ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Published Wed, Mar 19 2025 8:03 AM | Last Updated on Wed, Mar 19 2025 8:02 AM

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

అనంతగిరి: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్‌ డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం కలెక్టరేట్‌ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలకు డబుల్‌ సిలిండర్‌తోపాటు ప్రతి నెలా గ్యాస్‌ బిల్లులు ఇవ్వాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే మే నెలలో పూర్తిగా సెలవులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు నర్సమ్మ, భారతి, మంజుల, బేబి, లక్ష్మి, విజయలక్ష్మి, నవనీత, వనజ, సంతోష, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement