ప్రజారోగ్యమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యమే ధ్యేయం

Published Wed, Mar 5 2025 12:43 AM | Last Updated on Wed, Mar 5 2025 12:43 AM

ప్రజారోగ్యమే ధ్యేయం

ప్రజారోగ్యమే ధ్యేయం

చంద్రగిరి: ప్రజారోగ్యమే ధ్యేయంగా పనిచేసి, ఆరోగ్య సమస్యలు రాకుండా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బాలకృష్ణనాయక్‌ సూచించారు. మంగళవారం ఆయన అసిస్టెంట్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మురళీకృష్ణతో కలసి పట్టణంలోని సచివాలయం–2లోని హెల్త్‌ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్‌ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ చంద్రగిరి సర్పంచ్‌ రూప రామ్మూర్తికి ఫోన్‌ చేసి సమస్యను వివరించారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్‌ ఆయనకు తెలిపారు. అనంతరం హెల్త్‌ సెంటర్‌లో పలు రికార్డులను తనిఖీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement