రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ), జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలపై క్షుణ్ణంగా చర్చిస్తామని విద్యాశాఖ మంత్రి, హైపవర్ కమిటీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ నివేదికల్ని అధ్యయనం చేసేందుకు హైపవర్ కమిటీ త్వరలోనే సమావేశవుతుందని వెల్లడించారు.