వెలగలేరులో చోరీ | - | Sakshi
Sakshi News home page

వెలగలేరులో చోరీ

Published Tue, Feb 18 2025 7:32 AM | Last Updated on Tue, Feb 18 2025 7:32 AM

-

పెనుమంట్ర: వెలగలేరు శివాలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున తాళం వేసిన ఇంటిలో దొంగలు పడి బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు. గ్రామానికి చెందిన పడాల సూర్యకుమారి వారం రోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి వైజాగ్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లింది. అయితే సోమవారం ఉదయం తలుపులు తెరచి ఉండటాన్ని గమనించిన స్థానిక బంధువులు సమాచారాన్ని ఆమెకు తెలియజేయడంతో వైజాగ్‌ నుంచి వచ్చిన ఆమె పెనుమంట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ చోరీలో ఇరవై మూడున్నర కాసుల బంగారం, రూ.1.80 లక్షల నగదును దొంగలు దోచుకుపోయినట్లు ఆమె బంధువులు తెలిపారు. పెనుమంట్ర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement