచ్చింది. అకస్మాత్తుగా వచ్చిందానికి.. ఎవరూ బాధ్యులు కార’ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారులు కూడా ఎమ్మెల్యేకే వంత పాడారు. మహిళలు ప్రశ్నిస్తుండగానే ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. మీర్పేట్లో కొనసాగుతున్న వరద ఉధృతి హైదరాబాద్ మీర్పేట్లోని జనప్రియ కాలనీలో ఇంకా వరద ఉధృతి కొనసాగుతోంది. పైన ఉన్న చెరువులకు గండి పడటంతో కాలనీలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. నీటి దాటికి వాహనాలు, ఆటోలు, బైకులు కొట్టుకుపోతున్నాయి. పూర్తిగా రాకపోకలు లేకుండా రోడ్డు కోతకు గురైంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలు తీర్చే నాథుడే లేడంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్మాన్ మృతదేహం లభ్యం మంగళవారం నాగోల్ బండ్లగూడలో గల్లంతైన పోస్ట్మాన్ సుందర్రాజు మృతదేహం గురువారం లభ్యమయింది. నాగోల్ చెరువులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. -
ఎమ్మెల్యేపై మహిళల ఆగ్రహం
-
చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
-
చేపల వేటలో సరదాగా ఎమ్మెల్యే
సాక్షి, మహబూబ్నగర్: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నీటి కాలువలో చేపలు పట్టి సరదా తీర్చుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగుపయమైన ఎమ్మెల్యే బండర్ వల్లి బ్రిడ్జి దగ్గర ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు ప్రవహిస్తుండటాన్ని చూసిన అక్కడ కాసేపు ఆగారు. నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఇంతలో అక్కడ కొంత మంది గాలాలతో చేపలు పడుతుండటాన్ని గమనించి అక్కడికి వెళ్లారు. వారి వద్దనున్న చేపల గాలలను తీసుకుని తాను కూడా కాసేపు చేపలకు గాలం వేశారు. తాను చిన్నతనంలో సరదాకు గాలాలతో చేపలు పట్టే వాడినని, మళ్లీ ఇన్నేళ్లకు చేపలు పట్టడం ఆనందంగా ఉందన్నారు. కాగా, తన గాలానికి చేప పడటంతో ఎమ్మెల్యే మరింత ఆనందపడ్డారు. ఎమ్మెల్యే స్వయంగా చేపలు పట్టి సరదా తీర్చుకోవడంతో స్థానికులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: సెల్ఫీ ప్రమాదం: కళ్లముందే కూతురు జలసమాధి) -
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులతో పాటు అంగరక్షకులలకు పరీక్షలు చేయించగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఆయన హైదరాబద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల సురేందర్ కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇప్పటివరకూ సురేందర్ సహా నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ తెలింది. కాగా, ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్ బారి నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. (తెలంగాణ కరోనా రికవరీ రేటు 77.31శాతం) -
చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు
సాక్షి, న్యూఢిల్లీ/ కరీంనగర్:పౌరసత్వం వివాదంలో వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్కు ఎదురుదెబ్బ తగిలింది. భారత పౌరసత్వానికి ఆయన అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని పొందేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలతో మన దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆది వాదిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపి, తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించింది. తప్పుడు సమాచారం ఇచ్చారు.. ‘‘భారత పౌరసత్వం కోసం చెన్నమనేని రమేశ్ 31.03.2008న దరఖాస్తు చేసుకున్నారు. సెక్షన్ 5 (1) (ఎఫ్) ప్రకారం దరఖాస్తుదారు దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఏడాది పాటు భారతదేశంలో నివసించి ఉండాలి. ఈ విషయంలో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారు. 21.11.2008న గత 12 నెలల్లో విదేశాలకు వెళ్లిన వివరాలను సమర్పించాలని హోంశాఖ ఆయన్ను కోరగా.. తాను విదేశాలకు వెళ్లలేదని 27.11.2008న రమేశ్ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో 04.02.2009న ఆయనకు కేంద్ర హోంశాఖ భారత పౌరసత్వాన్ని ఇచ్చింది. దీనిపై ఆది శ్రీనివాస్ 15.06.2009న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా సంస్థల నివేదిక ప్రకారం రమేశ్ 01.03.2007 నుంచి 26.11.2007 వరకు, 20.12.2007 నుంచి 28.02.2008 వరకు విదేశాల్లో ఉన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక లేఖ ద్వారా 01.09.2009న ధ్రువీకరించింది. పౌరసత్వ చట్టం సెక్షన్ 10(5) పరిధిలో ఒక విచారణ కమిటీని నియమించగా.. ఆ కమిటీ 10.03.2017న తన నివేదిక సమర్పించింది. జర్మనీకి వెళ్లిన విషయాన్ని రమేశ్ నిజాయతీగా వెల్లడించలేదని, 27.11.2008న తప్పుడు సమాచారం ఇచ్చారని కమిటీ నిర్ణయానికి వచ్చింది. రమేశ్ భారత ప్రభుత్వాన్ని మోసగించడం ద్వారా పౌరసత్వాన్ని పొందారని తేలింది’’అని హోంశాఖ పేర్కొంది. రమేశ్ తప్పుడు అభ్యర్థన చేశారని, వాస్తవాలను మరుగున పెట్టారని, పౌరసత్వ దరఖాస్తుకు ముందు చేసిన విదేశీ పర్యటనలను దాచి ఉంచినట్టు వెల్లడైందని వివరించింది. వాస్తవాలను మరుగుపరచడం, తప్పుడు సమాచారం ద్వారా పౌరసత్వం పొందితే సెక్షన్ 10(2) వర్తిస్తుందని, అంటే ఆయన పౌరసత్వం తొలగించాల్సి వస్తుందని తెలిపింది. ఉదాహరణగా ఉండాల్సిన వారు ఇలా చేస్తే? ‘‘తాను ప్రజాసేవలో ఉన్నందున సెక్షన్ 10(3)ను పరిగణనలోకి తీసుకోవాలని చెన్నమనేని అభ్యర్థించారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేనని, ఎలాంటి నేరచరిత్ర లేదని, క్రిమినల్ కేసు లేదని, తీవ్రవాదం వంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. అయితే, తప్పుడు సమాచారం ఇవ్వడం, వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. దరఖాస్తు నాటికి ఏడాది ముందు కాలం పాటు పూర్తిగా భారతదేశంలో నివసించలేదని సమాచారం ఇచ్చి ఉంటే అధీకృత యంత్రాంగం ఆయనకు పౌరసత్వం ఇచ్చి ఉండేది కాదు. ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఇచ్చే సమాచారం సరైనదిగా ఉండాలి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు ఆయన ప్రవర్తన ఉదాహరణగా ఉండాలి. ఒక వ్యక్తి దేశ పౌరసత్వం పొందేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటే, సమాజానికి సదరు వ్యక్తి చేసే మంచిని ఊహించగలం. నేరారోపణలు లేనంత మాత్రాన తప్పుడు సమాచారం ఇవ్వడం మంచి చేయడానికే అని అర్థం కాదు. ప్రజాప్రతినిధిగా ఉండి అసత్య సమాచారం ఇవ్వడం ప్రజాశ్రేయస్సుకు మంచిది కాదు. ఆయన ఎలాంటి నేరాలకు పాల్పడలేదని భావించి పౌరసత్వాన్ని కొనసాగిస్తే ఇదొక ఉదాహరణగా మారి మరికొందరు ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పౌరసత్వాన్ని పొందుతారు. వీటన్నింటి దృష్ట్యా ఆయన భారత దేశపౌరుడిగా కొనసాగడం ప్రజాశ్రేయస్సుకు దోహదం చేయదని నిర్ణయించి, రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’’అని హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పదేళ్ల న్యాయ పోరాటం చివరికి ఇలా... రమేశ్బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 జూన్లో కేంద్ర హోంశాఖలో ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ విచారణ జరిపి, రమేశ్ కేవలం 96 రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నారని నివేదిక సమర్పించారు. 2010 ఉప ఎన్నికల అనంతరం రమేశ్బాబు ఎన్నికను సవాల్ చేస్తూ ఆది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. 2013 ఆగస్టు 14న రమేశ్బాబు పౌరసత్వం రద్దు చేయడమే కాకుండా ఓటరు జాబితాలో పేరు తొలగించాలని తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రమేశ్బాబు 2013లో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ ఈ వ్యవహారం కేంద్ర హోంశాఖకు మారింది. రమేశ్బాబు విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా ఆయన మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని తేల్చి చెప్పింది. దీంతో 2017 ఆగస్టు 31న రమేశ్బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది. అయితే, తాను ప్రజలకు సేవలు అందిస్తున్నానని, తన పౌరసత్వం కొనసాగించాలని మరోసారి ఆయన హోంశాఖను కోరారు. అనంతరం 2018 జనవరి 5న మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వగా.. దానిని ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 2019 జూలై 10న రమేశ్బాబు పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ మూడు మాసాల్లో తేల్చాలని ఆదేశించింది. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా: చెన్నమనేని తన పౌరసత్వ పరిరక్షణకు మరోమారు హైకోర్టును ఆశ్రయిస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తెలిపారు. ఈ ఏడాది జూలై 15న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ‘నా పౌరసత్వాన్ని 2017లో హోంశాఖ రద్దు చేసిన తరువాత హైకోర్టు వెంటనే స్టే మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ ఏడాది జూలై 15న నా పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని కొట్టివేసింది. పౌరసత్వ చట్టం, వాటి నియమ నిబంధనలు, దరఖాస్తులను సమగ్రంగా హేతుబద్దంగా, నైతిక విలువలు, వ్యక్తి సామాజిక నిబద్దతను పరిగణిస్తూ (సెక్షన్ 10.3) చూడాలి తప్ప, సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని తన 25 పేజీల తీర్పులో హైకోర్టు స్పష్టంచేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని హోంశాఖను ఆదేశించింది. ఒకవేళ సెక్షన్ 10.3ని పరిగణించకుండా.. ఏ నిర్ణయం వచ్చినా న్యాయం కోసం మళ్లీ తమ వద్దకు రావచ్చని చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 31న మరోమారు ఢిల్లీలో హోంమంత్రిత్వ శాఖ వద్ద వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు తీర్పులో పేర్కొన్న ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం. పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. తప్పక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’అని చెన్నమనేని పేర్కొన్నారు. న్యాయం గెలిచింది: ఆది శ్రీనివాస్ రమేశ్బాబు భారతదేశ పౌరుడు కాదని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని, ఇన్నాళ్లకు న్యాయం గెలిచిందని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మచ్చలేని నాయకుడనని చెప్పుకుంటున్న రమేశ్బాబు ఈ దేశ పౌరుడు కాదని కేంద్ర హోంశాఖ ప్రకటించిందని, ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ‘ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని నేను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ న్యాయస్థానంలో ఉంది. గతంలో వచ్చిన తీర్పుల ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి ఆ పదవిలోకి వస్తే సమీప ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుందని భావిస్తున్నా’అని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. వేటా.. చెల్లుబాటా? రమేశ్ భారత పౌరసత్వం రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేప థ్యంలో, ఆయన ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంపై ఉత్కంఠ నెలకొంది. హోం శాఖ నిర్ణ యం నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారా, సమీప ప్రత్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే హోంశాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మరోమారు హైకో ర్టును ఆశ్రయిస్తానని రమేశ్ ప్రకటించిన నేపథ్యంలో, ఎమ్మెల్యేగా ఆయన భవితవ్యంపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేశ్ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2010 ఉప ఎన్నికతో పాటు 2014, 2018 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. భారతీయుడైన రమేశ్ 1993లో జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించగా, 2008 మార్చి 31న తిరిగి భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
సోలిపేట రామలింగారెడ్డికి రెండోసారి
సాక్షి, దుబ్బాక: రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియమితులయ్యారు. ఆదివారం శాసనసభ సమావేశాలు ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డిని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్గా నియమిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. రెండోసారి చైర్మన్ గా.. రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రెండోసారి నియమితులయ్యారు. 2014లో తెలంగాణ అసెంబ్లీ మొట్టమొదటి అంచనాల కమిటీ చైర్మన్ గా ఎన్నికైన రామలింగారెడ్డి అసెంబ్లీ రద్దయ్యేంతవరకు ఆ పదవిలో కొనసాగారు. మళ్లీ రెండో సారి రామలింగారెడ్డిని అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్గా సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా.. నమ్మిన బంటుగా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఉన్నారు. ఆయనపై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ తాను విద్యాబుద్ధులు నేర్చుకొని ఇంతటి స్థాయికి చేరుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన దుబ్బాక టికెట్ను (అప్పటి దొమ్మాట) రామలింగారెడ్డికి టీఆర్ఎస్ నుంచి 2004 కేటాయించడంతో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008 బై ఎలక్షన్లో సైతం విజయం సాధించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా .. సోలిపేట రామలింగారెడ్డి మొత్తం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో, 2008 బై ఎలక్షన్ లో దొమ్మట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2018 డిసెంబర్లో నాలుగోసారి 65 వేల పై చిలుకు మెజార్టీతో రాష్ట్రంలోనే మెజార్టీలో 6వ స్థానంలో నిలిచారు. నక్సలైట్..జర్నలిస్టు నుంచి అంచనాల కమిటీ వరకు... సోలిపేట రామలింగారెడ్డి ప్రస్థానం మొదట నక్సలైట్ ఉద్యమం నుంచి ప్రారంభమైంది. తాను దుబ్బాక జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే వామపక్ష ఉద్యమాల ప్రభావం రామలింగారెడ్డిపై తీవ్రంగా పడింది. రామలింగారెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి చిట్టాపూర్లో పోలీస్పటేల్ ఏ లోటు లేని కుటుంబం. అయినప్పటికినీ అప్పటి రోజుల్లో గ్రామాల్లో పేదలపై భూస్వాముల అరాచకాలు ఆయనపై తీవ్రప్రభావం చూపింది. ఇంటర్ చదువుతున్న రోజుల్లో మొదట్లో పీడీఎస్యూ విద్యార్థి సంఘం జనశక్తి అనుంబంధంతో మొదలుకాగా కొద్దిరోజుల్లోనే పీపుల్స్వార్ అనుబంధ సంస్థ రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్ఎస్యూ)లో చేరారు. ఆ క్రమంలోనే పీపుల్స్వార్ రాష్ట్ర నాయకులు శాఖమూరి అప్పారావుతో పరిచయం రామలింగారెడ్డిని పూర్తిస్థాయిలో ఉద్యమం వైపు నడిపించింది.ఆర్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో పోరాటాల్లో క్రియాశీల పాత్ర పోషించాడు. ఆయనపై కక్ష గట్టిన పోలీసులు దేశంలోనే మొట్టమొదటి టాడాకేసు జర్నలిస్టుగా ఉన్న రామలింగారెడ్డిపై పెట్టారు. అప్పట్లో దేశవ్యాప్తంగా మేధావులు, జర్నలిస్టులు పెద్దెత్తున ఉద్యమించడంతో టాడాకేసును రద్దుచేశారు. జర్నలిస్టుగా, రచయితగా ఆర్ఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ పేరుతో రచనలు, కవితలు రాశారు. 2001 టీఆర్ఎస్ ఆవిర్భావంలో క్రీయాశీల పాత్ర పోషించారు. ఉద్యమంలో వందకు పైగా కేసులు.. తెలంగాణ ఉద్యమంలో అత్యధిక కేసులు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పైనే నమోదయ్యాయి. వందకు పైగా కేసులతో చాలా రోజులు జైలులో, కోర్టుల చుట్టూ తిరగారు. రాష్ట్రంలోనే ఉద్యమంలో ప్రతి సంఘటనలోను రామలింగారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామలింగారెడ్డి బయోడేటా పేరు: సోలిపేట రామలింగారెడ్డి పుట్టినతేది: 02 అక్టోబర్ 1962 పుట్టిన స్థలం: చిట్టాపూర్, దుబ్బాక మండలం. తల్లిదండ్రులు: మాణిక్యమ్మ, రామకృష్ణారెడ్డి. విద్యార్హతలు: డిగ్రీ భార్య: సుజాత పిల్లలు: కుమారుడు సతీష్రెడ్డి, కూతురు ఉదయశ్రీ. రాజకీయ ప్రస్థానం: చదువుకొనే రోజుల్లో పీపుల్స్వార్ గ్రూపుతో సంబంధాలు, జర్నలిస్టుగా 2 దశాబ్ధాలకు పైగా పనిచేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
బుల్లెట్పై తిరుగుతూ.. చెక్కులు పంచుతూ..
ఎల్లారెడ్డి: పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందజేశారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని 20 మంది లబ్ధిదారుల ఇంటింటికీ బుల్లెట్పై ఎమ్మెల్యే వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. పట్టణంలో బుల్లెట్పై ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లడంతో ఆయనను వింతగా చూశారు. ఎమ్మెల్యే ఏమిటి.. బుల్లెట్పై తిరగడమేంటి.. ఇంటింటికీ రావడం ఏమిటని ఒకరిని ఒకరు గుసుగులాడుకున్నారు. లబ్ధిదారులు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటికి వచ్చి అందజేయడాన్ని అందరూ చాలా సంతోషించారు. ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుడుముల సత్యం, ఇమ్రాన్, జలందర్ రెడ్డి, పద్మారావు, రవీందర్, నర్సింలు, సతీష్, శ్రీనివాస్, తిమ్మాపూర్ సర్పంచ్ దామోదర్ ఉన్నారు. -
మరో రెండు జిల్లాల ఏర్పాటుకు డిమాండ్
వరంగల్ : పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా రాష్ట్రప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. తెలంగాణలో కొత్త జిల్లాల డిమాండ్ ఆగడం లేదు. తమ ప్రాంతాన్ని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఎక్కడో చోట నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ తూర్పు నియోజక వర్గాన్ని ‘హెడ్ క్వార్టర్స్’గా ‘వరంగల్’ జిల్లాను ఏర్పాటు చేయాలని, ‘హన్మకొండ’ను మరో జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. సాక్షాత్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, తూర్పు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ డిమాండ్ను తెరపైకి తేవడం గమనార్హం. ప్రస్తుతం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా వరంగల్ జిల్లాను విభజించి.. జనగామ్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహాబూబాదాద్ జిల్లాలుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఇప్పటికే ఆరు జిల్లాలుగా విభజించారు. అయితే, వరంగల్ తూర్పు నియోజక వర్గాన్ని ‘హెడ్ క్వార్టర్స్’గా ‘వరంగల్’ జిల్లాను ఏర్పాటు చేయాలని, ‘హన్మకొండ’ను మరో జిల్లాగా ప్రకటించాలని, ఈ మేరకు రెండు జిల్లాల మార్పు అనివార్యమని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తాజాగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా మొదట ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మరో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ.. కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
అందుకే నన్ను బీదల డాక్టర్గా పిలిచేవాళ్లు...
జీవితానికి సార్థకత లభించాలంటే ఏదో మంచి చేయాలి. ఆ మంచి పలువురికి ఉపయోగపడాలి. ఈ సిద్ధాంతాన్ని నమ్మడమే కాదు.. దాన్ని పాటించేందుకు ప్రయత్నించే వ్యక్తిని నేను. అందుకే వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను కష్టపడి చదివి డాక్టర్ అయ్యాను. తర్వాత 12 ఏళ్లు అరబ్ దేశాల్లో వైద్యుడిగా పని చేసి కర్నూలుకి వచ్చేశా. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కర్నూలులోని కృష్ణానగర్లో ఓ క్లినిక్ తెరిచా. అప్పట్లో నా దగ్గరికి వచ్చే రోగుల నుంచి రూ.5 ఫీజు తీసుకునేవాడిని. కర్నూలుతో పాటు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అలంపూర్ నుంచి కూడా చాలా మంది వైద్యం కోసం వచ్చేవారు. వారిలో పేదలే ఎక్కువ. అలాంటి వాళ్ల దగ్గర రూ.5 కూడా తీసుకోలేదు. అందుకే ప్రజలు నన్ను బీదల డాక్టర్గా పిలవడం మొదలుపెట్టారు. ఆ అభిమానంతో నన్ను ఎమ్మెల్యేను చేశారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవకు అంకితమై ఉంటా.’’ ఆయనో వైద్యుడు.. ఎవరికి ఏ జబ్బు వచ్చినా ఏమీ ఆశించకుండానే వైద్య సేవలందించే వ్యక్తి. మంచితనానికి, ఆప్యాయతకు మారుపేరుగా నిలిచిన ఆయనకు ప్రజలు ఇచ్చిన బిరుదు బీదల డాక్టర్. రోగులకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న నిస్వార్థ వైద్యుడిని ప్రజలు ఇంకా ఉన్నతంగా చూడాలనుకున్నారు. ఆయనలో ఉన్న సేవాగుణం.. జనానికి ఏదో చేయాలనే తపనను గుర్తించిన కొందరు ఆప్తులు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని పట్టుబట్టారు. వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్ ప్రజాసేవే పరమావధిగా భావించే ఆ ప్రజామనిషిని పిలిచి మరీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయాలంటే దీనికంటే గొప్ప అవకాశం లేదనుకున్న ఆ జననేత..జనం అభీష్టం మేరకు వైద్యవృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలూ ఆయన్ను తమ నాయకుడిగా ఆదరించారు. ఎమ్మెల్యేగా గెలిపించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించడంతో పాటు ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ పేదలకు ఆప్తుడయ్యారు. చేసే పని ఏదైనా.. పలువురికి మేలు చేసేలా ఉండాలి. అది మనకు సంతృప్తినివ్వాలి అని అంటోన్న అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ బీఎం అబ్రహంతో ‘సాక్షి’ పర్సనల్ టైం. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : మాది జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వల్లూరు. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న వెంకటరమణ. అమ్మ గోవిందమ్మ. మేం ముగ్గురం అన్నాదమ్ములం. అన్న సుధాకర్ ప్రభుత్వ కాలేజీలో పని చేసి పదవీ విరమణ పొందారు. మరో అన్న ఏసన్న మా గ్రామం వల్లూరులో సర్పంచ్గా ఉన్నారు. మాకు చెల్లెళ్లు లేరు. కుటుంబంలో డాక్టర్ అయింది నేనొక్కడినే. నాన్న వ్యవసాయం చేసి మమ్మల్ని ఉన్నత చదువులు చదివించారు. అప్పట్లో ఉన్న పరిస్థితుల కారణంగా మా నాన్న పెద్దగా చదువుకోలేదు. ఆయన చదువుకోకపోవడంతో తన పిల్లలను బాగా చదివించాలని కోరిక బలంగా ఉండేది. అందుకే మా చదువుకు ప్రొత్సహించారు. ఎలాంటి లోటు రాకుండా వ్యవసాయంలో కష్టపడి చదువులు చెప్పించారు. ఆయన అందించిన ప్రోత్సాహంతో నేనే డాక్టర్గా రాణించాను. మా తమ్ముడు కూడా ప్రభుత్వ ప్రిన్సిపల్గా ఉద్యోగం సాధించాడు. వ్యవసాయం కుటుంబం కావడంతో ఉన్న భూమి సాగు చేయడం కష్టంగా ఉంటుందని చిన్నవాడు వ్యవసాయంలో స్థిరపడ్డాడు. అమ్మ ఎప్పుడూ మా అన్నదమ్ముల చదువుకు ప్రోత్సహించేది. ప్రస్తుతం అన్నదమ్ములు. బంధువులందరూ వల్లూరులోనే ఉంటారు. నేను నా కుటుంబంతో కలిసి కర్నూలులో ఉంటున్న. ‘‘పన్నెండేళ్లు ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాల్లో ఉన్న ఆస్పత్రుల్లో వైద్యుడిగా పని చేశా. మంచి పేరు, డబ్బు సంపాదించా. అయినా అది నాకు తృప్తి ఇవ్వలేదు. అందుకే పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అన్నీ వదిలేసి ఇండియాకు తిరిగొచ్చేశా. కర్నూల్లు లో ఓ ప్రైవేట్ క్లినిక్ ప్రారంభించి అతితక్కువ ఫీజుతో 22 ఏళ్లు పేదలకు వైద్య సేవలందించా. నేను డాక్టర్గా ఉన్నప్పుడు రోగులు నా క్లినిక్కు వచ్చేటోళ్లు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేనే ప్రజల వద్దకు వెళ్తున్న. ఇంట్లో కంటే ప్రజలతోనే ఎక్కువగా గడుపుతున్న. అందరి సమస్యలు వింటూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. డాక్టర్ వృత్తి కంటే ఎమ్మెల్యే పదవికి బాధ్యతలు ఎన్నో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే జనం నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి మధ్యలోనే ఉండేందుకు ప్రయత్నిస్తుంటా.’’ కుటుంబసభ్యులే కొండంత అండ ప్రజల మధ్య ఉండడమే నాకిష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన నాలో ఎక్కువ. ఓ వైద్యుడిగా.. ఎమ్మెల్యేగా ప్రజల కష్టసుఖాలు నాకు తెలుసు. అందుకే ఎవరికీ ఏ సమస్య వచ్చినా వారు నా దగ్గరికి వస్తారు. నా పరిధిలో ఉండే పని చేసి పెడతా. పని పూర్తయితే వాళ్ల మొఖంలో సంతోషాన్ని చూసి నేనూ ఆనందపడతా. నా కుటుంబసభ్యులే నాకు కొండంత అండ. నా సతీమణి విజయలక్ష్మి సహకారం అపూర్వం. కుటుంబబాధ్యతలు.. పిల్లల పెంపకం అంతా ఆమెనే చూసుకుంటుంది. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి. ఇద్దరు కూతుళ్లకు వివాహాలు జరిగాయి. జ్యోతి బీటెక్ చదివింది. అల్లుడు రవి బాబు(ఎంటెక్). ఇద్దరూ దుబాయ్లో ఉంటున్నారు. మరో కూతురు మాన్సి అమెరికాలో డాక్టర్. అల్లుడు నవీన్ (ఇంజనీర్). ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. కొడుకు అజయ్ బెంగళూరులో ఆర్థోపెడిక్ సర్జన్ చదువుతున్నాడు. ఆ మాస్టారే లేకుంటే.. నేను వల్లూరులో నాలుగో తరగతి చదివేటప్పుడు స్కూలుకు డుమ్మా కొట్టేవాడిని. ఇంటి నుండి బయలుదేరి మధ్యలో ఉన్న పంట చేనులో దాక్కొనే వాడిని. ఆ సమయంలో ముహమ్మద్ హుస్సేన్ అనే మా మాస్టార్ నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. నేను స్కూలుకు రాకపోతే నా గురించి ఇంటికొచ్చేవారు. చేనుల వెంట తిరిగిన నన్ను చదువు వైపు దృష్టి మళ్లించిన మాస్టారు అంటే నాకు ఎంతో గౌరవం. చేసిన అభివృద్ధి తృప్తినిచ్చింది కుటుంబం కంటే నా నియోజకవర్గ ప్రజలే నాకు ముఖ్యమని భావిస్తా. అందుకే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుమారు రూ. 580 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించా. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుగా ఉన్న అలంపూర్ మండలంలో రూ.66కోట్లతో మూడు ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టిన. దీంతో 8వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతోంది. రూ.6.25కోట్లతో ఐదు మండల కేంద్రాల్లో కేజీబీవీ భవనాలు, రూ.1.50 కోట్లతో అలంపూర్, అయిజలో రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాల భవనాలు నిర్మించా. ఏళ్ల తరబడిగా మరుగునపడిన అలంపూర్ చౌరస్తా–అయిజ రహదారిని రూ.78 కోట్లతో ఆధునీకీకరించా. రూ.14కోట్ల వ్యయంతో ఎస్సీ రెసిడెన్షియల్ భవనం, రూ.10 కోట్లతో అలంపూర్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టాను. సర్కారు చదివే.. నా విద్యాభ్యాసమంతా సర్కారు విద్యా సంస్థల్లోనే జరిగింది. అలంపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివా. గద్వాలలో ఏడో తరగతి వరకు, మహబూబ్నగర్లో ఇంటర్ పూర్తి చేశా. తర్వాత 1974లోనే హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. చిన్నప్పటి నుండే పేదలకు సేవ చేయాలనే తపన నాలోఉండేది. అందుకే డాక్టర్నయ్యా. -
అభివృద్ధికి గ్రహణం
నర్సంపేట: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందాన తయారైంది నర్సంపేట పట్టణ పరిస్థితి. సుందరీకరణ కోసం ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి టీయూఎఫ్ఐడీసీ జీఓ 51 ద్వారా రూ.35 కోట ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. పనులు పూర్తి చేసేందుకు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. పట్టణ ప్రజలకు కనీస వసతులు లేకుండా పోయింది. విడుదలైన నిధులతో డబుల్, సింగిల్ డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, ప్రధాన జంక్షన్లు, కుమ్మరికుంట పార్కు, సైడ్ డ్రెయినేజీ నిర్మాణాలు, రోడ్ల నిర్మాణం, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాళ్లు, కూరగాయల మార్కెట్, ఆడిటోరియం, అంబేడ్కర్ భవన్ లాంటి అభివృద్ధి పనులతో పట్టణ సుందరీకరణ కోసం నిధులను కేటాయించారు. అప్పట్లోనే ఎమ్మెల్యే రాష్ట్ర స్థాయి అధికారులను నర్సంపేటకు తీసుకువచ్చి అభివృద్ధి పనుల ప్రణాళికపై వివరించి సకాలంలో పూర్తిచేసే విధంగా సహకరించాలని కోరారు. కాని సంబంధిత అధికారులు ఉదాసీనత పాటించారు. పట్టణంలోని డివైడర్ల పనులు కొనసాగుతుండగా రూ.3 కోట్లతో కుమ్మరికుంట పార్కు అభివృద్ధి చేయాల్సిన పనులతో పాటు రూ.15 కోట్లతో నిర్మించాల్సిన 33 కమ్యూనిటీ భవనాలు నిర్మాణం పనులు అటకెక్కాయి. 7 కమ్యూనిటీ భవనాలకు మాత్రమే టెండర్లు పూర్తికాగా 26 భవన నిర్మాణాల కోసం టెండర్లు, 5 కోట్లతో నిర్మించాల్సిన ఎస్సీ ఆడిటోరియం , 30 లక్షలతో ఏర్పాటు కానున్న లైబ్రరీ పనులకు టెండర్లు జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్ సాకుతో అధికారులు పట్టణ అభివృద్ధిపై పట్టింపులేకపోవడం వల్లనే పూర్తిస్థాయి అభివృద్ధి ఆలస్యమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం.. పట్టణ సుందరీకరణలో జరగాల్సిన పనులకు టెండర్ల ప్రక్రియ చేయని వాటిపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ సుందరీకరణ కోసం పట్టు బట్టి రూ.35 కోట్లు విడుదల చేయించినప్పటికీ టెండర్లు పూర్తిస్థాయిలో నిర్వహించని పనులకు సంబంధించిన అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వెంటనే చేయాలని పూర్తిస్థాయి పనుల నిర్మాణానికి వెంటనే టెండర్లను నిర్వహించాలని ఆదేశించారు. పట్టణ ప్రజలకు తాగునీరందించేందుకు మిషన్ భగీరథ పైప్లైన్కు అనుసంధానంగా గతంలో ఉన్న పైప్లైన్కు లింకేజీ ఇస్తూ సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నర్సంపేట పట్టణాన్ని గ్రీన్సిటీగా తీర్చిదిద్దేందుకు ఇంటింటికీ కావాల్సిన మొక్కలను అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ వెంకటరమణారెడ్డి, మునిసిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ, కమిషనర్ వెంకటేశ్వర్లు, త్రిబుల్ ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత రాయిడి రవీందర్రెడ్డి, మునిగాల వెంకట్రెడ్డి, నల్లా మనోహర్రెడ్డి, ఏఈ సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ ఫెయిలైనా... డాక్టర్నయ్యా!: ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాలలో ఆయనో ప్రముఖ వైద్యుడు. కంటి డాక్టర్గా మారుమూల గ్రామాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించారు. వైద్య శిబిరంలో మందులు ఇచ్చి పంపించడమే గాక.. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసిన సేవా గుణం ఆయనది. 2014లో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. వెనుదిరిగి చూడలేదు. వైద్యుడిగా సేవలు అందిస్తూనే... ప్రజల్లో గుర్తింపు పొందారు. 6వేల ఓట్లతో ఓడిపోయిన చోటే 60వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనే జగిత్యాల ఎమ్మెల్యే ముకునూరు సంజయ్కుమార్. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రోత్సాహం, తాత చొక్కారావు ఆదర్శాలు తనను రాజకీయంగా నిలబెట్టాయని చెబుతున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో ‘సాక్షి’ పర్సనల్ టైం ఇది. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయం అంటే ఇష్టం జగిత్యాల మండలం అంతర్గాం సొంతూరు. నాన్న హన్మంతరావు, అమ్మ వత్సల. నాన్న వ్యవసాయం పైనే ఆధారపడ్డారు. కుటుంబంలోని ఇతరులు రాజకీయంగా ఉన్నతస్థాయిలో ఉన్నా, నాన్న మాత్రం వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. 90 ఎకరాల భూమిని కౌలుకు ఇవ్వకుండా సాగు చేసేవారు. నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టమే. చిన్నప్పుడు, డాక్టర్ వృత్తిలోకి రాకముందు నాన్నకు వ్యవసాయంలో సాయపడేవాడిని. పట్టుబట్టి చదివా! నాకు చదువు అంటే ఇష్టమే. అయినా 1977లో పదో తరగతిలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యా. అప్పట్లో 10వ తరగతి పాస్ పర్సంటేజీ 10 శాతం ఉండేది. అయినప్పటికీ పట్టుబట్టి సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అయి, ఇంటర్లో బైపీసీలో జాయిన్ అయ్యా. ఇంటర్మీడియట్లో 80 శాతం మార్కులతో పాస్ అయ్యా. ఇంటర్ పూర్తి కాగానే మా నాన్న హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీలో చేర్చారు. 1980–81లో ఏడాది మాత్రమే డిగ్రీ చేశా. అప్పుడే విజయవాడలో ప్రైవేటు రంగంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల వచ్చింది. నాకున్న మార్కులతో నేరుగా ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందాను. నాకు లా చేయాలని ఉన్నా, మా నాన్న కోరిక మేరకే ఎంబీబీఎస్ చదివి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పేరున్న నేత్ర వైద్య నిపుణుడిగా కొనసాగాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవి ఫెయిలైన విద్యార్థుల మానసిక స్థితిని చూస్తే బాధేస్తుంది. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. అది గెలుపునకు మరో మెట్టుగా మార్చుకోవాలి. టెన్త్లో ఫెయిల్ అయినా బాధ పడలేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఓడిపోయినా నేను బాధ పడలేదు. రెండోసారి విజయం సాధించానుగా. ఎదుగుదలలో సహధర్మచారిణి రాధిక 1989లో వివాహం జరిగింది. బంధువుల అమ్మాయి అయిన రాధికను పెళ్లి చేసుకున్నాను. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మా ఆవిడ రాధిక సైతం రాజకీయ కుటుంబం నుంచే వచ్చింది. రాధిక తండ్రి కమలాకర్రావు బోయినిపల్లి సర్పంచ్గా సేవలు అందించారు. రాధిక అమ్మ వాళ్ల నాన్న దివంగత మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్ధండుడు. అయినా రాధిక నా భార్యగా నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. గృహిణిగా సేవలందించింది. నా వృత్తి విజయంలో, రాజకీయంగా ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ఆమె ప్రధానం. సేవ చేసేందుకే వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి.. నాకు చిన్నప్పటి నుంచే సామాజిక సేవలో పాల్గొనడం ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన. డాక్టర్గా ఉంటూనే ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టడం, గ్రామాల్లో వైద్య సేవలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేసేవాడిని. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు అందించాను. వేలాది మెడికల్ క్యాంపులు పెట్టడమే కాక, 10వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగాను. ఎమ్మెల్యేగా పూర్తి సమయం ప్రజాసేవకే నాకు ఒక్కతే కూతురు హార్తిక, అల్లుడు రాజీవ్. హైదరాబాద్లో బిజినెస్ చేస్తుంటారు. నేను, నా భార్య ఇక్కడ ఉంటాం. వాళ్లు తరచూ వస్తూ వెళ్తుంటారు. ఎన్నికల సమయంలో నాకే సమయం కేటాయించారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రజా జీవితంలో మమేకం కావలసిందే. గ్రామాల్లో పేరుకుపోయిన అనేక సమస్యలు, ప్రజల బాధలను తెలుసుకుంటున్నా. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నా. జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. మా కుటుంబానిది రాజకీయ నేపథ్యమే మా సొంత చిన్నాన్న శ్రీరంగారావు కరీంనగర్ ఎంపీగా సేవలందించారు. నా భార్య తాత చొక్కారావు రాజకీయ దిగ్గజం. కరీంనగర్ చరిత్రలో వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి వంటి నేతనే ఓడించిన రాజకీయ దిగ్గజం ఆయన. నా జీన్స్లోనే రాజకీయ నేపథ్యం ఉంది. అదే నా రాజకీయ ప్రవేశానికి ప్రధాన కారణమై ఉంటుంది. గతంలో టికెట్ ఆఫర్ వచ్చినా... పోటీ చేయలేదు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, ప్రజారాజ్యం తరఫున జగిత్యాల నుం చి పోటీచేసే అవకాశం వచ్చింది. ప్రత్యేక కారణమేమీ లేకపోయినా... ఎందుకో పోటీ చేయలేదు. తెలంగాణ వచ్చాక ముఖ్య మంత్రి కేసీఆర్, ఎంపీ కవిత సహకారంతో టీఆర్ఎస్లో చేరాను. తొలిసారి 2014లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాను. రెండోసారి మొన్నటి ఎన్నికల్లో ప్రజా ఆశీస్సులు, కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో ఏకంగా 60వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. డాక్టర్గా, ఎమ్మెల్యేగా ప్రజాసేవలో సంతృప్తి పొందుతున్నా! డాక్టర్గా ఉన్నప్పుడు వైద్య పరంగా ప్రజలకు సేవ చేసేవాడిని. ఫ్రీ క్యాంపులు ఏర్పాటు చేసి, ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసేవాడిని. ఎందరికో కంటి వెలుగునయ్యా. కానీ పూర్తిస్థాయిలో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పటికీ సంతృప్తిగా ఉంది. జగిత్యాల ఎమ్మెల్యేగా ఏం చేయాలనుకుంటున్నారు? జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి చెరువులో నీరు నింపే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నీరందేలా చూ స్తున్నాం. ముఖ్యంగా జగిత్యాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందింది. పట్టణ ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉం ది. ముఖ్యంగా యావర్రోడ్డును వెడల్పు చేసేలా చర్యలు తీసుకుంటా. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి నన్ను అత్యధిక మెజారిటితో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను. -
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నన్ను బహిష్కరించింది..
‘‘నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో నేనేప్పుడూ రాజీ పడలేదు.. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా పోరాడి ఎదుర్కొన్న తప్పా.. ఏనాడు తలవంచి లొంగిన సందర్భం లేదు.. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నన్ను బహిష్కరించింది.. మావోయిస్టులు బుల్లెట్ దాడి చేశారు.. కాంగ్రెస్లో ఉన్నప్పుడు నన్ను అణగదొక్కాలని చూశారు. సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇచ్చి.. నన్ను మాత్రం మరో చోట పోటీ చేయమన్నరు.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలదొక్కుకున్న.. ఏదైనా పని చేయాలని సంకల్పిస్తే పట్టు వదలకుండా చేసి చూపించాలనే మన స్తత్వం నాది.. రాజకీయాల్లో మూడు తరాలను చూసిన.. అన్ని తరాల్లోనూ కలిసిపోయిన.. నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు.. కానీ ఇంకా యూత్లాగే నా ఆలోచన ఉంటుందం’టున్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. అభిమానులు, అనుచరులు గోవన్నగా పిలుచుకునే బాజిరెడ్డితో ‘సాక్షి’ప్రతినిధి పర్సనల్ టైం.. అనాది బాల్య వివాహం. 7వ తరగతిలో ఉన్నప్పుడే లగ్గమైంది. వినోద, శోభ మేనమామ కూతుర్లే. విదేశీ పర్యటనలంటే ఎంతో ఇష్టం.ఇప్పటి వరకు సుమారు 25 పైగా దేశాలు తిరిగిన. ఆయా దేశాల్లో పల్లెలు ఎలా ఉన్నాయనేది ఎక్కువగా గమనిస్తుంటా. మా కుటుంబానికి మాలీ పటేల్, పోలీస్ పటేల్ వతందార్లు ఉండేవి. నేను రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ పటేల్గా పనిచేసిన. అప్పట్లో నాకు వేటాడటం అంటే సరదా ఉండేది. జీపు, బుల్లెట్ వంటి వాహనాలు నడపడం ఎంతో ఇష్టం. మీ బాల్యం.. విద్యాభ్యాసం ఎలా ఎక్కడ జరిగింది..? ‘‘మా ఊరు చీమన్పల్లి. నేను మా అమ్మమ్మ ఊరు దేశాయిపేట్ (జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం)లో పుట్టి న. రాయల షావుకారు అనే పెద్దాయన నాకు అక్కడే శ్రీకారం పెట్టా రు. 1, 2 తరగతులు చీమన్పల్లిలో, మూడో తరగతి సిరికొండలో, 4, 5 తరగతులు న్యావనందిలో, 6,7 పల్లికొండలో చదువుకున్న. 8, 9, 10 తరగతుల కోసం ధర్పల్లి వచ్చిన. ఇంటర్ కోసం నిజామా బాద్కు రావాల్సి వచ్చింది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన..’’ మీది రాజకీయ కుటుంబమా? ∙అప్పట్లో మా కుటుంబానికి మాలీ పటేల్, పోలీస్ పటేల్ వతందార్లు ఉండేవి. మా తాత బాజిరెడ్డి సాయన్న మా ప్రాంతానికి తహసీల్దార్గా ఉండేవారు. మా చిన్నాన్న కూడా తహసీల్దార్గా పనిచేశారు. మా నాన్న బాజిరెడ్డి దిగంబర్ పటేల్ చదువు కున్న వ్యక్తి. నేను రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ పటేల్గా పనిచేసిన. 1973లో మా గ్రామంలో పోలీస్పటేల్ పోస్టు ఖాళీ అయింది. అప్పట్లో మా ఊరికి వెళ్లి సుమారు ఏడేండ్లు పోలీస్ పటేల్గా ఉన్న. 1981లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన. ఐదేళ్ల పాటు 1986 వరకు సర్పంచ్గా పనిచేసిన. రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది..? ‘‘చీమన్పల్లికి 15 ఏండ్లు ఒకే వ్యక్తి సర్పంచ్గా ఉండేవారు. గ్రామంలో మౌలిక వసతులు కూడా ఉండేవి కావు. గ్రామంలోని యువత అంతా నువ్వు సర్పంచ్గా చేయాలన్నారు.. అనుబంధ గ్రామాల ప్రజలు కూడా మద్దతిచ్చారు.. వారి ప్రోత్సాహంతో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికైన. గ్రామంలో రోడ్లు, పోస్టాపీసు, పశువైద్యశాల ఏర్పాటు చేసిన. సిరికొండ పీఏసీఎస్ చైర్మన్గా పనిచేసిన, ఎంపీపీగా కూడా పనిచేసిన. ఆర్మూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భంగా సిట్టింగ్ టికెట్ ఇవ్వకుండా బాన్సువాడ పంపారు. అక్కడ కూడా విజయం సాధించిన. తర్వాత రూరల్ ప్రజలు రెండు పర్యాయాలు ఆశీర్వదించారు. మీ ఇష్టాలేమున్నాయి.. అప్పట్లో నాకు వేటాడటం అంటే సరదా ఉండేది. మాది దట్టమైన అటవీ ప్రాంతం. అప్పుడప్పుడు అడవిలోకి వెళ్లేవాడిని. జీపు, బుల్లెట్ వంటి వాహనాలు నడపడం ఎంతో ఇష్టం. కొత్తగా ఏ స్పోర్ట్స్ వెహికిల్ వచ్చినా కొనాలనిపించేది. నడపాలనిపించేది. విదేశీ పర్యటనలంటే ఎంతో ఇష్టం. ఇప్పటి వరకు సుమారు 25 పైగా దేశాలు తిరిగిన. అక్కడికి వెళ్లినప్పుడు ఆయా దేశాల్లో పల్లెలు ఎలా ఉన్నాయనేది ఎక్కువగా గమనిస్తుంటా. అక్కడి పాలన ఎలా ఉంటుందనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా. విదేశాల్లో నాకు చాలా మంది మంచి మిత్రులున్నరు. వైఎస్ఆర్తో మీకున్న అనుబంధం.. సంక్షేమ పథకాల అమలులో ఒక్కో నేతది ఒక్కో శైలి ఉంటుంది. వైఎస్ రాజశేఖర్రెడ్డితో చాలా ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన నిరుపేదల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్లా పథకాలు అమలు చేశారు. ఎన్టీఆర్ ప్లస్ వైఎస్ఆర్ కలిస్తే వైఎస్ఆర్ అనుకునే వాడిని. ఇప్పుడు కేసీఆర్ కూడా ఎన్టీఆర్ ప్లస్ వైఎస్ఆర్ ప్లస్ కేసీఆర్ అనిపిస్తోంది. ఈ విషయంలో ముగ్గురూ ముగ్గురే. నా రాజకీయ గురువు శనిగరం సంతోష్రెడ్డి. ఎల్లప్పుడూ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండాలనిపిస్తుంది. అందుకే ఎప్పుడు నేను ప్రజల మధ్యలోనే ఉండేందుకు ప్రయత్నిస్తుంటాను. మీ వివాహం, కుటుంబం వివరాలు.. నాది బాల్య వివాహం. 7 తరగతిలో ఉన్నప్పుడే లగ్గమైంది. వినోద, శోభ మేనమామ కూతుర్లే. ఇద్దరు కుమారులు.. జగన్ (దిలీప్), అజయ్, కూతురు ధరణి. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబసభ్యులతో గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తుంటాను. అందరం కలిసి విహార యాత్రలకు కూడావెళతాం. మనవల్లతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంటా. మీ అబ్బాయి జగన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు.. అవును. పార్టీ అనుమతి తీసుకుని జగన్ ధర్పల్లి జెడ్పీటీసీగా పోటీ చేశారు. గెలుస్తున్నాం కూడా. రాజకీయ వారసత్వం జగనే. మా అబ్బాయి రాజకీయ భవిష్యత్తు కేసీఆర్, కేటీఆర్, కవిత చేతుల్లో పెట్టాను. ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది. డీఎస్, పోచారం వంటి అగ్రనేతలపై విజయం సాధించారు., నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి వరించలేదనే అసంతృతితో ఉన్నారనే వాదన వినిపిస్తోంది. అవును. ఈసారి మంత్రి పదవి వస్తుందనుకున్న.. సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేసిన. పరిస్థితులను బట్టి ఆయన నిర్ణయం తీసుకున్నరు.. ఎప్పుడైనా నాకు న్యాయం చేస్తరని గట్టి నమ్మకంతో ఉన్నా. మూడు తరాలు చూశానంటున్నారు.. అప్పటి రాజకీయాలకు, ఇప్పటికీ తేడా ఎలా ఉంది? అప్పటి రాజకీయాలకు, ఇప్పటికీ బాగా మార్పులొచ్చాయి. ప్రస్తుత రాజకీయాలు కమర్షియల్ అ య్యాయి. నాయకులు ఆ ధోరణితో పనిచేయడంతో ప్రజలు కూడా అట్లాగే అవుతున్నారనిపిస్తోంది. క మర్షియల్గా ఉండే నాయకులు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండరు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. టెన్షన్ పెట్టుకుంటే మాత్రం పని చేయలేం.. -
చంద్రబాబు పచ్చి మోసకారి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
రెంటచింతల (మాచర్ల): ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి మోసకారి అని, ఆయన వాగ్దానాలను మళ్ళీ నమ్మి మోసపోవద్దని నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని సత్రశాల వద్దనున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి దేవస్ధానంలోని స్వామివారికి ఆయన సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ..నాలుగున్నరేళ్లు ప్రధాని మోదీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగి, తన స్వప్రయోజనాల కోసం బీజేపీతో అంటకాగి చంద్రబాబు ఏపీకి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబును ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్తో కలిపి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో మంచి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. -
బాటలు బాగా లేవు..
వరంగల్ అర్బన్ : వరంగల్లో ప్రజలు నడిచే బాటలు ఏ ఒక్కటి కూడా బాగా లేదు.. ప్రజలకు అత్యంత ప్రధానమైన సదుపాయాలపై దృష్టి సారించండి.. ప్రణాళికలు రూపొందించి అభివృద్ది చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.. అని వరంగల్తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్లో బుధవారం సమసన్వయ సమావేశం నిర్వహించారు. ఇన్చార్జి మేయర్ ఖాజాసిరాజుద్దీన్, కమిషనర్ రవికిరణ్, కార్పొరేటర్లతోపాటు వరంగల్ మహానగర పాలక సంస్థ, ‘కుడా’ రైల్వే, ఆర్అండ్బీ, ఎన్పీడీసీఎల్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక నిధులు, స్మార్ట్సిటీ, హృదయ్, అమృత్, జనరల్ ఫండ్, సీడీఎఫ్ నిధులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, బస్ షెల్టర్లు, ఇంటింటా తాగునీటి నల్లాలు, సరఫరా, అండర్ బ్రిడ్జి విస్తరణ పనులు తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించి సూచనలు చేశారు. కాలనీల్లో అండర్ డ్రైయినేజీ లేకుండానే మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల(ఎస్టీపీ)ను ఎవరు అడుగుతున్నారని అధికారులను ప్రశ్నించారు. అండర్ బ్రిడ్జి మూడో దారికి డీపీఆర్ రూపొందించాలి.. వరంగల్ అండర్ బ్రిడ్జి మూడో దారికి డీపీఆర్ రూపొందించి.. అందజేయాలని రైల్వే ఇంజినీర్లకు ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుతం ఉన్న రహదారికి తోడుగా మరో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. హెడ్ పోస్టాఫీస్ నుంచి ఖమ్మం రోడ్డు మీదుగా వంద ఫీట్ల రహదారి విస్తరిస్తున్నందున మూడో దారి ప్రతిపాదనలు అందజేయాలన్నారు. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రహదారుల విస్తరణ, అభివృద్ధిపై దృష్టి పెట్టండి.. స్మార్ట్సిటీ, సీఎం ప్రత్యేక నిధులతో రూపొందించిన ప్రణాళికలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రూ.257 కోట్లతో 13 రహదారుల ప్రతిపాదనలు, టెండర్ల ప్రక్రియపై ప్రశ్నించారు. ప్రతిపాదనల్లో కొన్ని రహదారులను స్మార్ట్సిటీ బోర్డు రద్దు చేసి రూ.130కోట్టతో రెడ్డిపురం, బంధం చెరువు, రంగ సముద్రంలో ఎస్టీపీ ప్లాంట్కు ప్రవేశపెట్టి ఆమోదించినట్లు లీ అసోసియేట్స్ ప్రతినిధి తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఎంజీఎం నుంచి పోచమ్మమైదాన్, వెంకట్రామ జంక్షన్, లేబర్ కాలనీ, కాశిబుగ్గ నుంచి ఏనుమాముల మార్కెట్, వెంకట్రామ జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్ స్టేషన్ మీదుగా హెడ్ పోస్టాఫీస్ వరకు రహదారులను అభివృద్ధి పర్చాలన్నారు. హెడ్ఫోస్టాఫీ నుంచి ఖమ్మం రోడ్డు మీదుగా నాయుడుపెట్రోల్ పంపు వరకు రహదారి ఆక్రమణలను తొలగించి వంద ఫీట్ల రోడ్డుగా అభివృద్ధి చేయాలన్నారు. హెడ్ఫోస్టాఫీస్ నుంచి వరంగల్ చౌరస్తా, ఒకవైపు హంటర్ రోడ్డు, మరో వైపు పోచమ్మమైదాన్, ఎంజీఎం రోడ్డు నుంచి ఇందిరా గాంధీ బొమ్మ, కొత్తవాడ వంద ïఫీట్ల రోడ్డు, రైల్వే గేట్ ఫ్లై ఓవర్ నుంచి రంగశాయిపేట, దసరా రోడ్లు, శివనగర్ ప్రశాంతి ఆస్పత్రి రోడ్ల అభివృద్ది పనులపై ఆరా తీశారు. కొన్ని రహదారులకు రెండో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఇంజినీర్లు తెలపగా.. తొలి దఫాలో ఈ రహదారులను అభివృద్ధి చేయాలని నన్నపునేని ఆదేశించారు. ఎస్ఎన్ఎం క్లబ్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.. వరంగల్ ఎస్ఎన్ఎం క్లబ్లో వెయ్యి గజాల్లో తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్అండ్బీ అధికారులకు నరేందర్ సూచించారు. ఈ అంశం న్యాయ వివాదంలో ఉందని టౌన్ప్లానింగ్ అధికారులు వివరించారు. ఎస్ఎన్ఎం క్లబ్ స్థలంపై కోర్టుకు వెళ్లిన వారితో చర్చించామని.. వారు కేసు విత్ డ్రా చేసుకునేందుకు అంగీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 600 గజల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించాల్సి ఉంటుందని ఇంజినీర్లు వివరించారు. ఏప్రిల్ నాటికి ఇంటింటికీ తాగునీరు.. అమృత్ పనుల్లో నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. 33 వాటర్ ట్యాంక్లకు గాను 30 ట్యాంక్లు నిర్మాణంలో ఉన్నాయని, మూడు స్థల వివాదాల్లో ఉండడం వల్ల పనులు ప్రారంభం కాలేదని పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు తెలిపారు. బల్దియా, రెవెన్యూ, ‘కుడా’ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. 2.10 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రస్తుతం 1.10 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఉన్న ఇళ్లకు ఇంటి నంబర్లు ఇచ్చి నల్లా కనెక్షన్ల ద్వారా ఏప్రిల్ నుంచి ఇంటింటా తాగునీరు అందించాలని నరేందర్ అదేశించారు. అదేవిధంగా వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ను మోడల్గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. నగరంలో 163 ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణాలపై దృష్టిసారించాలన్నారు. కోమటిపల్లి, ఉర్సు రంగ సముద్రం, చిన్నవడ్డేపల్లి చెరువు అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. వరంగల్ టెక్స్టైల్ పార్కులో ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. ఇంజినీర్ల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి.. బల్దియా ఇంజినీర్లు, ఇతర శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతోందని ఎస్ఈ బిక్షపతిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఇంజినీర్లు సహకరించకపోవడం వల్ల రహదారుల అభివృద్ధి పనులు జరగడం లేదని ఆర్అండ్బీ అధికారులు వ్యక్తం చేయడం ఇంజినీర్ల పనితీరుకు నిదర్శనమన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ నాగేశ్వర్, ‘కుడా’ పీఓ అజిత్రెడ్డి, సీపీ నర్సింహాచారి, సెక్రటరీ విజయలక్ష్మి, ఎంహెచ్ఓ రాజారెడ్డి, తూర్పు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు గుండా ప్రకాశ్ రావు, బయ్యస్వామి, కుందారపు రాజేందర్, ఝెలగం లీలావతి, రిజ్వీనా షమీమ్, శారద జోషి, అశ్రిత రెడ్డి, వేణుగోపాల్, కేడల పద్మ, మురహరి భాగ్యలక్ష్మి, కావటి కవిత, మేడిది రజిత, సులోచన ఆర్అండ్బీ, రైల్వే, ‘కుడా’ అధికారులు పాల్గొన్నారు. -
వైరా ఎమ్మెల్యేకు చేదు అనుభవం
-
టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలకు ప్రచారంలో నిరసన సెగ
-
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మదనాపురం (కొత్తకోట): రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ పంట అవసరాల కోసం ఎమ్మెల్యే బుధవారం నీరు విడుదల చేశారు. అంతకు ముందు కృష్ణాజలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు చేయూతనిస్తూ వారిని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యాన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్స్టేషన్లో ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే మార్కెట్ యార్డు స్థలంలో నిర్మిస్తున్న 160 ఇళ్ల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు రెండు నెలల్లోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం మండలంలోని కొన్నూరు, నర్సింగపురం, గోపన్పేట గ్రామాలకు చెందిన 14 మంది ఎస్టీ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మౌనిక, సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీటీసీ సభ్యులు వెంకటనారాయణ, జయంతి, రైతు సమన్వ సమితి అధ్యక్షుడు హనుమాన్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, నాయకులు రవీందర్రెడ్డి, గోపాలకృష్ణ, రాములు, బాలకృష్ణ, సాయిలుయాదవ్, చాంద్పాషా, ప్రవీణ్కుమార్రెడ్డి, మహదేవన్గౌడ్, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం
తాంసి: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే బాపూరావు అన్నారు. కప్పర్లలో మంగళవారం రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి కప్పర్లను సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాపూరావును, లోక భూమారెడ్డిని గ్రామస్తులు సన్మానించారు. గ్రామ సమస్యలు వారి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మె ల్యే కప్పర్ల నుంచి నిపాని వరకు రోడ్డుకు రూ.6 లక్షలు , రైతు వేదిక భవనం కోసం రూ.12 లక్షలు, రెండు ఆలయాలకోసం దేవదాయశాఖ తరఫున రూ.80 లక్షలు కేటాయిస్తామని గ్రామస్తులకు తెలిపారు. లోక భూమారెడ్డి మాట్లాడుతూ త్వరలో రైతులకు 50 శాతం సబ్సిడీతో రైతుకు గేదెలు పంపిణీ చేస్తామని, సొసైటీలు ఏర్పాటు చేసుకొని రుణాలు పొందాలని సూచించారు. సహకార సంఘం చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ సదానంద్, వీడీసీ అధ్యక్షుడు శేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణ, నాయకులు శ్రీధర్ రెడ్డి,నారాయణ,మహేందర్ ఉన్నారు. -
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తొక్కుతా : ఎమ్మెల్యే
సాక్షి, పెద్దపల్లి : ‘పార్టీలో ఉంటూ ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తొక్కుతా’ అని అధిష్టానానికి చెప్పినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ పటిష్టత కోసం అనేక కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రామగుండం మేయర్పై అవిశ్వాసం ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో ఇష్టం లేనివారు ఏ పార్టీలోకైనా వెళ్లొచ్చని.. ఇక నుంచి ఎవరైనా జోక్యం చేసుకున్నా.. తప్పులు చేసినా ఊరుకోనన్నారు. అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల నుంచి వైదొగులుతానని తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఇబ్బంది కల్గించిందని, ఇది రాజకీయాల్లో కూడా సంచలనం కలిగిందని సోమారపు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో పార్టీలో క్రమశిక్షణ లేదని అధిష్టానానికి వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రులతో పాటు పక్కనున్న ఎమ్మెల్యేలు సైతం జోక్యం చేసుకుంటారని, ఇది తగదని చెప్పినట్లు వెల్లడించారు. -
ఎంపీ, ఎమ్మెల్యేను బహిష్కరించాలి
బెల్లంపల్లి: నీతిమాలిన పనికి పాల్పడిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులను బెదిరించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరువురు ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి హేయంగా ఉందన్నారు. ఇద్దరి నిర్వాకం వల్ల జిల్లా పరువు, ప్రతిష్ట రాష్ట్రంలో దిగజారిపోయిందని విమర్శించారు. మున్సిపల్ కౌన్సిలర్ కొప్పుల సత్యవతి కూతురితో ఎమ్మెల్యే చిన్నయ్య ఫోన్లో బెదిరింపులకు పాల్పడడం, అసమ్మతి కౌన్సిలర్లను ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించడం దారుణమన్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి పూర్తిగా ఆక్షేపనీయమన్నారు.ఎమ్మెల్యే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంపీ బాల్క సుమన్ ఇద్దరు మహిళలతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేయడం సరైంది కాదన్నారు. బాధిత మహిళలపై జనవరిలో ఎంపీని బ్లాక్ మెయిల్ చేసినట్లు కేసు పెట్టామని మంచిర్యాల పోలీసులు ప్రకటించడం ఎంపీకి కొమ్ముకాయడమే అవుతుందన్నారు. అప్పట్లో సదరు మహిళలపై కేసులు పెట్టినట్లు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై జ్యూడీషియల్ విచారణ జరిపించాలన్నారు. కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు సైతం ఓ ఎన్ఎస్యూఐ నాయకుడిని పరుష పదజాలంతో దూషించడం, బెదిరించడం సరైంది కాదన్నారు. ప్రేమ్సాగర్ రావుపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు డి.ప్రకాష్, కుసుమ భాస్కర్, కె.గోవర్ధన్, గట్టురాజం, అరుణ్కుమార్, సత్యనారాయణ రెడ్డి, రాజేశం తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రభుత్వ విప్కు తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు, మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా నాగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సునీతా మహేందర్ రెడ్డి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఘటన అనంతరం తేరుకున్న సునీత మాట్లాడుతూ...తాను క్షేమంగానే ఉన్నానని, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దయతో ప్రమాదం నుంచి బయపడినట్లు ఆమె తెలిపారు. -
వివాదంలో టీఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే
-
రైతుల అభివృద్ధే కేసీఆర్ ధ్యేయం
చండూరు : రైతుల అబివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నాంపల్లి, చండూరు, మర్రిగూడెం మండలాలకు చెందిన 50 మందికి సబ్సీడీ ట్రాక్టర్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటామనే మాట నేటికీ తప్పలేదన్నారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సబ్సీడీపై ట్రాక్టర్లను అందిస్తున్నామన్నారు. రైతులు సబ్సీడీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు దళారి వ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి రైతు పండించిన ధాన్యానికి ధర వారే నిర్ణయించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అధికారులను సమాయత్తం చేస్తున్నామన్నారు. అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయన్నారు. రానున్న కాలంలో మునుగోడును మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తోకల వెంకన్న, ఎంపీడీఓ శైలజ, తహసీల్దార్ మహేందర్ రెడ్డి, ఏడీఏ నాగమణి, ఏఓలు మల్లేశం, రెతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బొమ్మరబోయిన వెంకన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకన్న, కోడి వెంకన్న పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
-
బంగారు తెలంగాణ టీఆర్ఎస్తోనే సాధ్యం
అర్వపల్లి (తుంగతుర్తి) : బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని కొత్తగూడెంలో వివిధ పార్టీల నాయకులు లింగంపల్లి రమణ, పెద్ది శంకర్, పాక గోవర్ధన్, పెద్ది నాగయ్య, రావుల రఘు, ఎల్. సుమన్, మేడి నరేష్, సత్యనారాయణ, ఎం. చంటి, కె. రాజు, ఎం. రాంమ్మూర్తి, ఎం. నర్సయ్య, నవీన్లతో పాటు కొంత మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకుని మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పంట పెట్టుబడి కింద సీజన్కు ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రభుత్వం సాయమందిస్తుందని చెప్పారు. ఈపథకాన్ని రైతులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని టీఆర్ఎస్కు తప్ప మరో పార్టీకి స్థానం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు దావుల వీరప్రసాద్, మొరిశెట్టి ఉపేందర్, మండల అధ్యక్షుడు కుంట్ల సురేందర్రెడ్డి, దేవస్థాన ఛైర్మన్ బొడ్డు రామలింగయ్య, కందుల తిరుమల్రావు, కళెట్లపల్లి శోభన్బాబు, సర్పంచ్లు మన్నె లక్ష్మినర్సయ్య, జీడి వీరస్వామి, వల్లపు గంగయ్య, పద్మ, ఎంపీటీసీ రేఖల రాణి, సోమిరెడ్డి, పొట్టెపాక సైదులు, రేఖల సైదులు, దండ వీరారెడ్డి, మేడిపల్లి వేణు, లింగంపల్లి రాములు, వి. సుధాకర్, చిర్రబోయిన వెంకన్న, రాంబాబు, వి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సౌకర్యం కోసమే క్యాంపు కార్యాలయం
బెల్లంపల్లి : అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సౌలభ్యం కోసమే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నివాస గృహాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న తెలిపారు. బుధవారం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏరియాలో రూ.కోటి అంచనాతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు, నివాస గృహానికి ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులు, టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల క్యాంపు, నివాస గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. దశలవారీగా వాటిని ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ కో ఆర్డినేటర్ అత్తి సరోజ, వ్యవసామ మార్కెట్ కమిటీటి చైర్మ సిలువేరి నర్సింగం, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, సబ్ కలెక్టర్ పీఎస్.రాహుల్రాజ్, మున్సిపల్ చైర్పర్సన్ పసుల సునీతారాణి, టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి అరిగెల నాగేశ్వర్రావు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా కేసీఆర్
అమ్రాబాద్ : సీఎం కేసీఆర్ ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుగా, మేనమామగా కుటుంబ బాధ్యత మోస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్ అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 18మంది మహిళలకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, రైతు పెట్టుబడి తదితర పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, ఎమ్మార్ఐ కృష్ణాజీ, జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
భోజ్యానాయక్ త్యాగం మరువలేనిది
రఘునాథపల్లి: తెలంగాణా అమరవీరుడు లునావత్ భోజ్యానాయక్ త్యాగం మరువలేనిదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం మండలంలోని అశ్వరావుపల్లి శివారు వీరారెడ్డి తండాలో భోజ్యానాయక్ ఆరో వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై భోజ్యానాయక్ సమాది వద్ద పార్టీ నాయకులతో కలిసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నామాల బుచ్చయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. గండ్ర తీరుతోనే భోజ్యా నాయక్ ఆత్మహత్య.. హన్మకొండ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని రహదారిపై ఒంటిపై పెట్రోల్ పోసుకొని భోజ్యానాయక్ నిప్పంటించుకున్నాడని ఎమ్మెల్యే గుర్తు చేశారు. 92 శాతం గాయాలతో ఎంజీఎం అస్పత్రిలో చికిత్స పొందుతున్న భోజ్యానాయక్ను తాను కలిసినప్పుడు ‘రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిస్తే తెలంగాణ వస్తదా ..? రాదే రాదు’ అని గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అమరవీరుని తల్లిదండ్రులు మంక్తి, నామాల కడుపు కోత తీర్చలేనిదన్నారు. భోజ్యానాయక్ నగర్ పేరిట వీరారెడ్డి తండాలో డబుల్బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తానని ఈ సందర్భంగా హామి ఇచ్చారు. వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ కోసం అమరుడైన భోజ్యానాయక్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించాలని ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గాంధీనాయక్ కోరారు. అమరుడు భోజ్యానాయక్ తల్లిదండ్రులు మంక్తి, నామాలకు గాంధీనాయక్ పాదాభివందనం చేశారు. వర్ధంతి సభలో ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ బానోతు శారద, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోకల శివకుమార్, ఎంపీటీసీ దొనికల రమాదేవి, సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు గుడి వంశీధర్రెడ్డి, మారుజోడు రాంబాబు, చెంచు రమేష్, గొరిగ రవి, మడ్లపల్లి సునిత, మాలోతు నర్సింహ్మా, కుర్ర కమలాకర్, నీల ఆగయ్య, రాజేందర్నాయక్, అంజనేయులు, వెంకటేష్యాదవ్, గైని రాంచందర్ పాల్గొన్నారు. -
కోమటిరెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నా.. రాజీనామాకు సై!
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విసిరిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్టు టీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు. 'కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ రాజీనామా చేయాలి. నేను కూడా రాజీనామా చేస్తాను. నకిరేకల్లో నేను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా?' అని ప్రశ్నించారు. ఈసారి నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. నకిరేకల్కు కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తున్నారంటేనే ఎమ్మెల్యే వేముల వీరేశానికి గుబులు పుడుతుందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం దిగివచ్చినా ఇక్కడ కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ మూడవ కన్ను తెరిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఏ జిల్లాకు వెళ్లినా తమకు టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. -
ఇంటికి పిలిచి..చెంపచెళ్లు..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: క్రషర్ యజమానులు, కాంట్రాక్టర్ల సమస్య పరిష్కారం అంశం ఎమ్మెల్యే ఒకరిపై దాడి చేసే వరకు వెళ్లింది. పలువురు కాంట్రాక్టర్ల ఎదుటే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. ఓ గుత్తేదారుపై చేయిచేసుకున్నాడు. మాట్లాడుతున్న క్రమంలో జరిగిన దాడితో సదరు కాంట్రాక్టర్ నిర్ఘాంతపోయాడు. అయితే బాధిత కాంట్రాక్టర్ కుటుంబానికి రాజకీయాలతో సంబంధాలు ఉండడం వల్ల ఇరువర్గాల మధ్య వివాదం పెద్దదిగా మారింది. చివరికి ఇంటెలిజినెన్స్ వర్గాలు సమాచారం సేకరించి నివేదిక సైతం తయారు చేశాయి. స్టోన్ క్రషర్ల విషయంలో వివాదం.. స్టోన్ క్రషర్ల విషయంలో తలెత్తిన వివాదం కాంట్రాక్టర్పై దాడికి కారణమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న స్టోన్క్రషర్లు, హాట్మిక్స్, రెడిమిక్స్ ప్లాంట్ల నిర్వహణతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందంటూ కొంద రు ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే సమయంలో క్రషర్ల నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న స్టోన్క్రషర్ కార్యకలా పాలు నిలిపేయాలంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాలుష్య నియం త్రణ, ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేసే వరకూ ఇదే పరిస్థితి కొనసాగించాలంటూ తీర్పు వెలువరించడంతో స్టోన్క్రషర్లు మూతపడ్డాయి. దాదాపు నెలరోజులుగా ఈ పరిస్థితి కొసాగుతుండగా.. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన క్రషర్ నడుస్తుండడంతో ఇతర యజమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు యజమానులు ఫోన్లో మాట్లాడుకున్న సందర్భంలో ఎమ్మెల్యేకు చెందిన క్రషర్ విషయం ప్రస్తావనకు వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ క్రషర్ యజమాని, మరో క్రషర్ యజమాని (ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు)తో ఫోన్లో ఆవేదన వ్యక్తం చేస్తూ అధికార ఎమ్మెల్యే క్రషర్ విషయాన్ని ప్రస్తావించారు. ‘ఎమ్మెల్యేకు సంబంధించిన క్రషర్ ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుంటే మనకు ఈ ఇబ్బందు లేంటి. మనల్ని వాడు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఆయన పని చల్లగా చేసుకుంటున్నాడు. ఇదేం పద్ధతి. మనం మాత్రం ఏ పాపం చేశాం’ అంటూ ఓ క్రషర్ యాజమాని వ్యాఖ్యానించాడు. ఫోన్లో జరిగిన ఈ సంభాషణను మాజీ ఎమ్మెల్యే సోదరుడు ప్రస్తుత ఎమ్మెల్యే దృష్టి కి తీసుకువెళ్లి అందరం ఇబ్బందిపడుతున్నామని వివరిస్తూనే ఫోన్ సంభాషణను వినిపించాడు. దీంతో ఎమ్మెల్యేకు కోపమొచ్చి ఆయన్ను తీసుకురా అని చెప్పాడు. మెరుపుదాడి.. ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేసిన సదరు కాంట్రాక్టర్కు రాజకీయ నేపథ్యం ఉంది. అతడి కుటుంబ సభ్యులు గత ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించారు. దీంతో ఇరువురి మధ్య కాంప్రమైజ్ కోసం ఎమ్మెల్యే ఇంట్లో ఇటీవల సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు యజ మానులు, కాంట్రాక్టర్లతో కలిసి మాజీ ఎమ్మెల్యే సోదరుడు, ఫోన్లో మాట్లాడిన క్రషర్ యజమానిని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. తనపైనే వాఖ్యలు చేస్తావా, వాడు.. వీడు అంటావా అని క్రషర్ యజమానిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఒక్క ఉదుటన లేచి కాంట్రాక్టర్పై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆర్థిక, అంగబలం పుష్కలంగా ఉన్న తనపై ఎమ్మెల్యే దాడి చేయడాన్ని ఆ నాయకుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. సమస్య పరిష్కరించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తే కొత్త సమస్య ఎదురుకావడంతో క్రషర్ యజమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయం చినికిచినికి గాలివానలా మారడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేతో దాడికి గురైన వ్యక్తికి ప్రస్తుత ప్రభుత్వంలోని ముఖ్యలతోనూ దగ్గరి పరిచయాలు ఉండడంతో విషయం హైదరాబాద్కు వరకు చేరింది. అసలు ఏం జరిగిందో తెలియజేయాలంటూ అక్కడి నుంచి ఇంటలిజెన్స్ వర్గాలకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. చివరికి ఈ అంశానికి ముగింపు ఎలా ఉంటుందనేది రాజకీయ, కాంట్రాక్టర్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
ఎమ్మెల్యే చెన్నమనేనికి ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్కు తాత్కాలిక ఊరట లభించింది. భారత పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం పిటిషన్పై విచారణ చేపట్టిన ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. ఆయన పౌరసత్వ రద్దుపై ఆరువారాల్లో తేల్చాలని కేంద్రానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తిరిగి సమీక్షించాలని కోరే అవకాశం ఒక్కటే ఆయనకుండగా, హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. తన పౌరుసత్వ రద్దు నిర్ణయాన్ని కొట్టివేయాలంటూ రిట్లో రమేశ్ కోరారు. పౌరసత్వం రద్దు నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లో ఉంటుందంటూ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి తీసుకున్న చెల్లదని చెన్నమనేని పిటిషన్లో పేర్కొన్నారు. ‘భారతీయ పౌరసత్వ చట్టం సెక్షన్ 10(3) ప్రకారం ఒక వ్యక్తి కారణంగా దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా, ప్రజలకు హాని కలిగించేలా ఉంటే మినహా, ఆ వ్యక్తి పౌరసత్వాన్ని రద్దు చేయడానికి వీల్లేదు. ఈ విషయంలో నా అభ్యర్థనను పరిశీలించాలని కేంద్ర హోంశాఖకు ఉమ్మడి హైకోర్టు స్పష్టంచేసినప్పటికీ కనీసం పట్టించుకోలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆది శ్రీనివాస్ నాపై కేంద్రానికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం విన్నవించినప్పటికీ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఏకపక్షంగా నాపై నిర్ణయం తీసుకున్నారు’ అని రమేశ్ తన వాదనలను వినిపించారు. ఆయన పౌరసత్వం అస్సలు చెల్లదు -
ఆ ఎమ్మెల్యే పౌరసత్వంపై ఆరు వారాల్లో తేల్చండి
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం అంశాన్ని ఆరు వారాల్లో తేల్చాలని కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో రమేశ్ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. రమేశ్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ గతంలో శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రమేశ్ ఎన్నిక చెల్లదని, ఆయన భారత పౌరుడు కాదని 2013లో హైకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం కోర్టులో రమేశ్ అప్పీలు చేయగా దీనిపై స్టే విధించింది. స్టేను తొలగించాలని ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు గతేడాది ఆగస్టులో విచారించింది. 2008లో చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు. భారత పౌరసత్వం తిరిగి పొందగోరే వారు కనీసం ఏడాది కాలం దేశంలో ఉండాలి. అయితే చెన్నమనేని రమేశ్ ఏడాదిపాటు ఈ దేశంలో లేరని ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపి కేవలం 96 రోజులే దేశంలో ఉన్నట్టు తేల్చింది. ఈ నేపథ్యంలో సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర హోం శాఖ రమేశ్కు నోటీసులు జారీచేసింది. అయితే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు త్రిసభ్య కమిటీ వేసి విచారణ జరపాలని చట్టం చెబుతోందని, అందువల్ల త్రిసభ్య కమిటీ వేయాలని చెన్నమనేని రమేశ్ హోం శాఖకు జవాబు పంపారు. కేంద్ర హోం శాఖ 2012లో త్రిసభ్య కమిటీ వేసి విచారణ జరిపింది. కానీ నివేదిక ఇవ్వలేదు. ఆ నివేదిక హోం శాఖ వద్ద పెండింగ్లో ఉందని పిటిషనర్ ధర్మాసనానికి విన్నవించడంతో రమేశ్ పౌరసత్వ స్థితిపై మూడు నెలల్లో తేల్చాలని, సంబంధిత నివేదికను హైకోర్టుకు సమర్పించాలని 2016 ఆగస్టు 11న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు వెలువడిన కొద్దికాలానికి కేంద్ర హోం శాఖ మరికొంత గడువు కావాలని కోరింది. ఆ గడువు కూడా పూర్తికావడంతో తాజాగా సోమవారం మరోసారి ఆది శ్రీనివాస్ సుప్రీం కోర్టును ఆశ్రయించి కోర్టు ఆదేశాలు అమలు కాలేదని విన్నవించడంతో.. ఆరు వారాల్లో కేంద్ర హోం శాఖ ఈ అంశాన్ని తేల్చాలని ధర్మాసనం ఆదేశించింది. -
ఆ ఎమ్మెల్యేను బెదిరించింది బంధువులే
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను రెండేళ్లుగా బెదిరింపులకు గురిచేసిన వారిని పోలీసులు పట్టుకున్నారు. నక్సలైట్ల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురిని టేకులపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఆయనకు రెండు సార్లు బెదిరింపు లేఖలు, రెండుసార్లు బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయి. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అప్పమత్తమైన పోలీసులు దర్యాప్తు చేప్టటారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యేను బెదిరించిన నిందితులు ఆయన బంధువులు కావడం విశేషం. నిందితులు పూనెం బాలకృష్ణ, పూనెం ప్రకాష్, ఇర్ప కిషోర్లు చాలా సార్లు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరిస్తుండేవారు. తండ్రీకొడుకులైన బాలకృష్ణ, ప్రకాష్లు మరో నలుగురితో కలిసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రూ. లక్ష ఇవ్వాలని ఎమ్మెల్యే కనకయ్యను డిమాండ్ చేస్తూ చంపుతామని హెచ్చరించారని వివరించారు. వీరిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. -
ఇల్లందు ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖలు
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మావోయిస్టుల పేరుతో బెదిరింపులు వస్తుండటం జిల్లాలలో కలకలంగా మారింది. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఆయనకు రెండు సార్లు బెదిరింపు లేఖలు, రెండుసార్లు బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ఎమ్మెల్యే కనకయ్యకు భద్రను పెంచారు. ఆయన నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమరాలు ఏర్పాటుచేయడంతో పాటు, రక్షణ కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కొరం కనకయ్య.. కొద్ది నెలలకే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా, బెదిరింపు వ్యవహారం మావోయిస్టుల పనేనా? లేక నకిలీలదా అనేది తెలియాల్సిఉంది. -
ఎమ్మెల్యేలకే ఆధిపత్యం!
పార్టీ బలోపేతానికి టీఆర్ఎస్ కొత్త వ్యూహం ⇒ కేడర్ పెంచుకునే పనిలో నాయకత్వం ⇒ వలస ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లో కొత్త చిక్కులు ⇒ తమ వారికే ప్రాధాన్యం ఇస్తున్నారంటున్న పాత కేడర్ ⇒ ఆసక్తికరంగా టీఆర్ఎస్ సంస్థాగత రాజకీయం సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో సంస్థాగతంగా ఇక ఎమ్మెల్యేలకే పెద్ద పీఠ వేయనున్నారు. కింది స్థాయి నుంచి పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినాయకత్వం కొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదు, కొత్త కమిటీల నియామకం నుంచే ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో పెత్తనం కట్టబెడుతున్నారు. జిల్లా స్థాయి కమిటీలు ఉండవని తేల్చిన పార్టీ నాయకత్వం, నియోజకవర్గ కమిటీలు ఎంత ముఖ్యమో ఇప్పటికే ఎమ్మెల్యేలకు వివరించింది. వివిధ పార్టీల నుంచి నాయకులు, శ్రేణులు టీఆర్ఎస్లోకి వచ్చి చేరినా వారింకా సరిగా కుదురుకోలేదు. మరో వైపు తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, టీడీపీలకున్న కార్యకర్తల బలాన్ని విస్మరించకూడదన్న చర్చ కూడా నాయకత్వం వద్ద జరిగినట్లు సమాచారం. దీంతో తమ పార్టీలో ఉన్న కేడర్ను పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు అంకితమయ్యేలా, తద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా ప్రణాళిక రచించారు. ఈ వ్యూహం వల్ల వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని, ఈ బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు పెట్టడం వల్లే సత్ఫలితాలు వస్తాయని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఈ పనులన్నీ సక్రమంగా, సజావుగా జరగాలంటే ఆయా కమిటీలను నియమించుకునే వెసులుబాటు, ప్రభుత్వ పదవులకు పేర్లను ప్రతిపాదించే అవకాశం ఎమ్మెల్యేలకే ఉండాలని భావించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పూర్తి ఆధికారం ఎమ్మెల్యే లకే అప్పజెప్పారు. మంత్రులు, ఎంపీలను సైతం ఏ నియోజకవర్గంలో వేలు పెట్టొద్దని అధినేత సూచించారని సమాచారం. కొత్త – పాతల కిరికిరీ.. టీఆర్ఎస్లోకి వచ్చిన చేరిన ఆయా పార్టీల నేతలకు, పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు ఇంకా పొసగడం లేదు. గులాబీ తీర్ధం పుచ్చుకున్న వారిలో స్థానిక ప్రజాప్రతినిధులే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ స్థాయిల నాయకులు ఉన్నారు. అధినేత ఎంత చెప్పినా పాత–కొత్త నేతలు అన్న రేఖ మాత్రం చెరపలేక పోయారు. దీని ప్రభావం ఆయా నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో మంత్రులకు, కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు సయోధ్య లేదు. వలస ఎమ్మెల్యేల్లో ఏ కొందరో మినహా అత్యధికులు ఎవరిదారి వారిదే అన్నట్టుగా ఉండిపోయారు. కాగా, ఈ కొత్త విధానం వల్ల వారు కొంత ఊపిరి పీల్చుకునే వెసులు బాటు దొరుకుతుందని, మంత్రుల పెత్తనం తగ్గిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నల్లగొండ జిల్లాలో ఈ గొడవలు స్పష్టంగా కనిపించాయి. మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్రావుకు అక్కడి పార్టీ శ్రేణులు సహకరించడంలేదు. దేవరకొండలోనూ స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని అంటున్నారు. జిల్లా మంత్రి (పాత నల్లగొండ) జగదీశ్రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి రెండు వేర్వేరు వర్గాలుగా ముద్ర పడ్డారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న జిల్లాల్లో ఎమ్మెల్యేలకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పడంతో గొడవలు తగ్గే వీలుందంటున్నారు. ప్రతికూల అంశాలూ ఉన్నాయి మరో వైపు ఎమ్మెల్యేలకే నియోజవకర్గ పార్టీ పూర్తి బాధ్యతలను అప్పజెప్పడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సభ్యత్వ నమోదులో, గ్రామ కమిటీల ఏర్పాటులో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి, మొదటి నుంచి పార్టీలో ఉంటున్న నేతల మధ్య గొడవలు ఉన్నాయంటున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ల వర్గాల మధ్య గొడవలున్నాయి. ఇక, ఆయా పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు తమ వెంట వచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చి పాత వారిని పట్టించుకోకుండా పోయే ముప్పు ఉందంటున్నారు. మరో పక్క టీఆర్ఎస్కే చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకుల మధ్య సయోధ్య లేని జిల్లాలు కూడా ఉన్నాయని, అలాంటి చోట్ల సమస్యలు తప్పక పోవచ్చని విశ్లేషిస్తున్నారు. -
ప్రజల ఆకాంక్ష మేరకే బడ్జెట్ కేటాయింపులు
-
సంక్రాంతి తర్వాత అడ్డుకుంటాం : శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే తాము ట్రావెల్స్ బస్సులను అడ్డుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై చర్యలు తీసుకోకపోతే సంక్రాంతి పండుగ తర్వాత రోడ్లపైకి వచ్చి ట్రావెల్స్ బస్సులను అడ్డుకుంటామని ఆయన అన్నారు. -
వికలాంగుల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి : వికలాంగుల సంక్షేమానికి తగిన సహకారం అందజేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో లయన్స్క్లబ్ ఆఫ్ బె ల్లంపల్లి(సింగరేణి) ఆధ్వర్యంలో 32 మంది వికలాంగులకు ట్రై సైకిళ్లు, వీల్చైర్ల పంపిణీ జరి గింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మా ట్లాడారు. ప్రభుత్వం ఇతర వర్గాల ప్రజలతో స మానంగా వికలాంగుల అభ్యున్నతికి పాటుపడుతోందన్నారు. వికలాంగులకు జీవన భృతి క ల్పించడం కోసం నెలకు రూ.1500 చొప్పున పి ంఛన్ను మంజూరు చేస్తోందన్నారు. విద్య, ఉద్యోగవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ఏక కాలంలో రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలను ప్రారంభించి సాహసోపే త నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ప్ర జలకు పరిపాలన సౌలభ్యం కల్పించడమే ల క్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు. ప్రజలకు సేవ చేయడంలో కలిగే తృప్తి మరెందులోనూ లేదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పసు ల సునీతారాణి మాట్లాడుతూ సింగరేణి లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ చైర్లను ఉచితంగా అందజేయడం అభినందనీయమన్నారు. వికలాంగుల తోడ్పాటుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. భవిష్యత్లోనూ మరిన్నీ కార్యక్రమాలు నిర్వహించాల ని సూచించారు. అనంతరం వికలాంగులకు ట్రై సైకిళ్లు, వీల్ చైర్లను ప్రదానం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ సు భాష్రావు, డీఎఫ్వో తిరుమల్రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు రాములు, బి.సుదర్శన్, ఎస్.కె.యూసుఫ్, రాజులాల్యాదవ్, టి.వంశీకృష్ణారె డ్డి, ఎలిగేటి శ్రీనివాస్, సి.హెచ్.మధు, కో ఆప్షన్ సభ్యుడు నిజాముద్దీన్, సింగరేణి లయన్స్క్లబ్ నిర్వాహకులు నల్మాసు సంతోష్, చక్రపాణి, స త్యనారాయణ, సర్పంచ్లు అర్కాల హేమలత, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఏర్పాటు చరిత్రాత్మకం
రెబ్బెన : అన్ని రంగాల్లో వెనకబడిన ఆసిఫాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేయటం చారిత్రాత్మకమని తెలంగాణ గౌడ సంఘం నియోజక వర్గ ఇన్చార్జి మోడెం సుదర్శన్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ను గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ సన్మానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ కుంమ్రం భీం జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ది చెందేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఇబ్బందులను గుర్తించి జిల్లాను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా ఏర్పాటులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కృషి మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో గౌడసంఘం మండల అధ్యక్షుడు అన్నపూర్ణ, సొసైటీ అధ్యక్షుడు తాళ్లపల్లి కిష్టాగౌడ్, నాయకులు చిరంజీవిగౌడ్, వెంకటేశ్వర్గౌడ్, రాజాగౌడ్, ఉమేష్గౌడ్, రాజాగౌడ్, మహేష్గౌడ్, శాంతికుమార్గౌడ్, సర్వేశ్వర్గౌడ్, శ్రీనివాస్గౌడ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ జిల్లాకు వాస్తుదోషం!
కరీంనగర్ కల్చరల్ : కరీంనగర్ జిల్లా విభజనతో వాస్తుముప్పు ఏర్పడిందని జ్యోతిష్య, వాస్తు ఆగమశాస్త్ర పండితులు నమిలకొండ రమణాచార్యస్వామి అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను ఆయన కార్యాలయంలో మంగళవారం కలుసుకున్నారు. గతంలో జిల్లా నూరుశాతం వాస్తు ప్రకారం ఉండడంతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమైందన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం ఇక్కడ ప్రారంభం కావడం వల్లే రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. విభజన తర్వాత జిల్లాకు నైరుతిలో మానేరుడ్యామ్, పడమరలో మధ్యమానేరు ఉంటాయని, ఇవి దోషకరమని, ఉత్తరం, ఈశాన్య ప్రాంతాలు తగ్గాయని, జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతాలతో తూర్పు, దక్షిణ, ఆగ్నేయాలు పెరిగాయని ఇవి శుభసూచకం కాదని, తద్వారా అరిష్టాలు కలిగే అవకాశముందని పేర్కొన్నారు. వాస్తుదోష నివారణకు ఈశాన్య ప్రాంతాలలో చెరువు, కుంటల అభివృద్ధి, నైరుతిలో 108 ఫీట్ల ఎత్తులో అష్టదిక్పాలక సహిత వాస్తు స్తూపం నిర్మించాలని సూచించారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రజాక్షేమమే తనకు కావాలని, జిల్లా అభివృద్ధికి వాస్తుశాస్త్ర పద్ధతులు పాటిస్తామని వెల్లడించారు. -
‘కాళ్లలో కట్టెలు పెట్టడమే వారి అజెండా’
హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతూ కాంగ్రెస్ నాయకులు సైంధవుల్లా తయారయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండి పడ్డారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రణాళికా బద్దంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెట్టడమే అజెండాగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. నాడు తెలంగాణ రాకుండా అడ్డంపడిన ఉత్తమ్, భట్టి వంటి కాంగ్రెస్ నేతలే ఇప్పుడు స్వరాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారని, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని వివాదం చేస్తున్నారని విమర్శించారు. డి.కె.అరుణ అడిగిన వెంటనే జిల్లా ఇవ్వడానికి అదేమీ గద్వాల సంస్థానం కాదని, జనం కోరితేనే కొత్త జిల్లాలు వస్తాయని, కాంగ్రెస్ నాయకుల ఆధిపత్యం కోసం కొత్త జిల్లాలు రావని బాలరాజు పేర్కొన్నారు. -
ఆయన ఎమ్మెల్యే... అనుమతులు లేకుండా...
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తీరుపై విమర్శలు కరీంనగర్ : ప్రజాప్రతినిధిగా ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ ఎమ్మెల్యే అందుకు భిన్నంగా నడుచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రజలకే తప్ప తనకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆదాయం కోసం ఏకంగా ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న ఆయన మున్సిపల్ నుంచి ఎటువంటి అనుమతు లు తీసుకోకుండానే దర్జాగా పనులు చేపడుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ ఎమ్మెల్యే కావడంతో వారు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుకు మెట్పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన అర ఎకరం పైగా స్థలం ఉంది. మొదటి నుంచి ఆ స్థలంలోనే ఆయన నివాస భవనం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితం అదే స్థలంలో మరో చోట విశాలమైన నూతన భవనాన్ని నిర్మించుకున్నారు. పాత నివాస భవనాన్ని కూల్చి దాని స్థానంలో ఇటీవలనే కుటుంబసభ్యుల పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్తోపాటు ఆదనంగా మరికొన్ని అంతస్తులతో సుమారు 300 గజాల స్థలంలో ఈ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే పనులను మొదలు పెట్టారు. మున్సిపాలిటీల చట్టం ప్రకారం... భవనం నిర్మించేవారు ఇంజనీరింగ్ ప్లాన్తో ముందుగా మున్సిపల్కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాత నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలి. అనుమతి పత్రాల్లేకుండా నిర్మాణం చేపట్టరాదు. కాని ఎమ్మెల్యే ఇదేమీ పట్టించుకోకుండా కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారు. అనుమతులు లేవు ఎమ్మెల్యే నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్కు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇటీవలనే తన భార్య పేరు మీద అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి సంబంధిత స్థలాన్ని పరిశీలిస్తున్నారు. రెండ్రోజుల్లో అనుమతి పత్రం మంజూరు చేస్తాం. - శైలజ, మున్సిపల్ కమిషనర్ గతంలోనూ అంతే.. ప్రస్తుతం నిర్మిస్తున్న కాంప్లెక్స్ విషయంలోనే కాదు... నాలుగేళ్ల క్రితం నిర్మించిన నివాస భవన విషయంలోనూ ఎమ్మెల్యే మున్సిపల్ నిబంధనలను బేఖాతరు చేశారు. ఆ సమయంలో భవనానికి మున్సిపల్ నుంచి జీ+2కు అనుమతి తీసుకున్న ఆయన ఆ తర్వాత మరో అంతస్తును నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. దానిని క్రమబద్దీకరించుకోవ డానికి ఇటీవలనే బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. చోద్యం చూస్తున్న అధికారులు.. జాతీయ రహదారి పక్కనే ఎమ్మెల్యే అనుమతి లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మున్సిపల్ కమిషనర్తోపాటు ఇతర మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగే సమావేశాలకు తరచూ హాజరవుతుంటారు. అక్కడే గతనెల రోజులుగా పనులు జరుగుతున్న విషయం కళ్లముందు కనిపిస్తున్నా స్పందించడం లేదు. ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి సామాన్య ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించే అధికారులు ఎమ్మెల్యే విషయంలో ఉదాసీనత కనబర్చడం ఎంతవరకు సమంజసమనే విమర్శలు ఎదురవుతున్నాయి. -
పీహెచ్సీలో తనిఖీలు నిర్వహించిన ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరుగుతున్న పలు అవకతవకలు వెలుగు చూశాయి. ఉదయం 11 గంటలు అవుతున్నా వైద్యులు ఎవరూ ఇంకా ఆసుపత్రిలో విధులకు హాజరు కాలేదు. పైగా కొందరు ఉద్యోగులు శనివారం విధులకు హాజరయినట్లు శుక్రవారమే అటెండెన్స్లో సంతకం చేసినట్లు సునీత గుర్తించారు. అలాగే ఆస్పత్రి ఆవరణలో ఖాళీ మద్యం బాటిళ్లను కూడా ఆమె గుర్తించారు. దీనిపై ఆమె సిబ్బంది వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేస్తానని సునీత వెల్లడించారు. -
మహానాడుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టలేరు: ఓదేలు
ఆదిలాబాద్: మహానాడుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టలేరని తెలుగుదేశం పార్టీ నాయకులకు టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు సూచించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో నల్లాల ఓదేలు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనకు ప్రజలు కడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ పట్టమే ఉప ఎన్నికల ఫలితాలని ఆయన అభివర్ణించారు. తెలంగాణ జిల్లాల్లో మినీ మహానాడులను టీడీపీ నిర్వహిస్తుండడంపై ఓదేలు విమర్శించారు. తెలంగాణ నాయకులు బాబు పల్లకీ మోయడం ఆత్మవంచన చేసుకోవడమేనని నల్లాల ఓదేలు విమర్శించారు. -
'తెలంగాణ చుట్టంగా మారిన కరువు'
హైదరాబాద్ : వలస పాలనలో పాలమూరు జిల్లా బాగా వెనకబడిపోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు అంటే కేవలం కరువు జిల్లాగా పేరు పడిందన్నారు. రాష్ట్రంలో కరువు, జంటనగరాల్లో తాగునీటి సమస్యపై తెలంగాణ అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ... కరువు అనే మహమ్మారి తెలంగాణకు చుట్టంగా మారిందన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో విద్యుత్ రంగం చిన్నాభిన్నమైందన్నారు. పాలమూరు, డిండి, సీతారాం, భక్త రామదాసు ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం అకుపచ్చగా కళకళలాడుతుందని చెప్పారు. గత పాలకుల హయాంలో 40 ఏళ్లు అయిన తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మర్రి జనార్దన్రెడ్డి వెల్లడించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ. 1000 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం చారిత్రక ఒప్పందమని చెప్పారు. రాష్ట్రంలో అటవీశాతాన్ని పెంచెందుకు హరితహరం చేపట్టినట్లు మర్రి జనార్దన్రెడ్డి వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మర్రి జనార్దన్ రెడ్డి వివరించారు. -
బల్లలు చరచడానికే... మా పాత్ర పరిమితం
అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెగ మధనపడిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చాలా మంది ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం రావడం లేదు. చివరకు ప్రశ్నోత్తరాల్లో తాము వేసిన ప్రశ్నలు కూడా రాకపోవడంతో ఖాళీగా కూర్చుంటున్నారు. విపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ మాట్లాడే అవకాశం వస్తోందని, తమకు సబ్జెక్టు ఉన్నా, మాట్లాడాలన్న తపన ఉన్నా అదృష్టం కలసి రావడం లేదం టూ బాధపడిపోతున్నారు. ‘సీఎం మాట్లాడినప్పుడో.. మంత్రులు మాట్లాడినప్పుడో.. పాలక పక్షానికి మద్దతుగా బల్లలు చరచ డానికి మాత్రమే మా పాత్ర పరిమితం అవుతోంది... ఏ కొద్దిమందికో అవకాశం దక్కినా, వారితోనే మళ్లీ మళ్లీ మాట్లాడిస్తున్నారు..’ అంటూ ఓ యువ ఎమ్మెల్యే వాపోయారు. ఇదే పరిస్థితి ప్రభుత్వ విప్లకూ ఎదురవుతోంది. ‘ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రశ్న వేయడానికి లేదు.. సభా నాయకుడు అవకాశం ఇస్తే తప్ప ప్రభుత్వం తరఫున ఏదైనా అంశంలో సమాధానం ఇవ్వడమో, చర్చలో పాల్గొనడమో చేయలేం...’ అంటూ ప్రభుత్వ విప్ ఒకరు మనసులో మాట బయట పెట్టారు. దీంతో సభ్యులు తాము ఏ సబ్జెక్టుపైనా ప్రిపేర్ కావడం లేదని, అసెంబ్లీకి రావడం.. పోవడం తప్ప మరో ప్రయోజనమే కనిపించడం లేదంటున్నారు. అసెంబ్లీ ప్రసారాలను టీవీల్లో చూసే నియోజకవర్గ ప్రజలు తమను ఎక్కడ తక్కువ అంచనా వేస్తారోనన్న భావన తమ మనసులను అల్లకల్లోలం చేస్తోందని చెబుతున్నారు. -
పర్యాటక అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు
హైదరాబాద్ : సమైక్య పాలనలో తెలంగాణ టూరిజం గుర్తింపునకు నొచుకోలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి బాలకృష్ణ మాట్లాడుతూ... ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కట్టడాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎ.చందూలాల్ మాట్లాడుతూ... రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని వివరించారు. అందులోభాగంగా హెలీ టూరిజం ఏర్పాటు చేసిన విషయాన్ని చందూలాల్ గుర్తు చేశారు. -
'రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట'
హైదరాబాద్ : పేదల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ... రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బంగారు తెలంగాణకు బాటలు వేసే విధంగా ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని గాదరి కిషోర్ పేర్కొన్నారు. సాగునీటి రంగానికి కూడా ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు గాదరి కిషోర్ గుర్తు చేశారు. -
ఆయన తీరుతో పోలిస్తే మేం చేసింది ఎంత ?
హైదరాబాద్ : టీఆర్ఎస్లో టీడీఎల్పీ విలీనానికి ప్రజామోదం ఉందని ఇటీవలే ఆ పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు. శనివారం అసెంబ్లీ లాబీలో ఎర్రబెల్లి మాట్లాడుతూ... పార్టీ శాసనసభ పక్షాన్నే టీఆర్ఎస్లో విలీనం చేశాం కానీ ఫిరాయింపు కాదని ఆయన స్పష్టం చేశారు. గతంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ను గద్దె దించి బాబు సీఎం అయిన తీరుతో పోలిస్తే మేం చేసింది ఎంత అని విలేకర్లను ప్రశ్నించారు. టీఆర్ఎస్లోకి వస్తానంటూ నేను ఏ నేతకు ఫోన్ చేయలేదని ఎర్రబెల్లి తెలిపారు. -
అజ్ఞాతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
వరంగల్: ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వస్తున్న నేతలతో పార్టీ అధినాయకత్వం మంచి జోష్ మీద ఉంది. అయితే వలసలతో పార్టీలో ఉన్న నేతలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పార్టీలో వరుస చేరికలపై నేతలు అలక పూనుతున్నారు. తాజాగా వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అసంతృఫ్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీలోకి వరుస చేరికలతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని ఆయన ఆవేదన చెందినట్లు సమాచారం. కార్పొరేషన్ టికెట్ల విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని వినయ్ భాస్కర్ సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకరరావు, తాజాగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. -
'టీడీపీ అంటే డిపాజిట్ దక్కని పార్టీ'
హైదరాబాద్ : కాంగ్రెస్, టీడీపీలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలుకు వరుస పరాజయాలతో మైండ్ బ్లాక్ అయిందని జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. రోడ్డుప్రమాదంలో మృతి చెందిన సత్యం అంశాన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నేనే కనుక ఆ ప్రమాదం చేయించినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని జీవన్రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అంటే తెలంగాణలో డిపాజిట్ దక్కని పార్టీ అని జీవన్రెడ్డి ఈ సందర్భంగా అభివర్ణించారు. దొంగకే తాళం చెవి ఇచ్చినట్లుగా రేవంత్కు చంద్రబాబు పదవి ఇచ్చారని విమర్శించారు. తెలంగాణలో ఇక టీడీపీకి టు లెట్ బోర్డు పెట్టాల్సిందే అని వ్యంగ్యంగా ఆరోపించారు. వరుస వలసలతో టీడీపీకి మతి భ్రమించిందన్నారు. అందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారని జీవన్రెడ్డి అన్నారు. -
'రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఐరన్లెగ్'
హైదరాబాద్ : టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గురువారం హైదరాబాద్లో మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్రెడ్డి ఐరన్లెగ్ అని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి టీడీపీలో చేరిన నాటి నుంచి అన్ని అపజయాలే అని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మిగిలిన ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు త్వరలో టీఆర్ఎస్లో చేరతారని జీవన్రెడ్డి జోస్యం చెప్పారు. -
పటాన్ చెరు ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: మెదక్ జిల్లా పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓ వక్తిపై దాడి చేసిన కేసులో మహిపాల్ రెడ్డికి రెండున్నర ఏళ్ల జైలు శిక్ష పడిందని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే డిస్ క్వాలిఫై అయిన ఎమ్మెల్యేకు జీతం ఎలా చెల్లిస్తారని, అందుకు అసెంబ్లీ సెక్రటరీ పై కూడా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ రఘనందన్ రావు కోర్టను కోరారు. మరో వైపు పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరుగుతుందని రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ ప్రకటించారు. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం రెండు ఏళ్లకు మించి శిక్ష పడ్డ ప్రజా ప్రతినిధిపై ఆటోమేటిగ్గా అనర్హత వేటుపడుతుంది. ఈ నేపధ్యంలోనే ఉప ఎన్నిక జరుగుతుందని ఈసీ వర్గలు అంటున్నాయి. -
త్వరలో పఠాన్చెరు ఉపఎన్నిక
-
మహిపాల్రెడ్డికి రెండున్నరేళ్ల జైలు
ఓ పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో శిక్ష సంగారెడ్డి క్రైం: ఓ పరిశ్రమ యజమానిని బెదిరించి, బలవంతంగా రూ. 15 లక్షలకు చెక్కు రాయించుకున్న కేసులో మెదక్ జిల్లా పటాన్చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి రెండున్నరేళ్ల జైలు శిక్ష పడింది. దీనితోపాటు రూ. 2,500 జరిమానా విధిస్తూ సంగారెడ్డి అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ డి.దుర్గాప్రసాద్ గురువారం తీర్పు వెలువరించారు. అయితే జిల్లా కోర్టులో అప్పీలు చేసుకుంటామని, శిక్ష వాయి దా వేయాలని కోరడంతో అనుమతించారు. 2014, మే 5న పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పాశమైలారంలో ఉన్న వర్సటైల్ పరిశ్రమలో పనిచేస్తున్న మహేశ్ అనే కార్మికుడు మృతి చెందాడు. దీంతో మహిపాల్రెడ్డి, 70 మంది అనుచరులతో కలసి పరిశ్రమ వద్దకు వచ్చి.. కార్మికుడి కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆ కార్మికుడిని మీరే చంపారంటూ మహిపాల్రెడ్డి తమను బెదిరించారని పరిశ్రమ యజమాని పాటి చందుకుమార్... 2014, మే 7న బీడీఎల్ భానూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పరిశ్రమ జీఎం మదన్కాంత్, ఏజీఎం ప్రశాంత్ ఉన్నారని.. తన వద్ద నుంచి రూ. 15 లక్షలకు బలవంతంగా చెక్కు రాయించుకున్నారని అందులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిఛ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసును విచారించిన సంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి... ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిని దోషిగా నిర్ధారించి శిక్ష ఖరారు చేశారు. అయితే జిల్లా కోర్టులో అప్పీలు చేసుకుంటామని విజ్ఞప్తి చేయడంతో... న్యాయమూర్తి నెల రోజులు గడువు ఇచ్చారు. విచారణను 2016 జనవరి 6కి వాయిదా వేశారు. -
'రైతు ఏడిస్తే కేసీఆర్ ఏడుస్తారు'
హైదరాబాద్: రైతులు ఏడిస్తే తొలుత కళ్లల్లో నీళ్లు వచ్చేది ముఖ్యమంత్రి కేసీఆర్కేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం అసెంబ్లీ శాసనసభలో రైతుల ఆత్మహత్యల ఘటనపై మాట్లాడుతూ రైతుల విముక్తి సాధన ఉద్యమం కేసీఆర్ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏం చేసినా రైతుల కోసమే చేశారని, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, చెరువుల పూడిక తవ్వకాలు, హరిత హారం వంటి కార్యక్రమాలన్నీ కూడా రైతులకు భవిష్యత్ తరాల కోసమేనని చెప్పారు. ఎద్దు ఏడ్చినచోట ఎవుసం నిలవదని, రైతు ఏడ్చిన చోట రాజ్యం ఉండదని, రైతు ఏడిస్తే కేసీఆర్ ఏడుస్తారని తెలిపారు. రాజోలి బండ తూము పగులకొట్టినప్పుడు ప్రతిపక్షాలు నవ్వుతుంటే 102 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పాదయాత్ర చేశారని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణపై ప్రతిపక్ష పాత్రే, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రే విపక్షాలు పోషిస్తున్నాయని, వారిది పూర్తిగా సవతి ప్రేమేనని బాల కిషన్ ఆరోపించారు. ఈ సమయంలో జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. ఇప్పుడు రైతులకు కావాల్సింది భరోసా, ఆత్మస్థైర్యం అని చెప్పారు. కడుపులో నెలలు నిండని బిడ్డ గురించి ఆలోచించే తమ ముఖ్యమంత్రి రైతుల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటారని, ఒక్కసారి అంతా గుండెమీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలని తెలిపారు. -
పిక్క కొడితే కరీంనగర్కు కలెక్టర్ అవుతా:రసమయి
కరీంనగర్: పిక్క కొడితే కరీంనగర్కు కలెక్టర్ అవుతానని తెలంగాణ సాంస్కృతిక సారథి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ.. పీహెచ్డీ కోసం 500 మంది ప్రవేశ పరీక్ష రాస్తే జనరల్ కేటగిరీలో సీటు సంపాదించానని చెప్పుకొచ్చారు. అదే విధంగా తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై రసమయి తీవ్రంగా మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలను పతాక శీర్షికలో రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే దేశంలో అయితే తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టులను ఉరితీసిన దాఖలాలు ఉన్నాయన్నారు. రైతులకు భరోసా కల్పించేలా పత్రికలు వ్యవహరించాలని సూచించారు. -
ఎమ్మెల్యే చెన్నమనేనిపై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనర్హత వేటు పిటిషన్ విచారణలో ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించింది. అనర్హత వేటు పిటిషన్ విచారణలో ఉన్నా చెన్నమనేని ఓటు వేశారని ఆదిశ్రీనివాస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తప్పుపట్టింది. ఈ విషయంపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రమేష్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
మంత్రులే ఉసిగొలిపారు
-
అహంకారంతో దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను
-
'తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోంది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి. శ్రీనివాసగౌడ్ విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన ప్యాకేజీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ తన ఉనికిని కాపాడుకోవటానికే సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. -
'ఉద్యమాలు మాకు కొత్త కాదు'
హైదరాబాద్: తెలంగాణకూ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోతే ఉద్యమం చేపడతామని, పోరాటాలు తమకు కొత్తకాదని అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తమకు అన్యాయం జరిగితే సహించబోమని హెచ్చరించారు. ప్రత్యేక ప్యాకేజీపై రాజకీయ పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. -
అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే
మహబూబ్నగర్ : స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తమకు సముచిత స్థానం కల్పించలేదని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు అలిగి అక్కడి నుంచి వెళ్లి పోయారు. శనివారం మహబూబ్నగర్ పట్టణంలో పోలీస్ గ్రౌండ్స్లో 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఏ వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్ హాజరయ్యారు. అయితే వారికి కనీసం వీఐపీ గ్యాలరీలో కూడా కుర్చీలు వేయలేదు. దాంతో వారు అలిగారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.... స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నాకు అవమానం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య వేడుకల్లో బుక్లెట్లో అమరవీరుల ప్రస్తావనే లేదన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నాకు గౌరవం ఇవ్వలేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ వేడుకల్లో తమకు జిల్లా కలెక్టర్ శ్రీదేవితోపాటు ఉన్నతాధికారులు సముచిత స్థానం ఇవ్వలేదని వారు ఆరోపించి... అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఏసీబీ ఆఫీసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నవేళ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు హైదరాబాద్ లోని ఏసీబీ కార్యాలయానికి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మెదక్ జిల్లా సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. కేవలం వ్యక్తిగత పనుల నిమిత్తమే తాను ఏసీబీ ఆఫీసుకు వచ్చానని మీడియా ప్రతినిధులతో చెప్పిన చింతా.. మరిన్ని ప్రశ్నలకు బదులు చెప్పేందుకు నిరాకరించారు. ఓటుకు నోట్లు కేసులో ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ఏసీబీ.. తాజాగా ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయిన వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీరర్తన్ను బుధవారం విచారించింది. కాగా, టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు కొద్దిమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకున్నారనే ఆధారలు సేకరించిన ఏసీబీ.. వారిని కూడా ప్రశ్నించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరిని ప్రశ్నిస్తారనే విషయం తేలకముందే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ఏసీబీ ఆఫీసుకు రావడం రాజకీయవర్గాల్లో గుబులు రేపింది. -
'పక్క రాష్ట్రాల వ్యవహారాల పైనే బాబు దృష్టి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర సమస్యలు పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల వ్యవహారాల పైనే ఎక్కువ దృష్టి పెడతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో అన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'రేవంత్కు ఇది తాత్కాలిక ఊరటే'
హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డంగా దొరికిపోయిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కోర్టు నిర్దోషి అని చెప్పకముందే టీడీపీ సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఆరోపించారు. కోర్టు ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ మాత్రమే ఇచ్చిందని ఆ విషయం టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. రేవంత్కు ఇది కేవలం తాత్కాలిక ఊరట మాత్రమేనని జీవన్ రెడ్డి అన్నారు. -
'చట్టం చంద్రబాబు చుట్టం కాదు'
-
’సెక్షన్-8 అంటే మరో ఉద్యమమే’
-
'సెక్షన్ - 8 అంటే మరో ఉద్యమమే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపైన ఉన్న ఆరోపణలను కప్పి పుచ్చుకునేందుకు సెక్షన్ - 8ను తెరపైకి తీసుకు వస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సెక్షన్ -8 అంటే మరో ఉద్యమం తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలన్నీ సమావేశమై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సెక్షన్ -8లో తప్పేముంది ఇదిలా ఉండగా.. సెక్షన్ -8 అమలు చేస్తే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలోనే సెక్షన్ - 8 ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. -
ఇదేనా రాజకీయం
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ప్రలోభపరిచే యత్నంలో డబ్బుతో సహా ఏసీబీకి దొరికిపోవడం సంచలనం కలిగించింది. ఓటుకు నోటు చందంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ విధానాలపై విపక్షాలుతీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ కేసులోని సూత్రధారి చంద్రబాబునూ అరెస్టు చేయాలని, సీఎం పదవికి బాబు రాజీనామా చేయాలని విపక్షాల నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యగా ఖండిస్తున్నారు. ఇదేనా రాజకీయమని ప్రశ్నిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎన్నికల నిర్వహణలో తెలుగుదేశం పార్టీది అందెవేసిన చేయి. పార్టీ ఆవిర్భావం నుంచి నోట్లతో ఓట్లు కొనుగోలు చేయడం అలవాటుగా చేసుకున్న ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరిస్తోంది. ఇటీవల జరిగిన కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.5వేలు, ఉపాధ్యాయ సంఘాల నేతలకు బహుమతులు అందజేసి ఓటమి గండం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ కోసం పనిచేసిన నేతలను కాదని, కోట్లు ఖర్చు చేయగల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది. నోటుతో ఏదైనా సాధ్యం అనే రీతిలో ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అక్కడి ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ప్రలోభపరిచేయత్నంలో ఆదివా రం డబ్బుతో సహా ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికి తెలిసిందే. ‘మా ఎమ్మెల్యేలను పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని ఆక్రోశం వెళ్లగక్కినచంద్రబాబు అదే విధానాన్ని అమలు చేస్తూ తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. బాబు దిగజారుడుతనానికి ఇంతకంటే మరో ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదని రాజకీయ పక్షాలు పేర్కొంటున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ డబ్బుతోనే అభ్యర్థులను గెలిపించుకుంది. ఓట్ల కొనుగోలుకు అవసరమైన డబ్బును విజయవాడలోని సిద్ధార్థ అకాడమీలో నిల్వచేసి సీమాంధ్రలోని అన్ని నియోజకవర్గాలకు టీడీపీ సరఫరా చేసింది. పోలీసుల దాడిలో రూ.3 కోట్ల వరకు దొరికింది. ఈ సంఘటన తరువాత జరిగిన కృష్ణా,గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికను కూడా డబ్బుతోనే నడిపింది. పార్టీతో సంబంధం లేని వ్యక్తిని ఎన్నికల బరిలోకి దింపి ఒక్కో ఓటును రూ.5 వేలకు కొనుగోలు చేశారు. ఒక దశలో అభ్యర్థి గెలిచే అవకాశాలు కనపడకపోవడంతో టీడీపీ నేతలు అభ్యర్థి ఆస్తుల్ని కుదువ పెట్టుకుని అప్పు ఇచ్చారు. ఆ మొత్తంతో పెద్ద సంఖ్యలో ఓట్లు కొనుగోలు చేసి ఓటమి గండం నుంచి బయటపడింది. రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలోనూ డబ్బున్న అభ్యర్థినే ఎంపిక చేసే పనిలో పార్టీ ఉంది. మిగిలిన జిల్లాల్లో స్థానిక అభ్యర్థులను ఎంపిక చేసిన అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లాలో అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ కూడా రూ.5 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టగలిగిన నేతను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డబ్బుతోనే అన్ని పనులు చేయవచ్చనే ఆలోచనలో ఉన్న టీడీపీ అధినేత తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు అక్కడ బలం లేకపోయినా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేను రూ.5 కోట్లకు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఈ విధానాలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ కేసులోని సూత్రధారి చంద్రబాబును, పాత్రధారి రేవంత్రెడ్డిని అరెస్టు చేయాలని విపక్షాల నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్ నరసరావుపేట వెస్ట్: తెలంగాణ లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్యేను రూ.50లక్షలు ఇచ్చి కొనబోతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఏసీబీకి చిక్కిన కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, రేవంత్రెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హత వేటువేసి, తెలుగుదేశంపార్టీ ఇందుకు పూర్తి బాధ్యత వహించాలని కోరారు. దీనిపై చంద్రబాబును దోషిగా నిర్థారిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. మహానాడులో తాను రాజకీయాల్లో పునీతుడినని చెప్పుకున్న చంద్రబాబు నాలుగైదు రోజుల వ్యవధిలోనే ఒక ఎమ్మెల్యేను డబ్బుతో కొనబోతూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి పట్టుబడడం ఆ పార్టీ నిజస్వరూపాన్ని గుర్తుచేస్తోందన్నారు. చంద్రబాబు రాజీనామా చేయాలి రేవంత్రెడ్డి వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి కళంకం. అతడిని శాసనసభ్యుని పదవికి అనర్హుడుగా ప్రకటించాలి. సొంతపార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డే స్వయంగా బాస్ చంద్రబాబునాయుడు దగ్గరకి తీసుకెళ్తానని చెప్పిన విషయం అందరికీ తెల్సిందే. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేసి విచారణకు సిద్ధం కావాలి. - షేక్ మస్తాన్వలి, కాంగ్రెస్పార్టీ నగర అధ్యక్షుడు ఎవరికైనా చట్టం ఒకటే అవినీతికి పా ల్పడితే చట్టం ఎవరికైనా ఒకటే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి పూర్తి రికార్డు పరంగా అవినీతికి పాల్పడినట్లు స్పష్టం అవుతోంది. రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయటం సరైన చర్యే. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని చూసే వారిపై కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. - పాశం రామారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
నేను మొదటి నుంచీ రైతునే
ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి సదాశివనగర్: ఇజ్రాయిల్ పర్యటనపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆరోపించారు. తాను మొదటి నుంచి రైతునేనని, తనకు 30 ఎకరాల సాగు భూమి ఉందని పేర్కొన్నారు. బుధవారం ఆయన సదాశివనగర్ మండలం కుప్రియాల్లో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఓర్వలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ఇజ్రాయిల్ పర్యటకు వెళ్తున్నారని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. గతంలోనూ మహారాష్ట్రలోని బారామతి, సాంగ్లీ ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న చెరుకు పంటను పరిశీలించామన్నారు. ఇప్పుడు సాగు విషయాలను తెలుసుకోవడానికే ఇజ్రాయిల్కు వెళ్తున్నట్లు తెలిపారు. -
డిగ్రీ పరీక్ష రాసిన ఎమ్మెల్యే వీరేశం
నల్లగొండ అర్బన్: నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం ఓపెన్ డిగ్రీ ఫైనలియర్ పరీక్షకు హాజరయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన ఆయన.. వివిధ కారణాలతో ఫైనలియర్ పరీక్ష రాయలేదు. తాను ఉద్యమాల్లో తలమునకలవడంతో ఉన్నతవిద్య కొనసాగించలేకపోయానన్నారు. అది వెలితిగా ఉండేదని ఎమ్మెల్యే వీరేశం ‘సాక్షి’కి తెలిపారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
మెదక్ జిల్లా: కామారెడ్డి ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్థన్ కాన్వాయ్లో ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో జరిగింది. వివరాలు.. కాన్వాయ్ వేగంగా వెళ్తుండగా అడవి పంది అడ్డువచ్చింది. దీంతో డైవర్లు ఒక్క సారిగా బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విప్ కాన్వాయ్లోని మూడు వాహనాలు బాగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో కాన్వాయ్లో ప్రయాణిస్తున్న పార్టీ నాయకులు ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. కాగా, గంపగోవర్థన్కు ప్రయాణిస్తున్న వాహనం మాత్రం ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. (రామాయంపేట) -
ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్గా బాబుమోహన్
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం అసెంబ్లీ కొత్త కమిటీల చైర్మన్ల పేర్లు గురువారం ఖరారు చేసింది. మహిళ శిశు సంక్షేమ కమిటీ చైర్మన్గా రేఖా నాయక్, ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్గా బాబు మోహన్, బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్గా గంగాధర్గౌడ్, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్గా రెడ్యా నాయక్, మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్గా షకీల్ అహ్మద్గా నియమితులయ్యారు. -
తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
మహబూబ్నగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు తదితర విషయాల్లో తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోందంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. అదే సమయంలో పక్క రాష్ట్రం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో శనివారం సాయంత్రం జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ... కార్యకర్తల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ కృష్టి చేస్తోందని చెప్పారు. ఇతర పార్టీలు ఏజెంట్లను పెట్టుకుని దొంగ సభ్యత్వాలు నమోదు చేసుకున్నాయని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్రావు ఆర్య, సభ్యత్వాల నమోదు కార్యక్రమం జిల్లా ఇన్చార్జ్ మార్కండేయతో పాటు వెయ్యి మంది వరకు కార్యకర్తలు పాల్గొన్నారు. (అచ్చంపేట) -
'కేసీఆర్ ఎజెండానే నా ఎజెండా'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో 90 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్కు అన్ని జిల్లాలు సమానమేనని వెల్లడించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలు అన్న తారతమ్యాలు తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని పదవులు పొందిన నేతలంతా కలసి పని చేస్తామని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఎజెండానే తన ఎజెండా అని తెలిపారు. తెలంగాణ, మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని లక్ష్మారెడ్డి చెప్పారు. -
కొప్పుల ఈశ్వర్ కు బుజ్జగింపు
హైదరాబాద్: మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. ఆయనకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్ తో భేటీ కావాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు ఆదివారం ఆయన కరీంనగర్ లో ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న కొప్పుల ఈశ్వర్ కు సీఎం కేసీఆర్... చీఫ్ విప్ పదవి కేటాయించడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. మొదట్లో ఆయనకు డిప్యూటీ సీఎం దక్కుతుందని ప్రచారం జరిగినా ఫలించలేదు. మలి విడతలోనూ మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు రుగైయ్యారు. -
'చీఫ్ విప్ ఇచ్చి అన్యాయం చేయొద్దు'
-
'చీఫ్ విప్ ఇచ్చి అన్యాయం చేయొద్దు'
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్లో తొలి విస్తరణలో స్థానం దక్కక పోయినా రెండోసారి విస్తరణలోనైనా చోటు దక్కుతుందని కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ భావించారు. కానీ సీఎం కేసీఆర్... చీఫ్ విప్ పదవి కేటాయించడంతో కొప్పుల ఈశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. చీఫ్ విప్ పదవిని నిరాకరిస్తున్నట్లు కొప్పుల ఈశ్వర్... కేసీఆర్ సన్నిహితుల వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. అయితే కొప్పుల ఈశ్వర్కు చీఫ్ విప్ పదవిని కేటాయించడంపై మాలమహానాడు కార్యకర్తలు కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చీఫ్ విప్ పదవి తీసుకోవద్దంటూ కరీంనగర్లోని కొప్పుల ఈశ్వర్ నివాసం వద్ద ఆదివారం మాల మహానాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈశ్వర్కు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి వద్దు ... 16వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మీ వెన్నంటి ఉన్న తమ నాయకుడు ఈశ్వర్కు చీఫ్ విప్ పదవి ఇచ్చి అన్యాయం చేయొద్దని వారు సీఎం కేసీఆర్కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అంశంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కొప్పుల ఈశ్వర్ను కోరగా... అందుకు స్పందించేందుకు ఆయన నిరాకరించారు. -
'అమరుల'ను స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించాలి
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్కే సాధ్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని సాధించిన గౌరవం సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా అమరవీరులైన కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అమరులను స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించాలని సభ్యుడు చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. -
బాబు గైడెన్స్తోనే గొడవ చేస్తున్నారు: సురేఖ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టీటీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారాల శైలిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. టీటీడీపీ ఎమ్మెల్యేలు పక్క ప్రణాళికతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి గైడెన్స్తో గొడవ చేస్తోందని ఆరోపించారు. గత టీడీపీ పాలన హయాంలో రైతుల ఆత్మహత్యల విషయంలో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని ప్రశ్నోత్తరాలు అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. సభలో ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సమంజసం కాదని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. కేంద్రం, పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ, టీడీపీలు అక్కడి సమస్యలపై ఎందుకు నోరెత్తడం లేదని ఆయా పార్టీల నేతలను కొండా సురేఖ ప్రశ్నించారు. అలాగే తెలంగాణ విద్యుత్ సమస్యలను కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదో వెల్లడించాలని ఆయా పార్టీల నేతలను డిమాండ్ చేశారు. -
'బండారం బయటపడుతుందనే అడ్డుకుంటున్నారు'
హైదరాబాద్: తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలతోపాటు వివిధ సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేసి... ఇప్పుడు ఆ రెండు పార్టీల నేతలు ఇలా వ్యవహారించడం దారుణమన్నారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు 10 రోజులు కాదు.... నెలరోజులైనా తాము సిద్ధమేనని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. అయినా వినకుండా ప్రతిపక్షా నేతలు ఇలా వ్యవహరించడం సబబు కాదన్నారు. విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చ జరిగితే కారణం ఎవరన్నది బయటపడుతుందని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ విషయం తెలిసే ప్రతిపక్ష నేతలు సభను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. -
ఆంధ్రానేతలతో కలసి వ్యాపారం చేస్తే తప్పేంటి?
మెదక్ : తెలంగాణ టీడీపీ నాయుకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా ప్రతినిధిగా రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని వారు ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కరీనగర్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మర్రి జనార్థన్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో రేవంత్రెడ్డి చేసిన పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు తెలిపారు. పలు కేసుల్లో నిందితులతో రేవంత్కు సన్నిహిత సంబంధాలున్నాయని విమర్శించారు. త్వరలో రేవంత్ బండారం బయటపడతామని వారు హెచ్చరించారు. కొడంగల్ ప్రజా కోర్టులో చర్చకు సిద్ధమా అంటూ రేవంత్కు సవాల్ విసిరారు. మెదక్ ఉపఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని వారు జోస్యం చెప్పారు. ఆంధ్రానేతలతో కలిసి వ్యాపారం చేస్తే తప్పేంటని వారు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీన్ని రాద్ధాంత చేయడం తగదని హితవు పలికారు. రేవంత్రెడ్డి కాంట్రాక్టర్ను బెదిరించి డబ్బు వసూల్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్పై చేసిన విమర్శలను వెంటనే నిరూపించాలని రేవంత్రెడ్డిని డిమాండ్ చేశారు. రాజకీయ అసూయతోనే రేవంత్ ఆరోపణలు చేస్తున్నారని బాల్క సుమన్, గువ్వల బాలరాజు, మర్రి జనార్థన్ తెలిపారు. -
'మానసిక వికలాంగుడిలా మధుయాష్కీ వ్యవహారం'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిప్పులు చెరిగారు. శనివారం గంగుల కమలాకర్ మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే స్థాయి మధుయాష్కీకి లేదని అన్నారు. కేసీఆర్ను తుగ్లక్ అనే దమ్ము, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయని మధును కమలాకర్ ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆ పథకాలపై కూడా మధుయాష్కీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలల్లో ఓడిపోయి మధుయాష్కీ మానసికంగా కుంగిపోయినట్లు ఉన్నారని... అందుకే ఆయన మానసిక వికలాంగుడిలా వ్యవహరిస్తున్నారని కమలాకర్ ఎద్దేవా చేశారు. -
'రాష్ట్రం విడిపోయినా... సీమాంధ్రల ఆగడాలు ఆగలేదు'
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినప్పటికీ హైదరాబాద్ నగరంలోని సీమాంధ్రుల ఆగడాలు ఇంకా ఆగలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎస్. రామలింగారెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాజధానిని తక్షణమే సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన పాత అసెంబ్లీ హాల్ చారిత్రక భవనమని ఈ సందర్బంగా రామలింగారెడ్డి గుర్తు చేశారు. అలాంటి భవనానికి మరమ్మతులు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రామలింగారెడ్డి నిప్పులు చెరిగారు. -
తెలంగాణ అమరవీరుల గురించి చంద్రబాబా మాట్లాడేది ?
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకునేందుకు యత్నించిన చంద్రబాబు...తెలంగాణ అమర వీరులు గురించి మాట్లాడడం సిగ్గూచేటుగా ఉందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో తప్పించుకున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే అధిక సీట్లు గెలవకుంటే రాజకీయ సన్యాసం చేస్తావా అంటూ హారీష్ రావు ఈ సందర్బంగా చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఎన్నికలో గెలవలేక బీజేపీతో పొత్తు కోసం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముందు మోకరిల్లారని చంద్రబాబుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు ఫోటో పెట్టుకునేందుకు క్యాడర్ భయపడుతోందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అల్లుడు కాకుంటే ఆయన్ని పట్టించుకునే నాథుడు కూడా ఉండేవాడు కాదంటూ విమర్శించారు. -
'కౌరవులపై పాండవులు గెలిచినట్లు..'
అలనాటి మహాభారతంలో కౌరవులపై పాండవులు గెలిచినట్లు నేడు తెలంగాణ ప్రజలు గెలిచారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్రావు అభివర్ణించారు. మంగళవారం ఆయన మెదక్లో విలేకర్లతో మాట్లాడుతూ... తమతో కలిసి ఉండేవారంతా తమవాళ్లే అని పునరుద్ఘాటించారు. అయితే దోపిడి పెత్తనాన్ని మాత్రం ఒప్పకోమన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ భాగం కావాలని తమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. -
చంద్రబాబు నీ ఎమ్మెల్యేలు నీ చేతిలో ఉన్నారా?- హరీష్
-
కేసిఆర్ వల్లే రాష్ట్రం వచ్చింది
-
నల్లారి వారి తెలివి తెల్లారినట్లే ఉంది
-
సీఎం కిరణ్ పాలన కన్న తుగ్లక్ పాలనే నయం: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పాలన కన్నా పిచ్చి తుగ్లక్ పాలనే నయమని కేటీర్ అభిప్రాయపడ్డారు. ఎలక్టెడ్ సీఎం కాదు, సెలెక్టడ్ సీఎం అని కిరణ్ కుమార్ రెడ్డిని ఎద్దేవా చేశారు. సీఎం పదవిని అధిష్టించే వరకు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో సామ్యానుడికి తెలియదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డికి నైతిక విలువలు లేవని పేర్కొన్నారు. ఆయనకు ఆ విలువలే ఉంటే సీఎం పదవి నుంచి కిరణ్ ఎప్పుడో తప్పుకునేవారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ అజ్ఞానం అనే తిమిరంలో విహరిస్తున్నారన్నారు. సీఎంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై తమ పార్టీ సమావేశాల్లో చర్చిస్తామని కేటీఆర్ వెల్లడించారు. -
హరీష్రావు వ్యాఖ్యల పై వైఎస్సార్సీపీ మండిపాటు
-
'సీమాంధ్ర ఉద్యమాన్ని సీఎం, డీజీపీలు నడుపుతున్నారు'
సీఎం కిరణ్, డీజీపీ దినేష్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు బుధవారం మెదక్ లో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7వ తేదీన ఏపీఎన్జీవోలు చేపట్టనున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అదే రోజు తెలంగాణ ఉద్యోగులు చేపట్టనున్న శాంతి ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన కిరణ్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ సర్కార్ సీమాంధ్రవారిని ఓ విధంగా, తెలంగాణ ప్రాంతం వారిని మరో విధంగా చూస్తుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఉద్యమాన్ని సీఎం,డీజీపీలు దగ్గర ఉండి నడపుతున్నారని ఆయన ఆరోపించారు. -
తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది చంద్రబాబే-హరీష్రావు
-
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో ఒరిగేది లేదు: హరీష్
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో ప్రజలకు ఒరిగేది ఏమీలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు గురువారం హైదరాబాద్లో వెల్లడించారు. వారి సమ్మెతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్బాగమని ఆయన స్పష్టం చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్టం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలోని కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఏపీఎన్జీవోలు డిమాండ్ చేశారు. వారి రాజీనామాకు గడువును విధించింది. అయితే వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారించడంతో ఏపీఎన్జీవోలు తమ సమ్మెను ఉధృతాన్ని చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన బెదిరేదిలేదని ఆ సంఘం పేర్కొంది. అంతేకాకుండా వచ్చే నెలలో హైదరాబాద్ నగరంలో సమైక్యాంధ్ర బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఏపీఎన్జీవోల సంఘం వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే సమైక్య ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు నేటి నుంచి సమ్మెకు దిగారు. దాంతో ఆ ప్రాంతంలో ఒక్క పాఠశాల కూడా గురువారం తెరుచుకోలేదు. సీమాంధ్రలో ఉద్యోగుల సంఘం చేపట్టిన సమ్మెపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు గురువారం పై విధంగా స్పందించారు.