జాండిస్‌ వచ్చిందని వెళితే.. గడువుతీరిన సెలైన్‌ బాటిల్‌తో.. | Warangal: Infant Baby Treatment Expired Medicines In Narsampet Hospital | Sakshi
Sakshi News home page

జాండిస్‌ వచ్చిందని వెళితే.. గడువుతీరిన సెలైన్‌ బాటిల్‌తో..

Aug 29 2021 3:58 PM | Updated on Aug 29 2021 5:28 PM

Warangal: Infant Baby Treatment Expired Medicines In Narsampet Hospital - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిది రోజుల బాబుకు జాండీస్‌ వచ్చాయని తల్లిడండ్రులు నర్సంపేటలోని పిల్లల ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిది రోజుల బాబుకు జాండీస్‌ వచ్చాయని తల్లిడండ్రులు నర్సంపేటలోని తనుష పిల్లల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాబును పరీక్షించి ఫోటో తెరఫి బాక్సులో ఉంచి సెలైన్ పెట్టమని వైద్యుడు జాన్‌సన్‌ సిబ్బందికి చెప్పారు. కాసేపటి తరువాత తల్లిదండ్రులు చూసే సరికి గడువుతీరిన సెలైన్ బాటిల్‌ను బాబుకి ఎక్కిస్తున్నట్టు గమనించారు. అయితే అప్పటికే బాబు పరిస్థితి విషమించి మరణించాడు. దీంతో ఆ తల్లిదండ్రులు వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే తమ బాబుని కోల్పోయామని మండిపడుతూ గొడవకు దిగారు.

చదవండి: అదనపు కట్నం కోసం వేధింపులు.. ఎనిమిది నెలల నిండు గర్భిణి పై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement