కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటించారు. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ అయిన అధోని పత్తి మార్కెట్ యార్డులో రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. రైతుల కష్టాలు ఏంటో చెబితే విందామని.. ఓ రైతును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పవన్ మైక్ ఇచ్చారు. అనంతం అక్కడున్న వారందరిని ఉద్దేశించి పవన్ మాట్లాడారు. 'ఒక్క నిమిషం. మీ అందరికి నా హృదయ పూర్వక నమస్కారాలు. నేను ఇక్కడికి వచ్చింది మన రైతుల సమస్యలు వినడానికి. మీ భవిష్యత్తు కోసమే. రైతనేవాడే లేకపోతే, మన భవిష్యత్తు ఉండదు. ఒక్కసారి మీకోసమే వచ్చాను కాబట్టి రైతుల కష్టాలను విందాం' అని రైతును మాట్లాడమన్నారు.