ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాల సమాయాన్ని ప్రారంభించారు. అయితే కరువు, విత్తనాల కొరతపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు ఆ అంశాలపై చర్చకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్... ప్రశ్నోత్తరాల సమయం అనంతరం వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని సూచించారు.