
తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరింది. నిన్న శుక్రవారం 71,664 మంది స్వామివారిని దర్శించుకోగా, 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటలు సమయం పడుతుంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది.