Two-Person Attack On Dharmapuri Sanjay House Nizamabad - Sakshi
Sakshi News home page

డీఎస్‌ కొడుకు, కాంగ్రెస్‌ నేత ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి కలకలం..

Apr 11 2023 1:54 PM | Updated on Apr 11 2023 3:54 PM

Two Persons Attack On Dharmapuri Sanjay House Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: డీఎస్‌ కొడుకు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ ఇంటిపై దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు సంజయ్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం రెక్కీ నిర్వహించిన ఇద్దరు అగంతకులు.. స్కార్పియో వాహనంతో ఇంటి గేట్లను ధ్వంసం చేసి లోపలికి చొరబడేందుకు యత్నం చేశారు. సుమారు 20 నిమిషాలపాటు సంజయ్‌ ఇంటి వద్ద హంగామా సృష్టించారు.

అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దుండగులును అడ్డుకున్నారు. దీనిపై సంజయ్ అనుచరులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఉద్దేశపూర్వకంగా సంజయ్ ఇంటిపై దాడి చేశారా? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

కాగా మాజీ మేయర్ సంజయ్ తన తండ్రి శ్రీనివాస్‌తో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజే తను కాంగ్రెస్‌లో చేరలేదని, కేవలం కొడుకును పార్టీలో చేర్పించినట్లు డీఎస్‌ చెప్పారు. దీనికితోడు కొంత కాలంగా డీఎస్‌ తనయులు అరవింద్‌, సంజయ్‌ల మధ్య రాజకీయ వైరం నడుస్తోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి పై దాడికి వెళ్లడం కలకలం సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement