
ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్
పార్వతీపురం టౌన్: పార్వతీపురం పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన గోదాములను సందర్శించి అక్కడ పరిస్థితిని గమనించారు. గోదాములకు వేసిన సీల్డ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లును పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ ఏర్పాట్లుపై పరిశీలించి అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఆయన వెంట డీఆర్ఓ హేమలత తదితరులు ఉన్నారు.