
భవనం పైనుంచి పడి కార్మికుడి దుర్మరణం
తిరుపతి క్రైమ్: భవనం పైనుంచి పడి ఒక కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి ఎస్ఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు.. గుంటూరుకు చెందిన అబ్రహం కుమారుడు దావీదు(56) శుక్రవారం సాయంత్రం ఆటోనగర్లో ఓ భవనం వద్ద పెయింట్ పనులు చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కాలుజారి కింద పడ్డాడు. అయితే దీనిని గమనించిన కార్మికులు వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దావీదు మృతి చెందాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వారి బంధువులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment