Sheena Bora
-
షీనాబోరా హత్యకేసులో బిగ్ ట్విస్ట్
ముంబై : 12 ఏళ్ల క్రితం జరిగిన హీనాబోరా హత్య కేసులో బిగ్ ట్విస్ట్. కేసులో కీలకంగా ఉన్న షీనాబోరా అస్థికలు (ఎముకలు) మాయమయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హత్య అనంతరం రాయగఢ్ పోలీసులు షీనాబోరా అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడా అస్థికలు కనిపించడం లేదని సీబీఐ అధికారులు ముంబై ప్రత్యేక కోర్టుకు తెలిపారు.2012,మే 21న మహరాష్ట్రలోని రాయిఘడ్కు చెందిన గణేష్ ఎగ్డే తనకెంతో ఇష్టమైన మామిడి పండ్ల సీజన్ వచ్చేసిందని సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసేందుకు రాయిఘడ్ అడవుల్లో దొరికే రుచికరమైన మామిడి పండ్ల కోసం బయలు దేరాడు. అయితే అడవిలోకి వెళ్తుండగా.. ఓ చెట్టు సమీపంలో పెద్ద సూట్కేస్ గణేష్ కంటపడింది. అంతే ఆ సూట్కేసులో ఏముందో అని చూసిన ఆయన షాక్ తిన్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిన సంఘటన గురించి వివరించాడు. క్షణాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ సూట్కేస్లో కాలిన మృతదేహం కనిపించింది.కట్ చేస్తే షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్ను విచారించగా.. షీనా బోరా హత్య గురించి బయటపెట్టాడు.షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని, ఆ తర్వాత షీనాబోరాను కాల్చివేసి ఆమె అస్థికల్ని రాయ్ఘడ్లోని గాగోడే-ఖుర్ద్ గ్రామ సమీపంలోని అడవుల్లో పడేసినట్లు చెప్పాడు. అప్రమత్తమైన షీనాబోరా కేసును విచారిస్తున్న అధికారులు స్థానిక రాయ్ఘడ్ పెన్ పోలీసుల సహకారంతో షీనాబోరా అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు.ఆ ఎముకల్ని పరీక్షించి అవి షీనాబోరావేనని సర్ జేజే హాస్పిటల్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ జెబా ఖాన్ తేల్చారు. మే 7న కోర్టు విచారణలో సీబీఐ తరపున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీజే నాండోడ్ కేసు విచారణలో షీనాబోరా అస్థికల్ని జెబాఖాన్కు చూపించి విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.ఇందులో భాగంగా గురువారం (జూన్ 13) షీనాబోరా అస్థికల గురించి ఆరా తీయగా అవి మాయమైనట్లు సీబీఐ అధికారులు కోర్టుకు వెల్లడించారు. విచారణలో ఆధారాలు (ఎముకలు) ఉన్న రెండు మార్క్ ప్యాకెట్లను గుర్తించలేకపోయామన్నారు. అస్థికలు లేకున్నా షీనా బోరా కేసు విచారణ కొనసాగించాలని సీబీఐ భావించింది. అందుకు డిఫెన్స్ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. -
అందరినీ క్షమించేస్తున్నా: ఇంద్రాణి ముఖర్జీ
ముంబై: ఒకప్పటి మీడియా ప్రముఖురాలు ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చింది. కూతురు షీనాబోరా హత్యకేసులో జైలుకు వెళ్లిన ఆమె.. బెయిల్పై శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయ్యారు. ఈ క్రమంలో మీడియా ఆమెను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాత్రం నవ్వుతూ.. అన్నింటికి సమాధానం ఇచ్చుకుంటూ పోయారు. ఈ కేసులో ఇంద్రాణిని ఇరికించే ప్రయత్నం ఎవరైనా చేశారా? అని ప్రశ్న ఎదురుకాగా.. నన్ను ఇబ్బంది పెట్టిన అందరినీ క్షమించేస్తున్నా. అంతే అని బదులిచ్చారు. ఇక కూతురు(షీనా బోరా) బతికే ఉందా?.. ఆ వాదనను సమర్థిస్తారా? అనే ప్రశ్నను దాటవేశారామె. ‘‘ఈ కేసు గురించి ఇప్పడేం మాట్లాడలేను. జీవితాన్ని పలు దృకోణాల్లో చూడడం ఇప్పుడే నేర్చుకున్నా. దారిలో ఎందరినో కలుసుకున్నా. ఇదొక ప్రయాణం. ఓపికగా ఎంతో నేర్చుకున్నా. ఇప్పుడు సంతోషంగా ఉంది అని చెప్పింది యాభై ఏళ్ల ఇంద్రాణి ముఖర్జీ. బయటకు వెళ్లాక ఏం చేస్తారు అనే ప్రశ్నకు.. జైళ్లో ఎంతో నేర్చుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా అంతే. ఎలాంటి ఆలోచనలు లేవు. న్యాయవ్యవస్థ మీద నమ్మకం మళ్లీ వచ్చింది. ఆలస్యం అయినా న్యాయం జరిగిందని నమ్ముతున్నా. సంతోషం తప్ప.. వేరే ఏ భావోద్వేగం లేదు నాలో. త్వరలో ఓ బుక్ రాయాలనుకుంటున్నా. కానీ, అది జైలు జీవితం గురించి మాత్రం కాదు అని చెప్పారామె. చదవండి: ఇంద్రాణి ముఖర్జీ పతనం ఎలా అయ్యిందంటే.. -
Indrani Mukerjea: కూతురి హత్య కేసులో ఆరేళ్ల తర్వాత బయటకు..
చాలా చాలా సంతోషంగా ఉంది.. బెయిల్ మీద బయటకు వచ్చిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన మొదటి మాట ఇది. సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ జైలు నుంచి బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయగా.. రెండు లక్షల రూపాయల షూరిటీ బాండ్ మీద అనుమతి ఇచ్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. శుక్రవారం సాయంత్రం దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యింది ఆమె. సుమారు ఆరున్నరేళ్ల తర్వాత ఇంద్రాణి బయటి ప్రపంచాన్ని చూసింది. ముంబై: కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీ(50)కి.. సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా కోర్టు.. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆపై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో.. శుక్రవారం సాయంత్రం ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్కతాలో రిక్రూట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలు, కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులై.. ఇలా నేరపూరిత స్వభావంతో వార్తల్లోకి ఎక్కింది. ముగ్గురు భర్తల ఇంద్రాణి.. ఇంద్రాణి ముఖర్జీకి మొదటి భర్తతో కలిగిన సంతానం షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే.. మూడేళ్ల వరకు ఆ విషయం బయటకు పొక్కలేదు. 2012లో షీనా బోరాను హత్య చేయగా.. మూడేళ్ల తర్వాత ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్య కేసు గురించి తెలిసింది. షీనా బోరాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపారని.. ఆమెను తన చెల్లెలిగా పరిచయం చేసుకున్నారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఇంద్రాణీ ముఖర్జీ మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్ అనే కుమారుడు జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది. అప్పటికే పెద్దదయిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్మెయిలింగ్ మొదలుపెట్టింది. ఆమె తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇందుకోసం ప్లాన్ చేసి.. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో షీనాను హత్య చేసింది. ఈ కేసులో 2015 సెప్టెంబర్లో ఇంద్రాణీ, సంజీవ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం మూడో భర్త పీటర్ ముఖర్జియాను సైతం అదుపులోకి తీసుకున్నారు. బతికే ఉందని డ్రామాలు 2019లో జైల్లో ఉండగానే పీటర్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2020లో పీటర్కు బెయిల్ వచ్చింది. ఇంద్రాణీ జైల్లో శిక్ష పొందుతున్న సమయంలో.. తన కుమార్తె ప్రాణాలతోనే ఉందని సీబీఐకి లేఖ రాసింది. షీనా బోరాను జైలు అధికారి ఒకరు కశ్మీర్లో చూశానని చెప్పిందని ఆ లేఖలో పేర్కొన్న ఇంద్రాణి.. ఈ విషయమై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ మీద బయటకు రావడం కోసం అనేక సార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆరున్నరేళ్లపాటు శిక్ష అనుభవించాక ఎట్టకేలకు ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ 68 మందిని మాత్రమే విచారించింది. చదవండి: షీనా బతికే ఉందా? బయటకొచ్చిన ఇంద్రాణి ఏం చెప్పిందంటే.. -
షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ లెదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీకి సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని వ్యాఖ్యానించింది. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ 68 మందిని మాత్రమే విచారించింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం లేదని, బెయిల్ ఇవ్వాలంటూ ఇంద్రాణి తరఫున వాదిస్తున్న సీనియర్ లాయర్ ముకుల్ రొహ్తగి పేర్కొన్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఇప్పట్లో ఈ కేసు విచారణ పూర్తయ్యేలా లేనందున బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. ‘‘ఈ కేసులో ఆరున్నరేళ్లుగా ఇంద్రాణి జైల్లోనే ఉన్నారు. ఇప్పటివరకు 50 శాతం మంది సాక్షుల విచారణ కూడా పూర్తి కాలేదు. చాలాకాలం గా జైల్లో ఉన్నందున బెయిల్ ఇస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏమిటీ కేసు...? ఇంద్రాణి ముఖర్జీకి ఆమె మొదటి భర్తతో పుట్టిన కుమార్తె షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే మూడేళ్ల వరకు ఆ విషయమే బయటకు రాలేదు. ఇంద్రాణి తన మొదటి భర్తతో విడిపోయాక సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతనికి విడాకులిచ్చి ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. షీనా తన కుమార్తె అని కాకుండా తన చెల్లి అనే అందరికీ పరిచయం చేసింది. ఆమె కనిపించకపోతే అమెరికా వెళ్లిపోయిందని ఇంద్రాణి అందరినీ నమ్మబలు కుతూ వచ్చింది. అయితే మరో కేసులో ఇంద్రాణి డ్రైవర్ను అరెస్ట్ చేసి విచారిస్తుండగా తల్లే కుమార్తెను చంపిన విషయం తేలింది. కారులో ప్రయాణిస్తుండగా షీనా బోరాకు ఊపిరాడ నివ్వకుండా చేసి తల్లి ఇంద్రాణియే చంపితే, ఆమెకు భర్త పీటర్ ముఖర్జీ, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ సహకరించినట్టుగా తేలింది. దీంతో ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ని 2015లో అరెస్ట్ చేశారు. ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీకి మొదటి భార్య సంతానమైన రాహుల్ ముఖర్జీతో షీనా ప్రేమలో పడింది. వారిద్దరి మధ్య అఫైర్ని ఉందని తెలిసి తట్టుకోలేక ఇంద్రాణి కన్నకూతురని చూడకుండా పథకం ప్రకారం హత్య చేసిందని విచారణలో తేలింది. మరోవైపు జైల్లో ఉండగానే పీటర్, ఇంద్రాణిలు విడాకులు తీసుకున్నారు. 2019లో వారికి విడాకులు మంజూరయ్యాయి. చదవండి: గుజరాత్ కాంగ్రెస్కు బిగ్ షాక్.. హార్దిక్ పటేల్ రాజీనామా -
వైద్యం అందకపోతే చచ్చిపోతాను!
ముంబై: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలైన మీడియా బాస్ ఇంద్రాణి ముఖర్జీ సోమవారం ముంబై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కుట్ర పన్నుతోందని ఈ పిటిషన్లో ఆరోపించిన ఆమె.. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఎమోషనల్గా అభ్యర్థించారు. వీలైనంత త్వరగా తనకు వైద్యం సహాయం అందకపోతే తాను చనిపోతానని, తన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో సత్వరమే బెయిల్ ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని వేడుకున్నారు. ‘దాదాపు ఏడాది కిందట రాహుల్ ముఖర్జీ ఈ కేసులో తదుపరి సాక్షి అని ప్రాసిక్యూషన్ పేర్కొంది. 14 నెలలు అయినా ఇప్పటివరకు అతన్ని కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టలేదు. మరోవైపు అతడు కీలక సాక్షి అంటూ.. అతని సాక్ష్యం ఇవ్వని కారణంగా నాకుబెయిల్ నిరాకరిస్తూ వస్తున్నారు’ అని వాదనల సందర్భంగా ఇంద్రాణి న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇలా సాక్షిని ప్రవేశపెట్టకుండా తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. దీంతో ఈ కేసులో వాదనలను వేగవంతం చేయాలని ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లను ఆదేశించిన జడ్జి బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. -
‘చనిపోయేలోపు నా పిల్లలతో మాట్లాడనివ్వండి’
ముంబై: చనిపోయే లోపు తన పిల్లలతో మాట్లాడే అవకాశం కల్పించండి అంటూ ముంబై సీబీఐ కోర్టును వేడుకున్నారు మాజీ మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా ప్రధాన నిందితుడనే సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం సీబీఐ కోర్టుకు హాజరైన పీటర్ ముఖర్జియా ‘నేను ఎంతకాలం జీవిస్తానో నాకు తెలియదు. నేను చనిపోయేలోపు విదేశాల్లో ఉన్న నా పిల్లలతో మాట్లాడాలనుకుంటున్నాను. అందుకు నాకు అనుమతివ్వండి’ అంటూ ముఖర్జియా న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఇందుకు జడ్జి సానుకులంగా స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని తెలిపారు. షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జియా పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు రాహుల్ను పెళ్లి చేసుకోవాలనుకున్నందుకే షీనాను హత్య చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. (చదవండి: వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..) -
‘అతడు ఓ సైలెంట్ కిల్లర్; అప్పుడు తనేం చేశాడు మరి?’
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మాజీ మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియా సైలెంట్ కిల్లర్లా వ్యవహరించారని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. సవతి కూతురును దారుణంగా హత్య చేయించారనే ఆరోపణలతో 2015లో పీటర్ అరెస్టైన సంగతి తెలిసిందే. షీనా తల్లి, పీటర్ రెండో భార్య ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన నిందితురాలిగా ఉన్న ఈ కేసులో తనకు బెయిలు కావాలంటూ పీటర్ మరోసారి అప్పీలు చేశారు. ఈ క్రమంలో షీనా బోరా హత్యకేసు శుక్రవారం మరోసారి సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది.(వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..) ఈ నేపథ్యంలో పీటర్కు బెయిలు నిరాకరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ భరత్ బదామీ కోర్టుకు విఙ్ఞప్తి చేశారు. ఈ కేసులో పీటర్ ముద్దాయి అని నిరూపించడానికి సీబీఐ వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నాయని విన్నవించారు. షీనా హత్య జరిగినపుడు తన క్లైంట్ లండన్లో ఉన్నారని పీటర్ న్యాయవాది పేర్కొనగా.. ఇందుకు ప్రతిగా భరత్ వాదిస్తూ 26/11 ముంబై పేలుళ్ల కేసును ప్రస్తావించారు. ‘లష్కర్ ఏ తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ అతడికి ఈ పేలుళ్ల కేసుతో సంబంధం లేదని చెప్పలేం. అలాగే పీటర్ లండన్లో ఉన్నప్పటికీ అతడు షీనా కేసులో నిందితుడు కాకుండా పోడు’ అని వాదించారు. ‘ పీటర్కు అన్నీ తెలుసు. తన కొడుకు రాహుల్ షీనా గురించి ఆరా తీసినపుడే మందలించి ఉండాల్సింది. పీటర్ ఓ సైలెంట్ కిల్లర్. కొడుకును మార్చకుండా అతడు ఏం చేశాడు మరి’ అని భరత్ తన వాదనలు వినిపించారు. దీంతో ఆయన బెయిలు అప్పీలు మరోసారి తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది.(‘ఆ రెండు రోజులు ఎవరినీ ఫ్లాట్లోకి రానివ్వలేదు’) షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు రాహుల్ను పెళ్లి చేసుకోవాలనుకున్నందుకే షీనాను హత్య చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. -
‘ఆ రెండు రోజులు ఎవరినీ ఫ్లాట్లోకి రానివ్వలేదు’
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు విచారణలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. షీనా తల్లి, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ కలిసి ఉద్దేశపూర్వకంగానే షీనా బోరాను హత్యచేసినట్లు ఇటీవలే కీలక సాక్షి సీబీఐ కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్.. వర్లీ ఏరియాలోని మార్లో బిల్డింగ్(ఇంద్రాణీ- పీటర్ల నివాసం) మేనేజర్ మధుకర్ ఖిల్జీని విచారించారు. ఈ క్రమంలో... షీనా బోరా హత్య జరిగిన నాటి నుంచి(ఏప్రిల్ 24, 2012) రెండు రోజుల పాటు (ఏప్రిల్ 24-26) రెండు రోజుల పాటు ఇంద్రాణీ తన ఫ్లాట్లోకి ఎవరినీ రానివ్వలేదని మధుకర్ పేర్కొన్నాడు. షీనాతో పాటుగా ఆమె సోదరుడు మైఖేల్ బోరాను కూడా హత్య చేసేందుకు ఇంద్రాణీ ప్రణాళిక రచించారని తెలిపాడు. ’ షీనా తన చెల్లెలని ఇంద్రాణీ చెప్పారు. ఏప్రిల్ 23 న నన్ను పిలిచి తన అనుమతి లేకుండా ఎవరినీ ఫ్లాట్ దగ్గరికి కూడా రానివ్వొద్దని చెప్పారు. ముఖ్యంగా పీటర్ కొడుకు రాహుల్ ముఖర్జీ(ఇంద్రాణీ సవతి కొడుకు)ని అస్సలు అనుమతించొద్దన్నారు. అందుకే రాహుల్ మార్లోకు వచ్చినప్పుడు మేము అడ్డుకున్నాం’ అని మధుకర్ కోర్టుకు తెలిపాడు. కాగా ఇప్పటికే ఈ కేసులో మధుకర్తో కలిసి 28 సాక్షులను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలు, షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న ఇంద్రాణీ ప్రస్తుతం బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు సీబీఐ కోర్టులో బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా 27వ సాక్షిని ప్రాసిక్యూషన్ లాయర్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా... షీనా తల్లి, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ కలిసి ఉద్దేశపూర్వకంగానే షీనా బోరాను హత్యచేసినట్లు సదరు సాక్షి పేర్కొన్నారు. ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న ఇంద్రాణి స్నేహితుడు, ఆమె వద్ద పనిచేసే ఉద్యోగి అయిన ప్రితుల్ సంఘ్వీ విచారణలో భాగంగా పలు విషయాలు కోర్టుకు వెల్లడించారు.‘ 2002 నుంచి నాకు ఇంద్రాణి పరిచయం. నా ఇంట్లో తను అద్దెకు ఉండేది. ఆ తర్వాత ఆమె కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యాను. ఇంద్రాణి, ఆమె భర్త పీటర్ ముఖర్జీ ఇచ్చే పార్టీలకు తరచుగా హాజరయ్యేవాడిని. ఆ సమయంలో షీనా కూడా ఒకటి రెండుసార్లు అక్కడికి వచ్చింది. ఇంద్రాణి.. షీనాను తన చెల్లిగా మా అందరికీ పరిచయం చేసింది. అయితే పీటర్ కొడుకు రాహుల్తో షీనా రిలేషన్షిప్లో ఉండటం ఆ దంపతులిద్దరికీ నచ్చలేదు. 2008 నుంచి వాళ్లను విడదీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ కుదరకపోవడంతో ఓరోజు.. వాళ్లిద్దరు ఉండే ఏరియాకు నన్ను కూడా రమ్మన్నారు. అయితే నాకు ఆరోజు వేరే పని ఉండటంతో రాలేనని చెప్పాను. ఆ తర్వాత ఇంద్రాణి.. షీనాను తనతో పాటు తీసుకువెళ్లగా, రాహుల్ని.. పీటర్ తీసుకువెళ్లాడు. ఇంతలోనే షీనా కనిపించడం లేదనే వార్త బయటికి వచ్చింది’ అని ప్రితుల్ సింగ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షీనాను హత్య చేయడం వెనుక ఇంద్రాణికి ఉన్న ఉద్దేశమేమిటో నిరూపించేందుకు సీబీఐకి బలమైన సాక్ష్యం లభించినట్లైంది. (విడిపోనున్న ఇంద్రాణి దంపతులు) ఇంద్రాణి- పీటర్ ముఖర్జీ షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
విడిపోనున్న ఇంద్రాణి దంపతులు
సాక్షి, ముంబై : షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం ముంబైలోని ఫ్యామిలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్న ముఖర్జియా దంపతులు.. ఆస్తుల పంపకానికి సంబంధించిన విషయాలను కూడా పిటిషన్లో పొందుపరిచారు. బ్యాంకు అకౌంట్లతో సహా.. ఇప్పటివరకు సంయుక్తంగా లావాదేవీలు జరిపిన బ్యాంకు అకౌంట్లను ఇకపై వ్యక్తిగత అకౌంట్లుగా మార్పు చేసుకునేందుకు ఇరువురు అంగీకరించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఇద్దరి పేరిట సిండికేట్ బ్యాంకులో ఉన్న 53 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు, అంతర్జాతీయ బ్యాంకుల్లో కలిగి ఉన్న అకౌంట్లు, విదేశాల్లో ఉన్న బంగ్లాలు, విలువైన నగలు, ఖరీదైన వాచ్లు, బ్యాంకు లాకర్లను సమంగా పంచుకునేందుకు తామిద్దరికీ సమ్మతమేనని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా 16 ఏళ్ల క్రితం ఇంద్రాణి, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. వైవాహిక జీవితంలో ఆటుపోట్ల వల్లనే.. దక్షిణ ముంబైలో ఓ ఫైవ్ స్టార్ హోటర్లో ఇంద్రాణి, పీటర్ల ప్రేమ చిగురించింది. 2002లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లైన కొన్ని ఏళ్లలోనే వీరి వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. పీటర్ కొడుకు రాహుల్తో.. ఇంద్రాణి కూతురు(మొదటి భర్త ద్వారా జన్మించింది) షీనా బోరా సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత ఆమెను 2012లో చంపేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 2015 ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
ఆస్పత్రిలో చేరిన ఇంద్రాణి ముఖర్జియా
ముంబై : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలు, షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కాగా షీనా బోరా హత్య కేసులో భాగంగా కోర్టుకు హాజరైన ఇంద్రాణి వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మ గురువారం పలు సంచలన విషయాలు వెల్లడించారు. షీనా హత్య తర్వాత తమ అవసరాల నిమిత్తం ఇంద్రాణి ముఖర్జియా తనచేత షీనా పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేయించారని, తనకు తేదీలు అంతగా గుర్తుకులేవని, అయితే 2012జూన్-జూలై నెలల్లో ఈ పని చేసినట్లు కాజల్ శర్మ ఒప్పుకున్నారు. ఇంద్రాణి అరెస్టయ్యే వరకు కూడా షీనా బోరాకు సోదరిగానే ఆమె తెలుసునన్నారు. షీనా ఇంద్రాణి సోదరి కాదు కూతురని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఇంద్రాణి దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత పనిభారం పెరిగిపోయిందని, నమ్మకంగా పని చేయడం తప్ప తానేం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంద్రాణి ఆస్పత్రిలో చేరడం గమనార్హం. కాగా ఆమె ఇది వరకు కూడా పలుమార్లు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
ఇంద్రాణీ చెబితే.. తప్పక అలా చేశా!
ముంబై : సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో మరో విషయం వెలుగుచూసింది. షీనాను హత్య చేసిన తర్వాత ఆమె పేరుతో ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. షీనాను హత్య తర్వాత తమ అవసరాల నిమిత్తం ఇంద్రాణీ ముఖర్జియా అప్పటి తన వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మతో చెప్పి ఆ మెయిల్ ఐడీ క్రియేట్ చేయించారు. తనకు తేదీలు అంతగా గుర్తుకులేవని, అయితే 2012జూన్-జూలై నెలల్లో ఈ పని చేసినట్లు కాజల్ శర్మ ఒప్పుకున్నారు. ఇంద్రాణీ అరెస్టయ్యే వరకు కూడా షీనా బోరాకు సోదరిగానే ఆమె తెలుసునన్నారు. షీనా సోదరి కాదు కూతురని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. రాజీనామా లేఖలో షీనాబోరా సంతకాన్ని ఫోర్జరీ చేశానని, ఇంద్రాణీ నుంచి తనకు ఎలాంటి తప్పుడు సంకేతాలు రాకపోవడంతో ఆ పని చేసినట్లు వెల్లడించారు. ఇంద్రాణీ దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత పనిభారం పెరిగిపోయిందని, నమ్మకంగా పని చేయడం తప్పా తానేం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ స్కైప్ ఐడీ నుంచి కాల్స్ కూడా మాట్లాడినట్లు కోర్టులో వివరించారు. 2012 ఏప్రిల్లో షీనా బోరా హత్యకు గురికాగా, మూడేళ్ల అనంతరం 2015లో ముంబై పోలీసులు ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీని అరెస్టు చేశారు. అనంతరం ఈ కుట్రలో భాగమైనందున పీటర్ ముఖర్జీయాను సైతం అదుపులోకి తీసుకున్నారు. షీనాను హత్య చేసేందుకు ఇంద్రాణి, పీటర్ ముందే కుట్ర చేశారని ఇంద్రాణి ముఖర్జీ మాజీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ తన వాంగ్ములంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
విడాకులు కోరుతున్న ఇంద్రాణి
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు అయిన ఇంద్రాణి ముఖర్జియా తన పెళ్లి జీవితానికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నారు. విడాకులు కోరుతూ తన భర్త పీటర్ ముఖర్జియాకు నోటీసులు పంపించారు. ఈ కేసులో సహ నిందితుడు పీటర్ నుంచి పరస్పర అంగీకారం ద్వారా విడాకులు కోరుతున్నట్టు లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు చేసుకోలేదు. ఏప్రిల్ 25న ఈ నోటీసులు పంపినట్టు తెలిసింది. తమిద్దరి వివాహ బంధం సయోధ్యగా ఉండేందుకు ఎలాంటి అవకాశం లేదని, విడాకుల అనంతరం ఒకరి జీవితంలోకి మరొకరం ఎలాంటి జోక్యం చేసుకోమని ఇంద్రాణి చెప్పారు. కాగా, పీటర్ ముఖర్జియా ఇంద్రాణికి రెండో భర్త. ఇంద్రాణికి అంతకముందు సంబంధం ద్వారా జన్మించిన కూతురు షీనా బోరా. ఇంద్రాణి, తన ప్రస్తుత భర్త పీటర్తో కలిసి అత్యంత పాశవికంగా తన చేతులతోనే గొంతుపిసికి చంపేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. పీటర్ కొడుకు రాహుల్తో షీనా బోరా సంబంధం పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోవడంతో ఆ ఘాతుకానికి పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి. దక్షిణ ముంబైలో ఓ ఫైవ్ స్టార్ హోటర్లో ఇంద్రాణి, పీటర్ల ప్రేమ చిగురించింది. 2002లో వీరిద్దరికి పెళ్లి జరిగింది. పెళ్లైన కొన్ని ఏళ్లలోనే వీరి వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. పీటర్ కొడుకు రాహుల్తో షీనా బోరా సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత ఆమెను 2012లో చంపేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 2015 ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంద్రాణి అరెస్ట్ తర్వాత పీటర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే షీనాను చెల్లిగా తనకు ఇంద్రాణి పరిచయం చేసిటనట్టు పీటర్ చెప్పారు. అసలు విషయం తాను గుర్తించలేకపోయినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంద్రాణి, పీటర్ అసలు మాట్లాడుకోవడం లేదని తెలిసింది. పీటర్ మొదటి భార్యకు ఇద్దరు కొడుకులున్నారు. ఇంద్రాణి, పీటర్ ప్రస్తుతం బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ముంబై, గోవా, ఇంగ్లాండ్లో వీరు ఆస్తులు కొన్నట్టు తెలుస్తోంది. -
ఇంద్రాణి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. ఐఎన్ఎక్స్ మీడియా ఆదాయపు పన్ను ఎగవేత, ఇతరత్రా ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం ఇంద్రాణి జ్యుడీషియల్ కస్టడీని 2 వారాలు పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ ఫిబ్రవరి 5న ప్రత్యేక న్యాయస్థానం ఇంద్రాణిని అరెస్ట్ చేయాని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే షీనాబోరా హత్యకేసులో నిందితురాలైన ఇంద్రాణి ఇదివరకే అరెస్టయి ముంబైలోని బైకుల్లా జైల్లో కస్టడీలో ఉంది. ఐఎన్ఎక్స్ మీడియా ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) నియమాలను ఉల్లంఘించి మారిషస్ నుంచి పెట్టుబడులు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి.మనీ లాండరింగ్ విషయంలో ఐఎన్ఎక్స్ మీడియా అధిపతి పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణిపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. కాగా, 2012 ఏప్రిల్ 23న జరిగిన షీనా బోరా హత్యకు గురికాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్ గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పిన విషయం తెలిసిందే.షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్ ముఖర్జియా పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
షీనా బోరా కేసు విచారణాధికారి భార్య అనుమానాస్పద మరణం
ముంబై: షీనా బోరా హత్య కేసులో విచారణ అధికారి భార్య ఆకస్మికమరణం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారి భార్య అనుమానాస్పద రీతిలో మరణించింది. దర్యాప్తు బృందంలోని పోలీస్ అధికారి ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ శాంతక్రూజ్ ప్రాంతంలోని ఇంటిలో మంగళవారం రాత్రి చనిపోయారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ధ్యానేశ్వర్ చనిపోయి వున్నభార్యను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ముంబై పోలీస్ ప్రెస్ నోట్ ప్రకారం పోలీస్ అధికారి ఉదయం 03:30 గంటలకు ఇంటికి వచ్చి భార్య ఎంతకీ తలుపు తీయలేదు. ఫోన్ చేసినా ఫలితం లేదు. చివరకి ఏదో విధంగా తలుపు తెరిచి చూడగా రక్తపు మడుగులోఉన్న భార్య ను చూసి షాకైన అధికారి పై అధికారులకు సమాచారం అందించారు. మరోవైపు ఈ సంఘటన అనంతరం కొడుకు కూడా కనిపించకుండా పోయాడు. అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. సంఘటనా స్థలంలో హత్య సమయంలో ఉపయోగించిన ఆయుధంగా భావిస్తున్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు మొదలుపెట్టారు. -
ఇంద్రాణి ముఖర్జీయాకు చుక్కెదురు
న్యూఢిల్లీ: షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీకి చుక్కెదురు అయింది. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గౌహతి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. అయితే పోలీస్ భద్రత మధ్య ముంబయిలో తండ్రి అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. అలాగే ఇంద్రాణి ముఖర్జీ మీడియాతో మాట్లాడరాదని ఆదేశాలు ఇచ్చింది. కాగా 2012 ఏప్రిల్ నెలలో కన్న కూతురుని ఇంద్రాణి ముఖర్జీ దారుణంగా చంపేసి అనంతరం రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే. -
షీనా హత్య కేసులో కీలక విషయాలు
దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీతో కలిసి పీటర్ ముఖర్జీ తన తనయుడు రాహుల్ను తప్పుదోవ పట్టించిన టేపులు బహిర్గతమయ్యాయి. షీనా అదృశ్యమైనప్పుడు రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు తండ్రి, పిన్నతల్లితో సంభాషించిన రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఈ రికార్డుల ద్వారా పీటర్ ముఖర్జీ కూడా షీనా హత్య కేసులో కుట్రదారుడేనని తేలింది. రాహుల్ ఈ సంభాషణలను తన బ్లాక్ బెర్రీ స్మార్ఫోన్లో రికార్డు చేశాడు. ఈ ఆధారాలే కేసు విచారణకు కీలకంగా మారాయి. మొదట ఈ టేపులను ఖార్ పోలీసులకు అనంతరం సీబీఐకు రాహుల్ సమర్పించాడు. రాహుల్ సమర్పించిన టేపుల సంభాషణలతో పీటర్కు ఈ హత్య, నేరపూరిత కుట్రలో భాగమున్నట్టు తేలింది. మొత్తం 20 రికార్డింగ్లో 7 టేపులు అవసరమైనవిగా, మిగతా 13 టేపులు కేసుకు సంబంధం లేనివిగా సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్కు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. సీబీఐ విచారణలో ఈ టేపులను ఇప్పటికే కీలక ఆధారాలుగా పరిగణించినట్టు పేర్కొన్నారు. సంభాషణలో కొన్ని భాగాలు... పీటర్, రాహుల్ సంభాషణలో... షీనా గురించి తన తండ్రిని రాహుల్ అడిగాడు. కానీ తనకేమీ తెలియదని జవాబు ఇచ్చాడు. కానీ షీనా చివరి మెసేజ్ ఇంద్రాణికే పంపించిందని తెలియగానే, ఈ విషయంపై చర్చించడానికి గోవాకు రావాలని రాహుల్ను పీటర్ ఆదేశించాడు. షీనా ఎవరికీ చెప్పకుండా ఎటు వెళ్లదు. తను అలాంటి వ్యక్తి కాదు. షీనా కనిపించకుండా పోవడంపై కొంత బాధను రాహుల్ వ్యక్తపరిచాడు. ఎవరికీ టచ్ లేదు. కనీసం సోషల్ మీడియా అకౌంట్లలో కూడా యాక్టివ్గా లేదు. మరో టేపు సంభాషణ.. షీనా తన కంపెనీ హెచ్ఆర్ మేనేజర్కు కాంటాక్ట్లోనే ఉందని రాహుల్కు ఇంద్రాణి చెప్పింది. షీనా లీవ్ తీసుకుంటున్నట్టు హెచ్ఆర్ తెలిపినట్టు ఇంద్రాణి రాహుల్కు తెలిపింది. కానీ అధికారికంగా రాజీనామా చేయలేదని వెల్లడించింది. షీనా తన సెల్ఫోన్ను వాడితే తాము కనుక్కుంటామని పోలీసులు వెల్లడించినట్టు కూడా ఇంద్రాణి పేర్కొంది. నీ నుంచి విడిపోవాలని షీనా భావించిదేమో.. డబ్బున్న మరో వ్యక్తి తనకు దొరికాడేమో అని రాహుల్ను ఇంద్రాణి ఓదార్చింది.. తన దగ్గర్నుంచి కూడా డబ్బులు రాబట్టుకున్నాక అసలు కాంటాక్టులోనే లేకుండా పోయిందని ఇంద్రాణి నాటకాలు ఆడింది. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి వెళ్లింది. షీనాను మరచిపోవాలని రాహుల్కు పీటర్, ఇంద్రాణి సూచించారు. షీనా బోరా హత్య జరిగిన వెంటనే ఇంద్రాణి తన భర్త పీటర్కు ఫోన్ చేసినట్టు సీబీఐ దర్యాప్తులో కూడా వెల్లడైంది. షీనా, రాహుల్ ప్రేమను అటు ఇంద్రాణి, ఇటు పీటర్ వ్యతిరేకించారు. విడిపోయేందుకు ఇద్దరు అంగీకరించకపోవడంతో హత్య చేసినట్టు సీబీఐ గుర్తించింది. కన్న కూతురు హత్య కేసులో తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్రాయ్ను తొలుత అరెస్టు చేశారు. పీటర్ అమాయకుడని తొలుత భావించినప్పటికీ, హత్యలో పీటర్కు ప్రమేయం ఉన్నట్టు తాజా రికార్డులో కూడా వెల్లడైంది. 2012 ఏప్రిల్ 24న షీనా కనిపించకుండా అయింది. మూడేళ్ల తర్వాత ముంబై పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని అరెస్టు చేశారు. అనంతరం ఈ కుట్రలో భాగమైనందున పీటర్ను సైతం అదుపులోకి తీసుకున్నారు. షీనాను హత్య చేసేందుకు ఇంద్రాణి, పీటర్ ముందే కుట్ర చేశారని ఇంద్రాణి ముఖర్జీ మాజీ డ్రైవర్ శ్యామ్వార్ రాయ్ తన వాంగ్ములంలో తెలిపాడు. -
షీనా హత్య కేసులో బయటపడ్డ టేపులు
-
'ఆ హత్యలో నాకూ భాగం ఉంది.. నాకన్నీ తెలుసు'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో కీలక పురోగతి వైపు మళ్లింది. ఈ కేసులో కీలక నిందితుడు, ఇప్పటికే అరెస్టయి జైలులోనే ఉన్న విచారణ ఖైదీ.. ఇంద్రాణీ డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అప్రూవర్ గా మారాడు. కోర్టులో పలు నిజాలు చెప్పేందుకు అంగీకరించాడు. తాను ఇప్పటి వరకు చెప్పని అంశాలు ఇప్పుడు కోర్టు ముందు ఉంచుతానని అన్నాడు. ఈ నేరానికి సంబంధించిన విషయాలు తనకు తెలుసని, ఈ హత్యలో తాను కూడా ఒక భాగస్తుడినని తెలిపాడు. షీనా బోరాను గొంతునులిమి ఊపిరి ఆగకుండా చేసి హత్య చేసినట్లు కోర్టుకు చెప్పాడు. -
ఇంద్రాణీకి పీటర్ విడాకులు..!
షీనా బోరా హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణీ ముఖర్జీయాకు ఆమె భర్త పీటర్ ముఖర్జీయా విడాకులు ఇవ్వదలుచుకున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంద్రాణీ పుట్టినరోజున ఆమెకు గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇస్తానని లేఖ రాసిన పీటర్.. తాజాగా విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు ఆయన లాయర్ మిహిర్ ఘీవాలా తెలిపారు. షీనా కేసులో గత నవంబర్ లో పీటర్ ను కూడా నిందింతుడిగా చేరుస్తూ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీటర్ అరెస్టయిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 40కుపైగా ఉత్తరాలను ఇంద్రాణీ రాసింది. వాటిలో తాను ఏ తప్పు చేయలేదని, 2016లో మంచి జీవితం ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. మొదట్లో వాటికి సమాధానం ఇవ్వని పీటర్ డిసెంబర్21న వచ్చిన లేఖకు మాత్రం జనవరిలో ఇంద్రాణీ పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి సమాధానం ఇచ్చారు. 2015 సెప్టెంబర్ నుంచి బైకుల్లా మహిళా కారాగారంలో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణీ తరచుగా తన ఒంటరితనాన్ని పీటర్ తో పంచుకోవడానికి ప్రయత్నించారని, తనకున్న వ్యాధి (మెదడుకు రక్తప్రసరణ సరిగా అవకపోవడం) ముదురుతోందని త్వరలోనే మరణిస్తానని ఆమె లేఖలో తెలిపిందని పీటర్ మరో లాయర్ ఆబోద్ పాండా తెలిపారు. తన చివరి రోజులు భరించలేని నొప్పితో కూడుకొని ఉంటాయా? అని డాక్టర్లను ప్రశ్నించినప్పుడు.. వారు అదేం ఉండదని ముందు కోమాలోకి వెళ్లి తర్వాత మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారని ఇంద్రాణీ లేఖలో వివరించింది. అందుకు సమాధానంగా.. విధిరాతను ఎవరూ మార్చలేరు. తాను జైలు అధికారులతో మాట్లాడుతానని ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తనకు తెలపాలని కోరతానని చెప్పారు. కాగా గురువారం పీటర్ ముఖర్జియా బెయిల్ పిటీషన్ పై కోర్టులో మళ్లీ వాదనలు జరగనున్నాయి. -
'షీనా హత్య ప్రతి కదలిక ఆయనకు తెలుసు'
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు అవాక్కయ్యే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్వయంగా తానే కన్న కూతురుని చంపించినట్లు ఒప్పుకోగా.. ఆ వరుసలో త్వరలోనే ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా కూడా చేరనున్నారు. షీనా హత్యకు సంబంధించిన ప్రతి చిన్న విషయం పీటర్ కు ముందే తెలుసని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ పీటర్ ముఖర్జియా సీబీఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి కూడా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ అధికారుల తరుపు న్యాయవాది భరత్ బాదామి కోర్టుకు ఏం చెప్పారంటే.. 'షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా కీలక పాత్ర పోషించారు. హత్యకు సంబంధించిన ప్రతి కదలిక పీటర్ కు తెలుసు. హత్య జరగడానికి ఒక రోజు కూడా పీటర్ కు ఇంద్రాణి ఫోన్ చేసింది. 686 సెకన్లు(దాదాపు 11 నిమిషాలు పైగా) మాట్లాడింది. హత్య ప్రణాళికను ఎలా పూర్తి చేయాలని వారు డిస్కస్ చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంద్రాణి ఆయనకు తెలియజేసింది' అని వెల్లడించారు. గతంలో కూడా పీటర్ కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. -
త్వరలో షీనా బోరాపై సినిమా విడుదల!
ముంబై: షీనాబోరా హత్య ఆధారంగా నిర్మిస్తున్న బెంగాలీ చిత్రం 'డార్క్ చాక్లెట్' విడుదలపై బొంబాయి హైకోర్టు స్టేను తిరస్కరించింది. ఈ చిత్రానికి సంబంధించి కోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్లపై కోర్టుకు నమ్మకం ఉందని.. ఈ చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలలించిన మీదటే విడుదలకు సర్టిఫిట్ ను ఇస్తారని అంది. త్వరలో రానున్న చిత్ర విడుదలను సవాలు చేస్తూ షీనా పిన తండ్రి పీటర్ ముఖర్జీయా వేసిన పిటీషన్ను డివిజన్ బెంచ్ సిట్టింగ్ జడ్జీ ఎస్సీ ధర్మధికారీ గురువారం విచారించారు. ఈ సినిమా విడుదలయితే తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని పీటర్ కోర్టుకు తెలిపారు. సినిమాను విడుదల చేయడానికంటే ముందే తనను వీక్షించేందుకు అనుమతించాలని, ఆమేరకు వారికి ఆదేశించాలని కోర్టును కోరారు. సినిమా ఇంకా పూర్తి కాలేదని నిర్మాణానంతరం సీబీఎఫ్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఏవైనా అనుమానాలు ఉంటే మరలా కోర్టుకు రావొచ్చని ధర్మాసనం తెలిపింది. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ప్రజావాణీలో ఈ కేసు గురించి వినిపించిన కథనే తాము తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. చిత్ర దర్శకుడు అగ్నిదేవ్ ఛటర్జీ, నిర్మాతలు మాట్లాడుతూ న్యాయస్థానాలపై వారికి పూర్తి నమ్మకం ఉందని అన్నారు. త్వరలో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసి సెన్సార్ బోర్డుకు పంపుతామని చెప్పారు. ఈ చిత్రంలో మహిమా చౌదరి, రియా సేన్లు ఇంద్రాణీ ముఖర్జీయా, షీనాబోరా పాత్రల్లో కనిపించనున్నారు. -
'వాళ్లను ఉరి తీయండి'
గువాహటి: తన తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు మరణశిక్ష విధించాలని షీనా బోరా సోదరుడు మైఖేల్ కోరుకుంటున్నాడు. తన సోదరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితులకు ఉరి శిక్ష పడాలిని కోరుకుంటున్నట్టు చెప్పాడు. షీనా బోరా హత్య గురించి ఇంద్రాణి రెండో పీటర్ ముఖర్జియాకు అంతా తెలుసునని తాను ముందు నుంచి చెబుతున్నానని గుర్తు చేశాడు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరగదని అన్నాడు. భార్య(ఇంద్రాణి)తో కలిసి జీవిస్తున్న పీటర్ కు ఇందతా తెలియకుండా ఎలా వుంటుందని మైఖేల్ ప్రశ్నించాడు. పీటర్ పై సీబీఐ మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో అతడు స్పందించాడు. 'నా సోదరి షీనా బోరా హత్యకు సుదీర్ఘమైన కుట్ర జరిగింది. నన్ను చంపేందుకు కూడా ప్రణాళిక వేశారు. నలుగురు నిందితులు ఇంద్రాణి, పీటర్, సంజీవ్ ఖన్నా, శ్యామవర్ రాయ్ లను ఉరి తీయాలి. వీరికి జీవించే హక్కు లేద'ని మైఖేల్ పేర్కొన్నాడు. -
ఆవు ప్లస్ ఆ నలుగురు
న్యూఢిల్లీ: సమాజంలో మంచికైనా, చెడుకైనా సంచలనం సృష్టించిన అంశాలు ఈ ఏడాది ప్రధానంగా ఐదు ఉన్నాయి. అందులో ఆవు అంశం ఒకటి. హిందువుల ఆరాధించే ఆవు మాంసాన్ని ఎవరూ కలిగి ఉండరాదని, తినకూడదని, అలా చేస్తే పదేళ్లు జైలు శిక్ష విధిస్తామంటూ మహారాష్ట్రలోని బీజేవీ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చి సంచనలం సృష్టించింది. అదే తరహాలో హర్యానా కూడా కఠిన చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడమే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు ముస్లింల హత్యలకు దారి తీశాయి. ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో ఓ ముస్లిం కుటుంబం ఆవు మాంసం భద్రపర్చారనే మిషతో ఆ ఇంటిమీద కొంత మంది దాడులు జరిపి ఇంటి యజమానిని కొట్టి చంపారు. మరోచోట ఆవులను ఎత్తుకుపోతున్నారన్న ఆరోపణలతో ఓ ట్రక్కు డ్రైవర్ను హతమార్చారు. ఆవు మాంసం వడ్డిస్తున్నారన్న ఫిర్యాదుపై ఢిల్లీలోని కేరళ హౌస్పై ఢిల్లీ పోలీసులు దాడులు జరిపారు. దీనిపై రాజకీయ దుమారం కూడా రేపింది. ఇది చివరకు దేశంలో అసహనం పెరిగిపోతోందన్న ఆందోళనకు దారితీసింది. రెండో అంశం షీనా బోరా 24 ఏళ్ల షీనా బోరా హత్య కేసు. మూడేళ్ల క్రితం జరిగిన ఆమె హత్య కేసు రోజుకో మలుపుతిరుగుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీడియాకు ప్రధాన కథాంశంగా మారింది. ఈ కేసులో అరెస్టయిన ఇందిరాణి ముఖర్జీ చుట్టూ పలు కథనాలు వెలువడ్డాయి. ఊహంచని విధంగా గత నవంబర్ మారు తండ్రి, మీడియా బిగ్విగ్ పీటర్ ముఖర్జీ కూడా అరెస్టయ్యారు. 500 నుంచి 600 కోట్ల రూపాయల లావా దేవీలకు సంబంధించిన ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా బదిలీ అవడంతో కేసు దర్యాప్తు బలహీనపడినట్టు కనిపిస్తోంది. ఏదే మైనా వార్తలపరంగా ఈ కేసు 2015 సంవత్సరానికి ‘గాసిప్ ఇయర్’ అన్న పేరును తెచ్చింది. మూడో అంశం హార్థిక్ పటేల్ హార్థిక్ పటేల్ కూడా ఈ ఏడాది దేశంలో సంచలనం సృష్టించారు. వ్యాపారంలోనూ వ్యవసాయంలోనూ రాణిస్తున్న పటేళ్ల వర్గానికి బీసీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టిన పటేల్ అనతి కాలంలోనే ఏ రాజకీయ నాయకుడికిరానంత పేరు తెచ్చుకున్నారు. నాలుగైదు లక్షల మందితో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం గుండెల్లో గుబులు పుట్టించారు. సోషల్ మీడియాలో కూడా హీరో అనిపించుకున్నారు. అయితే, ఎంత వేగంగా హీరో అయ్యారో, అంతేవేగంగా జీరో అయ్యారు. ఇది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే! మహేశ్ శర్మ ఆరెస్సెస్లో సుదీర్ఘకాలంగా సభ్యుడిగా ఉన్న డాక్టర్ మహేశ్ శర్మ ఊహించని విధంగా మంత్రిపదవి దక్కించుకొని చ ర్చల్లో వ్యక్తి అయ్యారు. లోక్సభకు మొదటిసారి ఎన్నికైన ఆయన సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా స్వతంత్య్ర బాధ్యతలు నిర్విహ స్తూ ‘దాద్రి’ సంఘటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా సంచలనం సృష్టించారు. దాద్రి సంఘటన యాదృశ్ఛికంగా జరిగిందే తప్పా ఎవరు ఉద్ధేశపూర్వకంగా చేసింది కాదంటూ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఎవరినైనా కొడితే శరీరానికే గాయాలవుతాయని, ఆవును చంపితే మాత్రం మనిషిలోని గుండెకాయకు గాయం అవుతుందనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంకు కేటాయించిన బంగాళాను దక్కించుకోవడం ద్వారా కూడా శర్మ సంచలనం సృష్టించారు. మొదటిసారి ఎంపీ అయినావారెవరికి ఇలాంటి బంగళాను కేటాయించిన చరిత్ర దేశంలో లేదు. పహ్లాజ్ నెహ్లాని 2015, జనవరిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) చైర్మన్గా నియమితులైన పహ్లాజ్ నెహ్లాని తన వివాదాస్పద నిర్ణయాలతో సంచలనం సృష్టించారు. బాంబే అనే పదంతోపాటు 13 ఆంగ్ల పదాలను, 11 హిందీ పదాలను సినిమాల్లో వాడకూడదంటూ నిషేధం విధించారు. ఇటీవల వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ చిత్రంలో ముద్దు సీన్ను కుదించారు. ఎందుకు ఇలా చేశారంటూ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నించగా ‘మీరు ఇంట్లో తలుపులు తెరచుకొని అందరికి కనపడేలా సెక్స్లో పాల్గొంటారా?’ లాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. -
హోం ఫుడ్ తినేందుకు కోర్టు అనుమతి
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాకు ఇంటి నుండి తీసుకొచ్చిన ఆహారాన్ని తీసుకోవడానికి శుక్రవారం కోర్టు అనుమతించింది. షీనా బోరా హత్య కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న ముఖర్జియాను నవంబర్ 19 న అరెస్టు చేసి సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఆర్థర్ రోడ్డులోని జైలులో ఉన్నారు. తనకు గుండె సంబంధిత సమస్యలున్నాయని, వృద్దాప్యంలో ఉన్నందున హోం ఫుడ్ తీసుకునేందుకు అనుమతించాలని కోరుతూ ముఖర్జియా కోర్టును అభ్యర్థించారు. అయితే ముఖర్జియా అభ్యర్థనను సీబీఐతో పాటు జైలు అధికారులు వ్యతిరేకించారు. ఆయనకు అవసరమైనటువంటి తక్కువ ఆయిల్తో వండిన అహారాన్ని తాము అందించగలమని కోర్టుకు తెలిపారు. కాగా, ముఖర్జియా అభ్యర్థనను మానవతా దృక్పథంతో ఆలోచించిన మేజిస్ట్రేట్ కోర్టు.. ఇంటి నుండి తీసుకువచ్చిన ఆహారాన్ని.. జైలు అధికారి పర్యవేక్షణలో తీసుకోవడానికి ఆయనకు అనుమతిచ్చింది. -
కూతుర్ని చంపి పార్టీ చేసుకున్నారట!
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరిన్ని దిగ్ర్భాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీబీఐ విచారణలో భాగంగా సంజీవ్ ఖన్నా స్నేహతుడు, వ్యాపారవేత్త మంగలేష్ జలన్ (60)ను ప్రశ్నించారు. ఈ క్రమంలో షీనా హత్య తరువాత, ఆమె మృతదేహాన్ని ముంబైకి తరలించే ముందు కోలకత్తాలో్ని ఒక ప్రముఖ క్లబ్ లో మందు పార్టీ చేసుకున్నారని తెలిపారు. సీబీఐకి సమర్పించిన చేతిరాతలో ఉన్న ఒక పేజీ రిపోర్టులో ఆయన కీలకమైన విషయాలను వెల్లడించారు. షీనా హత్య తరువాత ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా ఏప్రిల్ 25న కోలకత్తా క్రికెట్ అండ్ ఫుట్బాల్ క్లబ్ లో పార్టీ చేసుకుంటూ చాలా ఉత్సాహంగా కనిపించారన్నారు. ఇద్దరూ మద్యం తాగుతూ కులాసాగా, సంతోషంగా ఉండడడాన్నిగమనించిన తాను ఖన్నాను ప్రశ్నించానన్నారు. ముంబైలో ఉన్న తన కూతురు విధిని చూడ్డానికి వెళుతున్నానంటూ ఖన్నా ఉత్సాహంగా చెప్పారన్నారు. సీసీ అండ్ ఎఫ్సీ లో చాలా సీనియర్ సభ్యుడైన ఖన్నా తనకు 30 ఏళ్లుగా తెలుసనన్నారు. కానీ ఇంద్రాణితో తనకు పెద్దగా పరిచయంలేదని జలన్ సీబీఐతో చెప్పారు. కాగా షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ లను సీబీఐ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. అనంతరం ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాను కూడా నిందితునిగా పేర్కొంటూ రిమాండ్ చేసింది. తల్లీకూతుళ్ల మధ్య తగాదాలు, బెదిరింపులు, ఆస్తి వివాదాలు, రాహుల్తో ప్రేమ వ్యవహారం నచ్చని ఇంద్రాణి ముఖర్జీ.. షీనా హత్యకు పథకం వేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన సీబీఐ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సంజీవ్ ఖన్నా స్నేహితుడును జలన్ కూడా విచారించింది. ఆయన ఇచ్చిన కీలక సమాచారంతో్ షీనాబోరా హత్య కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. -
పీటర్ ముఖర్జియాకు లై డిటెక్షన్ పరీక్షలు
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో స్టార్ గ్రూప్ మాజీ సిఈవో పీటర్ ముఖర్జియాకు అధికారులు శనివారం లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించారు. పీటర్ ముఖర్జియాను షీనా బోరా హత్య కేసులో గత పది రోజుల కిందటే సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆయనను పలుమార్లు ప్రశ్నించినా.. సీబీఐ అధికారులు సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. విచారణకు సహకరించని నేపథ్యంలో ఆయనకు లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించాలని ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా జైలులో ఉన్న విషయం తెలిసిందే. -
డెత్ మిస్టరీ.
-
'ఇంద్రాణి నా తల్లి కాదు.. సోదరి కాదు'
ముంబై: 'ఇంద్రాణి నా తల్లి కాదు.. సోదరి కూడా కాదు. కొన్ని సంవత్సరాల కిందట మన జీవితాల్లోకి వచ్చిన ఓ మంచి వ్యక్తి ఆమె'- షీనాబోరా ఈమెయిలో ఐడీ నుంచి 2013 మార్చ్ నెలలో వచ్చిన ఒక ఈమెయిల్ సారాంశమిది. షీనాబోరా ఐడీ నుంచి ఇంద్రాణి ముఖర్జీ భర్త, మీడియా అధిపతి పీటర్ ముఖర్జీయాకు ఈ మెయిల్ అందింది. అంటే షీనాబోరా హత్యకు గురైన ఏడాది తర్వాత కూడా ఆమె పేరిట ఉన్న ఈమెయిల్ ఐడీని ఉపయోగించినట్టు దీనిని బట్టి తెలుస్తున్నది. షీనా బోరా హత్యకేసు దర్యాప్తులో ఇది కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని సీబీఐ భావిస్తున్నది. సీబీఐ దర్యాప్తు జరుపుతున్న ఈ కేసులో షీనాబోరాను తల్లి ఇంద్రాణియే హత్యచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. షీనా బోరా తన కూతురు అయినప్పటికీ ఆ విషయాన్ని దాచి సోదరిగా ఇంద్రాణి ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షీరా బోరా హత్యకు గురయిన ఏడాది తర్వాత ఆమె ఈమెయిల్ ఐడీ నుంచి ఇంద్రాణి భర్తకు వచ్చిన మెసెజ్ లో చిత్రమైన విషయాలు పేర్కొని ఉన్నాయి. 1991లో షీనా బోరా తాత, నాయనమ్మల సహకారంతో ఒక నిగూఢ మహిళ ఇంద్రాణి అవతారంలోకి మారిందని, అసలు ఇంద్రాణి షీనా రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే షీనాను, మైఖేల్ ను వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఈ మెయిల్ పేర్కొంది. అయితే.. షీనా, ఇంద్రాణి మధ్య బంధం ఏమిటన్నది షీనా హత్యకు ముందు పీటర్ కు తెలియదని ఈ మెయిల్ ద్వారా తెలుస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మెయిల్ లోని విషయాలను ఓ జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. గొంతు నులుమడం వల్ల ఊపిరి ఆడకపోవడంతో షీనాబోరా చనిపోయిందని ఎయిమ్స్ పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. షీనాబోరా వజ్రాల వ్యాపారిని పెళ్లాడింది! 2012 ఏప్రిల్ నుంచి కనిపించకుండా పోయిన షీనాబోరా గురించి అడిగితే తన తల్లి ఇంద్రాణి కోప్పడేదని, అయితే ఓసారి మాత్రం షీనాబోరా అమెరికాలోని వజ్రాల వ్యాపారిని పెళ్లాడిందని చెప్పిందని విధి సీబీఐకి తెలిపింది. షీనాబోరా హత్యకేసులో భాగంగా ఇంద్రాణి, పీటర్ ముఖర్జీయా కూతురు అయిన విధి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చింది. -
వాళ్లు ఎలా కలిశారు?.. ఎవరు విడదీశారు?
ముంబై: రాహుల్ ముఖర్జీయా, షీనా బోరా విధివంచిత ప్రేమికులు. వారు ఎప్పుడు తొలిసారి కలుసుకున్నారు? ఎలా ప్రేమలో పడ్డారు? నిశ్చితార్థం జరిగిన తర్వాత విషాదకర పరిస్థితుల్లో ఎలా వేరయ్యారు? 2012లో షీనాబోరా దారుణ హత్యకు ముందు జరిగిన సంఘటనలేమిటి? అప్పటి పరిణామాలన్నింటినీ రాహుల్ ముఖర్జీయా పోలీసులకు పూస గుచ్చినట్టు వివరించాడు. తమ ప్రేమబంధం గురించి తెలుసుకొని షీనాబోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీయా తీవ్రంగా నిస్పృహకు లోనైందని తెలిపాడు. అకస్మాత్తుగా షీనాబోరా కనిపించకపోవడం తనను మానసికంగా కుంగదీసిందని, ఆమె మిస్సింగ్ వెనుక ఇంద్రాణి ప్రమేయం ఉండవచ్చునని అనుమానించానని రాహుల్ చెప్పాడు. షీనాబోరా హత్యకేసులో ప్రధాన హంతకురాలిగా మీడియా అధిపతి పీటర్ ముఖర్జీయా రెండో భార్య ఇంద్రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఎప్పుడూ కలిశారు? 2008లో రాహుల్ ముంబై వర్లిలోని మార్లో అపార్ట్మెంట్స్లో ఉన్న తన తండ్రి పీటర్ ముఖర్జీయా నివాసానికి మారాడు. అప్పడే షీనాను తొలిసారి చూశాడు. 'వర్లీ ఫ్లాట్లోనే నేను తొలిసారి షీనాను చూశాను. ఆ తర్వాత మేం తరచూ కలుసుకున్నాం. ఇది మా మధ్య సన్నిహిత స్నేహాన్ని ఏర్పరిచింది' అని రాహుల్ పోలీసులకు ఇచ్చిన తన వాంగ్మూలంలో తెలిపాడు. ఆ తర్వాత నెల రోజులకే తాను లండన్ వెళ్లానని, అక్కడ కొన్నాళ్లు ఉండిన తర్వాత మళ్లీ ముంబై వచ్చానని చెప్పాడు. అయితే ఈసారి ఇంట్లో ఉండకుండా వేరే చోట ఉండాలని పీటర్తో ఇంద్రాణి చెప్పించిందని, దీంతో తాను ఖార్దండలో ఫ్లాట్ తీసుకున్నానని తెలిపాడు. మొదటిసారి అప్పుడే చెప్పింది..! యావత్ ప్రపంచం అనుకుంటున్నట్టు తాను ఇంద్రాణి సోదరిని కాదని, ఆమె కూతురినని ఓరోజు స్వయంగా షీనాబోరానే చెప్పిందని రాహుల్ పోలీసులకు తెలిపాడు. 'నా తండ్రి సహకారంతో నేను ప్రైమ్ ఫొకస్లో ఉద్యోగం సంపాదించాను. షీనాను కూడా తరచూగా కలుస్తుండేవాణ్ని. క్రమంగా మేం ప్రేమలో పడిపోయాం. ఒక రోజు తను వచ్చి 'నేను ఇంద్రాణి చెల్లెల్ని కాదు కూతరిని' అని చెప్పింది. మా అనుబంధం గురించి ఇంద్రాణికి తెలియడంతో తను కోపాద్రిక్తురాలైంది. ఈ విషయమై నా తండ్రితో తను కోట్లాడింది. వెంటనే షీనాను గువాహటి పంపించింది' అని రాహుల్ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత 2009లో షీనాను ఢిల్లీకి పంపించారు. అక్కడ తీవ్ర అనారోగ్యంతో తను ఆస్పత్రి పాలైంది. ఆస్పత్రిలో ఉన్న ఆమెను ఇంద్రాణి, ఆమె మాజీ ప్రియుడు పరామర్శించారు. ఆ తర్వాత ఇంద్రాణి ఒత్తిడి మేరకు బెంగళూరు వచ్చిన షీనా బోరా.. ఇంద్రాణి మాజీ ప్రియుడితో కొంతకాలం ఉంది. 'ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదు. ఇంట్లోని వస్తువులన్ని అమ్మి బెంగళూరు వెళ్లి షీనాను కలుసుకున్నాను. ఆమె తన చాలా బలహీనంగా ఉంది. మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందే ఔషధాలను వేసుకోమని ఇంద్రాణి షీనాకు ఇచ్చింది. ఆ ఔషధాలను వైద్యుడికి చూపిస్తే వాటిని వెంటనే మానేయాలని మాకు సూచించాడు. ఆ మందులు తీసుకోవడం మానిన తర్వాత ఆమె కోలుకుంది. షీనా తాత-నాయనమ్మ, మా అమ్మ అనుమతి తీసుకొని ఆమెను డెహ్రాడూన్లోని మా ఇంటికి తీసుకెళ్లాను' అని రాహుల్ తెలిపాడు. ఆ తర్వాత 2009 చివర్లో ఈ ప్రేమ జంట ముంబైకి వచ్చింది. షీనాకు ఉద్యోగం దొరికింది. అంధేరిలోని ఓ అద్దె ఇంట్లో ఇద్దరు మకాం వేశారు. ఈ విషయం తెలియడంతో పీటర్, ఇంద్రాణి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. 2011 అక్టోబర్లో రాహుల్, షీనా డెహ్రాడూన్ వెళ్లి నిశ్చితార్థం చేసుకున్నారు. షీనా తాత-నాయనమ్మ, రాహుల్ తల్లి అనుమతితో ఈ నిశ్చితార్థం జరిగింది. వారు మళ్లీ ముంబైకి రావడంతో నిశ్చితార్థం గురించి ఇంద్రాణికి తెలిసింది. ఈ సమయంలో ఆమె ఎంతో మారిన మనిషిలా కనిపించిందని రాహుల్ తెలిపాడు. షీనా ఎలా అదృశ్యమైంది? ఆ తర్వాత ఓసారి ఇంద్రాణి షీనాను డిన్నర్కు పిలిచింది. షీనా హత్యకు ముందురోజు కూడా ఆమెను ఇంద్రాణి డిన్నర్కు పిలిచింది. షీనాకు నిశ్చితార్థం కానుక ఇస్తానని చెప్పింది. హత్యకు ముందు రోజు 2012, ఏప్రిల్ 24న షీనాను నేను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చాను. ఆ రోజు ఇంద్రాణి పదేపదే ఫోన్ చేసింది. షీనా రావడానికి ఎంత సమయం తీసుకుంటుందని పదేపదే అడిగింది. ఆ తర్వాత ఇంద్రాణి చెప్పిన అడ్రస్కు మేం వెళ్లాం. అక్కడికి షెవ్రోలె కారులో ఇంద్రాణి, మరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చారు. డ్రైవర్ సీటులో శ్యామ్రాయ్ ఉన్నాడు' అని రాహుల్ వివరించాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా అని తేలింది. ఆ తర్వాత షీనా ఇక ఎప్పటికీ కనిపించలేదని, ఆమె ఫోన్కు ఎన్నిసార్లు కాల్ చేసినా సమాధానం రాలేదని రాహుల్ తెలిపాడు. ఆ తర్వాత ఓ రోజు ఆమె తన మొబైల్ నుంచి ఓ మెసెజ్ వచ్చిందని, తాను కొత్త ప్రేమికుడిని చూసుకున్నానని, అతనితో ఆనందంగా ఉన్నానని ఆ మెసెజ్లో పేర్కొని ఉందని రాహుల్ చెప్పాడు. షీనా మిస్సింగ్పై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని వివరించాడు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ఖన్నా, ఆమె మాజీ డ్రైవర్ శ్యాంరావులకు వ్యతిరేకంగా రాహుల్ వాంగ్మూలం ఇచ్చాడు. పీటర్ పాత్ర ఏమిటి? షీనా హత్యకేసులో పీటర్ ముఖర్జీయా పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షీనా హత్య కుట్ర పీటర్కు తెలుసని పేర్కొంటూ సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. అయితే రాహుల్ మాత్రం ఒక్కసారి మాత్రమే తన వాంగ్మూలంలో పీటర్ పేరు ప్రస్తావించాడు. అంతకుమించి ఎలాంటి విషయాలు తెలుపలేదని తెలుస్తున్నది. పోలీసులు నమోదుచేసిన చార్జ్షీట్లోని ఈ వివరాలను మిడ్డే పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. -
ఆ హత్య పీటర్కు ముందే తెలుసా?
ముంబయి: షీనా బోరా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. తన తండ్రికి షీనా బోరా హత్యకు ఏ సంబంధం లేదని, ఆయన అమాయకుడని పీటర్ ముఖర్జియా తనయుడు రాహుల్ ముఖర్జియా చెప్పిన మరుసటి రోజే సీబీఐ వెల్లడించిన కొన్ని విషయాలు పీటర్కు షీనా హత్యకు ఏవో సబంధాలున్నాయని పరోక్షంగా చెబుతున్నాయి. షీనా చనిపోయిందన్న విషయం పీటర్ ముఖర్జియాకు ముందే తెలుసని సీబీఐ వర్గాలు పరోక్షంగా చెబుతున్నాయి. అందుకే కావాలని పోలీసు అధికారి దేవెన్ భారతీని కలిశారని, కనిపించకుండా పోయినా షీనా ఫోన్ కాల్ డేటా తమకు ఇవ్వాలని, ఆమె ఎక్కడ ఉందో గుర్తించాలని ఆయనను కోరినట్లు సీబీఐ అధికారులు దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ హత్యను ఒక మిస్సింగ్ కేసుగా మార్చే ప్రయత్నం ఇంద్రాణి, పీటర్ చేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో గత ఆగస్టులోనే షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు అరెస్టు చేయగా పీటర్ ను గత వారం అరెస్టు చేశారు. సీబీఐ వర్గాలు విశ్వసిస్తున్న ప్రకారం షీనా చనిపోయిన విషయం ముందే తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదుచేసేందుకు ప్రయత్నించిన రాహుల్ ముఖర్జియాను కూడా తప్పుదోవపట్టించాడని తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఇంద్రాణి, పీటర్ సంప్రదించిన పోలీసులు అధికారి భారతీని ఈ కేసులో ఆధారంగా చేర్చారు. -
ఆ హత్య పీటర్కు ముందే తెలుసా?
-
'మా నాన్న అమాయకుడు.. ఆయనకేం తెలియదు'
ముంబయి: తన తండ్రి పీటర్ ముఖర్జియా అమాయకుడని, ఈ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని షీనా బోరా హత్య కేసుకు సంబంధించి పీటర్ ముఖర్జియా తనయుడు రాహుల్ ముఖర్జియా అన్నాడు. గత శుక్రవారం సీబీఐ అధికారులు హత్య, నేర పూరిత కుట్ర ఆరోపణల పేరిట పీటర్ ముఖర్జియాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం కొందరు మీడియా అధికారులు రాహుల్ ను సంప్రదించగా అతడు ఈ విధంగా స్పందించాడు. 'షీనా హత్యకు గురికావడానికి మా నాన్న ఎందుకు కారణం కాదో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే కేసు విచారణలో ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. మా నాన్న అమాయకుడు ఆయనకు ఏమీ తెలియదు' అని రాహుల్ అన్నాడు. కీలక వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక వివరణలు ఇవ్వడంతోపాటు, చాలా ఆధారాలు విచారణ అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా తనకు నగరంలో మూడు బెడ్రూంల ఫ్లాట్ ఇవ్వకుంటే తాను ఇంద్రాణి సోదరిని కాదని, ఇంద్రాణి కూతురునని అందరికీ చెప్తానని తల్లి ఇంద్రాణిని షీనా బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు తెలిసింది. ఇంద్రాణి ముఖర్జియా కుమార్తె అయిన షీనాతో రాహుల్ సంబంధం నెరిపాడన్న విషయం ఇప్పటికే తెలిసిందే. -
'నా ఆనందం కోసం ఆలోచించావా?'
న్యూఢిల్లీ: 'రాహుల్తో నా జీవితం ఆనందంగా, భద్రంగా ఉంటుంది. తల్లిదండ్రులుగా నన్ను ప్రేమించేవారికి అంతకన్నా ఇంకేం కావాలి?'.. షీనా బోరా తన తల్లి ఇంద్రాణి ముఖర్జీయాకు రాసిన లేఖ ఇది. వరుసకు సవతి సోదరుడయ్యే రాహుల్తో షీనా బోరా డేటింగ్ చేస్తుండటంతో ఇంద్రాణి కుటుంబంలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఆ సమయంలో తన సొంత నిర్ణయాలు తాను తీసుకునేందుకు అనుమతించాలంటూ షీనా బోరా తల్లి ఇంద్రాణికి ఈమెయిల్ లేఖ రాసిందని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. 2012లో షీనాను ఇంద్రాణి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఈ హత్య ఘటనకు ముందే తల్లి ఇంద్రాణికి షీనా రాసిన లేఖలోని వివరాలను సీబీఐ వెల్లడించింది. ' నీ జీవితంలో నీకు ఏదైతే ఆనందం ఇస్తుందో అదే నువ్వు చేశావు. నాకు కూడా అంతే వర్తిస్తుంది. దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు? నాలోను కొంతవరకు నీ లక్షణాలే ఉన్నాయి. నా జీవితాన్ని నేను వెతుక్కుంటాను. నువ్వు దాని గురించి కలతపడకు' అని షీనా తల్లిని ఉద్దేశించి లేఖలో పేర్కొంది. షీనా బోరా రాహుల్తో ప్రేమలో మునిగి ఉండటంతో వారిద్దరూ విడిపోవాల్సిందేనని ఇంద్రాణి ఒత్తిడి తెచ్చి ఉంటుందని, ఈ నేపథ్యంలోనే షీనా ఈ లేఖ రాసిందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు తన చిన్న కూతురు వైదేహీతో షీనా బోరా సన్నిహితంగా ఉండటం, తన భర్త, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీయాతో దగ్గరవుతుండటం కూడా ఇంద్రాణి సహించలేకపోయిందని, తన ఆస్తులను ఎక్కడ షీనా బోరా సొంతం చేసుకుంటుందోనని, వైదేహీని తనకు దూరం చేస్తుందేమోననే భావనతోనే ఇంద్రాణి ఆమె హత్యకు ఒడిగట్టి ఉండవచ్చునని దర్యాప్తు వర్గాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా సవతి తండ్రి పీటర్కు కూడా షీనా లేఖ రాసిందని, అందులో 'నా సమస్య ఇంద్రాణితోనే. అది నా వ్యక్తిగత విషయం. మీరు ఇంద్రాణికి ఈ విషయాన్ని చెప్పి ఒప్పించండి. అంతేకానీ నన్ను-రాహుల్ను దూషించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు' అని షీనా పేర్కొందని సీబీఐ తెలిపింది. -
సీబీఐ కస్టడీలో పీటర్ ముఖర్జీయా
ముంబై: క్రైమ్ థ్రిల్లర్ మూవీలా మలుపులు తిరుగుతున్న షీరాబోరా హత్య కేసులో అరెస్ట్ అయిన ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సీబీఐ అధికారులు మూడు రోజుల పాటు పీటర్ ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఇంద్రాణి ముఖర్జియా సహా ముగ్గురిపై కేసులు నమోదు చేసిన సీబీఐ, తాజాగా ఆమె ప్రస్తుత భర్త, స్టార్ గ్రూప్ అధినేత పీటర్ ముఖర్జియాను ఏ-4 గా చేర్చింది. నిన్న పీటర్ ముఖర్జియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ అతడిని కోర్టులో హాజరు పరిచారు. కాగా షీనాబోరా హత్య విషయం తెలిసినా నిజం బయటపడకుండా పీటర్ ముఖర్జియా దాచి పెట్టారని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. అలాగే నిందితులకు ఆశ్రయం ఇవ్వటం, కేసును తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయటం వల్ల పీటర్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న షీరా బోరా తల్లి ఇంద్రాణీ ముఖర్జీ, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లకు సీబీఐ కోర్టు... డిసెంబర్ 3వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది. గత ఆగస్టులో సీబీఐ వీరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
షీనా బోరా హత్య కేసులో అనూహ్య మలుపు
-
షీనా కేసులో పీటర్ ముఖర్జీ అరెస్టు
చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ ముంబై: షీనా బోరా హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇంద్రాణీ భర్త పీటర్ ముఖర్జీని సీబీఐ అరెస్టు చేసి ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు మొదలైన మూడు నెలల తర్వాత చార్జిషీటు దాఖలు చేసింది. విచారణ సందర్భంగా హత్యలో పీటర్కు సంబంధం ఉన్నట్లు తెలియటంతోనే అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. సీబీఐ అధికారులు వివరాలు వెల్లడించనప్పటికీ.. నిందితులకు ఆశ్రయం ఇవ్వటం, కేసును తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయటం వల్ల పీటర్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టుకు ముందు రెండు గంటలపాటు పీటర్ను ముంబై కమిషనర్ ప్రశ్నించారు. ఆయన్ను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. ఆయన్ను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు. వెయ్యి పేజీలకు పైగా ఉన్న ఈ చార్జిషీటులో 150 మంది సాక్షుల వాంగ్మూలం, 200 డాక్యుమెంట్లు, మెజిస్ట్రేటు ముందు ఏడుగురు ఇచ్చిన వాంగ్మూలాలున్నాయి. ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజయ్, డ్రైవర్ శ్యాంలను ప్రధాన నిందితులుగా సీబీఐ పేర్కొంది. డ్రైవర్ గతవారం కోర్టు ముందు నేరాన్ని ఒప్పుకోవటంతోపాటు ఘటన జరిగిన తీరును తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని కీలక సాక్షంగా తీసుకునే సీబీఐ డ్రైవర్ సాక్షమే కేసుకు కీలక ఆధారమని సీబీఐ తెలిపింది. -
షీనా బోరా హత్య కేసులో అనూహ్య మలుపు
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు మరో అనూహ్యమైన మలుపు తిరిగింది. ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను గురువారం సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్వర్ సింగ్ లపై 1000 పేజీలతో కూడిన ఛార్జిషీట్ను సీబీఐ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురికి ఆగస్టులో కోర్టు నవంబర్ 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఇంద్రాణి ముఖర్జియా ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాను అరెస్టు చేయడంతో ఈ కేసులో ఆయన ప్రమేయంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పీటర్ అరెస్టుకు సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ కేసుకు సంబంధించిన నిజాలను వెలుగులోకి తేవాల్సి ఉందని సీబీఐ అధికారి వెల్లడించారు. -
ఇంద్రాణికి డెంగ్యూ!
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా డెంగ్యూతో బాధపడుతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. గత ఏడు రోజులుగా ఆమె డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు ఆమె ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు కోర్టుకు వివరించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం జైలులో ఉంచే చికిత్స అందిస్తున్నామని వైద్యులు తప్పనిసరిగా ఆస్పత్రికిగా తరలించాలంటే ఆ పని చేస్తామని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లి అటు జైలు అధికారులను, షీనా కేసు దర్యాప్తు అధికారులు ఇంద్రాణి కలవరపెట్టిన విషయం తెలిసిందే. ఆమెకు కొద్ది రోజులపాటు చికిత్స చేసి తిరిగి జైలుకు తరలించారు. 2012 ఏప్రిల్ నెలలో తన కన్న కూతురు 24 ఏళ్ల షీనా బోరాను ఇంద్రాణి మరికొందరితో కలిసి హత్య చేయగా.. ఆమెను పోలీసులు గత ఆగస్టు 25న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బైకుల్లా జైలులో ఉంది. -
షీనా సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. సోమవారం ముంబయి, కోల్ కతా, గువాహటి వంటి తొమ్మిది చోట్ల విస్తృతంగా సోదాలు నిర్వహించింది. షీనా సోదరి మిఖెయిల్ బోరా ఇంట్లో కూడా సోదా చేసింది. అయితే, కేసు దర్యాప్తులో భాగంగానే తన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించిందని, తాను దర్యాప్తు అన్ని విధాల సహకరిస్తానని చెప్పాడు. ఈ కేసులో ప్రధాన నిందితులై ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మొదటి భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ తో పాటు మరికొందరు అనుమానితులకు సంబంధించిన ప్రాంతాల్లో కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాల కోసం గాలింపులు చేపట్టినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. తన కూతురు షీనా బోరాను తాను హత్య చేయలేదని తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ హతమార్చారని సీబీఐకి ఇంద్రాణి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ కేసు విచారణను మరింత వేగవంతం చేసింది. -
'షీనాను చంపింది నేను కాదు.. ఆయనే'
-
'షీనాను చంపింది నేను కాదు.. ఆయనే'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన తన కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా సీబీఐకి కీలక వివరణ ఇచ్చినట్లు తెలిసింది. తన కూతురు షీనా బోరాను తాను చంపలేదని, తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ హతమార్చారని సీబీఐకి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. బాంద్రాలో సంజీవ్ ఖన్నాతో ఏర్పాటుచేసిన ఓ డిన్నర్ కార్యక్రమానికి షీనాబోరాను ఇంద్రాణి ఆహ్వానించినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. సీబీఐ అధికారులకు ఇంద్రాణి ఇచ్చిన వివరాల ప్రకారం షీనా పెరుగుతున్న తీరును ఖన్నాను కలవరపెట్టిందని, ముఖ్యంగా ఆమె తన భర్త పీటర్ ముఖర్జియా కుమారుడితో సంబంధం పెట్టుకోవడం అతడికి ఏమాత్రం నచ్చలేదని, తన సొంత కూతురుపై ఆ ప్రభావం పడుతుందేమోననే భయంతో హత్య చేశాడు. ఈ హత్యకు తనకు ఏ సంబంధం లేదని, సంజీవ్ ఖన్నా, డ్రైవర్ మాత్రం హత్యచేశారని వివరణ ఇచ్చింది. మరోపక్క, ఏ విధమైన విచారణకైనా తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని, వివరాలు తెలియజేస్తానని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం. -
ఒంటరిగా ఉండలేకపోతున్నాను
ముంబై: షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా జైలుగదిలో ఒంటరిగా ఉండలేకపోతోందిట. సెల్ లో ఒంటరిగా ఉండడం వల్ల తనకు డిప్రెషన్ మరింత పెరుగుతుందని ఆమె ఆందోళన చెందుతోంది. అందుకే తనను ఐసోలేటెడ్ సెల్లో ఉంచొద్దంటూ జైలు అధికారులకు ఇంద్రాణి మొరపెట్టుకుంది. జైళ్ల శాఖ ముఖ్య కార్యదర్శి డా. విజయ్ సత్బీర్ సింగ్ జైల్లో ఆమెను కలిసినపుడు ఒంటరిగా ఉండలేకపోతున్నానని, తనను ఏకాకిగా ఉంచొద్దంటూ విజ్జప్తి చేసింది. అసలే డిప్రెషన్తో బాధపడుతున్న తనకు, విడిగా సెల్లో ఒంటరిగా ఉండడం కష్టంగా ఉందని తెలిపింది. ఇది తన మానసిక స్థితిని మరింత దెబ్బ తీస్తుందని, తను ప్రత్యేక సెల్లో ఉంచొద్దని ఇంద్రాణి కోరింది. ఆమె విజ్ఞప్తికి జైలు అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆమె అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఆమెను వేరే సెల్ కు తరలించనున్నట్లు తెలుస్తోంది. కన్న కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉండి విచారణ నిమిత్తం జైలు అధికారుల కస్టడీలో ఉన్న ఇంద్రాణి మోతాదుకు మించిన మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను జేజే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందచేశారు. కోలుకున్న అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించారు. -
'ఇక ఇంద్రాణి స్టేట్ మెంట్ రికార్డు చేసుకోవచ్చు'
ముంబయి: త్వరలోనే ఇంద్రాణి ముఖర్జియా పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తుందని ఆమెను పర్యవేక్షిస్తున్న సీనియర్ డాక్టర్ టీపీ లహానే చెప్పారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుందని వైద్యులతో కూడా మాట్లాడుతోందని ఆయన వివరించారు. కన్న కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉండి విచారణ నిమిత్తం జైలు అధికారుల కస్టడీలో ఉన్న ఇంద్రాణి మోతాదుకు మించిన మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను జేజే ఆస్పత్రిలో చేర్పించగా ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షించింది. ప్రస్తుతం ఆ వైద్యుల అనుమతితోనే ఆమె డిశ్చార్జి అయ్యి పోలీసులకు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేశారు. త్వరలోనే ఆమెను డిశ్చార్జి చేస్తామని, పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకోవచ్చని ఇప్పుడామె శరీరం అన్ని రకాలుగా సహకరిస్తుందని వివరించారు. -
స్పృహలోకి ఇంద్రాణి
-
స్పృహలోకి ఇంద్రాణి
ముంబయి: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్పృహలోకి వచ్చింది. దీంతో ఇక ఆమె ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని వైద్యులు ధృవీకరించారు. తన కూతురు షీనాబోరాను హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పరిస్థితి శనివారం అకస్మాత్తుగా విషమంగా మారిన విషయం తెలిసిందే. బైకలా జైల్లో ఉన్న ఆమె కొన్ని మాత్రలు వేసుకున్న వెంటనే ఊపిరి తీసుకోవటం కష్టంగా మారటంతో హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నట్లు తేలింది. దీంతో వెంటిలేటర్ ద్వారా ఆమెకు ఆక్సిజన్ అందించారు. కాగా, ఈ కేసు నేపథ్యంలో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక మరేదైనా తెలియని కారణం ఉందా ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఆమె ఫిట్స్ నిరోధానికి వైద్యం చేయించుకుంటున్నారని, ఆ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, అది కూడా జైలు అధికారుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి.కానీ ఆ మాత్రలను అధిక మోతాదులో ఇంద్రాణి వాడటం వల్లే అపస్మారక స్థితిలోనికి వెళ్లారని వైద్యులు అంటున్నారు. -
షీనాబోరా కేసులో కీలక మలుపు
ముంబయి : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జియా, మరో ఇద్దరు నిందితులపై సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పదిరోజుల కిందట మహారాష్ట్ర ప్రభుత్వం షీనాబోరా హత్య కేసును సీబీఐకి అప్పగించిన విషయం విదితమే. ఇంద్రాణీ, ఆమె మాజీ భర్త సంజయ్ ఖన్నా, అప్పటి వారి కారు డ్రైవర్ శ్యామ్ వర్ పింటురామ్ రాయ్ పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అయితే, కిడ్నాప్, హత్య, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి తమ వద్ద ఉన్న రిపోర్టును రాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాల్ సీబీఐకి అప్పగించారు. 2012, ఏప్రిల్ 24న షీనాబోరా హత్యకు గురైన విషయం విదితమే. -
షీనా కేసు: సంజీవ్కు జ్యుడీషియల్ రిమాండ్
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమె సవతి తండ్రి సంజీవ్ ఖన్నాకు ఈ నెల 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మంగళవారం ముంబై పోలీసులు ఖన్నాను బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. షీనా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి, కారు డ్రైవర్ రాయ్లకు నిన్న జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఇంద్రాణి తన మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి కారు డ్రైవర్ సాయంతో షీనాను హత్య చేసినట్టు విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే. -
షీనా బోరా కేసు దర్యాప్తులో కీలక పరిణామం
-
'కస్టడీ ముగిసినా ఖన్నా జైలుకు ఎందుకు?'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో ప్రధాన నిందితుడు, ఇంద్రాణి ముఖర్జియా మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు మంగళవారం మరోసారి ముంబయిలోని ఖర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి కోర్టు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే, దీనిపై ఆయన తరుపు లాయర్లు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు కస్టడీ ముగిసి 24 గంటలు పూర్తవుతున్నా అతడిని కోర్టులో హాజరుపరచకుండా నేరుగా స్టేషన్కు తరలించడం అంగీకరించకూడని నిర్ణయమని కోర్టులో పిల్ వేయనున్నారు. కేసులో కీలక విచారణ కోసం సంజీవ్ ఖన్నాను పోలీసులు కోల్కతా తీసుకువెళ్లి ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన కస్టడీ ఆదివారమే పూర్తయిందని, సోమవారం కూడా అదుపులో ఉంచుకోవడం చట్ట విరుద్ధమని కోర్టులో ఫిర్యాదు చేయనున్నారు. -
ఇంద్రాణి, డ్రైవర్కు జ్యుడిషియల్ కస్టడీ
-
ఆ అస్థికలు షీనావే.. చిక్కుల్లో ఇంద్రాణి
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. షీనా బోరా హత్యకు గురైనట్టు నిర్ధారణైంది. రాయగఢ్ అడవుల్లో పోలీసులు సేకరించిన అస్థికలు షీనా బోరావేనని డీఎన్ఏ పరీక్షల్లో తేలినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నమూనాలు ఇంద్రాణి డీఎన్ఏతో సరిపోలినట్టు పరీక్షల్లో రుజువైందని సమాచారం. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో షీనా బోరాను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆమె శవాన్ని రాయగఢ్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఇటీవల నిందితులను సంఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లి అస్థికలు, పుర్రెను సేకరించారు. పరీక్షల్లో ఈ అస్థికలు షీనా బోరావేనని తేలింది. ఈ రోజు ముంబై పోలీసులు ఇంద్రాణి ముఖర్జియా, కారు డ్రైవర్ రాయ్లను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. మరో నిందితుడు, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు పోలీస్ కస్టడీ పొడగించారు. -
లిప్స్టిక్ వేసి.. పెర్ఫ్యూమ్ రాసి
ముంబయి: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. షీనా బోరాను హత్య చేసిన అనంతరం ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియా ... మృతదేహానికి లిప్ స్టిక్ రాయడంతో పాటు తలను కూడా అందంగా దువ్వి ముస్తాబు చేసిందట. ఈ విషయాన్ని షీనా కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు వెల్లడించారు. ఎటువంటి చెడువాసన రావద్దని ఆలోచించిందే ఏమో కానీ, షీనా మృతదేహానికి పెర్ఫ్యూమ్ కూడా రాసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రాయ్ గఢ్ తీసుకెళ్లి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ తో కలిసి దహనం చేసింది. అయితే మార్గమధ్యలో పోలీసులు తనిఖీల్లో భాగంగా కారులో ఉన్న షీనా బోరా గురించి ప్రశ్నించగా ఆమెకు ఆరోగ్యం బాగాలేదని నిద్రపోతుందని ఇంద్రాణి చెప్పినట్లు ఓ అధికారి వెల్లడించారు. షీనాను హత్య చేసిన రోజు (ఏప్రిల్ 24, 2012) వర్లీలోని ఇంద్రాణీ ఇంట్లోనే షీనా మృతదేహాన్ని ఉంచారు.మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని కారులో తరలిస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు లిప్ స్టిక్, పెర్ఫ్యూమ్ ఆమెకు రాయడం తల దువ్వడం వంటివి చేసినట్లు పోలీసుల విచారణలో ఇంద్రాణీ వివరించింది. కాగా పోలీస్ కస్టడీ నేటితో ముగియనుండటంతో ఇంద్రాణీ ముఖర్జియాను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. షీనా హత్య తర్వాత మెయిల్ ఐడీ క్రియేట్.. షీనా హత్య అనంతరం మృతదేహం ఆనవాళ్లు కూడా గుర్తించడం కష్టమని భావించిన ఇంద్రాణీ.. ఓ ఉద్యోగికి చెప్పి కూతురి పేరిట హాట్ మెయిల్ అకౌంట్ క్రియేట్ చేయించింది. అయితే షీనా అమెరికాలో చాలా బిజీగా ఉన్నట్లు ఆ ఉద్యోగికి చెప్పి అకౌంట్ ఓపెన్ చేయించి.. ఆ ఐడీ నుంచి చాలా మందికి ఇంద్రాణీ ఈమెయిల్స్ పంపినట్లు అంగీకరించింది. -
ఆ పుర్రె షీనా ముఖాకృతితో సరిపోలింది!
ముంబై: రాయ్గఢ్ అడవుల్లో స్వాధీనం చేసుకున్న కపాలంతో కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జియా చేతిలో హత్యకు గురైన షీనాబోరా ముఖ రేఖాకృతి సరిపోలినట్లు తమ డిజిటల్ సూపరింపొజిషన్లో తేలిందని శుక్రవారం ముంబై పోలీసులు వెల్లడించారు. అలాగే, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను తామింకా నిర్దోషిగా తేల్చలేదన్నారు. అయితే, ఆయనను ఈ కేసులో ఇంకా నిందితుడిగా కూడా చేర్చలేదు. షీనా హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్, పీటర్, షీనా తండ్రి సిద్ధార్థ్ దాస్ తదితరులను ఖార్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం కూడా సుదీర్ఘంగా విచారించారు. తొలిసారి ఇంద్రాణి, ఖన్నాల కూతురు విధిని కూడా కాసేపు ప్రశ్నించి పంపించేశారు. -
షీనాను హత్య చేసింది నేనే!
అంగీకరించిన ఇంద్రాణి ♦ పీటర్తో ఇంద్రాణి, ఖన్నా, రాయ్ల ముఖాముఖి.. ♦ చివరి నిమిషంలో మొదటి భర్త ♦ సిద్ధార్థ్దాస్ను ప్రవేశపెట్టిన పోలీసులు ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసు మిస్టరీ వీడింది. ఇన్నాళ్లూ అమెరికాలో షీనా బతికే ఉందంటూ బుకాయిస్తూ వచ్చిన షీనాబోరా కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జియా తానే కూతుర్ని హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఇంతకుమించి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఈ కేసులో నిందితులైన వారందరితో పాటు, ఇంద్రాణి భర్త, స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియాను గురువారమూ విచారించారు. బుధవారం దాదాపు 12గంటలపాటు విచారించిన పీటర్ను గురువారం ఉదయం11.30 గంటలకు ఖర్ పోలీస్ స్టేషన్కు రప్పించారు. పీటర్తో పాటు.. కేసులో నిందితులందరినీ ఒకరి వెంట ఒకరుగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి ప్రశ్నించారు. పీటర్తో ఆయన భార్య ఇంద్రాణిని ముఖాముఖిగా కూర్చోబెట్టి ఇంటరాగేట్ చేశారు. వీరి మధ్య అనైతిక సంబంధాలతో పాటు పీటర్ ఇంద్రాణిల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లోతుగా ఆరా తీశారు. వివిధ కంపెనీల్లో పీటర్కు ఉన్న షేర్ల వివరాలు, తన కొడుకు రాహుల్కు, భార్య ఇంద్రాణికి, ఆమె కూతుళ్లు షీనా, విధిలకు పీటర్ ఎంతెంత డబ్బులు ఇచ్చిందీ తెలుసుకున్నారు. ఆ తరువాత ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాం రాయ్లను కూడా పీటర్తో ముఖాముఖిగా ఉంచి దర్యాప్తు చేశారు. చివరి నిమిషంలో ఇంద్రాణి మొదటి భర్త, షీనాబోరా తండ్రి సిద్ధార్థదాస్ను అనూహ్యంగా ఇంద్రాణి ముందు ప్రవేశపెట్టి ముఖాముఖి విచారించారు. ఈ విచారణ అంతా డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో కొనసాగింది. మరోవైపు రాయ్గఢ్ అడవుల్లో దొరికిన అస్థికలు షీనావా కాదా అని నిర్ధారించేందుకు కలీనాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలు ప్రారంభించింది. -
ఐ హేట్ మై మదర్.. విరక్తి పుడుతోంది!
''డిప్రెషన్ చుట్టేస్తోంది.. జీవితం చాలా అసహ్యంగా ఉంది.. నా తల్లంటేనే విరక్తి పుడుతోంది.. ఆమె ఓ బ్లడీ ....'' ఇవీ మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా మనసులోని విషయాలు. ఈ కేసులో సరికొత్త విషయాలు తాజాగా వెలుగుచూశాయి. పోలీసుల విచారణలో షీనా బోరా స్వయంగా రాసుకున్న డైరీ బయట పడింది. ముత్యాల్లాంటి అక్షరాలతో ఒకే విషయాన్ని డైరీలో షీనా మళ్లీ మళ్లీ రాసుకుంది. ''అన్ని వైపుల నుంచీ డిప్రెషన్ నన్ను చుట్టేస్తోంది. జీవితం ఎంత అసహ్యకరంగా ఉంది, నా తల్లంటే నాకు విరక్తి పుడుతోంది. ఐ హేట్ మై మదర్.. ఆమె.. ఓ '' బ్లడీ బి...'' . ఆమె తల్లి కాదు మాంత్రికురాలు అంటూ తన ఆవేదనంతా అక్షరాల్లో వెలిబుచ్చింది. షీనా తన తల్లిపట్ల ఉన్న ఏహ్యభావంతోనే ఆమెరికాలో ఉండేదని, ఇక్కడకు వచ్చేందుకు ఇష్టపడేది కాదని డైరీలో ఆమె రాసుకున్న విషయాలను బట్టి తెలుస్తోంది. ఆమె ఏప్రిల్ 24, 2012 న చనిపోయే సమయానికి షీనాకు 24 సంవత్సరాలు వయసు ఉందని, ఆ సాయంత్రమే షీనాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాతోపాటు, ఆమె డ్రైవర్ కారులో షీనాను గొంతు నులిమి చంపేశారని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దొరికిన పదేళ్ల కిందటి డైరీ ముఖ్యంగా షీనాకు, ఆమె తల్లి ముఖర్జియాకు మధ్య కుటుంబ సంబంధాలను తెలియజేస్తోందని, షీనాను ముఖర్జియా అందరికీ తన సోదరిగా పరిచయం చేసేదని పోలీసులు అంటున్నారు. 2003 ఫిబ్రవరి 11 తేదీన డైరీలో ''ఓహ్ నాకు హ్యాపీ బర్త్ డే నా! కానీ నేను హ్యాపీగా లేను'' అని షీనా రాయడం ఆమె ఎంత మాత్రం తన తల్లితో సంతోషంగా లేదన్న విషయాన్ని సూచిస్తోంది. షీనా బోరా... పీటర్ ముఖర్జియా కొడుకు రాహుల్ ముఖర్జియా దగ్గర ఉండేది. ఇంద్రాణి ముఖర్జియాను పీటర్ 2002 లో వివాహం చేసుకున్నాడు. పీటర్ను పోలీసులు బుధవారం నాడు 12 గంటల పాటు ప్రశ్నించారు. ఇందులో పోలీసులకు పీటర్ ముఖర్జియా తమ మధ్య ఉన్న ఆర్థిక పరమైన గొడవల గురించి వివరించారు. అంతేకాదు సంజయ్ ఖన్నా, ఇంద్రాణిల కుమార్తె 'విధి' విషయంలో తమ మధ్య గొడవలు మొదలయ్యాయని, షీనా బోరా, ఆమె సోదరుడు మిఖైల్ ఇద్దరూ కలిసి విధిని చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. కాగా తాను కూడా షీనా హత్యకు సహాయపడినట్లు ఆయన ఒప్పుకున్నారు. -
నేరాన్ని అంగీకరించి కుప్పకూలిన ఇంద్రాణి
-
వాడు నా కన్నకొడుకు కాడు
రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న షీనాబోరా హత్యకేసులో తాజాగా మరో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. అసలు మిఖాయిల్ తన సొంత కొడుకు కానే కాదని, అతడు తన దత్తపుత్రుడని ఇంద్రాణి ముఖర్జీ తన న్యాయవాదులకు తెలిపింది. అయితే, షీనాబోరా కన్నతండ్రినని చెబుతున్న సిద్దార్థ దాస్ చెబుతున్న విషయాలకు మాత్రం ఇది పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. ఆయన ఇటీవలే కోల్కతాలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో లాయర్లు మళ్లీ తల పట్టుకున్నారు. నిన్న మొన్నటివరకు మిఖాయిల్ అనే వ్యక్తి ఇంద్రాణి కొడుకని అంతా అనుకుంటూ ఉన్నారు. తన చెల్లి చాలా కష్టాలు పడిందని గతంలో మిఖాయిల్ చెప్పిన విషయం తెలిసిందే. చెల్లెలి తర్వాత తనను చంపేయాలనుకుంటోందని, తానే ఆమె తదుపరి టార్గెట్ అని కూడా అతడు అన్నాడు. ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ కలిసి 2012 ఏప్రిల్ 24వ తేదీన షీనాబోరాను గొంతు పిసికి చంపేసి, తర్వాత ఆమెను కాల్చేశారని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. -
హమ్మయ్య.. కట్టప్పకు విముక్తి లభించింది!
నిన్న మొన్నటి వరకు... అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం మీద అనేక చర్చోప చర్చలు జరిగాయి. చిన్నతనంలో తన ప్లేటులోని అన్నం లాక్కున్నాడనే చంపాడన్నారు, మిర్చి సినిమాలో తన భార్య (నదియా) మరణానికి కారణం అయ్యాడన్న కోపంతో ఈ సినిమాలో ప్రభాస్ను చంపాడని చెప్పారు. ఇలా నెట్లో ఈ టాపిక్ విపరీతంగా హల్చల్ సృష్టించింది. అయితే, గత కొన్నాళ్లుగా ఇది మళ్లీ మరుగున పడిపోయింది. కట్టప్ప.. బాహుబలి ఈ రెండు అంశాలు కొన్నాళ్ల నుంచి చర్చకు రావడం తగ్గింది. ఇప్పుడు కొత్త టాపిక్ ఏంటో తెలుసా.. షీనా బోరా ఎందుకు హత్యకు గురైంది? ఆమెను నిజంగా చంపింది ఎవరు.. ముఖర్జియాల కుటుంబ చరిత్రలో అసలు ఎవరికి ఎవరు ఏమవుతారు. ఇలాంటి అనేకానేక ప్రశ్నలు నెట్టింట్లో అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాయి. మామూలు ఔత్సాహికుల దగ్గర్నుంచి వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ వరకు ప్రతి ఒక్కరూ ఈ టాపిక్ గురించి ట్వీట్లు చేస్తున్నారు, వాట్సప్లో షేర్ల మీద షేర్లు చేస్తున్నారు, ఫేస్బుక్లో లైకులు కొడుతున్నారు. Mukherjeas,The Great Indian Family Tree pic.twitter.com/HQ0UPZSQ0b — Ram Gopal Varma (@RGVzoomin) August 30, 2015 Kattappa is relieved aftr sheena's murder mystery , it is more complicated than Bahubali, Now everyone is asking :Why Indrani killed Sheena? — Mahi Illindra (@mahimilli) September 2, 2015 -
పీటర్ ఇంట్లో పోలీసుల సోదాలు
ముంబయి: షీనా బోరా హత్య కేసు విషయానికి ముంబయి పోలీసులు బుధవారం టీవీ మీడియా టైకూన్, స్టార్ ఇండియా మాజీ చైర్మన్ పీటర్ ముఖర్జియా ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 2012లో కన్నకూతురు షీనా బోరాను హత్య చేసినందుకు ప్రస్తుతం పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి ముఖర్జియా పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈరోజే పీటర్ వాంగ్మూలం కూడా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈలోగానే పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు చేయడం కొంత చర్చనీయాంశమైంది. కేసుకు సంబంధించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనన్న ఉద్దేశంతోనే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
'షీనా' ఆరు మెస్సేజ్ లు పంపింది!
