భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. తన గారాల పట్టి ఇషా వివాహం పిరామల్ ఎంటర్ప్రైజెస్ అధినేత అజయ్ పిరామల్ తనయుడు ఆనంద్ పిరామల్తో నిశ్చయం కావడంతో ఆ కుంటుంబం సంబరాల్లో మునిగితేలుతోంది. ఈ ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఈషా అంబానీ, ఆనంద్ పిరమాల్ల ఎంగేజ్మెంట్ పార్టీని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ ప్రముఖులు షారూక్ఖాన్, ఆమీర్ఖాన్, రణ్బీర్ కపూర్, కరణ్జోహార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇషా తన తల్లిదండ్రులతో కలిసి స్టెప్పులు వేసింది. ముఖేష్ అంబానీ తన కూతురుతో కలిసి ఆనందంగా స్టెప్పులేశాడు. ఇక ఇషా తల్లి నీతా అంబానీతో కలిసి బాలీవుడ్ పాటలకు స్టెప్పులేసి అందరిని అలరించారు.