రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ఆయన కృషి చేశారని కొనియాడారు. సోమవారం శాసనసభలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంపై సంతాప తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యువతలో స్ఫూర్తి నింపేందుకు కలాం అనునిత్యం ప్రయత్నం చేశారని చెప్పారు.