గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతి

Published Sun, Mar 9 2025 12:58 AM | Last Updated on Sun, Mar 9 2025 12:58 AM

గుర్త

గుర్తుతెలియని వ్యక్తి మృతి

తిరుపతి క్రైం: శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ రైల్వే గేట్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్వీ యూనివర్సిటీ పోలీసుల కథనం.. సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి పద్మావతి డిగ్రీ కాలేజ్‌ సమీపంలో ఉన్న రైల్వే గేట్‌ వద్ద మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

ట్రెక్కింగ్‌కు

అనుమతుల్లేవ్‌!

చంద్రగిరి: పనపాకం రేంజ్‌తో పాటు చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో అటవీ ఏనుగులు సంచరిస్తున్నాయని, అనుమతులు లేకుండా ఎవరైనా అడవుల్లోకి ప్రవేశిస్తే చర్యలు తప్పవని పనపాకం రేంజ్‌ డీఆర్‌ఓ చిన్నబాబు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అడవుల్లో సంచరించడం, ట్రెక్కింగ్‌ను పూర్తిగా నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గుర్తుతెలియని వ్యక్తి మృతి 1
1/1

గుర్తుతెలియని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement