సంచలనం సృష్టించి కీలక మలుపులు తిరుగుతున్న షీనా బోరా హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన తీరు, హత్యకు దారి తీసిన పరిస్థితులను ఆమె పోలీసులకు వివరించినట్లు సమాచారం. నేరాన్ని అంగీకరించిన ఆమె అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.