కబ్జారాయుళ్లను అరెస్ట్ చేయాలి
తిరుపతి రూరల్ పరిధిలోని ఓటేరు చెరువు ఆక్రమణలను అడ్డుకోవాలంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి పీ.మురళి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. విలువైన ఓటేరు చెరువును కొంతమంది కబ్జారాయుళ్లు పూడ్చేసి ఆక్రమించుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. దీనిపై కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ స్పందిస్తూ ఓటేరు చెరువును యథావిధిగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఆర్టీవో సైతం స్పందిస్తూ చెరువులను ఆక్రమించిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కే రాధాకృష్ణ, నగర కార్యదర్శి జే.విశ్వనాథ్, ఉదయ్ కుమార్, నగర కార్యవర్గ సభ్యులు ఎన్డీ.రవి తదితరులు పాల్గొన్నారు. – తిరుపతి అర్బన్
Comments
Please login to add a commentAdd a comment