వనస్థలిపురం ఆటోనగర్ ప్రాంతంలో సోమవారం జరిగిన కాల్పుల్లో తప్పించుకున్న చైన్ స్నాచర్ల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. సైబరాబాద్ పోలీసులు ఈ నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులలో ఒకరికి బుల్లెట్ గాయం అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.