భీమవరం: అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ భీమవరం పట్టణం గునుపూడికి చెందిన గోరుముచ్చు సిరివెన్నెల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భీమవరం వన్టౌన్ హెడ్ కానిస్టేబుల్ జీజీఎస్ఎస్ చక్రవర్తి శనివారం చెప్పారు. కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన గోరుముచ్చు కల్యాణ్బాబుతో 2023 జూన్ 16న సిరివెన్నెలకు వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.3 లక్షలు కట్నంగా ఇచ్చారు. ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడంతో సిరివెన్నెల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చక్రవర్తి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment