వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజబాబు మృతి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజబాబు మృతి

Published Sun, Feb 16 2025 12:23 AM | Last Updated on Sun, Feb 16 2025 12:22 AM

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజబాబు మృతి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజబాబు మృతి

ద్వారకాతిరుమల: మండలంలోని సీహెచ్‌ పోతేపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్‌రావు(రాజబాబు) శనివారం రాత్రి మృతి చెందారు. ఇటీవల బాత్‌రూమ్‌లో కాలుజారి పడిపోవడంతో ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. కొద్దిరోజుల పాటు లక్ష్మీపురంలోని విర్డ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు వారం రోజుల క్రితం ఆయన కాలికి శస్త్రచికిత్స చేశారు. ఈ నెల 12న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవ్వాల్సి ఉండగా, అదే రోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌ సాయంతో వైద్యం చేస్తూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రాజబాబు మృతి చెందడంతో మండలంలోని పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement