dance
-
విశాఖ బీచ్రోడ్డులో యువతతో కలిసి వైద్యురాలు స్టెప్పులు (ఫొటోలు)
-
‘డాన్స్ కోసం పుట్టి.. ప్రొఫెసర్ అయ్యారు’
బెంగళూరు: ఏదైనా కళాశాలో పంక్షన్ జరుగుతున్నప్పుడు విద్యార్థులు నృత్యం చేస్తుంటే, ఉపాధ్యాయులు వారిని ఉత్సహపరచడాన్ని, ఆనందించడాన్ని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నమైన దృశ్యం బెంగళూరులో కనిపించింది. ఇక్కడి ఒక కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ విద్యార్థుల సమక్షంలో హిప్-హాప్ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. ఆ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆ ప్రొఫెసర్ను ఉత్సాహపరుస్తుండగా, అతను డాన్స్ ఇరగదీయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు.గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ(Global Academy of Technology) (గాట్) విద్యార్థులు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియోలో ప్రొఫెసర్ పుష్ప రాజ్.. ప్లే అవుతున్న మ్యూజిక్కు అనుగుణంగా నృత్యం చేయడాన్ని చూడవచ్చు. మైఖేల్ జాక్సన్ తరహాలో నృత్యం చేశారు. కళాశాల కారిడార్లో ప్రొఫెసర్ నృత్యం చేస్తుండగా, విద్యార్థులు ఆనందంతో కేకలు వేశారు. కళాశాలలోని విద్యార్థులంతా అతని నృత్యాన్ని వీక్షించారు. ఈ వీడియో ఇప్పటికే 24 మిలియన్లకు పైగా వ్యూస్ను దక్కించుంది.ఈ వీడియోను చూసిన యూజర్స్ సోషల్ మీడియా(Social media)లో రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక యూజర్ ‘నృత్యకారునిగా పుట్టారు.. లెక్చరర్గా బలవంతంగా మారారు’ అని రాయగా, మరొకరు ‘అతను నా గురువు కాకుంటే, నాకు ఇష్టమైన హీరో అయ్యేవారు’ అని రాశారు. మరొకరు ‘అతను తనకు నచ్చని వృత్తిలో కొనసాగుతున్నారు’ అని రాశారు. మొరొకరు *అతను మాస్టర్ జీ కాదు..డ్యాన్స్ మాస్టర్ జీ’ అని రాశారు. View this post on Instagram A post shared by 🎥🚀 (@gatalbum)ఇది కూడా చదవండి: New Delhi: తృటిలో తప్పిన తొక్కిసలాట -
రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అది దా డేవిడ్ వార్నర్ సర్ప్రైజ్!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'రాబిన్హుడ్'.'భీష్మ' హిట్ ఫిల్మ్ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తాజాగా రాబిన్హుడ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథి డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్నర్ తన డ్యాన్స్తో ఆడియన్స్ను అలరించారు. పుష్ప చిత్రంలో చూపే బంగారమాయమే శ్రీవల్లి.. అనే పాటకు అల్లు అర్జున్ స్టైల్లో హుక్ స్టెప్కు కాలు కదిపారు. అంతేకాకుండా రాబిన్ హుడ్ మూవీలో అది దా సర్ప్రైజ్ అంటూ సాగే కేతిక శర్మ పాటకు సైతం డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. The fan-favorite @davidwarner31 does the blockbuster #Pushpa hookstep at the #Robinhood trailer launch & Grand Pre-Release Event ❤️🔥Watch Live now!▶️ https://t.co/lbpuVoSvra#Robinhood Trailer Out Now ▶️ https://t.co/h2nhPhMrqE@actor_nithiin @sreeleela14 @VenkyKudumula… pic.twitter.com/fUUihxlejF— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2025 The stars of #Robinhood - @actor_nithiin, @sreeleela14, @davidwarner31 & @TheKetikaSharma - dance to the trending chartbuster #AdhiDhaSurprisu at the #Robinhood trailer launch & Grand Pre-Release Event 💥💥❤️🔥Watch Live now!▶️ https://t.co/lbpuVoSvra#Robinhood Trailer Out Now… pic.twitter.com/mmISnN1ula— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2025 -
ఐపీఎల్ ప్రారంభ వేడుక.. కింగ్ ఖాన్తో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ
వేసవి క్రీడా సంబురం ఐపీఎస్ సందడి అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ ఏడాది మెగా సీజన్ మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభ వేడుకల్లో పలువురు సినీతారలు కూడా సందడి చేశారు. ముఖ్యంగా కేకేఆర్ యజమాని షారూఖ్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్లో బాలీవుడ్ భామ దిశాపటానీ తన డ్యాన్స్తో అభిమానులను మెప్పించింది.అయితే ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ క్రికెటర్లను కాసేపు నటులుగా మార్చేశారు. తనతో పాటు విరాట్ కోహ్లీ, రింకూ సింగ్ను డ్యాన్స్ చేయించారు. పఠాన్ మూవీలోని ఓ సాంగ్కు కింగ్ కోహ్లీ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఐపీఎల్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అంతేకాకుండా ఈ వేడుకలో ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన పాటలతో అభిమానులను అలరించారు. పుష్ప-2 సాంగ్ పాడి ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం షారూక్ ఖాన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్లో నటించడం లేదు. చివరిసారిగా జవాన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. King Khan 🤝 King Kohli When two kings meet, the stage is bound to be set on fire 😍#TATAIPL 2025 opening ceremony graced with Bollywood and Cricket Royalty 🔥#KKRvRCB | @iamsrk | @imVkohli pic.twitter.com/9rQqWhlrmM— IndianPremierLeague (@IPL) March 22, 2025 -
విమానంలో అదిరే హోలీ స్టెప్పులు: ఇక జన్మలో స్పైస్జెట్ ఎక్కను!
హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సామాన్యమానవుల దగ్గర్నించీ, సెలబ్రిటీల దాకా రంగుల పండుగ ఉత్సవాల్లోఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్మీడియాలో ఆకట్టుకంటున్నాయి. అయితే వీటన్నింటికంటే భిన్నంగా ఒకవీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. హోలీ పండుగ సందర్భంగా స్పైస్ జెట్ (SpiceJet) సిబ్బంది తమ డ్యాన్స్తో ప్రయాణికులను అలరించారు. అయితే విధి నిర్వహణ మర్చి గెంతులేశారు అంటూ నెటిజన్లులు మండిపడ్డారు.హోలీ (Holi202) స్పైస్జెట్ క్యాబిన్ సిబ్బంది వార్తల్లో నిలిచాయి. విమానంలో స్టెప్పులేసి ప్రయాణీకులతో కలిసి హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. బాలీవుడ్ మూవీ యే జవానీ హై దీవానీ చిత్రంలోని పాటకు నృత్యం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో టేకాఫ్కు సిద్ధంగా విమానంలో స్పైస్జెట్ క్యాబిన్ క్రూ అంతా సంప్రదాయ దుస్తులు ధరించి, హోలీ ‘బలం పిచ్కారి’ పాటకు నృత్యంచేశారు ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లు ఉత్సాహంగా మ్యూజిక్కు తగ్గట్లు స్టెప్పులతో అదరగొట్టేశారు. వీరి సంతోషానికి ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. పనిలో పనిగా వీడియోలను రికార్డు చేశారు. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ వీడియోను గోవింద్ రాయ్ (@govindroyicai) అనే వినియోగదారు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. వీడియో 3 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించినప్పటికీ, ఇది ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీన్ని తప్పుబట్టారు. సిబ్బంది మూలంగా విమానం 5 గంటలు ఆలస్యం అయింది అంటూ విమర్శించారు. విధి నిర్వహణ మానేసి ఇదేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.A signature festival, a signature song, and a celebration like no other! 💃 Our crew brought Holi to life with an energetic dance, proving that traditions take flight with us!#flyspicejet #spicejet #happyholi #addspicetoyourtravelVideo was filmed on ground with all safety… pic.twitter.com/63XKMJDZCI— SpiceJet (@flyspicejet) March 14, 2025 మరో వినియోగదారుడైతే ఏకంగా స్పైస్ జెట్ విమానం ఎక్కను అంటూ అన్నాడు. “చాలా ఏళ్ల తరువాత నేను స్పైస్జెట్లో ప్రయాణిస్తున్నా..ఇక ఇదే చివరిసారి. ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఈ ఎయిర్లైన్తో ప్రయాణించను”అంటూ కమెంట్ చేశాడు.కొంతమంది క్యాబిన్ క్రూ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. “ ఒక క్యాబిన్ క్రూగా, నేను దీన్ని అభినందించను. ఇది అస్సలు ప్రొఫెషనల్ కాదు” అని వ్యాఖ్యానించారు. -
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్కు వెళ్తున్నా’
కర్నూలు: మరో రెండు రోజుల్లో పాఠశాలలో వేడుక ఉంది. అందులో నిర్వహించే డ్యాన్స్ కార్యక్రమంలో అందరినీ అలరించాలని ఆ బాలుడు ఎంతో ఎదురు చూశాడు. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. ‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్కు వెళ్తున్నా’ అని ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు విగత జీవిగా తిరిగొచ్చాడు. తండ్రి కళ్లేదుటే ఆ కుమారుడు లారీ చక్రాల కింద నలిగిపోయాడు. ఈ ఘటన ఆదోని పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని లంగర్బావి వీధికి చెందిన గురురాజ, ప్రతిభ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సత్యనారాయణ 9వ తరగతి, ద్వితీయ కుమారుడు ఆదిత్యనారాయణ (10) ఐదో తరగతి చదువుతున్నారు. గురురాజ.. మెడికల్ ఏజెన్సీ వృత్తి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎమ్మిగనూరు రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదిత్యనారాయణ విద్యనభ్యసిస్తున్నాడు. అకాడమీ పూర్తి కావడంతో మంగళవారం ఫెర్వెల్ పార్టీ నిర్వహించాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం కొందరు విద్యార్థులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఆదిత్యనారాయణ ఉదయం తన తండ్రి గురురాజతో బైక్పై పాఠశాలకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఎమ్మిగనూరు రోడ్డులోని శ్రీ కృష్ణదేవాలయం సమీపంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ లారీ ఆదోని వైపు వేగంగా దూసుకువస్తుండగా తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డారు. అయితే గురురాజ ఒకవైపు పడిపోయి సురక్షితంగా ఉన్నాడు. మరోవైపు ఆదిత్యనారాయణ లారీ టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడు మృతిచెందినా లారీని నిలబెట్టకుండా డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లి ప్రమాద స్థలానికి చేరుకుని.. కుమారుడి జ్ఞాపకాలను తలుచుకుని రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. తండ్రి గురురాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తప్పించుకున్న లారీ డ్రైవర్, లారీని సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.అమ్మా.. నేనేం పాపం చేశా! -
Mega Jhumur: ప్రధాని మోదీ గెస్ట్గా మెగా ఝుమైర్
ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సోమవారం అస్సాం అతిపెద్ద ఝుమైర్ నృత్య కార్యక్రమం జరగనుంది. ఇందులో ఎనిమిదివేల మందికి పైగా పాల్గొంటారు. అంతేగాదు ఈ నృత్య ప్రదర్శనను విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో సుమారు 60 మందికి పైగా విదేశీ దౌత్యవేత్తలు వీక్షించనున్నారు. అలాగే ప్రజలందరూ వీక్షించేలా దాదాపు 800 టీ ఎస్టేట్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇంతకీ అసలేంటీ నృత్యం..? దాని ప్రాముఖ్యత తదితరాల గురించి తెలుసుకుందాం. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఝుమైర్ ప్రాముఖ్యత గురించి పలుమార్లు పునరుద్ఘాటించారు. ఇది అస్సామీ సంస్కృతిలో అంతర్భాగం, టీ తెగ కమ్యూనిటీ భావాలను ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రి బిస్వా ఢిల్లీలో రాబోయే ప్రదర్శనల ప్రణాళికలను ప్రకటిస్తూ..అంతర్జాతీయ వేదికపై కూడా ఈ నృత్యం ప్రదర్శించాలనే తన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఇంతలా అస్సాం గిరిజనులతో లోతుగా పాతుకు పోయిన ఝుమైర్ నృత్యం అంటే ఏంటంటే.. ఝుమైర్ నృత్యం అంటే.. ఝుమోయిర్ అనేది అస్సాంలోని టీ తెగ సంఘం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల గిరిజనులు ప్రదర్శించే సంప్రదాయ జానపద నృత్యం. ఇది టీ తోట కార్మికుల రోజువారీ జీవితాలలో లోతుగా పాతుకుపోయింది. తరచుగా పండుగలు, పంటకోత వేడుకలు, సామాజిక సమావేశాల సమయంలో ప్రదర్శిస్తారు. చూడటానికి ముగ్ధమనోహరంగా డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్ధమైన కదలికలతో కూడిన ఝుమైర్ నృత్యం ఇది. సంప్రదాయ మడోల్(డ్రమ్) లయబద్ధమైన దరువులు నడుమ టీతోటల శ్రమైక జీవుల కథలను శ్రావ్యమైన జానపద పాటలతో చెబుతారు. ఈ నృత్యాన్ని సమూహాలుగా చేస్తారు. ఒకరి నడుములు ఒకరు పట్టుకుని లయబద్ధమైన చప్పట్లు, డ్రమ్ లయలకు అణుగుణంగా పాదాలు కదుపుతారు. ఈ సాంస్కృతిక దృశ్య రూప నృత్యం టీ తోటల కార్మికుల ఐక్యత, సాముహిక స్ఫూర్తిని తెలియజేస్తుంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ నృత్యాన్ని ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ప్రధాన మోదీ సమక్షంలో ప్రదర్శించనున్నారు. అంతేగాదు ఈ ప్రతిష్టాత్మక కళారూపానికి జాతీయ, ప్రపంచ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది అస్సాం రాష్ట్రం. అస్సాం గతంలో 2023లో ఇదే వేదికపై సుమారు 12 వేల మందికి పైగా నృత్యకారులతో రికార్డు స్థాయి బిహు నృత్య ప్రదర్శన ఇచ్చి చరిత్ర సృష్టించింది. మళ్లీ ఈసారి కూడా ఆ స్థాయిలో శాశ్వత ముద్రను వేసే దిశగా అగుడులు వేస్తున్నారు అస్సాం ప్రదర్శనకారులు.(చదవండి: నో ఛాన్స్ మోడల్ కాలేవంటూ తిరస్కారాలు..కానీ అతడే ఇవాళ..) -
దివ్యాంగుల కోటాలో ఉద్యోగం .. ఆపై హుషారైన స్టెప్టులేసి..
భోపాల్ : ఓ ప్రభుత్వ అధికారిణి హుషారైన స్టెప్పులేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పార్టీల్లో డ్యాన్స్లు వేయడం,వాటిని వీడియోల రూపంలో పంచుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. అయితే, ట్రెజరీ విభాగంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆమె చేసిన డ్యాన్స్ వీడియోపై వివాదం చెలరేగింది. దీంతో ఆమె ప్రభుత్వ ఉద్యోగ నియామకంపై, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించే ఉద్యోగాల నియామకాలపై అనేక అనుమానాలు,ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆ హుషారైన స్టెప్పులేసిన ఆ అధికారిణి ఎవరు? ఎందుకు వివాదంలో చిక్కుకున్నారు.ఇటీవల,మధ్యప్రదేశ్లో జరిగిన ఓ పార్టీకి ఉజ్జయిని ట్రెజరీ,అకౌంట్స్ విభాగంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ప్రియాంకా కదమ్ (Priyanka Kadam)హాజరయ్యారు. ఆ పార్టీలో బ్రేక్ డ్యాన్స్ సైతం వేశారు. ఆమె డ్యాన్స్పై ఇతర గెస్ట్లు ఆహోఓహో అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. డ్యాన్స్ చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోనే ఇప్పుడు వివాదంగా మారింది.మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) నిర్వహించిన 2022 పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ప్రియాంకా కదమ్ బోన్ డిజేబుల్ సర్టిఫికెట్తో దివ్యాంగుల కోటా కింద ఆమె ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారని నేషనల్ ఎడ్యుకేటెడ్ యూత్ యూనియన్ నాయకుడు రాధే జాట్ ఆరోపణలు చేశారు. తాను దివ్యాంగురాలినని చెప్పుకునే ప్రియాంకా కదమ్ డ్యాన్స్ ఎలా చేశారని ప్రశ్నించారు. ఆమె దివ్యాంగంపై అనుమానం వ్యక్తం చేశారు. 45% दिव्यांग अधिकारी का डांस फ्लोर पर धमाल..MPPSC भर्ती 2022 में दिव्यांग कोटे से चयनित प्रियंका कदम के डांस वीडियो वायरल होने से विवाद खड़ा हो गया है. नेशनल एजुकेटेड यूथ यूनियन ने भर्ती में धांधली का आरोप लगाया, जिसके बाद निष्पक्ष जांच की मांग उठ रही है.#viral #trending… pic.twitter.com/bs5rLMs7Ad— NDTV India (@ndtvindia) February 14, 2025 అంతేకాదు, ఈ పరీక్షలో దివ్యాంగుల కోటాలో ఎంపికైన అభ్యర్థులకు మరోసారి పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్లను అందించేలా భోపాల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులను ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు స్పందించలేదు.అయితే, తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రియాంక కదమ్ ఖండించారు. తన నియామకంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. 2017లో తాను బాత్రూమ్లో జారిపడ్డానని, దీంతో తనకు అవాస్కులర్ నెక్రోసిస్ అనే సమస్య తలెత్తినట్లు చెప్పారు. అవాస్కులర్ నెక్రోసిస్ వ్యాధి కారణంగా రక్త సరఫరా లోపం తలెత్తి ఎముకలు బలహీనమవుతాయి.బోన్ సంబంధిత సమస్యల కారణంగా 45 శాతం దివ్యాంగురాలిగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అయితే తాను నడవగలనని, కొంతమేర డ్యాన్స్ కూడా చేయగలనని స్పష్టం చేశారు. నేను మీకు సాధారణంగా కనిపించవచ్చు. కానీ నా శరీరంలో ఇంప్లాంట్స్ వల్లే నడవగలుగుతున్నాను. కొన్ని నిమిషాలు డ్యాన్స్ కూడా చేయగలుగుతున్నాను. డ్యాన్స్ చేస్తే కొన్నిసార్లు శరీరంలో నొప్పులు తలెత్తుతాయి. మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది’ అని స్పష్టం చేశారు. -
బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధికా అంబానీ స్టెప్పులు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా అంబానీ తన డ్యాన్స్తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధిక అంబానీ తనదైన శైలిలో ఆకట్టుకుంది. స్టైలిష్ లుక్తో అందర్నీ కట్టి పడేసింది. స్నేహితులు కృష్ణ పరేఖ్, యష్ సింఘాల్ సంగీత్ వేడుకలో అనంత్ అంబానీ,రాధికా అంబానీతో కలిసి తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. అంతేకాదు అనార్కలి డిస్కో చలి అంటూ ప్రెండ్స్తో కలిసి సూపర్ స్టెప్పులేసింది రాధిక. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. రాధికా అంబానీ తన స్నేహితుల బృందంతో కలిసి విలాసవంతమైన సంగీత్ వేడుకలో నృత్యం చేసింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఇటీవల ముంబైలో ట్రైడెంట్ ఒబెరాయ్ హోటల్లో జరిగిన విలాసవంతమైన సంగీత్ వేడుకలో 'అనార్కలి డిస్కో చలి'కి తన అద్భుతమైన స్టెప్పులేసింది. 2012 చిత్రం హౌస్ఫుల్ 2 మూవీలోని ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వివాహానికి రాధిక అంబానీ స్టైలిష్ లుక్ మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. సిల్వర్ కలర్ లెహెంగాలో అందంగా ముస్తాబైంది. డైమండ్ బ్యాంగిల్స్ , చెవిపోగులతో తన లుక్ మరింత గ్రాండ్గా ఉండేలా జాగ్రత్తపడింది. దిల్ ధడక్నే దో చిత్రంలోని గల్లన్ గుడియాన్ లాంటి పాటలకు కూడా ఆమె ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ కనిపించింది. మరో వీడియోలో, ఆమె భర్త అనంత్ అంబానీ, వరుడు యష్ సింఘాల్, వారి స్నేహితులతో కలిసి నృత్యం చేస్తూ కనిపించారు. ఇదీ చదవండి: సబీర్ భాటియా లవ్ స్టోరీ : స్టార్ హీరోయిన్తో లవ్? కానీ పెళ్లి మాత్రం! View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ చ శైలా మర్చంట్ దంపతుల కుమార్తెరాధికా మర్చంట్. అలాగే అంబానీముఖేష్ , నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వివాహం తర్వాత తన అంబానీ ఇంటి పేరుతో కలిపి రాధికా అంబానీగా మారిపోయింది. యూరప్లో క్రూయిజ్తో సహా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకల పాటు గత ఏడాది జూలై 12న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇది "ఇండియాస్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్"గా నిలిచింది. ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిసెంబరులో రిలీజ్ చేసిన " మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024" జాబితాలో అనంత్-రాధికా అంబానీ కపుల్ని చేర్చడం విశేషం. -
‘ఆప్’ ఓడినా అతిషి డ్యాన్సులేంటి..? స్వాతి మలివాల్ పోస్టు వైరల్
న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం అతిషిపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఫైరయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయినప్పటికీ సీఎం అతిషి మాత్రం కల్కాజి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిచిన సంతోషంలో అతిషి తన అనుచరులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను స్వాతి మలివాల్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. పార్టీ ఓడిపోయినా బాధలేదు కానీ తాను మాత్రం గెలిస్తే చాలన్నట్లు సీఎం అతిషి డ్యాన్సులేయడం ఏంటని మలివాల్ ఎద్దేవా చేశారు. పార్టీ ఓడిపోయింది.ఆప్ ముఖ్య నేతలంతా ఓడిపోయారు.అయినా అతిషి ఇలా వేడుక చేసుకుంటున్నారు అని వీడియోను ఉద్దేశించి మలివాల్ విమర్శించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అతిషి 3521 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై గెలుపొందారు. ये कैसा बेशर्मी का प्रदर्शन है ? पार्टी हार गई, सब बड़े नेता हार गये और Atishi Marlena ऐसे जश्न मना रही हैं ?? pic.twitter.com/zbRvooE6FY— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025ఈ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి పార్టీ సీనియర్ నేతలంతా ఓటమి పాలయ్యారు.27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. కాగా, అతిషి ఆదివారం(ఫిబ్రవరి 9) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎల్జీ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే దాకా పదవిలో కొనసాగాలని ఎల్జీ అతిషిని కోరారు. -
ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి.. సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ముంబయిలోని ఓ రిసార్ట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రియాంక సోదరుడు సిద్దార్థ్ చోప్రా తన ప్రియురాలు నీలం ఉపాధ్యాయ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లిలో ప్రియాంక చోప్రా తన డ్యాన్స్తో అదరగొట్టింది. బాలీవుడ్ సాంగ్స్కు స్టెప్పులు వేస్తూ పెళ్లి వేడుకల్లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.తన సోదరుడి పెళ్లి ప్రియాంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. మండపం వద్దకు సోదరుడిని తీసుకురావడంతో పాటు డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. కుటుంబ సభ్యులతో పాటు తన భర్త నిక్ జోనాస్లో కలిసి ఈ పెళ్లి వేడుకలో అలరించింది. అంతేకాకుండా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
బామ్మర్ది పెళ్లిలో సాంగ్ పాడిన నిక్ జోనాస్.. ప్రియాంక చోప్రా డ్యాన్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లి వేడుకలతో బిజీగా ఉన్నారు. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా గ్రాండ్ వెడ్డింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెహందీ వేడుకల్లో తన ముద్దుల కూతురు మాల్టీ మేరీకో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. తాజాగా ఇవాళ జరిగిన బరాత్ వేడుకల్లో తన భర్త, సింగర్ నిక్ జోనాస్లో కలిసి సందడి చేసింది. బాలీవుడ్ సాంగ్కు స్టెప్పులు వేస్తూ కనిపించింది.ఈ వేడుకల్లో ప్రియాంక నీలిరంగు లెహంగాలో అందంగా కనిపించగా.. నిక్ జోనాస్ తెల్లటి షేర్వానీ ధరించి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు.అంతకుముందు జరిగిన సంగీత్ వేడుకల్లో నిక్ జోనాస్ పాట పాడారు. ఈ వీడియోను ప్రియాంక చోప్రా ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ బామర్ది పెళ్లిలో బావ అద్భుతమైన ఫర్మామెన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా.. తన ప్రియురాలు, నటి నీలం ఉపాధ్యాయను పెళ్లాడనున్నారు. మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) -
నాగచైతన్య తండేల్ మూవీ.. సాయిపల్లవిలా అదరగొట్టిన దేవీశ్రీ ప్రసాద్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.అయితే ఈ మూవీ రిలీజ్కు ముందు దర్శకుడు చందు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తండేల్ను వీక్షించారు. సినిమా ఫైనల్ కాపీ చూసిన దేవీశ్రీ, చందు డ్యాన్స్తో అదరగొట్టారు. హైలెస్సా హైలెస్సా అంటూ సాంగే పాటకు స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తండేల్ సినిమా ఫర్ఫెక్ట్గా రావడంతో సంతోషంతో డ్యాన్స్ చేశారు. దీంతో తండేల్ సూపర్ హిట్ కావడం ఖాయమని ఫ్యాన్స్తో పాటు మేకర్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.(ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)మత్స్యకార బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ చిత్రాన్ని రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. గుజరాత్లో చేపల వేటకు వెళ్లిన కొందరు శ్రీకాకుళం మత్స్యకారులను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తండేల్ మూవీని రూపొందించారు. నిజజీవితంలో జరిగిన కథ కావడంతో తండేల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా శోభితతో నాగచైతన్య పెళ్లి తర్వాత వస్తోన్న మొదటి చిత్రం కావడం మరో విశేషం. ఏదేమైనా చైతూ ఖాతాలో హిట్టా? సూపర్ హిట్టా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. వస్తున్నాం దుల్లగొడ్తున్నాం 🌊🔥⚓That's the tweet. 😎🤙🏻#Thandel in cinemas from tomorrow 🔥 pic.twitter.com/YLclLTci5L— Geetha Arts (@GeethaArts) February 6, 2025 -
నాగచైతన్య తండేల్ ఈవెంట్.. డ్యాన్స్తో అదరగొట్టిన అల్లు అరవింద్
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన చిత్రం 'తండేల్'(Thandel Movie). కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. తండేల్ జాతర పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.(ఇది చదవండి: బన్నీ ఫ్యాన్స్కి షాకిచ్చిన ‘తండేల్’ టీమ్.. నో ఎంట్రీ!)డ్యాన్స్తో ఆకట్టుకున్న అల్లు అరవింద్..అయితే ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తన డ్యాన్స్తో అలరించారు. యాంకర్ సుమ కనకాలతో కలిసి స్టెప్పులు వేశారు. హైలెస్సా హైలెస్సా అంటూ సాగే పాటకు ఆయన డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాస్ నిర్మించారు. The legendary producer does it again 💥💥💥The super energetic #AlluAravind Garu shakes his leg for #HailessoHailessa at the #ThandelJaathara ❤️🔥Watch the #ThandelJaathara live now 💥💥▶️ https://t.co/DPO8zzLUOv#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.… pic.twitter.com/qo8OvOwNeB— Geetha Arts (@GeethaArts) February 2, 2025 -
'ఈ వయసులో మీలా చేయలేను'.. సౌత్ హీరోలపై షారూఖ్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఆసక్తికర కామెంట్స్ చేశారు. దక్షిణాది హీరోలను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. గణతంత్ర దినోత్సవం రోజున దుబాయ్ గ్లోబల్ విలేజ్ వేదికగా జరిగిన ఈవెంట్లో షారూఖ్ మాట్లాడారు. సినీరంగంలో తన కెరీర్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ప్రభాస్, యష్, తలపతి విజయ్. రజనీకాంత్ లాంటి స్టార్స్ తనకు మంచి స్నేహితులని అన్నారు. అంతే కాదు సౌత్ హీరోల డ్యాన్స్ గురించి కూడా షారూఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.షారూఖ్ మాట్లాడుతూ.. 'దక్షిణ భారత్ నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి నాకు లక్షలాది అభిమానులు, చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, యష్, మహేష్ బాబు, తలపతి విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. అయితే వారికి నాది ఒకటే విజ్ఞప్తి. పాటలకు వేగంగా డ్యాన్స్ చేయడం ఆపేయండి. డ్యాన్స్ విషయంలో వారిని ఫాలో కావడం చాలా కష్టమైన పని. ఈ వయసులో నేను మీలా డ్యాన్స్ చేయలేను.' అంటూ సరదాగా మాట్లాడారు.అంతేకాకుండా షారూఖ్ ఖాన్ తన నటుడు తన రాబోయే చిత్రం కింగ్ గురించి మాట్లాడారు. గతంలో బ్లాక్ బస్టర్ పఠాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో తన కుమార్తె సుహానా ఖాన్తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. షారూఖ్ ఖాన్ చివరిసారిగా రాజ్కుమార్ హిరానీ తెరకెక్కించిన డుంకీలో కనిపించాడు.కింగ్ మూవీ గురించి షారూఖ్ ఖాన్ చెబుతూ..'ఈ చిత్రం గురించి నేను మీకు పెద్దగా చెప్పలేను. అయితే ఇది వినోదాత్మకంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. నేను ఇంతకు ముందు చాలా టైటిల్స్ వాడాను. ఇప్పుడు మన దగ్గర మంచి టైటిల్స్ అన్నీ అయిపోయాయి. అందుకే కింగ్ అనే టైటిల్ పెట్టాం. రాజు ఎప్పటికీ రాజే' అని వేదికపై నవ్వులు పూయించారు. .@Actorvijay , @urstrulyMahesh , #Prabhas , @AlwaysRamCharan , @alluarjun are my Close friends ~ @iamsrk 🔥pic.twitter.com/xCWBaLJuBS— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 28, 2025 -
Keerthy Suresh: భర్తతో కీర్తి స్టెప్పులు.. ఈ ఫోటోలు చూశారా?
-
అస్సాం సత్రియా చారిత్రాత్మక అరంగేట్రం
యాగ్రాజ్లో జరిగే మహా కుంభమేళాలో అస్సాం సత్రియా సంస్కృతిని ప్రదర్శించనున్నారు. మజులిలోని ఔనియాతి సత్రం నుంచి 40 మంది సభ్యుల బృందం సాంప్రదాయ సత్రియా నృత్యం, సంగీతం, నాటకాన్ని ప్రదర్శిస్తుంది, ఇది రాష్ట్ర ఆధ్యాత్మిక, కళాత్మక వారసత్వంలోకి ఒక ప్రత్యేకమైన విండోను అందిస్తుంది. ఈ ప్రదర్శనలలో శ్రీమంత శంకరదేవుని భక్తి నాటకం రామ్ విజయ్ భావోనా, దిహా నామ్ (సామూహిక గానం), సాంప్రదాయ బోర్గీత్, ఖోల్, సింబల్స్, ఫ్లూట్, వయోలిన్, దోతర వంటి వాయిద్యాలతో కూడిన నృత్యం ఉంటుంది. ఈ బృందం పురుష (పారశిక్ భాంగి), స్త్రీ (స్త్రీ భాంగి) నృత్య శైలులను ప్రదర్శిస్తుంది. 2000 సంవత్సరంలో భారతదేశ శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటిగా గుర్తింపు పొందిన సత్రియాను 15వ శతాబ్దంలో శ్రీమంత శంకరదేవుడు నృత్యం, నాటకం, సంగీతం ద్వారా శ్రీకృష్ణుని బోధనలను వ్యాప్తి చేయడానికి భక్తి మార్గంగా ప్రవేశపెట్టారు. కుంభమేళాలో ప్రదర్శనలు సత్రియాకు కేంద్రంగా ఉన్న గొప్ప కథ చెప్పడం, ఆధ్యాత్మిక ఇతివృత్తాలను ప్రతిబింబిస్తాయి. ఔనియాతి సత్రం సత్రాధికార్ పీతాంబర్ దేవ్ గోస్వామి, అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిష్టాత్మక వేదికపై ప్రాతినిధ్యం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ బృందం జనవరి 31 నుండి ఫిబ్రవరి 10, 2025 వరకు ప్రయాగ్రాజ్లో ఉంటుంది. భగవత్ పఠనాన్ని నిర్వహిస్తుంది. ఈ భాగస్వామ్యం అస్సాంకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు జరిగే పవిత్ర కుంభమేళాలో ప్రపంచ ప్రేక్షకులతో దాని సాంస్కృతిక సంప్రదాయాలను పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. (చదవండి: సేఫ్ లడకీ దేశాన్ని చుట్టేస్తోంది!) -
డాకు మహారాజ్ స్టెప్స్ పై ఊర్వశీ రౌతేలా స్ట్రాంగ్ కౌంటర్..
-
హృతిక్ రోషన్ vs జూనియర్ ఎన్టీఆర్ భీభత్సమైన డ్యాన్స్ పోటీ
-
డాకు మహారాజ్లో ఊర్వశి రౌతేలా.. బాలయ్యతో మరోసారి చిందులు!
బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించింది. అంతేకాకుండా దబిడి దిబిడి అంటూ సాగే ఐటమ్ సాంగ్లో బాలయ్య సరసన మెప్పించింది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్లింది.సాంగ్పై విమర్శలు..డాకు మహారాజ్లోని దబిడి దిబిడి సాంగ్పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.పట్టించుకోని ఊర్వశి రౌతేలా..అయితే సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వస్తున్నా పిచ్చ లైట్ అంటోంది బాలీవుడ్ భామ. తాజాగ ఇన్స్టా వేదికగా మరో వీడియోను పోస్ట్ చేసింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో కలిసి దబిడి దిబిడి సాంగ్కు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఊర్వశి రౌతేలాపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాలో రాస్తూ..' డాకు మహారాజ్ సక్సెస్ బాష్. దబిడి దిబిడి సాంగ్ 20 మిలియన్ల వ్యూస్ సాధించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ న్యూయర్లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
నృత్య పోటీల్లో..శ్రీరాధాకృష్ణ ‘హై’లైట్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): “గోదావరి నీటిని తాగితే కళాకారులవుతారు’ అనేది నానుడి. దీనిని నిజం చేస్తూ అనేక మంది సంగీత, నృత్య కళాకారులు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. చరిత్ర పుటల్లో తమదైన ముద్రను వేసి రాజమహేంద్రవరం ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నారు. ఆ కోవలోకే శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం చేరింది. ఈనెల 2న మలేషియాలోని టీఎంసీ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో 14 బహుమతులను గెలుచుకుని ఇక్కడి కళాకారులు ప్రతిభ చాటారు. ఇందులో ప్రథమ బహుమతి ఉండటం విశేషం. మలేషియాలోని స్వర్ణ మరియమ్మన్ కుచాంగ్ వారు ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పోటీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించారు.ఇందులో 13 దేశాల నుంచి 615 మంది కళాకారులు పాల్గొన్నారు. గాత్రం, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్, సెమీ క్లాసికల్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. దీన్లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం నుంచి 68 మంది విద్యార్థులు పాల్గొని 14 మంది బహుమతులు గెలుచుకున్నారు. ఆన్లైన్లో పోటీలు మలేషియాలో జరిగిన ఈ పోటీల్లో ఆన్లైన్ ద్వారా కళాకారులు తమ ప్రతిభను కనబరిచారు. వీటిని రికార్డ్ చేసుకున్న నిర్వాహకులు అన్నీ పరిశీలించాక బహుమతులు ప్రకటించారు.స్థానిక శ్రీరాధాకృష్ణ క్షేత్రం మొత్తం 14 బహుమతులు దక్కించుకుంది. ఇందులోమొదటి బహుమతి కూచిపూడి నాట్యానికి రాగా, ఐదు ద్వితీయ బహుమతుల్లో రెండు గాత్రం, ఒకటి సెమీ క్లాసికల్, రెండు కూచిపూడికి వచ్చాయి. తృతీయ బహుమతులు రెండు కూచిపూడి నృత్యానికి, సెమీ క్లాసికల్కు రెండు, గాత్రానికి ఒకటి వచ్చాయి. ఇవి కాకుండా కన్సొలేషన్ బహుమతులు సెమీ క్లాసికల్కు ఒకటి, కూచిపూడి నృత్యానికి రెండు వచ్చాయి. ఆయా బహుమతులను మలేషియా నుంచి కొరియర్లో మంగళవారం కళాక్షేత్రానికి వచ్చాయి. ఈ బహుమతులను శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకులు డాక్టర్ జి.వి. నారాయణ, డాక్టర్ ఉమా జయశ్రీ కళాకారులకు అందజేశారు.చదువుతో పాటు డ్యాన్స్ కూడా... నేను పదో తరగతి చదువుతున్నా. ఆరేళ్ల నుంచి కూచిపూడితో పాటు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. మలేషియాలో జరిగిన పోటీల్లో సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి వచ్చిoది. నాట్యాచార్యులు ఉమ జయశ్రీ నాట్య సాధన చేస్తున్నా. అలాగే చదువుకూ సమయం కేటాయిస్తున్నా. – చెరుకుమిల్లి సిరిచందన నాట్యం అంటే ప్రాణం నేను ఏడో తరగతి చదువుతున్నాను. నాకు నృత్యం అంటే ప్రాణం. మలేషియాలో జరిగిన పోటీలో ద్వితీయ బహుమతి వచి్చంది. నేను 2024లో కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రతి ప్రముఖ దేవాలయంలో నృత్య నీరాజన కార్యక్రమంలో పాల్గొన్నా. – కె.హర్షిత కావ్య అనేక బహుమతులు వచ్చాయి నేను ఐదోతరగతి చదువుతున్నాను. మలేషియా పోటీలో సెమీ క్లాసికల్ జూనియర్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించా. 2023 జూన్లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం వారు నిర్వహించిన హనుమాన్ చాలీసాను 14 గంటల 2 నిమిషాల పాటు 101 మంది కళాకారులతో కలసి నృత్యం చేసినందుకు గోల్డెన్ స్టార్, భారత్ వరల్డ్ రికార్డ్, గిన్సిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందా. – ధర్నాలకోట శరణ్య -
లండన్లో శివతాండవం
నాట్యం అనేది ఆహ్లాదానికే కాదు మానసిక వికాసానికి కూడా అనుకుంటే... నాట్యం అంటే సంతోషమే కాదు మానసికస్థైర్యం కూడా అనుకుంటే... నాట్యం అనేది ఆనందతరంగమే కాదు పర్యావరణహిత చైతన్యం అంటే గుర్తుకు వచ్చే పేరు.... సోహిని రాయ్ చౌదరి....సోహిని రాయ్ చౌదరి తండ్రి సుబ్రతో రాయ్ సితార్ విద్వాంసుడు. తల్లి ఉమారాయ్ చౌదరి శిల్పి. కోల్కత్తాలోని వారి ఇంటిలో ఎప్పుడూ కళాత్మక వాతావరణం ఉండేది. నాలుగు సంవత్సరాల వయసులోనే నృత్యకారిణిగా కాళ్లకు గజ్జె కట్టింది సోహిని రాయ్ చౌదరి. భరతనాట్యం నుంచి మోహినియాట్టం వరకు ఎన్నో నృత్యాలలో ప్రావీణ్యం సాధించింది.‘మన వైదిక సిద్ధాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ మానవతావాదం, మంచి గురించి చాటి చెప్పాయి. కోవిడ్, ఆర్థికమాంద్యం, యుద్ధంలాంటి అనిశ్చిత కాలాల్లో అవి మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఇతరులకు సహాయపడేలా ప్రేరణ ఇస్తాయి. జీవితానికి సానుకూల దృక్పథాన్ని ఇచ్చే శక్తి మన పవిత్ర తత్వాలలో ఉంది’ అంటుంది సోహిని. వాతావరణ మార్పులపై ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో సదస్సులలో సోహిని రాయ్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.‘వేదమంత్రాలతో కూడిన నా నృత్యప్రదర్శన ప్రకృతి గురించి, మన జీవితాల్లో దాని ప్రాముఖ్యత గురించి తెలియజేసేలా ఉంటుంది. పశుపతిగా శివుడు, అడవులు, జంతువులు, పర్యావరణాన్ని పరిరక్షించేవాడు. ప్రకృతిని మనుషులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, విధ్వంసం సృష్టిస్తున్నారో చెప్పడానికి, ప్రకృతితో సన్నిహిత సంబంధాల కోసం శివతాండవం చేస్తున్నాను’ అంటున్న సోహిని రాయ్ ‘గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ కూడా అందుకుంది.ప్రపంచవ్యాప్తంగా భారతీయ కళలు, సంస్కృతికి సోహిని రాయ్ చౌదరి అంబాసిడర్గా మారింది. యూకేలోని ఇండియన్ హైకమిషన్కు చెందిన నెహ్రూ సెంటర్లో సోహిని చేసిన శివతాండవం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివతాండవంతోపాటు శివుడి గురించి రుషి దాస్ గుప్తా చెప్పిన విలువైన మాటలను వినిపించింది. మార్కండేయ పురాణం, శివపురాణాలలో నుంచి ఒక కథను ఎంపిక చేసుకొని దాన్ని నృత్యరూపకంగా మలుచుకుంది. లండన్ తరువాత అమెరికా, రష్యా, జర్మనీ, స్పెయిన్... మొదలైన దేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వబోతోంది.‘డ్యాన్సింగ్ విత్ ది గాడ్స్’ పేరుతో తొలి పుసక్తం రాసిన సోహిని రాయ్కు రచనలు చేయడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆమె రచనల్లో మహిళా సాధికారత నుంచి రంగస్థలం వరకు, నృత్యోద్యమం నుంచి దేవదాసీల దుస్థితి వరకు ఎన్నో అంశాలు ఉంటాయి. శక్తివాదాన్ని ప్రధానంగా చేసుకొని ఎన్నో రచనలు చేసింది.‘ఇండియన్ స్టేజ్ స్టోరీస్: కనెక్టింగ్ సివిలైజేషన్స్’ పేరుతో సోహినిరాయ్ రాసిన పుస్తకం భారతీయ రంగస్థలం ఆత్మను పట్టిస్తుంది. ఈ పుస్తకం ద్వారా మన నాగరికతలోని గొప్ప సాంస్కృతిక, సంప్రదాయల గురించి తెలియజేసే ప్రయత్నం చేసింది. యూరప్లోని పద్ధెనిమిది యూనివర్శిటీలలో విజిటింగ్ప్రోఫెసర్గా పనిచేసింది. ‘సూఫీ తత్వం, రూమీ కవిత్వం, ఠాగూరు మానవతావాదంలో నాకు మహిళాసాధికారత కనిపిస్తుంది’ అంటున్న సోహినిరాయ్ చౌదరి తన నృత్య కళను సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగిస్తోంది. -
హూప్ హూప్ హుర్రే...ఈ కుట్టీ ఎవరో తెలుసా?
ఆ సన్నటి పెద్ద రింగును ‘హూప్’ అంటారు. పిల్లలు సరదాగా నడుము చుట్టూ దానిని తిప్పుతారు. సర్కస్లో హూప్తో చేసే ఫీట్లు ఉండేవి. కాని ఇప్పుడు హూప్ డాన్స్ ఫిట్నెస్కు ఒక దారిగా ఉంది. సరదాగా ఉంటూనే శరీరాన్ని విపరీతంగా కదిలించే ఈ డాన్స్లో దేశంలోనే నంబర్1గా ఉంది ఈష్నా కుట్టి. ఆమె పరిచయం.‘మూవ్మెంట్ థెరపీ గురించి ఇప్పుడు ఎక్కువమంది మాట్లాడుతున్నారు సైకాలజీలో. అంటే శరీర కదలికల వల్ల స్వస్థత పొందడం. హూపింగ్తో మూవ్మెంట్ థెరపీ చేయవచ్చు. హూపింగ్ వల్ల కండరాలు శక్తిమంతమవుతాయి. గుండె బాగవుతుంది. యాంగ్జయిటీ, స్ట్రెస్ మాయమవుతాయి. హూపింగ్లో ఆట ఉంది. వ్యాయామం ఉంది. నృత్యం ఉంది. మూడూ కలగలసిన హూపింగ్ స్త్రీల ఫిట్నెస్కు బాగా ఉపయోగం’ అంటుంది ఈష్న కుట్టి.ఢిల్లీలో స్థిరపడ్డ మలయాళ కుటుంబంలో జన్మించిన 25 ఏళ్ల ఈష్న కుట్టి ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 హూపర్గా గుర్తింపు పొందింది. హూప్ లేదా హులా హూప్ అని పిలిచే ‘టాయ్ రింగ్’తో విన్యాసాలు చేసేవారిని హూపర్స్ అంటారు. (20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!)మన దేశంలో ఎప్పటినుంచో హూపింగ్ ఉన్నా 1950లలో ఆట వస్తువుగా దీని తయారీ మొదలయ్యాక వ్యాప్తిలోకి వచ్చింది. నడుమును తిప్పుతూ హూప్ను నడుము చుట్టూ తిప్పడంతో మొదలెట్టి మెరుపు వేగంతో హూప్ను కదిలిస్తూ ఎన్నో విన్యాసాలు చేయొచ్చు. ఇలా చేయడాన్ని ‘ఫ్లో ఆర్ట్’లో భాగంగా చూస్తారు. బంతులు ఎగరేయడం, జగ్లింగ్ చేయడం.. ఇవన్నీ ఫ్లో ఆర్ట్ కిందకే వస్తాయి. హూపింగ్ కూడా.చిన్న వయసులోనే...‘చిన్నప్పుడు మా బంధువు ఒకామె హూప్ను గిఫ్ట్గా ఇచ్చింది. కాసేపు ఆడుకోవడానికి ట్రై చేసి మానుకున్నాను. కాని ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రాక్టీసు చేశాను. మెల్లగా వచ్చేసింది. దాంతో ఎవరూ లేనప్పుడుప్రాక్టీసు కొనసాగించాను. మెల్లమెల్లగా హూప్ నా శరీరంలో భాగమైపోయింది’ అంటుంది ఈష్న. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ చదివిన ఈష్న ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’లో ‘డిప్లమా ఇన్ డాన్స్ మూవ్మెంట్ థెరపీ’ కూడా చేసింది. ‘సైకాలజీ, హూపింగ్ తెలియడం వల్ల మనిషికి ఉత్సాహం, ఆరోగ్యం కలిగించడానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాను’ అంటుంది ఈష్న.తిహార్ జైలులో...తిహార్ మహిళా జైలులో ఖైదీలకు ఆరు నెలల పాటు హూపింగ్ నేర్పించడానికి వెళ్లింది ఈష్న. ‘జైలుకు వెళ్లి ఖైదీలను కలవడం ఎవరికైనా కష్టమే. కాని అక్కడ ముప్పై నుంచి 60 ఏళ్ల వరకూ ఉన్న మహిళా ఖైదీలకు హూపింగ్ నేర్పించాను. వారు హూప్ రింగ్తో రేయింబవళ్లు ప్రాక్టీసు చేసేవారు. నేను వెళ్లినప్పుడల్లా ఆ ముందుసారి కన్నా మరింత ఉత్సాహంగా, హుషారుగా కనిపించారు’ అంది ఈష్న.ఇలా చేయాలి‘సౌకర్యవంతమైన బట్టలు, సరైన ఫ్లోర్ ఉంటే హూప్తో మీరు ఎన్ని విన్యాసాలైనా సాధన చేయొచ్చు. మార్కెట్లో హూప్ రింగ్లు 28 ఇంచ్ల నుంచి 39 ఇంచ్ల వరకూ దొరుకుతాయి. వాటితోప్రాక్టీసు చేయడమే. ఈ ఆటలో పోటీలేదు పోలిక లేదు. అందుకే మన ఇష్టం వచ్చినట్టు ఆడవచ్చు. ఒకరకంగా బయటకు రాని స్త్రీలకు బెస్ట్ ఆటవిడుపు’ అంటుంది ఈష్న. మన దేశంలో హూపింగ్ నేర్పించే టీచర్లు తక్కువ కనుక ఆమె తరచూ నగరాలు తిరుగుతూ స్త్రీలకు క్యాంప్స్ నిర్వహిస్తూ నేర్పిస్తూ ఉంటుంది. ‘హూప్ రింగ్ మీ బెస్ట్ ఫ్రెండ్ కాగలదు. మీ మంచి చెడుల్లో అది పక్కనే ఉంటే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి’ అంటున్న ఈష్నకు ఇటీవల కార్పొరేట్ ఈవెంట్స్లో షో చేయమని ఆహ్వానాలు అందుతున్నాయి. డబ్బు కూడా బాగా వస్తోంది. షోలలో ఆమె చేసే హూపింగ్ నోరెళ్లబెట్టేలా ఉంటుంది. ఒక్క రింగు ఆమె జీవితాన్నే మార్చేసింది. మీ జీవితాన్ని కూడా మార్చొచ్చు. -
ఇలాన్ మస్క్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: ట్రంప్తో డ్యాన్స్ (ఫోటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం.. బ్యాట్ పట్టి, స్టెప్పులేసిన వెంకీమామ (ఫోటోలు)
-
డైరెక్టర్ పెళ్లిలో సందడి చేసిన హీరోయిన్.. ట్రైన్లో వెళ్తూ చిల్
బాలీవుడ్ భామ నోరా ఫతేహి ఓ పెళ్లిలో సందడి చేసింది. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ అనూప్ సర్వే పెళ్లికి హాజరైంది. అయితే ఈ వివాహా వేడుకలో పాల్గొనేందుకు రైలులో ప్రయాణించింది ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ముంబయిలోని దాదర్ రైల్వే స్టేషన్లో ఉన్న వీడియోను పంచుకుంది.ట్రైన్లో రత్నగిరి చేరుకున్న నోరాకు ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత డైరెక్టర్ హల్దీ వేడుకలో నోరా ఫతేహీ డ్యాన్స్ కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. డైరెక్టర్ అనూప్ సర్వేతో తనకు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉందని నోరా ఫతేహీ తెలిపింది. 2017 నుంచి తన సినీ ప్రయాణంలో ఉన్నాడని రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే నోరా ఫతేహి చివరిసారిగా మడ్గావ్ ఎక్స్ప్రెస్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ధృవ సర్జా నటిస్తోన్న కేడీ - ది డెవిల్తో కన్నడలో అరంగేట్రం చేస్తోంది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
కాలానుగుణంగా కోలాటం : ప్రొద్దుటూరు మహిళల విజయం
‘చీరలంటే చీరలు... చీరల మీద చిలకలు/ రైకలంటే రైకలు... రైకల మీద రంగులు’‘జానపదమైనా సరే–‘అబ్బబ్బా దేవుడూ... అయోధ్య రాముడు సీతమ్మ నాథుడు... శ్రీరామచంద్రుడు’... ఇలా ఆధాత్మికమైనా సరే–ఈ జనరేషన్ ఆ జనరేషన్ అనే తేడా లేకుండా ఆబాలగోపాలం కోలాటం సంబరాల సందడిలో ఉత్సాహతరంగమై ఎగరాల్సిందే.తెలుగు వారి సాంస్కృతిక చిరునామాలలో ఒకటి... కోలాటం. కళ అనేది పుస్తకాల్లో కాదు ప్రజల మధ్య, ప్రజలతో ఉంటేనే నిత్యనూతనంగా వెలిగిపోతుంది. ఈ ఎరుకతో కోలాటానికి పూర్వ వైభవం తేవడానికి ముందుకు కదిలారు ప్రొద్దుటూరు మహిళలు.కడప జిల్లా ప్రొద్దుటూరులోని మహిళలు కోలాట నృత్యానికి కొత్త హంగులను జోడించి ఆ కళకు మరింత ఆదరణ వచ్చేలా కృషి చేస్తున్నారు. బండి మల్లిక ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మాస్టర్ సాయి భరత్ దగ్గర కోలాటంలో శిక్షణ తీసుకుంది. తనలాగే శిక్షణ తీసుకున్న దాదాపు నాలుగు వందలమందితో ‘సావిత్రి బాయి పూలే అభ్యుదయ మహిళా కోలాట బృందం’ ఏర్పాటు చేసింది. అందరినీ ఒకే తాటి పైకి...కోలాటం సంప్రదాయ స్ఫూర్తిని పదిలంగా కా΄ాడేలా పూలమాలలు, లెజిన్స్, భజన తాళాలు... మొదలైన వాటితో అన్నమాచార్య కీర్తనలతో నృత్యప్రదర్శనలు చేస్తూ కోలాటానికి కొత్త శోభను తీసుకువస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో కోలాటం నేర్చుకున్న వారు ఎవరికి వారు బృందాలుగా వుండడంతో వారందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చి కొత్తగా ఏదైనా సాధించాలనే ఆలోచన మల్లికకు వచ్చింది.వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్లోకి దశావతార కోలాటంపశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల క్షేత్రంలో 222 మంది మహిళలు కోలాటంతో దశావతార జానపద నృత్య ప్రదర్శన చేశారు. ‘గోవిందుడేలరాడే.. గోపాలుడేలరాడే.. మా అయ్య ఏలరాడే..’ అనే పాటతో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శన తో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు సాధించారు. కాలంతో పాటు ప్రవహించాలి...ప్రొద్దుటూరుకు మాత్రమే పరిమితం కాకుండా హైదరాబాద్, తిరుచానూరు, శ్రీకాళహస్తి, ఒంటిమిట్ట, అరుణాచలంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, తిరుమల తిరుపతి ఆలయాల బ్రహ్మోత్సవాలలో తమ కోలాటంతో కనుల పండగ చేస్తున్నారు బృందం సభ్యులు.‘కాలేజీలో పనిచేస్తూనే సాయంత్రం వేళల్లో, సెలవుల్లో కోలాటం నేర్చుకున్నాను. శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపకరించే కళ ఇది. ్ర΄ాచీన జానపద కళలకు జీవం పోయాలనే లక్ష్యంతో కోలాటం ఆడుతున్నాం. ఈ కళ నిలువ నీరులా ఉండకూడదు. కాలంతోపాటు ప్రవహించాలి. ప్రతి తరం సొంతం చేసుకోవాలి’ అంటుంది ‘గౌతమి ఇంజినీరింగ్ కాలేజీ’లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న భూమిరెడ్డి నాగమణి.ఇక అయోధ్య రాముడి దగ్గరికి... ‘దశావతారం’ కోలాట నృత్య ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ప్రదర్శనల కోసం ఎవరి దగ్గరా డబ్బు తీసుకోకుండా సొంత ఖర్చులతో దేవస్థానాలలో ప్రదర్శనలు చేస్తున్నాం. బయట ఎక్కడా ప్రదర్శనలు చేయం. అయోధ్యలో కోలాటం ప్రదర్శన చేయడానికి అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ తరం పిల్లలు కూడా కోలాటానికి దగ్గర కావాలి. ఏ కళా దానికి అదే దూరం కాదు. సంప్రదాయ కళలకు చేరువ కావడం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఒక్కరిద్దరు కాకుండా కళాకారులందరూ ఐక్యంగా కృషి చేస్తే ఎంత అద్భుతం సృష్టించవచ్చో నిరూపించాం. – బండి మల్లిక అరుణాచల కొండల్లో... అలుపెరగని కోలాటంబండి మల్లిక నేతృత్వంలో తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షణ సందర్భంగా ‘సావిత్రి బాయి పూలే కోలాట బృందం’లోని 111 మంది మహిళా కళాకారులు 14 కిలోమీటర్లు కోలాటాన్ని ప్రదర్శించారు. కోలాట కర్రలతో అన్నమయ్య, శివనామస్మరణ కీర్తనలకు లయబద్ధంగా నృత్యం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు మొదలైన కోలాట నృత్యం మరుసటి రోజు ఉదయం 3.40 గంటల వరకు కొనసాగింది. ఏకధాటిగా తొమ్మిది గంటల పాటు గిరి నృత్య ప్రదక్షిణలో అలసిపోకుండా కోలాటం పూర్తి చేసిన వీరి ప్రతిభ ఉత్తర అమెరికాలోని ‘తానా బుక్ ఆఫ్ రికార్డు’ లో నమోదైంది. ‘భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ లోనూ చోటు సాధించారు. – మోపూరు బాలకృష్ణారెడ్డి సాక్షి ప్రతినిధి, కడపఫొటోలు: షేక్ మహబూబ్ బాషా, ప్రొద్దుటూరు. -
స్టూడెంట్స్తో మహిళా ప్రొఫసర్ క్రేజీ డ్యాన్స్ : వీడియో హల్చల్
సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్కు క్రేజ్ ఎక్కువ. సూపర్ హిట్ సాంగ్కు రీల్స్ చేసినా, డ్యాన్స్ చేసిన ఇక రచ్చ రచ్చే. తాజాగా కొచ్చిన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పుష్ప -2 సినిమాలో హిట్ సాంగ్ కి చేసిన డ్యాన్సింగ్ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇన్స్టాలో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే 70 లక్షలకుపైగా వ్యూస్ను సంపాదించింది.కొచ్చిన్ (Cochin)యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో వేడుకలు ఘనంగా జరుగు తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థినిలు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. అప్పటిదాకా ప్రశాంతంగా చూస్తూ కూర్చున్న మహిళా ప్రొఫెసర్ విద్యార్థినిలతో జత కలిసి స్టెప్పులు వేయడం మొదలు పెట్టారు. తన చేతిలోని బ్యాగ్ను కుర్చీపై పెట్టి మరీ రంగంలోకి దిగి పోయారామె. అమ్మాయిలతో సమానంగా జోరుగా డ్యాన్స్ చేశారు. అదీ చీరలో.. సూపర్ స్టెప్స్తో తమకు పోటీగా మేడమ్ తమతో జత కట్టడం చూసిన విద్యార్థినులు మరింత ఉత్సాహంగా డాన్స్ ఇరగదీశారు. ఏ పాటకో తెలుసా?పుష్ప 2: ది రూల్ మూవీలోని ‘పీలింగ్స్’ సాంగ్కు మైక్రోబయాలజీ ప్రొఫెసర్,డిపార్ట్మెంట్ హెడ్ (HOD), అయిన పార్వతి వేణు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. “మీ హెచ్ఓడీ మేడమ్ మీ కంటే ఎక్కువ వైబర్గా ఉన్నప్పుడు” అనే క్యాప్షన్తో షేర్ అయిన ఈ వీడియోను నెటిజన్లు ఉత్సాహంగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by @ottta_mynd -
అభిరామం నృత్యంతో చెప్పే రామాయణం : ఎవరీ ఐశ్వర్య హరీష్!
ఇతిహాసమైన రామాయణం అందం, భక్తి, సంక్లిష్టతలను ఐశ్వర్య హరీష్ ప్రదర్శించే భరతనాట్యం అన్వేషిస్తుంది. శాస్త్రీయ నృత్యాన్ని బహుభాషా కథనాలతో మిళితం చేసి మన ముందు ప్రదర్శిస్తుంది. రామాయణంలో తెలియని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి ‘అభిరామం’ ప్రదర్శనను ఎంచుకున్నాను అని చెబుతుంది. ఐశ్వర్య హరీష్ పుట్టుకతోనే నృత్యకారిణి అని చెప్పవచ్చు. ఐదు తరాలుగా ఆ ఇంట నృత్యకళాకారులే ఉన్నారు. ఆ విధంగా చాలా చిన్న వయస్సు నుండి తన తల్లి ద్వారా శిక్షణ పొందుతూ ఐశ్వర్య తన స్వంత నృత్య కథల గురించి కలలు కంటూ పెరిగింది. ఇటీవల ముంబయ్లో ప్రఖ్యాత నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సిపిఎ)లో ప్రదర్శన ద్వారా అబ్బురపరిచిన ఐశ్వర్య రామాయణాన్ని నృత్యంగా ఎందుకు ఎంచుకున్నానో వివరించింది.నృత్యంతో అన్వేషణ‘‘రాముడు నా ఇష్ట దేవత. నా చిన్నప్పుడు రాముని గంభీరమైన రూపం, అతనిపై పాట, పద్యం, నృత్యం ఏది నేర్చుకున్నా అది నన్ను ఉత్తేజపరిచింది. ఇటీవల, వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనగా వాల్మీకి రామాయణాన్ని దాని అనువాదంతో పాటు చదవడం ప్రారంభించాను. చదివేటప్పుడు కథలో ఇంకా ఏవో తెలియని అంశాల సారంశాం ఉందని గ్రహించాను. చాలా అన్వేషించని కోణాలు ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్లోనూ రసాలు ఎక్కువ. ఇది నాకు నృత్యంలో అన్వేషించాలనే ఆలోచనను ఇచ్చింది. రామాయణానికి చాలా వెర్షన్లు ఉన్నాయి. అందుకే నా పరిశోధన విస్తృతం చేశాను. దీంతో అనేక అవకాశాలు నాకు లభించాయి. అన్ని వెర్షన్లు కథాంశం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కటి విభిన్న దృష్టి, రుచిని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు– వాల్మీకి రామాయణం రాముడిని మానవ శ్రేష్ఠతగా చూస్తే, అధ్యాత్మ రామాయణం అతనిని అంతిమ భగవంతునిగా, అద్భుతంగా చూసింది. రామాయణంలో సీత పాత్రకు భిన్నమైన టేకింగ్ ఉంది.ఆత్మను కదిలించాలిఅభిరామం నృత్య రూపకం వివిధ రామాయణ గ్రంథాల నుండి సేకరించిన ఆరు అరుదైన ఎపిసోడ్లను వర్ణిస్తుంది. రామాయణం భారతీయ మనస్తత్వంలో చాలా పాతుకుపోయింది కాబట్టి, నేను కథ టైమ్లైన్ను నిర్వహించాలనుకున్నాను. రాముడి కథ ప్రతి మట్టిని దాని స్వంత ఫ్లేవర్లో తాకింది. నేను దానిని ఉపదేశాత్మకంగానో, సాదాసీదాగానో స్తుతించేలనుకోలేదు. శృంగార భక్తి కోణాన్ని కొనసాగించాను. అదే నన్ను మొదటి స్థానంలో ప్రాజెక్ట్లోకి తీసుకువచ్చింది. ఎక్కడి నుంచైనా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని, దానిని మరో కోణంలో వివరిస్తే అది వినోదభరితంగా ఉండాలి అలాగే ఆత్మను కదిలించాలి. ప్రేక్షకుల ఊహల మైదానంలో ఆ అంశం తిరగాలి. నేను ఎంచుకున్న కథ మాత్రమే కాదు నా డ్యాన్స్ ఎలిమెంట్ను కూడా కోల్పోకూడదు. దీన్ని మరింత థియేట్రికల్ ప్రెజెంటేషన్గా మార్చాలనుకున్నాను. ఆకర్షించిన అంశాలుమొదట వాల్మీకి రామాయణాన్నే చదివాను. మా అమ్మ అప్పటికే తులసీదాస్ రచనలపై కొంత పరిశోధన చేసింది. అలా తులసి రామాయణం నుండి నాకు నచ్చిన అంశాలను సేకరించడానికి అది ఒక కిటికీలా ఉపయోగపడింది. కౌసల్య తన నవజాత శిశువుతో చేసిన మొదటి సంభాషణ నన్ను అమితంగా ఆకర్షించింది. అదేవిధంగా, రావణుడి పాత్రను చూస్తే విష్ణువు దైవిక బలాన్ని ఎదుర్కోవడంలో పూర్తి జ్ఞానంతో అతను సీతను అపహరించాడు. రావణుడు మోక్షానికి తన ఏకైక సాధనం – భగవంతుడి చేతిలో మరణం ఇదేనని గ్రహించాడు. తులసీరామాయణం రాముడు, సీత స్వయంవరం, వారి కలయిక గురించి చాలా అందంగా, సుందరంగా కవితాత్మకంగా అన్వేషించబడింది. రావణుడి సోదరి శూర్పణఖ సీతను అపహరించడానికి, ఆమె చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన సోదరుడిని ప్రేరేపించడం ద్వారా రామాయణంలో మలుపు తిరిగింది. అరుణాచల కవి తమిళంలో రామనాటకంలో ఈ క్యారెక్టరైజేషన్ని చాలా అందంగా చూపించాడు, రాక్షసి బెంగను అనుభూతి చెందాడు. ప్రొడక్షన్లో ఇది మూడో ఎపిసోడ్గా తీసుకోబడింది. కథను ఇలా ముందుకు తీసుకెళ్తుంటే హనుమంతుని అద్భుతమైన చర్యలు, సెయింట్ పురందర దాసు కన్నడ పద్యాల పదునుగా బయటకు వచ్చాయి. తల్లే గురువుమా అమ్మ నా గురువుగా ఉండటం నాకు దొరికిన అద్భుతమైన ఆశీర్వాదం. చిన్నతనం నుండే సాంప్రదాయ సంగీతం, నృత్యం, కథల రూపంలో ఉండే సాహిత్యం, ఏదైనా సాధించాలనే కల, క్రమశిక్షణతో కూడిన ఆలోచనలతో ఉన్నాను. పరిపూర్ణత గురించి ఎప్పుడూ చర్చలు ఉండకూడదు. అలాగే, నాణ్యతలో ఎప్పుడూ రాజీ పడకూడదు. ఇది నా వారసత్వాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించే సవాల్, మరింత పరిపూర్ణత కోసం పట్టుదలతో కూడిన బాధ్యత. దానిని స్వీకరించి ముందు తరాలకు ఇవ్వాలనే నిబద్ధతో కృషి చేస్తున్నాను. కూర్పులో సవాల్ప్రతి ఎపిసోడ్ లోనూ కథనంలో మార్పు లేకుండా అందులోని అందాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాం. సంగీతం, నృత్యం అన్నీ వేర్వేరు వ్యక్తులచే కం΄ోజ్ చేయబడ్డాయి. కౌసల్య వాత్సల్యమైనా, రాముడు– సీతల శృంగారమైనా, సీత వైభవం, హనుమంతుడి సుందరకాండ ఇలా ప్రతీది ‘అందం’లోని అంశమే ఈ నృత్యంలో ప్రత్యేకంగా నిలుస్తుంది’’ అని వివరిస్తుంది ఐశ్యర్వ. -
స్కూలు యాన్యువల్ డే : ఆరాధ్య సందడి, ముద్దుల్లో ముంచెత్తిన ఐశ్వర్య
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకల్లో స్టార్ కిడ్స్ సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య, బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్కాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గురువారం (డిసెంబరు 19) జరిగిన ఈ ఈవెంట్లో ఆరాధ్య బచ్చన్ తన షోను అందర్ని కట్టి పడేసింది. ఆమె నటనకు ఐశ్వర్య, అభిషేక్తోపాటు, తాత అమితాబ్ బచ్చన్ కూడా గర్వంతో ఉప్పొంగి పోయారు. ముఖ్యంగా మాజీ ప్రపంచ సుందరి ఐశర్య తన కుమార్తె నటనకు ఫిదా అయిపోయింది. ఈమెమరబుల్ మూమెంట్స్ను కెమెరాలో బంధిస్తూ కనిపించింది. ఆ తరువాత ఆరాధ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దులతో ముంచెత్తింది.And Aaradhya’s final bow - trust her parents to cheer the loudest as always pic.twitter.com/phf29fiGG3— Bewitching Bachchans (@TasnimaKTastic) December 19, 2024మరోవైపు భార్యబిడ్డలను ఇలా చూసిన అభిషేక్ మురిసిపోయారు. ఇక మనవరాలు క్రిస్మస్ ప్రదర్శనకు గర్వంతో చిరునవ్వులు చిందించారు అమితాబ్. షో ముగియగానే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అలాగే తన కుమారుడు అబ్రామ్ ప్రదర్శనకు షారూఖ్ఖాన్ కూడా ఉత్సాహంగా క్లాప్స్ కొట్టారు. మురిపెంగా వీడియోలు తీసుకుంటూ కనిపించారు. కరీనా సైఫ్ అలీఖాన్, దంపతుల కుమారుడు కూడా తైమూరు కూడా అద్భుత ప్రదర్శనతో అలరించాడు. ఈ వార్షికోత్సవ వేడుకులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.మరోవైపు ఆరాధ్య పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్ జంటగా కనిపించడం, ఇద్దరూ అమితాబ్ను వేదికపైకి జాగ్రత్తగా తీసుకెళ్లిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్టైంది. < View this post on Instagram A post shared by mamaraazzi (@mamaraazzi) -
అశ్లీల నృత్యాల ఘటనలో 24 మంది అరెస్టు
నిడమర్రు: ఏలూరు జిల్లా బావాయిపాలెంలో జనసేన నేతల అశ్లీల నృత్యాల బాగోతంలో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఈ వ్యవహారానికి సూత్రధారి అయిన జనసేన పార్టీ క్రొవ్విడి గ్రామ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్, మరో 21 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు ఉన్నట్లు గణపవరం సీఐ సుభాష్ గురువారం తెలిపారు. ఈ అశ్లీల నృత్యాల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీఆర్వో భుజంగరావు ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేశామని చెప్పారు. అరెస్టయిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 292, 296 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదీ జరిగింది: ఈ నెల 12వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వేడుకలకు హాజరైన వారిలో పలువురు మద్యం సేవించారు. భీమవరానికి చెందిన ఇద్దరు హిజ్రాలతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఈ నృత్యాలను మిల్లులో ఉన్న ధాన్యం బస్తాల పైనుంచి సెల్ఫోన్లో రహస్యంగా చిత్రీకరించి, బుధవారం సోషల్ మీడియాలో పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసి జనసేన నేతలు టీడీపీ వారిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే తొలిసారి: ఈ ప్రాంతంలో ఇలా అశ్లీల నృత్యాలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇదే కొనసాగితే జనసేన నాయకుల ఆగడాలు ఎలా ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వైఖరిని నియోజకవర్గ ప్రజలు తప్పుపడుతున్నారు. మరోపక్క ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఇంద్రకుమార్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మల దొరబాబు ప్రకటించారు. -
కాబోయే భర్తతో కలిసి పీవీ సింధు డ్యాన్స్ ప్రాక్టీస్(ఫొటోలు)
-
నృత్యంతో సేవ చేస్తున్న భారత సంతతి యువ కళాకారిణి
18 ఏళ్ల నర్తకి విశాఖ విజన్ 2020కి సహాయం చేయడానికి ఈ యేడాది నవంబర్ చివరిలో ఆస్ట్రేలియాలో భరతనాట్యాన్ని ప్రదర్శించింది. విశాఖ ప్రస్తుతం ప్రతిష్టాత్మక వాపా (వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్)లో బ్యాచిలర్ ఆఫ్ డ్యాన్స్ అభ్యసిస్తోంది. భారతదేశంలో చిదంబరం ఖసురేష్, షీజిత్ కృష్ణ, బ్రాగా బెస్సెల్ల వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందింది.ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగిన విశాఖ భారతీయ నృత్యాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకుంది. భారతీయ మూలాలుండటం వల్ల తనలో శాస్త్రీయ నృత్యం శ్వాసగా మారిపోయింది అంటోంది. ‘భావోద్వేగ మేల్కొలుపు – నవరస మోహన’ అనేది మన రోజువారీ పరస్పర చర్యలను ప్రభావితం చేసే, నిర్దేశించే భావోద్వేగాల తొమ్మిది వ్యక్తీకరణలపై ఆధారపడింది. వీటిని విశాఖ పుణికి పుచ్చుకుంది. సామాజిక మేల్కొలుపును కలిగించేలా ‘నిస్వార్ధ జీవి చెట్టు’ గురించి తన ప్రదర్శనలో వర్ణించింది.113 ఏళ్ల వృద్ధురాలు తిమ్మక్క, చెట్లతో ఆమెకు ఉన్న అనుబంధం ఈ కథనంలో అల్లుకుపోయింది. కళా ప్రక్రియలలో విస్తరించిన అద్భుతమైన భాగంగా దీనిని చెప్పవచ్చు. ఇది సామాజిక సందేశాన్ని దాని ప్రధాన భాగంలో ప్రసారం చేయడంలో శైలులు, భాష, ఫార్మాట్లను మిళితం చేసింది. ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు ఆలోచింపజేసేటటువంటి, ప్రక్రియలో సరిహద్దులను చెరిపేసింది.‘భారతదేశంలో చెట్లను నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలనే అవగాహన, ప్రతి వ్యక్తి సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం.. ఎప్పుడూ మా ఇంట్లో ఒక మంత్రంగా ఉంటుంది. అందువల్ల ఈ నృత్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది’ అని చెబుతుంది విశాఖ. భారతీయ–ఆస్ట్రేలియన్ యువ కళాకారిణిగా ఆమె జీవితంలో భరతనాట్యానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ సందర్భంగా వివరించింది. పాశ్చాత్య నృత్య సమాజంలో భరతనాట్య నర్తకిగా నన్ను బయటి వ్యక్తిగానే చూసేవారు. కానీ ఇప్పుడు అందరిచేత ‘నృత్యం ఆత్మ ప్రదర్శించే భాష, ఇది కేవలం సమకాలీనమైనది కాదు, ఇది శరీరం, ఆత్మ కదలిక’ అని చెబుతుంది విశాఖ. (చదవండి: అత్యంత అరుదైన పెంగ్విన్..!) -
అక్కినేనివారి కోడలు.. ఆనందంలో స్టెప్పులు అదుర్స్.. వీడియో వైరల్!
ఇటీవలే అక్కినేనివారి ఇంట పెళ్లి వేడుక జరిగింది. ఈనెల 4న అక్కినేని హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిపెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ తారలు పాల్గొన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు.అయితే పెళ్లికి ముందు శోభిత డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. పెళ్లి కూతురిగా ముస్తాబయ్యే సమయంలో తెలుగు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలోని బ్లాక్బస్టర్ బ్లాకబస్టరే అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో చిందులు వేసింది. This video of #SobhitaDhulipala proves happiest brides are the prettiest #NagaChaitanya #viralvideo #GalattaIndia pic.twitter.com/9MUHLG0K35— Galatta India (@galattaindia) December 10, 2024 -
పిల్లలతో కలిసి స్కూల్లో డ్యాన్స్ చేసిన అమ్మ
-
రీలు చేసింది, క్షమాపణ చెప్పింది
-
కొండకోనల్లో నృత్య సౌందర్యం
మాటలు లేని కాలంలో ఆదివాసీలు లయబద్ధంగా వేసిన గెంతులే నేడు ప్రపంచదేశాల్లో గొప్ప నృత్యంగా వెలుగొందుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటైన గిరిజనుల కొమ్ముకోయ నృత్యం అత్యంత పురాతన కళారూపంగా ప్రసిద్ధి చెందింది. కోయ జాతి గిరిజనులు మాత్రమే చేసే ఈ నృత్యం దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఈ నృత్యం పేరు చెబితే చింతూరు మండలంలోని కోయజాతికి చెందిన కళాకారులు గుర్తుకువస్తారు.చింతూరు: సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొమ్ముకోయ నృత్యంతో తమ ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటుతున్నారు కోయజాతికి చెందిన గిరిజన కళాకారులు. ఈ నృత్యం పేరు చెబితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని తుమ్మలకు చెందిన గిరిజన కళాకారులు ముందుగా గుర్తుకొస్తారు. సొంత శుభకార్యాలతో ప్రారంభమైన ఈ నృత్యం రాష్ట్రంలో వివిధ పండుగల సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ భాగమైంది. అనంతర కాలంలో ఇతర రాష్ట్రాల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు కామన్వెల్త్ గేమ్స్, ఐపీఎల్ ప్రారంభం, ముగింపు సంబరాల్లో సైతం ఈ నృత్యం ఎంతో ప్రాచుర్యం పొందింది. 20 బృందాలు... తుమ్మలతోపాటు బుర్కనకోట, సరివెల, వేకవారిగూడెం, సుద్దగూడెం తదితర గ్రామాలకు చెందిన గిరిజన కళాకారులు సైతం ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సుమారు 20 బృందాల వరకు ఉన్నాయి. ఈవెంట్ను బట్టి ఒక్కో బృందంలో 20 నుంచి 40 మంది మహిళలు, పురుషులు ఉంటారు. ⇒ గిరిజన సంస్కృతికి తగ్గట్టుగా దుస్తులు ధరించి పురుషులు అడవి బర్రె కొమ్ములను పోలిన ఆకృతులు, నెమలి ఈకలతో కూడిన తలపాగా చుట్టుకుని, పెద్ద డోలు పట్టుకుని దానిని వాయిస్తూ ఉంటారు. మహిళలు తలకు రిబ్బన్ చుట్టుకుని అందులో ఈకలను పెట్టుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని పురుషుల డోలు వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తుంటారు. ముందు నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ నృత్యం క్రమేపీ పుంజుకుంటుంది. ⇒ నృత్యం ముగింపులో పొట్టేళ్ల మాదిరిగా పురుషులు తమ కొమ్ములతో ఒకరినొకరు గుద్దుకోవడం ప్రత్యేక ఆకర్షణ. దుస్తుల అలంకరణ వైవిధ్యంగా ఉంటుంది. పురుషులు ఎర్ర దుస్తులు ధరిస్తే మహిళలు పచ్చ దుస్తులు ధరిస్తారు. సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో.. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నారు. వివిధ పండుగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటున్నారు. ⇒ మన్యంలో చిత్రీకరించే కొన్ని సినిమాల్లో సైతం కొమ్ముకోయ నృత్య ప్రదర్శనకు చోటు దక్కింది. పుష్ప–2, గేమ్చేంజర్, దేవదాసు–2, ఊరిపేరు భైరవకోన, దొంగలబండి, అమ్మాయినవ్వితే.. శ్లోకం వంటి చిత్రాల్లో తమ ప్రదర్శనకు అవకాశం వచ్చినట్టు నృత్య కళాకారులు తెలిపారు.⇒ రోజుకు రూ.వెయ్యి: ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు రవాణా ఖర్చులు, వసతి కల్పించడంతో పాటు ఒక్కొక్కరికీ రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తారని వారు పేర్కొన్నారు. ఒకొక్క కళాకారుడు ఏడాదికి సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఆదాయం పొందుతుంటారు. ⇒ ఎంతో ఖ్యాతి పొందినా కళాకారులు మాత్రం వ్యవసాయం, కూలిపనులపై కూడా ఆధారపడుతుంటారు.ప్రస్థానమిలా..చింతూరు మండలం తుమ్మ లకు చెందిన పట్రా ముత్యం తమ గ్రామానికి చెందిన కొంత మంది కళాకారులతో కలసి ఓ బృందాన్ని ఏర్పాటుచేసి వివిధ పాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కొమ్ముకోయ నృత్య ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన మృతి అనంతరం అతని కుమారుడు రమేష్ సంప్రదాయ వృత్తిగా ఈ నృత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఐటీడీఏ సహకరించాలి కొమ్ముకోయ నృత్యం ద్వారా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటుతున్న తమకు సహకారం అందించాలి. ఐటీడీఏ ద్వారా తమకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే తాము ప్రదర్శనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. – పట్రా రమేష్, కొమ్ముకోయ కళాకారుడు, తుమ్మల ఎంతో ఆదరణ ఆదివాసీ సంస్కృతిలో భాగంగా ప్రకృతి ఒడిలో తాము నేర్చుకున్న ఈ నృత్యానికి ఇతర ప్రాంతాల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనల ద్వారా అక్కడి సంస్కృతిని తాము తెలుసుకునే అవకాశం కలుగుతోంది. ప్రభుత్వం నుంచి మాలాంటి కళాకారులకు పూర్తిస్థాయిలో సహకారంఅందించాలి. – వుయికా సీత, కొమ్ముకోయ నృత్య కళాకారిణి -
ఆరు నాట్యరీతుల అద్భుత సమాగమం
ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి ఒకే వేదికపై ఆరు రకాల నృత్యరీతులను అత్యంత అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేసింది.. అమ్రిత కల్చరల్ ట్రస్టు వారి నాట్యతోరణం కార్యక్రమం. నగరంలోని శిల్పకళావేదికలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమానికి ప్రాంగణం సామర్థ్యాన్ని మించి ప్రేక్షకులు రావడంతో మొత్తం కిక్కిరిసిపోయింది. భరతనాట్యం, కూచిపూడి, మోహినీ అట్టం, కథక్, ఒడిస్సీ, ఆంధ్రనాట్యం లాంటి నృత్యరీతులకు చెందిన కళాకారిణులు ఒక్కో విభాగంలో 6 నుంచి 10 మంది చొప్పున తమ తమ నాట్యాలను ప్రదర్శించారు. అనంతరం మొత్తం కళాకారిణులు అందరూ కలిసి ఒకేసారి చేసిన జుగల్బందీ ప్రేక్షకులను కట్టిపడేసింది.ప్రముఖ నాట్యగురువులు కళాకృష్ణ (ఆంధ్రనాట్యం), అనితా గుహ (భరతనాట్యం), చావలి బాల త్రిపురసుందరి (కూచిపూడి), నీనా ప్రసాద్ (మోహినీ అట్టం), శామా భాటే (కథక్), బిచిత్రానంద స్వైన్ (ఒడిస్సీ), పేరిణి కుమార్ (పేరిణి నాట్యం-ఆంధ్రనాట్యం) తదితరుల సారథ్యంలో ఈ కళాకారులంతా తమ తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. అమ్రిత కల్చరల్ ట్రస్టును పగడాల రాజేష్, భార్గవి దంపతులు ప్రారంభించారు. దీని యాజమాన్య కమిటీలో సీతా ఆనంద్ వైద్యం, రేవతి పుప్పాల, సురేంద్రనాధ్ తదితర దిగ్గజాలు ఉన్నారు.భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ... అన్ని ప్రాంతాలకు చెందిన నృత్య కళారీతులను ప్రోత్సహించేలా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు అమ్రిత కల్చరల్ ట్రస్టును అభినందించకుండా ఉండలేకపోతున్నామని కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఆదాయపన్ను శాఖ మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పి.వి. రావు అన్నారు. నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న కళాకారిణులందరికీ ఈ రంగంలో అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి టీవీ నరసింహారావు, పద్మశ్రీ పద్మజారెడ్డి, కోటి సూర్య ప్రభ, శిల్పారెడ్డి, టీవీ9 రజనీకాంత్, పద్మశ్రీ ఉమామహేశ్వరి, మాదాల రవి, ఆశ్రిత వేముగంటి తదితరులు పాల్గొన్నారు.(చదవండి: Mouni Roy:కథక్తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మెస్మరైజ్ చేసిన నటి) -
ఎల్లో చీరలో ’క్రష్మిక’ లుక్, ఆ స్టయిలే వేరు సామి (ఫోటోలు)
-
డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది!
‘నృత్యశాస్త్రం నుంచి నృత్యం పుట్టదు. హృదయంలో కలిగే భాధ నుండి ఉద్భవిస్తుంది’ అంటారు కూచిపూడి నృత్యకారిణి, దేవదాసి నృత్యంలో ప్రావీణ్యత గల యశోదా ఠాకోర్. ఇటీవల ఆమె విదేశాల్లో దేవదాసీ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని కళావంతుల సంఘంచే స్వరపరిచి రూపొందించిన దానిని యశోద మరింత అందంగా ఆవిష్కరిస్తారు. ఒక ప్రేమికురాలు కృష్ణుడిని కోల్పోవడంపై కలిగిన ఆందోళనను అద్భుతంగా వర్ణిస్తుంది. కథానాయిక తనవాడైన వ్యక్తిని పొడవాటి వస్త్రాలతో కట్టివేయాలనే కోరికను అణుచు కుంటూ ఎటూ వెళ్లొద్దని వేడుకోవడాన్ని కళ్లకు కడుతుంది. యు.కెలోని గ్లెన్బర్గ్లో జరిగిన వేడుకలో ప్రదర్శన అనంతరం....ఈ నృత్యం వేరొకరి జీవితంపై రూపొందించిందిదేవదాసీ నృత్యం భారతదేశ చరిత్ర, రాజకీయాలలో ఎలా ప్రధానంగా ఉంటూ వచ్చిందో ఠాకోర్ వివరించారు. ‘భారత శాస్త్రీయ కళలు క్లిష్టమైన పరిస్థితులలో కొన్నిసార్లు అట్టడుగుకు చేరుకున్నాయి. కొన్ని హింసాత్మక చరిత్రలనూ పరిచయం చేశాయి. దక్షిణాదిన వ్యాపించి ఉన్న దేవదాసి సంఘాలు తమ కళతో తరతరాలుగా దేవాలయాలు, జమీందార్లను ఆశ్రయించాయి. దేవదాసీ కళాకారులు తమ కుటుంబ సభ్యులతో వాయిద్యాలతో ప్రదర్శనలను నిర్వహించారు. వారు భూమి, ఆస్తి, ఆభరణాలకు యజమానులు కాకపోయినా సంరక్షకులుగా ఉండేవారు. ఒక కళారూపానికి బాధ్యత వహించే శక్తిమంతమైన ప్రదర్శనకారులు ఇప్పటికీ ఉన్నారు. కానీ సామ్రాజ్యపాలన, కొత్త జాతీయవాద ఎజెండా ఈ ప్రదర్శనకారులకు కఠినమైన రోజులను తెచ్చిపెట్టింది. జాతీయవాద – వలసవాద పితృస్వామ్యాల మధ్య ప్రదర్శన కళలు సంప్రదాయాలలోని లైంగికశక్తితో అణగదొక్కడానికి వ్యవస్థ మొగ్గు చూపింది. మధ్యతరగతి డ్రాయింగ్ రూమ్లలో ’సంస్కృతి’ని కొత్తగా చూపడానికి దేశీయ రూపాలను ప్రభావవంతంగా శుద్ధి చేసింది. కోల్కతాలోని ఝుమూర్ నృత్య కథలో, కథక్ వంటి నృత్య రూపాల ప్రసిద్ధ చరిత్రలలో కూడా ఇది గమనించవచ్చు. దీంతో దేవదాసీ అవమానకరమైన, బలహీనమైన వ్యక్తిగా ఎదిగింది.హృదయాన్ని కదిలించేలా!లోతుగా చీలి΄ోయిన కుల సమాజంలో బ్రిటీషర్ల కాలంలో ఈ కళలు అక్షర రూపంలోకి వచ్చాయి. 1947లో దేవదాసీ నిర్మూలన చట్టం రావడంతో ఈ కళాకారులు ప్రదర్శన చేసే హక్కును కోల్పోయారు. ప్రదర్శకులుగా వారి శ్రమ, నైపుణ్యం పూర్తిగా కనిపించకుండా పోవడంతో దేవదాసీలు వ్యభిచారంలోకి నెట్టబడ్డారు. పెత్తందార్లు, ΄ోలీసుల నుండి వేధింపులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒంటరి మహిళలు కావడంతో వారి కుటుంబాలు అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. ఒకప్పుడు గౌరవనీయమైన మాతృకగా, అన్నదాతగా ఉన్న దేవదాసీలు ఇప్పుడు లేమితో జీవన ΄ోరాటం చేస్తున్నారు. కడుపులోని కేన్సర్ మెలిపెడుతుంటే ఆకలిని చంపుకోవడానికి బీడీలు కాల్చే మహిళలు నాకు తెలుసు. డబ్బు కోసం కాదు, మోక్షం కోసం నృత్యం చేయాలి... దేవదాసీ నిర్మూలన చట్టం వల్ల కొంతమంది మహిళలు తమ కళను కోల్పోతే, మరికొందరు సిగ్గుతో కుటుంబాలను, సంబంధాలను విచ్ఛిన్నం చేసే మార్గాల్లో తమను తాము దూరం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒక చట్టాన్ని ఆమోదించినప్పుడు ఆ కళ పై ఆధారపడి జీవించే వారికి ఏం జరుగుతుందో ఎవరికీ పట్టదు. దేవదాసీలు ప్రజా జీవితం నుండి తొలగించిన తర్వాత వారి కళ మాత్రం ‘గౌరవనీయమైన’ శరీరాలపై నాటబడింది. మీరు వెళ్లిపొండి, మీ కళను మాత్రం తీసుకుంటాము అన్నట్టుగా చేశారు. ఉన్నత–కులాల పురుషులు ఈ నృత్య రూపాలను స్వీకరించి, ఆధిపత్యం చెలాయించారు. వాటి మూలాలను మాత్రం చెరిపివేశారు. దేవదాసీల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి, నృత్యాన్ని మాత్రం ’క్లాసికల్’ నిబంధనలలో ఉంచారు. కళ‘డబ్బు కోసం కాదు, మోక్షం కోసం జీవిస్తుంది. నాట్యం నాట్యశాస్త్రం నుండి రాదు, హృదయం లోని భాధ నుండి ఉత్పన్నం అవుతుంది’ అంటారు యశోదా ఠాకూర్. ఇదీ చదవండి: రంభా ప్యాలెస్ గురించి తెలిస్తే.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటారు! -
నిరసన డ్యాన్సులు..
-
బర్త్ డే పార్టీలో కేజీఎఫ్ స్టార్.. అదరగొట్టేశాడుగా!
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న శాండల్వుడ్ హీరో యశ్. ప్రస్తుతం ఆయన టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది.అయితే తాజాగా యశ్కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఓ బర్త్ డే పార్టీకి హాజరైన కేజీఎఫ్ స్టార్ తనదైన స్టెప్పలతో హోరెత్తించారు. స్టార్ హీరో శివరాజ్కుమార్ హిట్ సాంగ్కు డ్యాన్స్తో అదరగొట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్ రాకింగ్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. యశ్ డ్యాన్స్ చేసిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది.వివాదంలో టాక్సిక్ టీమ్యశ్ నటిస్తోన్న టాక్సిక్ టీమ్ ఊహించని వివాదంలో చిక్కుకుంది. రీసెంట్గా బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది. రెండు రోజులు షూటింగ్ చేశారు. అయితే సెట్ నిర్మాణ కోసం అక్రమంగా వేలాది చెట్లు నరికేశారనే ఆరోపణలొచ్చాయి.ఈ విషయంపై కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. 'టాక్సిక్' మూవీ టీమ్ చెట్లు నరికేశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేయడంతో పాటు స్యయంగా ఆ ప్రదేశానికి వెళ్లి సందర్శించారు. చెట్ల నరికివేతకు అనుమతించిన వ్యక్తులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో షూటింగ్ అర్థంతరంగా నిలిచిపోయింది.Rocking Star @TheNameIsYash bringing all the energy, dancing to Century Star @NimmaShivanna 's hit "Tagaru Bantu Tagaru" at Yatharv’s birthday party.#YashBoss #Shivanna pic.twitter.com/pM1mM413NZ— Bhargavi (@IamHCB) October 31, 2024 -
డ్రైవర్ అన్న డాన్స్ అదుర్స్
-
వారెవా డ్యాన్స్ : అదరగొట్టిన మాధురి, విద్యా, వైరల్
వయసు పెరుగుతున్న కొద్దీ అందం, నటనతో అభిమానులను ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తున్నారు కొందరి తారామణులు. వారిలో ఇప్పుడు ముందు వరసలో చేరారు మాధురీ దీక్షిత్. విద్యాబాలన్తో కలిసి ఇటీవల ‘అమి జె తోమార్ 3.0’ యుగళగీతానికి నృత్యం చేస్తున్న షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భూల్ భులయ్యా3 సినిమాలోని ఈ పాట అక్టోబర్ 25న విడుదల అయ్యింది. ఈ సినిమా ట్రైలర్లో ఇప్పటికే మాధురీ దీక్షిత్ను చూసిన నెటిజనులు చెక్కుచెదరని ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంక ‘అమి జె తోమర్ 3.0’ లో 45 ఏళ్ల విద్యాబాలన్తో కలిసి 57 ఏళ్ల మాధురి దీక్షిత్ చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంటోంది. 2007లో విడుదలైన భూల్ భులయ్యా సినిమాలోని ఒరిజనల్ ట్రాక్కి రీమేక్ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ కం΄ోజ్ చేసిన ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) -
దసరా ఉత్సవాల్లో అసభ్యకర నృత్యాలు
కలిదిండి(కై కలూరు): దసరా ఉత్సవాల్లో ఎటువంటి అశ్లీల, అసభ్యకర నృత్యాలు చేయకూడదని జిల్లా ఎస్సీ పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు కమిటీ సభ్యులు మాటవినడం లేదు. ఏలూరు జిల్లా కోట కలిదిండిలో 30వ వార్షికోత్సవ దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి మ్యూజికల్ నైట్, డాన్స్ బేబీ డాన్స్ ఏర్పాటు చేశారు. ఇదే మండలం పోతుమర్రు పంచాయతీ గొల్లగూడెం నుంచి 10 మంది మైనర్ యువకులు కార్యక్రమాన్ని తిలకించడానికి కోట కలిదిండి వచ్చారు. డాన్సులను సెల్ఫోన్లలో చిత్రీకరిస్తుండగా కమిటీ సభ్యులు సెల్ఫోన్లు లాక్కున్నారు. పడమటి ప్రేమ్సాగర్ అనే యువకుడుని కొట్టారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ప్రేమసాగర్ తల్లి పడమటి వెంకటరమణ తాగిన మైకంలో తన బిడ్డను పేటేటి సత్యనారాయణ, గంధం వాసు, చిట్టూరి పరుశురాం, సుబ్బారావులు కొట్టారని కలిదిండి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. తన కుమారుడితో పాటు మరో యువకుడిని బంధించి హింసించారని సెల్ఫోన్లు లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం కొడుకును కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకువెళ్లింది. దోషులను కఠినంగా శిక్షించాలని కోరింది.నృత్యాలు వీడియా ఇప్పటిది కాదువాస్తవానికి ఈ నెల 5న అదే స్టేజీమీద మ్యూజికల్ నైట్లో నృత్యాలు జరిగినట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఏలూరు డీఎస్పీ, సీఐలు విచారణ చేస్తున్నారు. నిర్వాహకులపై యువకులపై దాడి, అసభ్యకర నృత్యాల ప్రదర్శనపై కేసుల నమోదుకు పోలీసులు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనిపై కలిదిండి ఎస్సై వేంకటేశ్వరరావును వివరణ కోరగా మంగళవారం గొడవ జరిగిన మాట వాస్తవమేనని అందుకు బాధ్యులైన వారిపై విచారించి కేసులు నమోదు చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న అసభ్యకర నృత్యాలు వీడియో ఇప్పటిది కాదని ఆయన స్పష్టం చేశారు. -
దేవర సాంగ్.. నాగార్జున డ్యాన్స్ చూశారా!
టాలీవుడ్ హీరో నాగార్జున ప్రస్తుతం రజినీకాంత్ కూలీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే వైజాగ్లో కూలీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. నాగార్జున యాక్షన్ సీన్స్కు సంబంధించిన వీడియోలు కూడా ఇటీవల నెట్టింట లీక్ అయ్యాయి.అయితే నాగార్జున ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-8కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా నాగార్జున బిగ్బాస్ షో సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీలోని సాంగ్కు స్టెప్పులతో అదరగొట్టారు. ఆయుధ పూజ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.(ఇది చదవండి: మీ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుంటా.. అభిమానులపై ఎన్టీఆర్)కాగా.. ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. Nagarjuna performance for Ayudhapooja song ❤🔥#Nagarjuna #NTR @tarak9999 pic.twitter.com/5xuXrHS3Yr— Devara NTR (@DevaraTsunamiOn) October 5, 2024 -
ఓల్డేజ్.. ఓల్టేజ్..
చిన్న కుర్రాడిలాగా ఏంటీ ఆ డ్యాన్సులు? అంటూ ఎవరైనా ఆక్షేపించినా వెనకడుగు వేయనక్కర్లేదు. ఎందుకంటే డ్యాన్సులు చేస్తే వృద్ధుల్లో కుర్రతనం ఇనుమడిస్తుందని, వృద్ధాప్య ప్రభావం కనుమరుగవుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వృద్ధాప్యంపై యుద్ధంలో మిగిలిన అన్నిరకాల శారీరక వ్యాయామాల కన్నా డ్యాన్స్ ది బెస్ట్ అని తేల్చడం విశేషం. సిటీలోని ప్రతి డ్యాన్స్ స్టూడియో తమ నేమ్ బోర్డులో ఫిట్నెస్ అనే పదాన్ని చేర్చుకుంటున్న నేపథ్యంలో పెద్దవాళ్లు సైతం డ్యాన్సర్లుగా మారేందుకు ఇలాంటి సర్వే ఫలితాలు తోడ్పడనున్నాయి. వృద్ధాప్యాన్ని జయించడంలో శారీరక శ్రమను మించిన ప్రత్యామ్నాం లేదు. దీనిని ఇప్పుడిప్పుడే ఆధునికులు గుర్తిస్తున్నారు. జిమ్లు, యోగాసనాలు.. వగైరా ఎన్నో వ్యాయామ శైలులు.. ఒక్కో వ్యాయామం ద్వారా ఒక్కో రకమైన ప్రయోజనం. అదే క్రమంలో నృత్యం ద్వారా వృద్ధాప్యాన్ని జయించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.స్టడీ ఇదీ.. ఫలితం ఇదీ.. అన్ని వ్యాయామాలూ ఆరోగ్యానికి ఉపయోగపడేవే అయినా నృత్యం వల్ల వృద్ధాప్య సమస్యలకు చాలా మంచిదని ఫ్రంటియర్స్ ఇన్ హ్యూమన్ న్యూరోసైన్స్ జర్నల్లో ప్రచురించిన తాజా పరిశోధన నిర్ధారించింది. వయసు పరంగా మీదపడే శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోడంలో ఎండ్యురెన్స్ట్రైనింగ్, డ్యాన్సింగ్ రెండింటి మధ్యా వ్యత్యాసాన్ని పరిశీలించినప్పుడు డ్యాన్స్ మరింత లాభదాయకమని తేలిందని పరిశోధనకు సారథ్యం వహించిన జర్మన్ సెంటర్ ఫర్ న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్కు చెందిన డాక్టర్ కేథరిన్ అంటున్నారు. సగటున 68 ఏళ్ల వయసున్న వందలాది మందికి 18 నెలల పాటు నృత్య శిక్షణ, ఎండ్యురెన్స్, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ ఇచ్చారు. అయితే వీరిలో నృత్యాన్ని ఎంచుకున్నవారి బ్రెయిన్లోని హిప్పో క్యాంపస్ ప్రాంతంలో మరింత ఆరోగ్యకరమైన వృద్ధి కనిపించింది. వృద్ధాప్య ప్రభావాన్ని పెంచి తత్సంబంధిత అల్జీమర్స్ తరహా వ్యాధుల్ని దరిచేర్చడంలో కీలకం ఈ ప్రాంతమే. ఈ పరిశోధన ఫలితాలను అనుసరించి బ్రెయిన్పై యాంటీ ఏజింగ్ ప్రభావాలను చూపే సరికొత్త ఫిట్నెస్ ప్రోగ్రామ్ను జిమ్మిన్ (జామ్మింగ్, జిమ్నాస్టిక్) అనే పేరుతో శబ్దాలను (మెలొడీస్, రిథిమ్) పుట్టించే ఒక కొత్త పద్ధతిని వీరు రూపొందించారు.నృత్యం ఆరోగ్యకరం.. ప్రతి ఒక్కరూ ఎంత కాలం వీలైతే అంత కాలం స్వతంత్రంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుంటారు. శారీరక శ్రమ దీనికి ఉపకరిస్తుంది. దీనిలో నృత్యం భాగమైతే శరీరానికి, మైండ్కి కొత్త సవాళ్లను, చురుకుదనాన్ని అందించడం అనివార్యం అని నగరానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ బాబీ అంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి ఇది మరింత మేలు చేస్తుందనేది తమ వద్ద శిక్షణకు వస్తున్నవారి విషయంలో రుజువైందన్నారు.ఇవీ తెలుసుకోండి.. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే సంతోషకారక హార్మోన్లు విడుదల అవుతాయి అని ఆ్రస్టేలియాలోని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యుయుటి) కూడా నిర్ధారించింది. 👉అంతర్గత ఆరోగ్య సమస్యలున్నవారికి నృత్యాలు సరిపడవు. కాబట్టి నృత్యాన్ని ఎంచుకునే ముందు ఫ్యామిలీ డాక్టర్ అభిప్రాయం తీసుకోవడం అవసరం. 👉 సోలో డ్యాన్సింగ్ సులభమైనది, పెద్దలకు బాగా నప్పుతుంది. అదే విధంగా ఓరియంటల్ డ్యాన్స్, బాలె డ్యాన్స్, ఇండియన్ డ్యాన్స్, ట్యాప్ డ్యాన్స్.. వంటివి చేయవచ్చు. 👉మోకాలు, హిప్, కాలి మడమ నొప్పులు.. వంటివి ఉన్నవారి కోసం సీటెడ్ డ్యాన్స్ కూడా ఉంది. 👉బాల్ రూమ్ డ్యాన్స్నే సీనియర్స్ బాగా ఇష్టపడతారు.. ఎందుకంటే ఇవి కపుల్ డ్యాన్స్ క్లాసెస్ కావడంతో పెద్దలకు చాలా ఉపయుక్తం. – ఈ డ్యాన్సుల్లో ఇతరులతో సోషలైజింగ్ ఉంటుంది కాబట్టి, ప్రాధాన్యత కలిగిన వారిమే అనే అభిప్రాయంతో హుషారు వస్తుంది. 👉పెద్దల్లో ట్యాంగో, క్విక్ స్టెప్, వియన్నీస్ వాల్ట్జ వంటివి జ్ఞాపకశక్తి వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. 👉 చా– చా– చా, రుంబా, సాంబా, ప్యాసో.. వంటి విదేశీ నృత్యాలు చూడడానికి కాస్త సులభంగా అనిపించినా చేసేందుకు కొంత సంక్లిష్టంగా ఉంటాయి. అలాగే వీటికి మరింత శారరీక సామర్థ్యం అవసరం కాబట్టి వీటిని ఎంచుకోకపోవడమే ఉత్తమం. 👉లైన్ డ్యాన్సింగ్ పెద్ద వయసులో ఉన్నవారికి అత్యంత ఆదరణ పొందుతోన్న నృత్యశైలి. అమెరికాలో ఇది బాగా పాపులర్. ఈ నృత్యంలో డ్యాన్సర్లు ఒకరితో ఒకరు టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. -
విజయవాడ : దసరా సందర్భంగా సిద్ధార్థ ఆడిటోరియంలో యువజనోత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడ : సిద్ధార్థ కళాశాలలో ఉత్సాహంగా నృత్యోత్సవం 2024 (ఫొటోలు)
-
రామ్ చరణ్ సాంగ్కు స్టెప్పులేసిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య ఇటీవలే సరిపోదా శనివారం అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఆ మూవీ నుంచి రా మచ్చా మచ్చా అనే లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్.(ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!)ఈ పాటకు తన స్టెప్పులతో అలరించారు ఎస్జే సూర్య. డ్యాన్స్ చేస్తూ వేదికపై సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. Poduu Thalaaa @iam_SJSuryah 💥💥#RaaMachaMacha #DamTuDikhaja #GameChanger pic.twitter.com/YTBD5ktGns— Raees🚁 (@RaeesHere_) September 30, 2024 #RaaMachaMacha sj surya on fire🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/aCkFweUpyJ— GCR🚁🚁🚁 (@GaniCharan1) September 30, 2024 -
శబరిమలలో హరివరాసనం: అద్వితీయంగా చిన్నారి నృత్యాభినయం
ప్రసిద్ధ గాయకుడు కే జే ఏసుదాసు నోట అత్యంత అద్భుతంగా పలికిన ‘‘హరివరాసనం విశ్వమోహనం హరిహరాత్మజం దేవమాశ్రయే’’ అయ్యప్పస్వామి పాటను వింటే ఎలాంటి వారికైనా అద్భుతం అనిపిస్తుంది. ఇక అయ్యప్ప భక్తులైతే భక్తిపరవశంతో తన్మయులౌతారు. ఈ పాటకు చిన్నారి చేసిన నృత్యాభినయం విశేషంగా నిలుస్తోంది.శబరిమలలో హరివరాసనం పఠిస్తున్నపుడు చిన్నారి అద్భుతంగా నృత్యం చేసింది. ఆ పాటకు చక్కటిన హావభావాలు, అభినయానికి అందరూ మంత్ర ముగ్ధులవుతున్నారు. ‘‘ఆమె అభినయం, చూపించిన భావాలు చాలా బావున్నాయి. ఈ చిన్నారికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప!’’ అంటూ నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేస్తున్నారు.Harivarasanam with a small Ayyappa Devotee girl dancing to the song .Ayyappa Sharanam1/2 pic.twitter.com/2XyE5Lrme7— @Bala (@neelabala) March 30, 2024ఇటీవల స్వామి వారి సన్నిధానంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు, రాత్రి 10 గంటలకు, విష్ణుప్రియ ఈ మధురమైన పాటకు, లయకు అనుగుణంగా నృత్యం చేయడం ప్రారంభించింది. దీన్ని చూసిన భక్తులు చిత్రీకరించడంతో అది తరువాత వైరల్గా మారింది.కాగా స్థానిక మీడియా మాతృభూమి కథనం ప్రకారం విష్ణుప్రియ కేరళలోని ఎడపల్లిలోని అమృత విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి కొచ్చిలోని అమృతా టెక్నాలజీస్లో పని చేస్తున్నారు. ఆమె తల్లి పలరివట్టం వెక్టర్ షేడ్స్ కంపెనీలో ఇంజనీర్. ఆమె సోదరుడు 1వ తరగతి విద్యార్థి. -
చదరంగం ఎత్తులే కాదు, డ్యాన్స్ స్టెప్పుల్లోనూ మనోడు తోపు, వైరల్ వీడియో
చెన్నైకి చెందిన ఇండియన్ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ స్టార్ ఆఫ్ ది సోషల్ మీడియాగా హల్ చల్ చేస్తున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ గా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యామస్ తమిళ సినిమా పాట స్టెప్పులతో అదర గొట్టాడు. మనసులాయో అంటూ దీనికి సంబంధించిన వీడియోను గుకేశ్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. చదరంగంలో ప్రత్యర్థులు తోకముడిచే స్టెప్పులే కాదు,అదిరే స్టెప్పులతో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేశాడు అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ‘‘యుద్ధంలో రాణి (చెస్లో క్వీన్ పాత్ర)ని ముందు పెట్టి ఎలా నెగ్గాలో తెలిసినవాడు, మొత్తానికి గుకేశ్ రెండో కోణాన్ని ఆవిష్కరించాడు’ అంటూ పలువురు వ్యాఖ్యానించారు. మరి మన ఆటగాడి స్టెప్పులేంటో మీరూ చూసేయండి. Manasilayo...with my family friends!Idhu epdi irukku 😎 pic.twitter.com/r2hkDWYiJE— Gukesh D (@DGukesh) September 29, 2024 -
పుష్ప సాంగ్కు డ్యాన్స్ చేసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్!
ఐఫా-2024 అవార్డుల వేడుక అబుదాబిలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సినీతారలంతా సందడి చేస్తున్నారు. సౌత్తో పాటు బాలీవుడ్ అగ్ర సినీతారలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే ఈవెంట్లో హోస్ట్లుగా వ్యవహరించిన బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ సందడి చేశారు. వేదికపై స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరించారు.అయితే వేదికపై వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్ పుష్ప సాంగ్కు డ్యాన్స్ చేశారు. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అనే ఐటమ్ సాంగ్కు స్టెప్పులతో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: నేను మాట్లాడింది ప్రభాస్ గురించి కాదు.. జోకర్ కామెంట్స్పై క్లారిటీ!)కాగా.. ఈ అవార్డ్స్ వేడుకల్లో షారూఖ్ ఖాన్కు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. జవాన్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ దక్కించుకున్నారు. సినీ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సెప్టెంబర్ 27న అబుదాబిలో ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకల్లో సమంతా రూత్ ప్రభు, ఐశ్వర్యరాయ్ బచ్చన్ సందడి చేశారు. Yeh tho asli FIRE hey 🔥🔥KING KHAN @iamsrk & @vickykaushal09 set the stage on FIRE 🔥😄 pic.twitter.com/bpqUL40hgk— Mythri Movie Makers (@MythriOfficial) September 28, 2024 -
అట్టహాసంగా ఐఫా వేడుక.. సీనియర్ నటి డ్యాన్స్ అదుర్స్!
ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుక ఐఫా-2024 అట్టహాసంగా జరుగుతోంది. సినీ ఇండస్ట్రీలో ఉత్తమ నటన కనబరిచిన వారికి అవార్డులను అందజేస్తారు. ఇప్పటికే పలువురు సినీతారలు ఈ అవార్డ్స్ దక్కించుకున్నారు. సెప్టెంబరు 27న మొదలైన ఈ వేడుక ఆదివారంతో ముగియనుంది. ఇప్పటికే సౌత్ ఇండియా, బాలీవుడ్ తారలకు అవార్డులను ప్రకటించారు.అయితే ఈ వేడుకలకు హాజరైన సీనియర్ నటి రేఖ అందరి దృష్టిని ఆకర్షించింది. 1965లో వచ్చిన ఆమె నటించిన చిత్రం గైడ్లోని ఓ సాంగ్కు డ్యాన్స్తో అదరగొట్టింది. 150 మంది డ్యాన్సర్లతో కలిసి దాదాపు 20 నిమిషాల పాటు అభిమానులను అలరించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పింక్ అనార్కలి సూట్లో రేఖ మిస్టర్ నట్వర్లాల్ చిత్రంలోని "పర్దేశియా" పాటకు డ్యాన్స్తో అదరగొట్టింది.(ఇది చదవండి: ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్)కాగా.. టాలీవుడ్లో ఉత్తమ నటుడిగా నాని(దసరా) నిలిచారు. ఉత్తమ చిత్రంగా దసరా మూవీకి అవార్డ్ దక్కింది. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్(జవాన్) ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ నిలిచింది. The one and only #Rekha ji ❤️#IIFA2024 pic.twitter.com/DMUVNOHju7— Raj Nayak (@rajcheerfull) September 29, 2024 #Rekha ji mesmerizing the audience with her ever charming charisma 💓💓💓💓 #IIFA2024 pic.twitter.com/hRc4gV1zZ0— 💖👑 GreatestLegendaryIconRekhaji👑 💖 (@TheRekhaFanclub) September 28, 2024 -
Zumba Dance: జుంబా హాయిరే..
జుంబా ప్రస్తుతం నగరాల్లో ట్రెండింగ్ అవుతున్న పదం.. డ్యాన్స్లో ఇదో కొత్త తరహా అనే చెప్పాలి. అయితే సరదా కోసం వేసే డ్యాన్స్ కాదు.. ఆరోగ్యం కోసం, వెయిట్ లాస్ కోసం చేసేదే జుంబా. ఇటు డ్యాన్స్.. అటు ఎక్సర్ సైజ్ రెండూ ఇందులో మిళితమై ఉంటాయి. అందుకే నగరంలో ఎక్కువ మంది ప్రస్తుతం జుంబాకు ఆకర్షితులవుతున్నారు. జుంబాతో శరీరానికి, గుండెకు మేలు చేసి, మానసిక ప్రశాంతత ఇవ్వడమే కాకుండా ఎన్నో వ్యాధులు దరిచేరకుండా చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం లేవగానే ఇంటి పనులు.. ఉద్యోగం కోసం పరుగులు.. ఆఫీస్ వర్క్.. టార్గెట్స్.. టెన్షన్స్.. సాయంత్రం పొద్దుపోయాక రావడం.. అలసిపోయి ఏదో తినేసి పడుకోవడం.. మళ్లీ ఉదయంతో షరా మామూలే.. అన్నట్లు మారిపోయింది. కనీసం ఆరోగ్యం గురించి కాస్త సమయం కేటాయించడానికి కూడా కష్టం అవుతోంది. దీంతో చిన్న వయసులోనే అనారోగ్యంతో పాటు మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా హృద్రోగ సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రతి రోజు కాకపోయినా వారంలో రెండు, మూడు రోజులైనా ఓ గంట పాటు వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే జిమ్కు వెళ్లడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వెళ్లినా జిమ్ చేయడం అందరి శరీరాలకు సెట్ కాకపోవచ్చు. అందుకే నగరంలో చాలా మంది జుంబా డ్యాన్స్ను ఎంచుకుంటున్నారు. బరువు తగ్గేందుకు.. నగరంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో ఊబకాయం, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో మానసికంగానే కాకుండా సామాజికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే చాలా మంది బరువు తగ్గేందుకు జిమ్లను కాకుండా జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నారు. జుంబా అంటే ఒక రకమైన కార్డియో వ్యాసు్కలార్ ఎక్సర్సైజ్లలో ఒకటని చెప్పుకోవచ్చు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని కూడా అనొచ్చు. రోజులో కనీసం గంట పాటు చెమటలు వచ్చేదాకా జుంబా డ్యాన్సులు చేయిస్తుంటారు. దీని ద్వారా శరీరంలో కేలరీలు కరిగి బరువు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ జుంబా క్లాసుల్లో మ్యూజిక్ పెట్టి.. సాల్సా, కుంబియా, బచతా, మెరెంగ్యూ వంటి డ్యాన్స్ స్టెప్స్ వేయిస్తుంటారు. వీటితో పాటు సినిమా పాటలకు కూడా స్టెప్స్ వేయిస్తుంటారు. పైగా పది మందితో కలిసి డ్యాన్స్ చేస్తుంటారు కాబట్టి ఫన్ ఉంటుంది.హార్ట్కు మాంచి ఎక్సర్సైజ్.. జుంబా డ్యాన్స్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావడంతో గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. రక్త పీడనం (బ్లడ్ ప్రెషర్) తగ్గించడంతో పాటు హృద్రోగ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. శరీర బరువు తగ్గడంతో పాటు శరీరాకృతిని మెరుగుపరుస్తుంది. అంటే చక్కటి శరీరాకృతి వచ్చేలా చేస్తుంది. జుంబా డ్యాన్స్లో చేసే స్టెప్స్ ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్గా మారుతుంది. అంతేకాకుండా కాన్ఫిడెన్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మరెన్నో లాభాలు.. జుంబా డ్యాన్స్ క్లాసులకు చాలా మంది వస్తుంటారు. వారితో తరచూ సంభాషిస్తుండటం.. కలిసి డ్యాన్సులు చేస్తుండటంతో స్నేహం పెరుగుతుంది. అలాగే మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేస్తుంటే మంచి మూడ్ పెంచే హార్మన్స్ విడుదల అవుతాయి. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. రోజులో చేయాల్సిన పనులను ఎంతో ఉత్సాహంగా చేస్తుంటాం. దీంతో ఉత్పాదకత కూడా పెరగుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. డ్యాన్స్ వల్ల చెమటలు రావడంతో చర్మంపై ఉన్న రంధ్రాలు తెరుచుకుంటాయి. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి.. చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా జుంబా డ్యాన్స్ ఎవరైనా చేయొచ్చని శిక్షకులు చెబుతున్నారు. ఆడవాళ్లు మాత్రమే జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తారనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే ఆడవారితో పాటు మగ వారు కూడా జుంబా డ్యాన్స్ చేయొచ్చని పేర్కొంటున్నారు. నిపుణుల పర్యవేక్షణలో సరైన పద్ధతిలో, సరైన రీతిలో జుంబా డ్యాన్స్ చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయని వివరిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా శిక్షణ.. గత ఎనిమిది ఏళ్లుగా జుంబా డ్యాన్స్ నేరి్పస్తున్నాను. 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వరకూ ఎంతో మంది క్లాసులకు వస్తుంటారు. కొందరు బరువు తగ్గడానికి వస్తుంటారు. చాలా మంది ఫిట్నెస్ కోసం వస్తుంటారు. జుంబా క్లాసులను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. రెగ్యులర్గా జుంబా చేస్తే ఆరోగ్య పరంగా, మానసికంగా ఎన్నో లాభాలున్నాయి. – ప్రేమ్ శోతల్, జుంబా ట్రైనర్, డివైన్ స్టూడియో ఆహ్లాదం.. ఆరోగ్యం.. బరువు తగ్గడమంటే చాలా మంది ఎదో బర్డెన్లా చూస్తుంటారు. కానీ జుంబాతో ఇటు ఎంటర్టైన్మెంట్ అటు బరువు తగ్గే వీలుంటుంది. దీని ద్వారా శరీరంలోని కొవ్వు తగ్గిస్తుంది. ఫ్లెక్సిబిలిటీ పెరిగి, శరీరాకృతి మెరుగు పడుతుంది. ఆహారంలో పెద్దగా మార్పులు ఏం అవసరం లేదు. కాకపోతే ఇంట్లో ఆహారం సమయానికి, కాస్త తక్కువగా తింటే లాభాలు కనిపిస్తాయి. రెగ్యులర్గా జుంబా డ్యాన్స్ చేస్తుంటే అనుకున్న ఫలితాలు చూడొచ్చు. – బుద్ధరాజు పూజిత, జుంబా ట్రైనర్, వన్ ఆల్ ఎరేనా -
అదర్సైడ్ .. నువ్వు విజిలేస్తే...
ప్రతి సంవత్సరం మన దేశంలో నిమజ్జనోత్సవాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రకరకాల వేషాల్లో వినాయకుడు సరదాగా ఉన్నాడు. లడ్డూ వేలాలు కోట్లకు చేరుకుంటు న్నాయి. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని మారుతున్నా ఒక్కటి మాత్రం మారలేదు – నిమజ్జనం లాంటి సమయాల్లో పోగైన జనాల మధ్యనుంచి స్త్రీలని వేధించే పోకిరీ వేషాలు.నిమజ్జనాలు మొదలైన మూడో రోజు అనుకుంటా. ఒక మీటింగ్ ముగించుకుని ఊబర్ బైక్పై ఇంటికొస్తున్నాను. ట్రాఫిక్ మెల్లగా కదుల్తోంది. మా బైక్కి కొంచెం ముందు ఒక చిన్న ట్రాలీ ఆటోలో ఒక బుజ్జి వినాయకుడు. క్యూట్గా ఉన్నాడు. వినాయకుడి విగ్రహం కంటే చుట్టూ పెట్టిన సౌండ్ సిస్టం పెద్దదిగా ఉంది. డుబ్ డుబ్ అని డీజే సౌండ్లతో మారుమోగిపొతోంది రోడ్డంతా. ట్రాలీలో ఒక పదిమందికి పైగానే కుర్రాళ్ళు ఫుల్ డాన్స్ చేస్తున్నారు. అంతా బావుంది అనుకుంటుండగా ఆ గుంపులో ఒకడు నన్ను చూసి కన్ను కొట్టాడు. అప్పటివరకూ నేనూ సరదాగా చూస్తున్న ఆ దృశ్యం వికృతంగా మారింది.అంతటితో అయినపోలేదు. నా వైపు చూసి కన్ను కొట్టినోడు, పక్కనున్న మరొకడి చెవిలో ఏదో చెప్పడు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో గట్టిగా నవ్వుకుంటూ అప్పటిదాకా నిలబడి చూస్తున్న వీళ్లిద్దరూ డాన్స్ చేస్తున్న కుర్రాళ్లతో కలిసి అదో రకంగా స్టెప్స్ వేయడం మొదలుపెట్టారు. మామూలుగా అయితే నేను మొహం తిప్పేసుకోవడమో లేదా మొబైల్ చూసుకోవడమో చేసేదాన్ని. కానీ ఆ రోజు మాత్రం వాళ్లవైపే గుడ్లురుమి చూస్తుండిపోయాను. ఎంత కోపంగా చూస్తే అంత రెచ్చిపోతున్నారు. ట్రాఫిక్ కదలడం లేదు. కాసేపటికి నేనే తల తిప్పుకున్నాను. ట్రాఫిక్ కొంచెం మూవ్ అయింది. మా ఊబర్ డ్రైవర్ ఒక కారు వెనక ఆగిపోయాడు. ఆ ట్రాలీ ఆటో ముందుకు వెళ్లిపోయింది. పాట మారింది. అప్పుడే మమ్మల్ని దాటుకొని ఒక స్కూటీ వెళ్లింది. ఆ స్కూటీ నడుపుతున్న అమ్మాయి మీదకి మారింది ఆ కుర్రాళ్ల చూపు. ఆ అమ్మాయిని చూసి కూడా అవే కోతలు, అవే కేకలు, అవే కుప్పి గంతులు. ఆ అమ్మాయి చున్నీ సర్దుకోవడం నాకు కనిపించింది. ఆ అమ్మాయి ఆ ట్రాలీని కూడా దాటుకొని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఓయ్ ఓయ్ అని తరిమాయి ఆ పిల్లని ఈ గాలి మాటలు.ఆ కుర్రాళ్లు ఆ రాత్రికెప్పుడో నిమజ్జనం పూర్తి చేసుకుని, ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుని హాయిగా నిద్రపోయుంటారు. కానీ వాళ్ల చేసిన అల్లరికి ఎంతమంది అమ్మాయిలకు ఆ రాత్రి నిద్రపట్టకుండా చేసుంటారో, వాళ్లలో ఎంత భయాందోళనలు కలుగచేసి ఉంటారో వాళ్లకి తెలిసుండదు.ఏదో దార్లో ఆమ్మాయి కనిపిస్తే జస్ట్ విజిలేసా, అంతే అని మగాళ్లకి అనిపించవచ్చు. అదేం పెద్ద విషయం కాదని మన సినిమాలు నార్మలైజ్ చేసుండొచ్చు. కానీ ఈ రకమైన వేధింపులు స్త్రీలకు తీవ్రమైన మానసిక, శారీరక ఇబ్బందులను కలుగచేస్తాయనేది ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాల్సిన విషయం.ఇదో పెద్ద సమస్యా అని తీసిపారేసే విషయం కాదు. 2014లో న్యూయార్క్ లో సొషానా రాబర్ట్స్ అనే మహిళ 10 గంటల పాటు నడిచినప్పుడు దాదాపు 100 సార్లు ఇలాంటి వేధింపులకు గురైంది. ఆమె ఈ అనుభవాన్ని వీడియోగా చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అయి, ప్రపంచవ్యాప్తంగా క్యాట్ కాలింగ్పై చర్చకు తెరలేపింది.అంటే ఒకమ్మాయి రోడ్డు మీద గంటసేపు నడిస్తే కనీసం పదిసార్లు ఎవరో ఒకరు ఆమెను అదోలా చూడడమో, ఏదో ఒకటి అనడమో జరుగుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే భయంగా లేదా?సరే ఇది ఒక వైపైతే, నిమజ్జనం చివరి రోజు ఆ జనాల మధ్య ఎంతమంది మగాళ్లు ఆడవాళ్లని తాకరాని చోట తాకుతూ ఎంత హింసకు గురిచేస్తారో, ఈ దేశంలోని ప్రతి మహిళ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవానికి గురయ్యే ఉంటారు. ఇది కేవలం నిమజ్జనానికి సంబంధించిన విషయం కాదు. ఎక్కడ ఎప్పుడు జనాలు గుమిగూడినా జరిగే విషయమే.ఒక్క ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర, కేవలం వారం రోజుల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 285 మందిని అరెస్ట్ చేశారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి.లైంగిక వేధింపు అనేది కేవలం స్త్రీల సమస్య కాదు, ఇది మన సమాజం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. ఈసారి ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి ఏదైనా అనాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా అక్కడ మీ అమ్మో, అక్కో, చెల్లో ఉంటే ఏం చేస్తారు అని ఒక్కసారి ఆలోచించమని మై డియర్ మగాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాదు ఈ సమస్య బయట వేరేవరో కాదు మీ అక్క, మీ చెల్లి కూడా ఎదుర్కొంటున్నారని ఆలోచించమంటున్నాను. -
ఓనం వేళ దరువుతో అలరించే పులికలి..! ఏకంగా 200 ఏళ్ల..
కేరళలో ఓనమ్ పది రోజుల పంట పండుగ. ఈ సందర్భంగా సద్య తాళిని ఆస్వాదించడానికి, పూల అలంకరణలు చేయడానికి, పడవ పందాలను చూడటానికి, ఆటలు ఆడటానికి, దయగల, ఎంతో ప్రియమైన రాక్షస రాజు మహాబలి స్వదేశానికి రావడాన్ని గౌరవించే వేడుక ఓనమ్. ఈ వేడుకలలో నాల్గవ రోజున కేరళలోని అత్యంత అద్భుతమైన దేశీయ కళారూపాలలో పులికలిను ప్రదర్శించారు. కొన్ని ప్రదేశాలలో దీనిని కడువాకలి అని కూడా పిలుస్తారు. ఇక్కడ కళాకారులు పులి వేషం ఓనం రోజుల్లో పులికొట్టు లేదా డ్యాన్స్ తోపాటు వేసే దరువులు త్రిస్సూర్లో ప్రతిధ్వనిస్తాయి. త్రిస్సూర్లోని పులికలి తప్ప మరే ఇతర ప్రదేశంలోనూ ఈ ప్రత్యేక లయ లేదని చెప్పుకోవచ్చు. పులికలిక్కర్లు వారి నడుముకు గంటలు జోడించి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉండే ఈ అసుర లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు. వందల ఏళ్ళ నృత్యంపులికలి 200 ఏళ్లనాటిది. అప్పటి కొచ్చిన్ మహారాజా రామవర్మ శక్తన్ థంపురాన్ దీనిని ప్రవేశపెట్టినట్లు చెబుతారు. సహజసిద్ధమైన రంగులను శరీరానికి పూసుకుని, కదులుతున్న పులుల వలె అలంకరింపబడిన పులికెత్తికళి ప్రదర్శనను స్థానికులు ఎంతగానో ఆస్వాదిస్తారు. త్రిస్సూర్లో ఈనాటికీ పురాతనమైన నృత్య శైలి మనుగడలో ఉంది. పులి వేషంలో నృత్యం చేసే కళాకారులను పులికలిక్కర్ అంటారు. వాద్యమేళం (కేరళకు చెందిన ఆర్కెస్ట్రా) లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు. పులికలిక్కర్ పెయింటింగ్లో చారలు ముదురు పసుపు, నలుపు రంగులో ఉంటాయి. పులినిపోలి ఉండేలా శరీరం మొత్తం పెద్ద మచ్చలతో ఈ ఆర్ట్ వేస్తారు. అట్టముక్కలు, సైకిల్ ట్యూబ్లు‘కళాకారులు ఓనమ్కి రెండు లేదా మూడు నెలల ముందే పులికాలి సన్నాహాలు ప్రారంభిస్తారు. బాగా తిని, పొట్టను సిద్ధం చేసుకుంటారు. దీని వల్ల కళలో వారు మంచి ప్రదర్శనను ఇవ్వగలుగుతారు‘ అని చెబుతారు. ఆరు రకాల చారలతో శరీరం అంతా పెయింట్ చేస్తారు. నేడు కళాకారులు ఫేస్ మాస్క్లతో మరింత నూతనంగా డిజైన్ చేస్తున్నారు. ఫేస్ మాస్క్ కోసం కాగితపు అట్టలను కత్తిరించి, దంతాలగా అటాచ్ చేయడానికి జిగురును ఉపయోగిస్తారు. నాలుకను సైకిల్ ట్యూబ్ను కత్తిరించి తయారు చేస్తారు. చివరి టచ్–అప్ ముఖానికి సాంప్రదాయక రంగులతో తగిన షేడ్స్ను సృష్టిస్తారు. ప్రాచీన నృత్యాలురంగుల ముసుగు నృత్యం త్రిసూర్, పాలక్కాడ్ జిల్లా, దక్షిణ మలబార్లోని కొన్ని ప్రాంతాలలో జరుగుతుంది. మొదటి రోజు నుంచి ఓనమ్ నాల్గవ రోజు వరకు ప్రదర్శకులు ఇంటింటికీ వెళతారు. శరీరమంతా కప్పి ఉంచేలా పర్పటక గడ్డితో దుస్తులు సిద్ధం చేస్తారు. దేవతలు, మానవులు, జంతువులు కుమ్మట్టికలిలో కనిపిస్తాయి. కళాకారులు ధరించే పాత్రలు, ముఖాలలో శివుడు, బ్రహ్మ, రాముడు, కృష్ణుడు, గణేశుడు, కాళి మొదలైనవారు ఉంటారు. ముసుగు వేసుకున్న కుమ్మట్టి (మాతృమూర్తి) నటన కళ్లారా చూడాల్సిందే. ఇతర నృత్యాలుస్త్రీలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి చేసే ప్రత్యేకమైన నృత్యం. అలంకరించిన ముగ్గు, మధ్యన సంప్రదాయ దీపం.. దాని చుట్టూ మహిళలు చేరి నృత్యం చేస్తారు. నీటితో నిండిన పాత్ర , బియ్యం పాత్ర.. వంటివి కూడా ఉంచుతారు.(చదవండి: 30 కిలోల చాక్లెట్తో అర్థనారీశ్వర రూపంలో గణపతి..నిమజ్జనం ఏకంగా..!) -
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు
రాజాం సిటీ: అంతవరకు అందరితో కలిసి డీజే ముందు డ్యాన్స్ చేసిన యువకుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మున్సిపాలిటీ పరిధి పొనుగుటివలస గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జనంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వావిలపల్లి వినయ్ అనే ఇరవై ఏళ్ల యువకుడు వినాయకుని నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే వద్ద డ్యాన్స్చేసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం గమనించిన కొంతమంది యువకులు అతనిని పరిశీలించగా అపస్మారకస్థితిలో ఉన్నట్లు గుర్తించి సపర్యలు చేపట్టి ఇంటికి చేర్చారు. అక్కడ నుంచి రాజాంలోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. గుండె సంబంధిత సమస్యగా గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిఫర్ చేశారు. అక్కడ నుంచి విశాఖపట్నం తరలించారు. డీజేల వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నా యువత పట్టించుకోకపోవడం విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రాజాం టౌన్, రూరల్ సీఐలు కె.అశోక్కుమార్, హెచ్.ఉపేంద్ర వద్ద ప్రస్తావించగా.. డీజేలకు ఎటువంటి అనుమతుల్లేవన్నారు. వినాయక నిమజ్జనాల్లో డీజేలు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
Sai Pallavi: పూజా కన్నన్ సంగీత్.. చెల్లితో కలిసి చిందేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
ప్యారిస్ వీధుల్లో పతక సంబరం!
ప్యారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్లో భారత హై జంపర్ నిషాద్ కుమార్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఈ విశ్వక్రీడల్లో నిషాద్ రజత పతకంతో మెరిశాడు. పురుషుల హై జంప్ T47 విభాగంలో నిషద్ కూమార్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్స్లో నిషిద్ కూమార్ 2.06 మీటర్లు ఎత్తు ఎగిరి రెండో స్థానంలో నిలిచి.. రెండో పారాలింపిక్స్ మెడల్ను తన ఖాతాలో వేసుకున్నాడు.నిషాద్ సూపర్ డ్యాన్స్..ఇక పారాలింపిక్స్ ముగిసిన తర్వాత నిషాద్ తనలోని మరో కోణాన్ని చూపించాడు. ప్యారిస్ వీధుల్లో డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన నిషాద్ అద్బుతంగా డ్యాన్స్ చేస్తూ.. తన మెడల్ విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా నిషాద్ తన ఆరేళ్ల వయస్సులోనే ఓ ప్రమాదంలో తన చేతిని కోల్పోయాడు. అయినప్పటకి తన పట్టుదలతో విశ్వవేదికపై సత్తాచాటుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో సైతం అతడు సిల్వర్ మెడల్ సాధించాడు. Paralympics Silver Medalist Nishad Kumar amazing dance moves at Paris 🕺🗼Nishad is totally enjoying it 🤩pic.twitter.com/EkND79OoBk— The Khel India (@TheKhelIndia) September 9, 2024 -
వినాయక చవితి వేడుకల్లో స్టార్ హీరో డ్యాన్స్.. వీడియో వైరల్!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముంబయిలో సందడి చేశారు. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఆయన డ్యాన్స్ చేస్తూ కనిపించారు. చిన్నపిల్లలతో కలిసి డప్పుల ముందు చిందులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను సల్మాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. సల్మాన్ చివరిగా 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ సరసన నటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ సరసన రష్మిక మందన్నా స్క్రీన్ పంచుకోనుంది. ఇటీవల పక్కటెముకల గాయంతో ఓ ఈవెంట్లో ఇబ్బంది పడుతూ కనిపించారు. మరోవైపు హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు హోస్ట్గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు.గాయంతో ఈవెంట్కు హాజరు..ఈ బిగ్బాస్ ఈవెంట్లోనూ తాను ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. రెండు పక్కటెముకలు విరిగాయని, ఈ గాయం తాను అనుకున్నదానికంటే కూడా సీరియస్గా ఉందని పేర్కొన్నాడు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ ఫోటో, వీడియో జర్నలిస్టులకు సూచించాడు. సల్మాన్ ఇబ్బందిని గమనించిన అభిమానులు అంత కష్టంలోనూ పనిధ్యాసే అని పొగుడుతున్నారు. Happy Ganesh Chaturthi pic.twitter.com/Ac7d9Om86v— Salman Khan (@BeingSalmanKhan) September 9, 2024 -
‘‘గన్నూ రాజాకు బై..బై..!’’ ముద్దుల తనయతో శిల్పాశెట్టి డ్యాన్స్ అదుర్స్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ప్రతీ ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే ఈ సారి తన ముద్దుల తనయతో కలిసి చేసిన నృత్యం హృద్యంగా నిలిచింది. భర్త రాజ్ కుంద్రా, పిల్లలతో కలిసి గణపతి విసర్జన ఆచారాలను నిర్వహించి, ధోల్ దరువులకు ఆనందంగా నృత్యం చేశారు.దీనికి సంబంధించిన వీడియో గణపతి భక్తులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కుమార్తె సమీషాతో కలిసి విసర్జన్ పూజ కోసం ట్విన్నింగ్ లెహంగా-చోలీలో ఉత్సాహంతా డ్యాన్స్ చేసి అలరించారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)అంతకుముందు గణపతి బప్పాకు ఇంటికి సాదరంగా ఆహ్వానించి, భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించారు శిల్పాశెట్టి దంపతులు. ఆ తరువాత అందమైన సాంప్రదాయ దుస్తుల్లో గణపతికి వీడ్కోలు పలికారు. భర్త రాజ్ కుంద్రా, పిల్లలు వియాన్, సమీషా, సోదరి షమితా శెట్టి, తల్లి సునందతో కలిసి ఇష్టదైవం హారతి ఇచ్చి, గణపతిబప్పా మోరియా అంటూ ఆనందోత్సాహాల మధ్య వీడ్కోలు పలికారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) "మా గన్ను రాజాకు వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదు, అత్యంతభక్తి, ప్రేమతో నిండి ఉన్నాం. కానీ భారమైన హృదయాలతో వీడ్కోలుపలుకుతున్నాం, వచ్చే ఏడాది మిమ్మల్ని స్వాగతించేందుకు ఎదురు చూస్తూ..’’ అంటూ శిల్పా ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్శిల్పాశెట్టి ఘనంగా నిర్వహించిన గణపతి వేడుకలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్,ఆమె భర్త జాకీ భగ్నానీ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
Madhya Pradesh: మరో దారుణం.. అశ్లీల వీడియో చూసి..