ముంబై: షీనా బోరా హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. క్రైమ్ సీరియల్ ను తలపిస్తోన్న షీనా కేసులో తాజాగా మరో విషయం బయటపడింది. 2012, ఏప్రిల్ నెలలో షీనా హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నా.. ఆ తరువాత ఆమె సొంత మొబైల్ ఫోన్ నుంచి తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ ముఖర్జీయాకు ఆరు మెస్సేజ్ లు వచ్చాయట. ఈ విషయాన్ని పోలీసు విచారణలో రాహుల్ స్పష్టం చేశాడు. షీనా అదృశ్యమైన నాటి నుంచి తనకు వరుసగా కొన్ని మెస్సేజ్ లు వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న పోలీసులు.. అసలు ఆ మెస్సేజ్ లు పంపిందెవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 'నేను యూఎస్ కు వెళ్లిపోయాను.. దయచేసి నన్ను ఫాలో కావద్దు. ఇక నీతో ఎటువంటి సంబంధం కొనసాగించదలుచుకోలేదు.. నాకు ఫోన్ చేయకు. మెస్సేజ్ లు కూడా పంపకు. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నా.. నీతో మాట్లాడం నాకు ఇష్టం లేదు. నేను అమెరికాలో ఉన్నా. నాకు యూఎస్ లో కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి... నేను అతనితో సంతోషంగా ఉన్నా' అని షీనా తన మొబైల్ కు మెస్సేజ్ లు పంపినట్లు రాహుల్ తెలిపాడు. -
ఆ అవశేషాలు షీనా బోరావేనా ?
ముంబై: దాదాపు మూడేళ్ల క్రితం రాయ్గఢ్ జిల్లాలో దొరికిన గుర్తు తెలియని శవం అవశేషాలు షీనా బోరావేనా ? అయితే వాటిని ఎలా గుర్తించడం ? సాధారణంగా తల్లిదండ్రులు, వారి ఇతర సంతానం డీఎన్ఏలతో అవశేషాల నుంచి తీసిన డీఎన్ఏను పోల్చి గుర్తిస్తారు. సర్వ సాధారణంగా ముక్కలు ముక్కలుగా నరికిన శవం నుంచి డీఎన్ఏను గుర్తించడం దాదాపు అసాధ్యమని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు మరెలా ఆ అవశేషాలు షీనా బోరావేనా, కాదా ? అన్న అంశాన్ని ఎలా తేల్చాలి ? షీనా బోరా ఇప్పటికీ బతికే ఉందని, అమెరికాలో ఉంటోందని సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితురాలైన ఇంద్రాణి పోలీసు ఇంటరాగేషన్లో మాటమార్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత బలం చేకూరింది. ప్రతి మనిషికి ప్రత్యేకమైన పలు వరుస ఉంటుంది. ఆ పలు వరుస ద్వారాగానీ, 2డీ లేదా 3డీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించి కచ్చితంగా గుర్తించవచ్చని ఫోరెన్సిక్ నిపుణలు చెబుతున్నారు. అనుమానిత స్కల్పై ముఖం ఫైల్ ఫొటోను సూపర్ ఇంపోజ్ చేసి కూడా గుర్తించవచ్చని వారు అంటున్నారు. ఒకప్పుడు సంచలనం సృష్టించిన నిఠారి హత్య కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 19 మంది పిల్లల కపాలాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి అక్కడ ముఖ పునర్నిర్మాణం ద్వారా 16 మంది పిల్లలను కచ్చితంగా గుర్తించారు. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ కూడా ఉపయోగించవచ్చని నిపుణులు తెలియజేశారు. నోయిడా పోలీసులు 2006లో చండీగఢ్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించగా అక్కడి డాక్టర్లు డాక్టర్ సంజీవ్, డాక్టర్ రాజీవ్ గిరోటి (డీఎన్ఏ) నిపుణులు కంప్యూటర్ సూపరింపోజ్, 3డీ ద్వారా ముఖాలను పునర్నిర్మించి ఆ కపాలాలు ఎవరివో గుర్తించారు. ప్రస్తుతం షీనా బోరాగా భావిస్తున్న అవశేషాలను 2012, మే 23వ తేదీన రాయ్గఢ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో స్కల్, ఎముకలు, పంటి శాంపిల్స్ను ముంబైలోని జేజే ఆస్పత్రికి పంపించారు. ఎలాంటి మిస్సింగ్ కేసు దాఖలు కాకపోవడం, దర్యాప్తు ముందుకు సాగకపోవడం ఆ అవశేషాలు చాలాకాలం జేజే ఆస్పత్రిలోనే ఉండిపోయాయి. అనంతరం వాటిని ఆస్పత్రి వర్గాలు తిరిగి ముంబై పోలీసులకు అప్పగించారు. అవి, ముఖ్యంగా స్కల్, పను వరుస ఇప్పటికీ భద్రంగా ఉన్నాయని షీరా బోరా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. పంటి వరుస ద్వారా ఆ అవశేషాలు షీనా బోరావేనా ? అన్న విషయాన్ని గుర్తించాలంటే ఆమె ఎప్పుడైన డెంటిస్ట్ దగ్గరికి వెళ్లారా? అన్న విషయం తేలాలి. వెళ్లినట్టయితే అక్కడ అందుకు సంబంధించిన రికార్డులు ఉండాలి. అలా లేనప్పుడు 2 డీ లేదా 3డీ లేదా కంప్యూటర్ సూపర్ ఇంపోజ్ ద్వారా స్కల్ను ముఖంగా మార్చి గుర్తించడమే ప్రత్యామ్నాయ మార్గాలు. ఆ సాంకేతిక పరిజ్ఞానం అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో లేదు. ముంబైలోని కెమ్ ఆస్పత్రి, చండీగఢ్లోని ఎఫ్ఎస్ఎల్ ఆస్పత్రిలో మాత్రమే ఉంది. -2డీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించాలంటే: అనుమానిత వ్యక్తి ఫొటోలు కావాలి. స్కల్ కావాలి. ఒక చిత్రకారుడు, ఓ ఫోరిన్సెక్ ఆంత్రోపాలజిస్ట్ కలసి ముఖాన్ని పనర్నిర్మిస్తారు. కొన్ని సందర్భాల్లో స్కల్ రేడియో గ్రాఫ్లను కూడా వినియోగిస్తారు. -3డీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించాలంటే: బంకబట్టి, ఇతర పదార్థాలను ఉపయోగించి స్కల్ను ముఖ విగ్రహంగా మలుస్తారు. దీనికోసం హై రెసల్యూషన్గల త్రీ డెమైన్షనల్ కంప్యూటర్ చిత్రాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇందులోనూ చిత్రకారుడు, ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్ట్ పరస్పర సహకారం అవసరం. ఇదివరకు 2డీ, కంప్యూటర్ చిత్రాల ద్వారా విడివిడిగా ముఖాలను పునర్నిర్మించేవారు. ఇప్పుడు 3డీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కంప్యూటర్ చిత్రాలను, 3డీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకకాలంలో ఉపయోగించి ముఖాలను పునర్నిర్మిస్తున్నారు. -
షీనా తండ్రిని నేనే.. కాని ఇంద్రాణిని పెళ్లాడలేదు
ముంబయి/కోల్కతా: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో బయటకు వస్తున్న ఒక్కో అంశం ఒక్కో సంచలనంగా మారుతోంది. తొలిసారి షీనా బోరా అసలు తండ్రి సిద్ధార్థ్ దాస్ బయటకు వచ్చి పలు వివరణలు కోల్ కతాలో మీడియాకు వివరణ ఇచ్చారు. షీనాకు తండ్రి తానేనని ఒప్పుకున్న ఆయన ఈ కేసులో అసలు ముద్దాయి ఇంద్రాణి ముఖర్జియాను వివాహం మాత్రం చేసుకోలేదని చెప్పారు. కన్నకూతురు హత్యకు పాల్పడిన ఆమెను నిలువునా ఉరి తీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రాణి పూర్తిగా డబ్బు మనిషి అని, ఆమెతో తాను సహజీవనం మాత్రమే చేశాను తప్ప వివాహం చేసుకోలేదని వివరణ ఇచ్చారు. 1989లోనే ఇంద్రాణి తనను వదిలేసి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి ఆమెతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. బహుశా నాకు అప్పుడు ఉద్యోగం కూడా లేనందున నా స్థితి ఆమెకు నచ్చక వెళ్లిపోయి ఉండొచ్చని అన్నారు. షీనా డీఎన్ఏ పరీక్ష కోసం తన డీఎన్ఏ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సిద్ధార్థ దాస్ తెలిపారు. -
షీనా బోరా బతికే ఉంది: ఇంద్రాణి
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. షీనా బోరా బతికే ఉందని, అమెరికాలో ఉంటోందని ఉందని పోలీసు ఇంటరాగేషన్ లో ఆమె తల్లి ఇంద్రాణి ముఖార్జియా తెలిపినట్టు సమాచారం. తనపై ఉన్న ద్వేషంతోనే ఆమె ఎవరికీ కనిపించకుండా ఉండిపోయిందని ఇంద్రాణి చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. 24 ఏళ్ల షీనా బోరా 2012, ఏప్రిల్ 24న హత్యకు గురైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా షీనా అమెరికా వెళ్లిందని మూడేళ్లుగా ఇంద్రాణి చెబుతూ వచ్చింది. షీనా నిజంగా అమెరికా వెళ్లిందా, లేదా అనేది గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. షీనా హత్యకు గురైన సమయంలో అమెరికా వెళ్లిన ప్రయాణికుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు ఇంటరాగేషన్ సమయంలో పోలీసులకు ప్రశ్నలకు ఇంద్రాణి సరిగా సమాధానం చెప్పలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. సంజీవ్ ఖన్నాను దుమ్మెత్తి పోసినట్టు వెల్లడించాయి. -
షీనాబోరా కేసులో నిందితులకు కస్టడీ పొడిగింపు
-
కోర్టులో పడిపోయిన ఇంద్రాణి!
ముంబై: కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి ఇంద్రాణి ముఖర్జియాను సోమవారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆ సందర్భంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇంద్రాణిని విచారిస్తున్న సమయంలో ఆమె కోర్టులో కళ్లు తిరిగిపడిపోయింది. కాగా, కాసేపటికి ఇంద్రాణి తేరుకుంది. అనంతరం విచారణ చేపట్టిన కోర్టు.. ఆమె పోలీస్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకూ పొడిగించింది. ఇంద్రాణి ముఖర్జియాను విచారించడానికి మరికొంత సమయం కావాలని ముంబై పోలీసులు కోర్టుకు విన్నవించారు. వారి అభ్యర్థనను మన్నించిన కోర్టు.. ఆమె కస్టడీని పొడిగించింది. ఇదిలా ఉండగా ఇంద్రాణిపై విషప్రయోగం జరిగే అవకాశం ఉన్నందున ఆమె ఇంటి నుంచి ఆహారాన్ని అనుమతించకూడదని ప్రాసిక్యూషన్ వాదించింది. -
ఇంద్రాణి పోలీస్ కస్టడీ పొడిగింపు
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి ఇంద్రాణి ముఖర్జియా పోలీస్ కస్టడీని స్థానిక కోర్టు సెప్టెంబర్ 5 వరకూ పొడిగించింది. షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాను సోమవారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఇంద్రాణి ముఖర్జీయాను విచారించడానికి మరికొంత సమయం కావాలని ముంబై పోలీసులు కోర్టుకు విన్నవించారు. వారి అభ్యర్థనను మన్నించిన కోర్టు.. ఆమె కస్టడీని పొడిగించింది. కాగా, మరోవైపు ఇంద్రాణి ముఖర్జీ తరుపున వాదనలు కూడా వాడివేడిగా జరిగాయి. ఇప్పటికే ఇంద్రాణిని 80-90 గంటలు విచారించారని.. ఇంకా ఇంద్రాణిని పోలీస్ కస్టడీలో తీసుకోవాల్సిన అవసరం లేదని ఇంద్రాణి తరపు న్యాయవాది వాదించారు. ఇప్పటికే ఆమెపై హత్యకేసును నమోదు చేసిన పోలీసులకు కస్టడీ అవసరం లేదన్నారు. అయితే ఇంద్రాణి తరుపు న్యాయవాది వాదనతో ఏకీభవించని కోర్టు.. ఆమె పోలీస్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకూ పొడిగించింది. -
ఇంద్రాణిని తీవ్రంగా కొడుతున్నారు !
ముంబయి: విచారణ సమయంలో పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని తీవ్రంగా కొడుతున్నారని ఆమె తరుపు న్యాయవాదులు సోమవారం ముంబయి కోర్టుకు ప్రధానంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె హత్య కేసుకు సంబంధించి పలు వివరణలు ఇచ్చినా సంతృప్తి చెందని పోలీసులు విచారణ పేరిట ఆమెను భౌతికంగా మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించనున్నట్లు సమాచారం. తాము ఆమెను కలిసేందుకు వెళ్లిన సమయంలో ఆమె ముఖంపై చెంపదెబ్బల గాయాలు వారికి కనిపించినట్లు తెలుస్తోంది. సొంత కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఆమె కుమారుడిని కూడా హత్య చేసేందుకు ఆమె అదే రోజు పలురకాల కుట్రలకు పాల్పడిందని కూడా తెలిసింది. గతంలో పోలీసులు కోరిన కస్టడీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆ గడువు మరింత కోరేందుకు మరోసారి ఆమెను సోమవారం కోర్టుకు పోలీసులు హాజరుపరచనున్నారు. -
షీనా బోరా హత్య కేసులో గ్రామస్తుని సాయం!
ముంబై: షీనా బోరా.. 2012, ఏప్రిల్ నెలలో హత్య గురైంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీయా ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఆమె తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె డ్రైవర్ కలిసి షీనాను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. అయితే షీనా అవశేషాలను సేకరించే పనిలో పడ్డారు ముంబై పోలీసులు. షీనా హత్య కేసు దర్యాప్తులో సాయం అందించేందుకు రాయ్ గఢ్ జిల్లాలోని పెన్ తెహసిల్ గ్రామనికి చెందిన గణేష్ థానే ముందుకొచ్చాడు. గత మూడు సంవత్సరాల క్రితం ఓ మృతదేహ ఖనన స్థలిని చూశానని పేర్కొన్న గణేష్.. పోలీసులకు సాయం అందించేందుకు సిద్ధమయ్యాడు. తాను మామిడి కాయలు తేవడానికి అడవికి వెళ్లిన సమయంలో ఓ పాడైన మృతదేహాన్ని అక్కడ చూసినట్లు అతను పోలీసులకు తెలిపాడు. దీంతో అతనితో కలిసి శనివారం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పోలీసులు కొన్ని అవశేషాలను సేకరించారు. తాము సేకరించిన అవశేషాలను డీఎన్ఏ టెస్టుకు పంపిస్తున్నామని ముంబై నగర కమిషనర్ రాకేష్ మారియా తెలిపాడు. అప్పుడు పట్టించుకోని పోలీసులు.. మూడేళ్ల కిందట రాయ్గఢ్ జిల్లా పెన్ తాలూకాలో షీనా మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. దానికి సంబంధించి ఎటువంటి హత్య లేదా ప్రమాద మరణం కేసునూ నమోదు చేయకపోవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆనాడు విచారణను ఎవరు అడ్డుకున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీడియా రంగానికి చెందిన ఉన్నతస్థాయి వ్యక్తి ఇంద్రాణి ముఖర్జియా కుమార్తె షీనా బోరా 2012లో హత్యకు గురైన విషయం కొద్ది రోజుల కిందటే వెలుగు చూడ్డం తెలిసిందే. '2012 మే 23వ తేదీన సగం కాలి, పాడైపోయివున్న స్థితిలో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించిన ఒక వ్యక్తి సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. తొలుత కొన్ని అవశేషాలను అప్పట్లో సేకరించినా.. వాటిపై దర్యాప్తు మాత్రం జరగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. -
అప్పుడు అడ్డుకున్నది ఎవరు?
షీనా మృతదేహం మూడేళ్ల కిందటే దొరికినా కేసు ఎందుకు పెట్టలేదు? తాజా విచారణకు ఐజీపీ ఆదేశం అలీబేగ్/ముంబై: సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా హత్య మిస్టరీ మరో మలుపు తిరిగింది. మూడేళ్ల కిందట రాయ్గఢ్ జిల్లా పెన్ తాలూకాలో షీనా మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. దానికి సంబంధించి ఎటువంటి హత్య లేదా ప్రమాద మరణం కేసునూ నమోదు చేయలేదని పోలీసులు అంగీకరించారు. దీంతో ఆనాడు విచారణను ఎవరు అడ్డుకున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీడియా రంగానికి చెందిన ఉన్నతస్థాయి వ్యక్తి ఇంద్రాణి ముఖర్జియా కుమార్తె షీనా బోరా 2012లో హత్యకు గురైన విషయం కొద్ది రోజుల కిందటే వెలుగు చూడ్డం తెలిసిందే. షీనాను ఆమె తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె డ్రైవర్ కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించటం విదితమే. '2012 మే 23వ తేదీన సగం కాలి, పాడైపోయివున్న స్థితిలో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించిన ఒక వ్యక్తి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ పంచనామా నిర్వహించి.. కొన్ని అవశేషాలను జేజే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పుడు ఎటువంటి కేసూ నమోదు చేయలేదు. స్టేషన్ డైరీలో మాత్రం నమోదు చేశారు' అని రాయ్గఢ్ ఎస్పీ సువేజ్ హక్ శనివారం అలీబేగ్లో విలేకరులకు చెప్పారు. ఇందుకు కారణాలు, చేసిన తప్పులపై విచారణ జరపాలన కొంకణ్ రేంజ్ ఐజీపీ తనను ఆదేశించినట్లు తెలిపారు. దీంతో కేసుకు మసిపూసి మాఫీ చేయటానికి అప్పుడే ప్రయత్నాలు జరిగాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కేసు నమోదు చేయకపోవటంపై విచారణ నివేదిక అనంతరం తప్పు చేసిన అధికారులపై చర్యలు చేపడతామని డీజీపీ సంజీవ్ దయాల్ పేర్కొన్నారు. ఇదిలావుంటే.. శుక్రవారం వెలికితీసిన షీనా అస్థికలను ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. నన్ను కూడా చంపేవారు: షీనా తమ్ముడు షీనాను ఏ కారులో గొంతు నులిమి చంపారని నిందితులు వెల్లడించారో.. ఆ కారును పోలీసులు గుర్తించారు. ఆ కారును సమకూర్చిన వ్యక్తిని త్వరలో ప్రశ్నించే అవకాశముంది. ఇదిలావుంటే.. షీనా తమ్ముడు మైఖేల్ బోరా పోలీసుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తన తల్లి ఇంద్రాణి తనను కూడా చంపాలని కుట్ర పన్నినట్లు చెప్పారు. షీనాను హత్య చేసిన రోజున తాను కూడా.. ఖన్నా బసచేసిన హోటల్లో ఉన్నానని, మత్తుమందు కలిపిన నీటిని తనకు ఇవ్వజూపారని, కానీ తాను తప్పించుకోగలిగానని ఆయన వివరించినట్లు సమాచారం. షీనా హత్యకు తాను సహకరించానని చెప్పిన సంజీవ్ ఖన్నా.. పోలీసుల విచారణలో మైఖేల్ బోరాను కూడా తాము హత్య చేసి ఉండేవారమని అంగీకరించినట్లు తెలిసింది. ముగ్గురు నిందితులను రాయ్గఢ్లో షీనాను హత్య చేసిన అటవీ ప్రాంతానికి మరోసారి తీసుకెళ్లనున్నారు. -
షీనా బోరా అసలు తండ్రి ఎవరు?
-
'ఆ రోజే అమ్మ నన్ను చంపాలనుకుంది'
ముంబై: షీనా బోరా హత్య కేసులో ఎన్నో కొత్త విషయాలు, కుట్రలు వెలుగు చూస్తున్నాయి. తన తల్లి ఇంద్రాణి ముఖర్జియా తన సోదరి షీనాను హత్య చేసిన రోజే (2012 ఏప్రిల్ 24) తననూ చంపాలని ప్రయత్నించిందని మైకేల్ బోరా పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే ప్రమాదం నుంచి తాను తప్పించుకున్నానని చెప్పాడు. ముంబై పోలీసు బృందంతో కలసి గువహాటి నుంచి ఇక్కడకు వచ్చిన మైకేల్ విచారణలో కీలక విషయాలు చెప్పాడు. రాహుల్ ముఖర్జియాతో షీనా పెళ్లి విషయం గురించి మాట్లాడేందుకు ముంబైలో ఇంటికి రావాల్సిందిగా తన తల్లి పిలిచిందని మైకేల్ వెల్లడించాడు. మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చారని, తాగగానే తల తిరిగినట్టు అనిపించిందని చెప్పాడు. ఆ సమయంలో షీనాను తీసుకువస్తామని ఇంద్రాణి, ఆమె మాజీ భర్త (రెండో భర్త) సంజీవ్ ఖన్నా వెళ్లారని, ఆ సమయంలో తాను ఇంట్లో నుంచి పారిపోయానని తెలిపాడు. షీనాతో పాటు తనను చంపేందుకు ఇంద్రాణి పథకం పన్నిందని చెప్పాడు. ఆ సమయంలో ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ విదేశాల్లో ఉన్నారని చెప్పాడు. ఆ తర్వాత ఇంద్రాణి, ఖన్నా.. షీనాను తీసుకుని నిశ్చితార్థం కోసం ఉంగరం కొనేందుకు వెళ్లారని పోలీసులు చెప్పారు. ఓ హాటల్లో ఆమెకు మద్యం తాగించి గొంతునులిచి చంపేశారు. ఆ తర్వాత వర్లిలోని ఇంద్రాణి ఇంటికి రాగా ఇంట్లో మైకేల్ కనిపించలేదు. మైకేల్ను కూడా చంపేందుకు ఇంద్రాణి పథకం వేసిందని కారు డ్రైవర్ రాయ్ కూడా పోలీసుల విచారణలో చెప్పాడు. పీటర్పై తన పట్టు కోల్పోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోతాననే ఉద్దేశంతో ఇంద్రాణి.. షీనాను చంపినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అంతేగాక షీనా.. రాహుల్ను పెళ్లి చేసుకుంటే ఆమె తన కుమార్తె అని అందరికీ తెలుస్తుందని కూడా భయపడినట్టు చెప్పారు. ఇంద్రాణి.. పీటర్ను పెళ్లి చేసుకునే సమయంలో షీనా తన కూతురనే విషయం దాచిపెట్టి సోదరిగా పరిచయం చేసింది. పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్ కాగా, మొదటి భర్త ద్వారా ఇంద్రాణికి పుట్టిన పిల్లలు షీనా, మైకేల్లు. -
హత్యకు గురయ్యే ముందు షీనా గర్భవతా?
-
హత్యకు గురయ్యే ముందు షీనా గర్భవతా?
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. షీనా బోరాను హత్య చేసే సమయానికి ఆమె గర్భవతి అయినట్టు సమాచారం. ముఖర్జియా కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఈ విషయం చెప్పారని ఆన్లైన్ మీడియా వెల్లడించింది. ఆన్లైన్ మీడియా సమాచారం మేరకు.. షీనా ఓ వ్యక్తితో కలసి ఓ ఆగ్నేయాసియా దేశానికి బిజినెస్ ట్రిప్ వెళ్లారు. ఆ వ్యక్తి షీనా తల్లి ఇంద్రాణికి సన్నిహితుడు. ఇంద్రాణి ఈ విషయంపై ఆ వ్యక్తిని ప్రశ్నించగా, ఆయన షీనాతో కలసి వెళ్లినట్టు ఒప్పకున్నారు. తాను గర్భవతి అయినట్టు షీనా తన తల్లి ఇంద్రాణికి చెప్పారు. ఆ తర్వాత షీనా హత్యకు గురైంది. ఆమెను హత్య చేసి అడవుల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా ఆమె కుమార్తె షీనాను గొంతు నులిమి చంపేసినట్టు వారి కారు డ్రైవర్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్ని ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా స్వయంగా ఇంటరాగేట్ చేశారు. కోల్కతాలో అరెస్టు చేసిన మూడో నిందితుడు సంజీవ్ ఖన్నా (ఇంద్రాణి రెండోభర్త)ను పోలీసులు విచారించారు. హత్య జరిగిన తీరు సంజీవ్ఖన్నా, డ్రైవర్ ఎస్పీరాయ్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. -
అమ్మ నన్ను కూడా చంపేసేదేమో!?
-
'ఇంద్రాణి మాజీ భర్త.. షీనాను చంపారు'
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా ఆమె కుమార్తె షీనాను గొంతు నులిమి చంపేసినట్టు వారి కారు డ్రైవర్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్ని ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా స్వయంగా ఇంటరాగేట్ చేశారు. కోల్కతాలో అరెస్టు చేసిన మూడో నిందితుడు సంజీవ్ ఖన్నా (ఇంద్రాణి రెండోభర్త)ను పోలీసులు విచారించా రు. హత్య జరిగిన తీరు సంజీవ్ఖన్నా, డ్రైవర్ ఎస్పీరాయ్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. -
అక్క పేరుతో విలువైన ఆస్తులున్నాయే..
-
అమ్మ నన్ను కూడా చంపేసేదేమో!?
షీనా హత్య కేసులో ఇంద్రాణి కొడుకు అనుమానం * గువాహటిలో మిఖైల్, కోల్కతాలో ఖన్నా... * ముంబైలో ఇంద్రాణి, రాహుల్ల ఇంటరాగేషన్ * హత్య చేయాల్సిన ప్రదేశంలో ముందే రెక్కీ నిర్వహించిన ఇంద్రాణి గువాహటి/ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు విచారణ ఊపందుకుంది. గువాహటిలో షీనా సోదరుడు మిఖైల్ను, కోల్కతాలో నిందితురాలు ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాను, ముంబైలో ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కొడుకు రాహుల్ను పోలీసులు గురువారం రోజంతా విచారించారు. విచారణలో రకరకాల కోణాల్లో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన సోదరిని హత్య చేసిన తల్లి.. తరువాత తనను కూడా చంపేసేదేమోనని ఆమె కుమారుడు మిఖైల్ బోరా గువాహటిలో అన్నాడు. పోలీసులు ముంబైకి పిలిస్తే ఈ కేసులో వారికి పూర్తిగా సహకరిస్తానని.. కేసుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలను సమర్పిస్తానన్నాడు. ‘అమ్మ చాలా శక్తిమంతురాలు.. తాను ఏమైనా చేయగలదు’ అని అన్నాడు. తన పాన్ కార్డ్ను, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వాలని తల్లి తనను అడిగిందని. అయితే తాను ఇవ్వకుండా నిరాకరించానన్నాడు. ఆ తరువాత ముంబై నుంచి వచ్చిన ఓ పోలీసు అధికారి మిఖైల్ను అతని ఇంట్లోనే గంటపాటు విచారించారు. హత్యకుకారణమేంటో తెలుసు: మారియా ఇటు ముంబైలో షీనా హత్య కేసు విచారణలో గురువారం ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా స్వయంగా రంగంలోకి దిగారు. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్ని రాకేశ్ స్వయంగా ఇంటరాగేట్ చేశారు. షీనా బోరాను స్వయంగా ఆమె తల్లే చంపడానికి కారణమేమిటనేది తమకు తెలుసని, అయితే కోల్కతాలో అరెస్టు చేసిన మూడో నిందితుడు సంజీవ్ ఖన్నా (ఇంద్రాణి రెండోభర్త) ఇంకా ముంబైకి చేరుకోలేదని, ఆయనను కూడా విచారించాకే జరిగిందేమిటో వెల్లడిస్తామని రాకేశ్ గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అటు కోల్కతాలో ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు గురువారం విచారించా రు. హత్య జరిగిన తీరు మాత్రం సంజీవ్ఖన్నా, డ్రైవర్ ఎస్పీరాయ్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. దీని ప్రకారం ‘షీనా హత్య జరిగిన ఏప్రిల్ 24, 2012కు ముందు రోజే సంజీవ్ఖన్నా కోల్కతా నుంచి ముంబైకి వచ్చాడు. ఏప్రిల్ 23న ఇంద్రాణి రాయ్గఢ్ తాలూకాలోని అటవీప్రాంతానికి వెళ్లి అక్కడ రెక్కీ నిర్వహించింది. ఏప్రిల్ 24లో ముంబైలోని ఓ హోటల్ గదిలో షీనాకు మద్యం తాగించి, తరువాత కారులోకి బలవంతంగా ఎక్కించి.. హైవేపై తీసుకెళ్తూ మార్గమధ్యంలోనే గొంతు నులిమి చంపేశారు. ఆ తరువాత ముందురోజు తాము ఎంపిక చేసుకున్న అటవీ ప్రాంతంలో ఆమె శవాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఏప్రిల్ 25న విమానం ద్వారా సంజీవ్ఖన్నా తిరిగి కోల్కతా వెళ్లిపోయాడు.’ మరోవైపు పీటర్ కుమారుడు రాహుల్ను దాదాపు 12 గంటల పాటు పోలీసులు విచారించారు. షీనాది పరువు హత్యా? లేక ఆర్థిక వ్యవహారమా? అన్నది తేలాల్సి ఉంది. తండ్రి స్థానంలో తాతపేరు కూతురు షీనా బోరా బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరు స్థానంలో ఇంద్రాణి ముఖర్జీ ఎవరి పేరు రాయించారో తెలుసా? తన సొంత తండ్రి పేరును. ఉపేంద్ర కుమార్ బోరా...ఇంద్రాణికి తండ్రి. అయితే మనవరాలు షీనా బర్త్ సర్టిఫికెట్లో కూడా తండ్రిగా ఈయన పేరే ఉంది. 80 ఏళ్ల ఉపేంద్ర కుమా ర్ బోరా గురువారం స్పందిస్తూ... ‘షీనా నా కూతురు కాదు, మనవరాలు’ అని చెప్పారు. సిద్ధార్థ్ దాస్(ఇంద్రాణి మొదటిభర్త) షీనా తండ్రి అని తెలిపారు. అయితే సిద్ధార్థ్ కూడా షీనా తండ్రి కాకపోవచ్చని, షిల్లాంగ్ వాసి ద్వారా ఇంద్రాణి ఆమెను కన్నదనే వార్తలపై స్పందిస్తూ... వాస్తవమేంటో తేలాలన్నారు. -
షీనా బోరా సోదరుడు అరెస్టు
గువాహతి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో అరెస్టు జరిగింది. హత్యకు పాల్పడిన ఇంద్రాణి ముఖర్జియా కుమారుడు, షీనాబోరా సోదరుడు మిఖైల్ బోరాను పోలీసులు దిస్పూర్లో అదుపులోకి తీసుకున్నారు. తొలుత ప్రాథమిక విచారణ కోసం స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు కొద్ది సేపు ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేశారు. 2012లో షీనా బోరాను ఆమె కన్నతల్లి ఇంద్రాణి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సమగ్ర సమాచారం కోసం షీనా బంధువులను, కుటుంబీకులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు. -
తర్వాత అమ్మ నన్నే చంపేసేదేమో..
గువాహతి: 'నాసోదరి తర్వాత మా అమ్మ నన్నే టార్గెట్ చేసేదేమో. ఆ తర్వాత నన్నే చంపేసేదేమో' అని కూతురు హత్యకు పాల్పడి కటకటాలపాలైన మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జియా కుమారుడు మిఖైల్ బోరా అన్నాడు. ఇంద్రాణి అరెస్టు నేపథ్యంలో గువాహతిలో మీడియాతో మాట్లాడారు. 'నాకు తెలియదు. 2012లో మా సోదరి షీనా బోరాను హత్య చేసిన తర్వాత బహుషా నన్నే టార్గెట్ పెట్టుకొని చంపేసేదేమో. ఆ రోజు నన్ను పిలిచింది. కానీ నేను రావడం కుదరదని చెప్పాను. ఆమె చాలా శక్తిమంతురాలు. ఏమనుకుంటే అది చేయగలదు' అని పేర్కొన్నాడు. ఈ కేసు దర్యాప్తుకు సహాయపడేందుకు ముంబయికి వెళ్లాలని ఉంది. కాని ఒంటరిగా వెళ్లడం భయంగా ఉంది. మా తాతయ్యఅమ్మమ్మల బాధ్యతలు చూసుకునేందుకు అసోం ప్రభుత్వం ఇద్దరు నర్సులను ఏర్పాటుచేయగలిగితే వెళ్లగలను' అని చెప్పాడు. సొంత కూతురు షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసిన విషయం తెలిసిందే.