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం చోటుచేసుకుంది. 34 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి, నగ్నంగా డ్యాన్స్ చేయమని ఒత్తిడి చేసిన ఐదుగురిపై కేసు నమోదైంది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను ఓ పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 19 రోజుల తర్వాత ఈ కేసు నమోదైంది. మహిళ ఫిర్యాదును పరిశీలించి, 90 రోజుల్లోగా పరిష్కరించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జూన్ 11న టీవీలో పోర్న్ వీడియో చూసి, తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, నిందితులు తనను బలవంతంగా గోదాంనకు తీసుకెళ్లారని కనాడియా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది.నిందితులు తనను బెల్ట్తో కొట్టారని, అరగంట పాటు బలవంతంగా నగ్నంగా డ్యాన్స్ చేయించారని మహిళ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు ఆ పోలీసు అధికారి తెలిపారు. బాదితురాలి ఐదుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను అరెస్టు చేయనున్నామని కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) అభినయ్ విశ్వకర్మ విలేకరులకు తెలిపారు. విచారణలో లభించిన సాక్ష్యాల ఆధారంగా ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.దీనికి ముందు తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ తాను జూలై 17న కనాడియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అయితే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని 90 రోజుల్లోగా పరిష్కరించి తగిన చర్యలు తీసుకోవాలని కనాడియా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ని ఆగస్టు 14న కోర్టు ఆదేశించింది. ఇదిలావుండగా బీజేపీ ఒత్తిడితో మహిళ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేశారని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నీలభ్ శుక్లా ఆరోపించారు. ఈ ఆరోపణలను రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా తోసిపుచ్చారు. నిందితులు ఎవరైనప్పటికీ భాజపా ప్రభుత్వ హయాంలో బాధితురాలికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని సలూజా అన్నారు. -
చినుకు తెచ్చిన సంబరం : ఒళ్ళంతా తుళ్ళింతే! వైరల్ వీడియో
మబ్బొచ్చినా, వానొచ్చినా తొలుత పులకించిపోయేది రైతన్నే. బీటలు వారిన నేలన నాలుగు చినుకులు పడినప్పుడు రైతు గుండె ఉప్పొంగి పోతుంది. వర్షపు దాహం తీరిన మట్టి చిందించే పరిమళానికి ఉత్సాహంగా చిందులేస్తాడు. గుజరాత్లోని కచ్లోని ఒక ప్రాంతంలో సరిగ్గా ఇదే జరిగింది. జోరుగా కురిసిన వాన ప్రవాహంలో పరిపూర్ణ ఆనందంతో తండ్రీ కొడుకులు ఆనందంతో చిందులు వేశారు. అచ్చమైన రైతులా తండ్రి, అతనికి తోడుగా కొడుకు కూడా చేరాడు. ఇద్దరూ కలసి చేసిన అచ్చం లగాన్ సినిమాలో లాగా చేసిన గుజరాతీ సంప్రదాయ నృత్యం ఇంటర్నెట్లో హృద్యంగా నిలిచింది. రోనక్ గజ్జర్ అనే జర్నలిస్టు ఎక్స్లోదీన్ని పోస్ట్ చేశారు. The father and son demonstrated their joy by performing a traditional dance in a field, as the semi-arid region of Kutch experienced substantial rainfall.#Gujarat #Monsoon pic.twitter.com/HTPTJ2D8Qr— Ronak Gajjar (@ronakdgajjar) July 23, 2024 -
రవీంద్రభారతిలో ఆకట్టుకున్న కాకతీయం నృత్య రూపకం (ఫొటోలు)
-
డ్యాన్స్ చేస్తే ఆ వ్యాధులు రావు! పరిశోధనలో షాకింగ్ విషయాలు
జిమ్కి వెళ్లడం అనేది చాలా శ్రమతో కూడిన పని. పైగా వర్కౌట్లు, యోగా వంటివి కొన్ని రోజులు చేసి వదిలేస్తాం. అదే డ్యాన్స్ అనంగానే కాస్త ఉత్సాహంగా ఆనందంగా చేస్తాం. శ్రమగా కూడా భావించం. ఒక్కసారిగా బాధలన్నీ మరిచిపోయి కాసేపు తేలికైపోతాం. అలాంటి డ్యాన్స్ని చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చట. అంతేగాదు కొన్ని రకాల రుగ్మతల నుంచి బయటపడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. బాడీ ఫిట్నెస్ కోసం నృత్యానికి మించిన వర్కౌట్ లేదని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం.నృత్యం చేసినప్పుడు శరీరాన్ని కదిలించడమే గాక మెదడుకు పని కల్పిస్తుంది. దీంతో మెదడుకు ఓ చక్కని వ్యాయామం అందుతుంది. నృత్యంలో బ్యాలెన్స్కి, కొన్ని స్టెప్లు గుర్తుంచుకునేందుకు తగ్గట్టుగా మెదడులో షార్ప్గా అవ్వడం మొదలవుతుందని న్యూరో సర్జర్ ఆదిత్య గుప్తా చెబుతున్నారు. నృత్యం మనసును ఏకాగ్రతతో వ్యవహరించేలా చేస్తుంది. జ్ఞాపకశక్తికి వ్యాయామంగా ఉంటుంది. బీట్లకు తగ్గట్టు కాళ్లు, చేతులు తిప్పేలా మల్టీ టాస్క్ చేస్తారు. ఇది అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పార్కిన్సన్స్తో బాధపడుతున్న రోగులకు డ్యాన్స్ చికిత్సగా కూడా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే..? ఇది చూస్తూ.. వింటూ అనుకరిస్తూ తన శరీరాన్ని కదుపుతుంటారు కాబట్టి..నెమ్మదిగా బ్రెయిన్ ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఇది అధ్యయనంలో కూడా తేలింది. అంతేగాదు వృద్ధులపై జరిపిన అధ్యయనంలో కూడా మెరుగరైన ఫలితాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి చెక్ పెడుతుంది..డ్యాన్స్ ఒత్తడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎండార్ఫిన్ల విడుదల ద్వారా మానసిక స్థితిని మెరుగుపరిచి మంచి అనుభూతిని కలిగించేలా చేస్తుంది. డ్యాన్స్ మూవ్మెంట్లు డిప్రెషన్, యాంగ్జయిటీని తగ్గిస్తుంది. జీవన నాణ్యత, వ్యక్తుల మధ్య అభిజ్ఞా నైపుణ్యాలను పెంచుతుందని పరిశోదన పేర్కొంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..ఆరోగ్యంగా దృడంగా ఉండేందుకు బెస్ట్ వర్కౌట్ డ్యాన్స్. రెగ్యూలర్ డ్యాన్స్ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. నృత్యం శ్యాసకోశ వ్యవస్థను కూడా మెరుగ్గా ఉంచుతుంది. బరువు నిర్వహణలో సహాయపడుతుంది బాడీ మంచి ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచింగ్ ఉండేందుకు ఉపకరిస్తుంది. ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.(చదవండి: రాయల్ సెల్ఫీ: వందేళ్లక్రితమే భారత్లో సెల్ఫీ ఉందని తెలుసా..!) -
లోకల్ టాలెంట్ కాదు అమెరికాస్ గాట్ టాలెంట్
కాళ్ల కింద రెండు గ్లాసులు, తల మీద గ్లాస్పై గ్లాస్ పద్దెనిమిది గ్లాస్లు పెట్టుకొని వాటిపై కుండ పెట్టుకొని రెండడుగులు వేయడమే కష్టం. అలాంటిది డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు కదా! రాజస్థాన్కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ నిన్న మొన్నటి వరకు లోకల్ టాలెంట్. ఇప్పుడు మాత్రం అమెరికాస్ గాట్ టాలెంట్. ఫోక్ డ్యాన్సర్ అయిన ప్రవీణ్కు అమెరికాస్ గాట్ టాలెంట్ (ఏజీటి)లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని ‘స్టాండింగ్ ఒవేషన్’ అందుకున్నాడు. కాళ్ల కింద 2 గ్లాసులు(డ్యాన్స్ ప్రారంభంలో) తల మీద 18 గ్లాస్లు వాటిపై ఒక కుండతో ప్రవీణ్ చేసిన ‘మట్కా భవ’ డ్యాన్స్ ఆడిటోరియంను ఉర్రూతలూగించింది. ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
టాలీవుడ్ నటి మెహందీ వేడుక.. డ్యాన్స్తో ఇరగదీసిన ఆమె తండ్రి!
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్కుమార్ తన ప్రియుడిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను కలిసిన తన పెళ్లికి ఆహ్వానించింది. టాలీవుడ్ హీరోలకు సైతం పెళ్లి పత్రికలు అందజేసింది. ఆమె వివాహా వేడుక థాయ్లాండ్లో జరుగుతోంది. జూలై 2న వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారు.తాజాగా వీరి మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆమె తండ్రి శరత్కుమార్ డ్యాన్సు వేస్తూ సందడి చేశారు. మెహందీ వేదిక వద్దే అతిథులతో కలిసి శరత్కుమార్ డ్యాన్సుతో అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. హనుమాన్ చిత్రంలో మెరిసిన వరలక్ష్మి ఈ ఏడాది మార్చిలో ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్తో నిశ్చితార్థం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Radikaasarath_love❤️ (@virad_15) -
తమన్న పాటలకు రాజేష్ స్టెప్పులు
-
Fathers Day 2024: కన్నా... నేనున్నా
తల్లి ఎదురుగా ఉంటే ఎంతమంది ఉంటే మాత్రం ఏమిటి? సంప్రదాయ నృత్య దుస్తులు ధరించిన అమ్మాయి భయం భయంగా స్టేజీ ఎక్కింది. ఎదురుగా ఎంతోమంది జనం. తన వైపే చూస్తున్నారు. ‘భయపడవద్దు’ అన్నట్లుగా సైగ చేసింది తల్లి. అంతేకాదు...మ్యూజిక్ స్టార్ట్ కాగానే డ్యాన్స్ స్టెప్స్ను ఆటిస్టిక్ కుమార్తెకు చూపెట్టడం మొదలుపెట్టింది. స్టేజీ ముందు ఉన్న తన తల్లిని నిశితంగా గమనిస్తూ అందంగా, అద్భుతంగా డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయి. ‘స్పెషల్–నీడ్స్ చిల్డ్రన్ ఆలనా పాలనకు ఎంతో ఓపిక, అంకితభావం కావాలి. అవి ఈ తల్లిలో కనిపిస్తున్నాయి’ అని నెటిజనులు స్పందించారు. అపర్ణ అనే యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
మంత్రి సీతక్క గిరిజన డ్యాన్స్
-
డ్యాన్సమ్నాస్టిక్
నృత్య ప్రదర్శనలో ఆకట్టుకునే అందమైన డ్రెస్ అనేది కామన్. ఆర్షియా మాత్రం భయపెట్టే డ్రెస్తో, హారర్ లుక్తో స్టేజీ మీదికి వచ్చింది. ‘ఇదేం లుక్కు బాబోయ్’ అనుకునేలోపే తన అద్భుత నృత్యప్రతిభతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ టీవీ షో న్యాయనిర్ణేతలు ‘వావ్’ అనుకునేలా చేసింది. జమ్మూ కశ్మీర్కు చెందిన 13 ఏళ్ల ఆర్షియా శర్మ స్వదేశం దాటి వేరే దేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ ఇంటర్నేషనల్ షోలో ΄ాల్గొనడానికి ముందు ఆర్షియా శర్మ లిటిల్ మాస్టర్స్, సూపర్ డ్యాన్సర్ 4 లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతర్జాతీయ వేదికపై చప్పట్లతో ‘ఆహా’ అనిపించుకున్న ఆర్షియా ప్రత్యేకత ఏమిటి... అనే విషయానికి వస్తే....డాన్స్కు జిమ్నాస్టిక్స్ జోడించి ‘వారెవ్వా’ అనేలా చేసింది. ఆర్షియ ‘డ్యాన్సమ్నాస్టిక్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
పుష్ప పాటకు RGV డ్యాన్స్
-
సీన్ హై జపానీ..సినిమా హై హిందుస్థానీ
భారతీయ సినిమా పాటలకు విదేశీయులు డ్యాన్స్ చేయడం కొత్త కాదు. అయితే జపాన్లో మాత్రం బాలీవుడ్ హిట్ సినిమాల ఐకానిక్ సీన్లను రీక్రియేట్ చేసే కొత్త ట్రెండ్ మొదలైంది. బాలీవుడ్ మూవీ ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ (కె3జి)లో అంజలిగా కాజోల్, రాహుల్గా షారుఖ్ ఖాన్ నటించారు. రాహుల్, అంజలి వేషధారణలో జపనీస్ ఇన్ఫ్లూయెన్సర్లు మాయో, కకే టకులు ‘కె3జి’లోని ‘బడే మజాకీ హో’ కామెడీ సీన్ను రీక్రియేట్ చేశారు. ‘లెర్నింగ్ హిందీ ఇన్ 2024 ఈజ్ లైక్ బడే మజాకీ హో’ కాప్షన్తో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. హిందీలో ్రపావీణ్యం సంపాదించిన మాయో, కకే టకుల లిప్ సింక్ బాగా కుదిరింది. ‘క్రాస్–కల్చరల్ అడ్మిరేషన్ అనేది భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒక గొడుగు కిందికి తీసుకువస్తుంది. పర్యాటక ఆసక్తి పెంచుతుంది’... లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వచ్చాయి. -
డల్లాస్లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్లో నృత్య, నటన, శిక్షణ శిబిరం నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక అవర్ కిడ్స్ మాంటిస్సోరిలో రోబో గణేశన్ నృత్య, నటన శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. ఈ శిక్షణా శిబిరంలో 20 మందికి పైగా పిల్లలు, పెద్దలు పాల్గొని రోబో డాన్స్, మైమింగ్, నటన, యానిమల్ మూవ్స్, రాంప్ వాక్, డాన్స్ మూవ్స్, వాయిస్ యాక్టింగ్ లాంటి పలు విభాగలలో శిక్షణ పొందారు. ఎంతో మంది ఔత్సాహికులు ఈ శిక్షణా శిబిరంలో నృత్యం, నటనలోని మెళుకువలు నేర్చుకున్నారు. తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నారు.. ఈ శిక్షణ శిబిరాన్ని చక్కగా నిర్వహించిన రోబో గణేశ్ని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన డల్లాస్ చాప్టర్ కో-కోఆర్డినేటర్ రవి తాండ్ర, ఈవెంట్ కోఆర్డినేటర్ కిశోర్ నారేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారాన్ని అందించిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డీవీ ప్రసాద్, ఇతర డల్లాస్ కార్యవర్గ సభ్యులు శ్రవణ్ కుమార్ నిదిగంటి, శ్రీనివాస్ ఉరవకొండ, స్వప్న కాట్రగడ్డ, సత్య శ్రీరామనేని, తదితరులను బాపు నూతి ప్రత్యేకంగా ప్రశంసించారు. డల్లాస్లో తెలుగువారి కోసం ఇంత చక్కటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన డల్లాస్ నాట్స్ విభాగ సభ్యులకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!) -
ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ హీరో గోవిందా తళుక్కున మెరిశారు. దశాబ్దకాలం తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ఆయన మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. శివసేన స్టార్ క్యాంపెయినర్గా పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. గోవిందా ఎన్నికల ప్రచార వేదికపై డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.ఆయన డ్యాన్స్ను చూసిన శివసేన నేతలు కూడా ఉత్పాహంగా ఆయనతోపాటు కాలు కదుపుతున్నారు. గోవిందా స్టైల్, ఉత్సాహం మునుపటిలానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2004లో ముంబై నార్త్ లోక్సభ స్థానం నుంచి గోవిందా కాంగ్రెస్ టిక్కెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి, బీజేపీ సీనియర్ నేత రామ్ నాయక్ను ఓడించారు. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.चुनाव प्रचार के बीच गोविंदा का जोरदार डांस◆ एक्टर को डांस करता देखकर वहां मौजूद जनता और बाकी नेता भी झूम उठे#Govinda #ActorGovinda #Maharashtra pic.twitter.com/Zdugpko9Zp— News24 (@news24tvchannel) May 9, 2024Video Credits: News24తాజాగా గోవిందా గత మార్చి లో శివసేనలో చేరారు. ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేరినప్పటి నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి గోవిందా లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా అనేది ఖరారు కాలేదు. అయితే ముంబై నార్త్వెస్ట్ నుంచి ఆయనను శివసేన ఎన్నికల బరిలోకి దింపవచ్చనే టాక్ వినిపిస్తోంది. -
Viral Video: జాబ్ మానేసి.. మేనేజర్ ముందు తీన్మార్ డ్యాన్స్లు
ఈ రోజుల్లో ఉద్యోగం రావడం అంటే చాలా కష్టం.. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా.. దానిని నిలబెట్టుకోవాలంటే కత్తిమీద సాము లాంటిది. ఉద్యోగంలో ఒత్తిడి, సరిపోని జీతం, సమయ వేళలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని భరించలేక ఉద్యోగం మానేస్తుంటారు. ఉన్న ఉద్యోగం పోయినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. కానీ మహారాష్ట్రలో ఓ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి జాబ్ మానేసి, ఆఫీసు ఎదుట డ్యాన్స్ చేసి మరి ఎంజాయి చేశాడు. ఈ ఆశ్యర్యకర ఘటన పుణెలో వెలుగుచూసింది. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ వ్యక్తి తన మాజీ మేనేజర్కు విచిత్రంగా విడ్కోలు పలికారు. బ్యాండ్ను ఆఫీస్ వద్దకు పిలిపించి బాస్ ముందు తీన్మార్ స్టెప్పులు వేశారు. తోటి ఉద్యోగులకు విచిత్రంగా తన రాజీనామా విషయాన్ని తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టుచేయగా వైరల్గా మారింది. పూణేకు చెందిన అనికేత్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఓ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అయితే ఆ జాబ్లో ఒత్తిడి, సీనియర్ల నుంచి వచ్చే వేధింపులు, సరిపడని జీతంతో తీవ్రంగా సతమతం అయ్యాడు. చివరికి ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇక తన చివరి వర్కింగ్ డే రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించాలనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాడు.ఆఫీస్ వద్దకే బ్యాండ్ను తీసుకువచ్చి.. డ్యాన్స్ చేశాడు. మేనేజర్ బయటకు వచ్చే దాకా అక్కడే ఉండి, అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘సారీ సర్ బాయ్ బాయ్’ అంటూ ఆనందంగా స్టెప్పులేశాడు. ఊహించని పరిణామానికి ఆ కంపెనీ మేనేజర్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో వైరలవ్వడంతో చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. తాము కూడా ఉద్యోగంలో ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. అనికేత్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఉద్యోగం మానేసిన అనికేత్ జిమ్ ట్రైనర్ కావాలని ప్రయత్నిస్తున్నట్లు అతని స్నేహితుడు భగత్ తెలిపారు. View this post on Instagram A post shared by Anish Bhagat (@anishbhagatt) -
జగనన్న పాటకు విశాఖ మహిళలు మాస్ డాన్స్
-
డీజే రాజయ్య
-
జగనన్న పాట పాడి..డాన్స్ తో అదరగొట్టిన సీదిరి అప్పలరాజు
-
సీఎం జగన్ పాటకు ఫ్లాష్ మాబ్..
-
స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే జపాన్లో సందడి చేసి తిరిగొచ్చారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం మహేశ్బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి తనలోని మరో టాలెంట్ను బయటకు తీస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికెళ్లినా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇటీవలే ఓ పెళ్లిలో సతీమణి రమతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రిహార్సల్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. 'అందమైన ప్రేమరాణి చేయి తలిగితే' అనే పాటకు అంటూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు దర్శకధీరుడు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. SS Rajamouli Dance 👌 pic.twitter.com/hkdfxPWq1Q — Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024 -
తగ్గేదేలే..జగనన్న పాటకు అవ్వ డాన్స్
-
జగన్ పాటకు.. మహిళల డ్యాన్స్
-
అవిభక్త కవలలకు వివాహం.. వరుడెవరంటే..
అమెరికాకు చెందిన అవిభక్త కవలలు (కంజోయిన్డ్ ట్విన్స్)అబ్బి, బ్రిట్నీ హెన్సెల్లు రిటైర్డ్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకుని ముఖ్యాంశాలలో నిలిచారు. 1996లో ‘ది ఓప్రా విన్ఫ్రే షో’లో కనిపించి, ఇద్దరూ తొలిసారి వెలుగులోకి వచ్చారు. తాజాగా ఈ అవిభక్త కవలలు అమెరికా ఆర్మీ రిటైర్డ్ అధికారి జోష్ బౌలింగ్ను వివాహం చేసుకున్నారు. బ్రిట్నీ హాన్సెల్ ఫేస్బుక్ ప్రొఫైల్లో వారి పెళ్లి ఫొటో ప్రత్యక్షమయ్యింది. దానిలో పెళ్లి దుస్తుల్లో ఈ అవిభక్త కవలలు జోష్ బౌలింగ్ ముందు నిలబడి అతని చేతిని పట్టుకోవడాన్ని చూడవచ్చు. ఈ కవల సోదరీమణులు ప్రస్తుతం ఐదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వీరు వీరి స్వస్థలమైన మిన్నెసోటాలో నివసిస్తున్నారు. మరోవైపు జోష్ బౌలింగ్ ఫేస్బుక్ పేజీలో అతను ఆ అవిభక్త కవలలకు ఐస్ క్రీం అందిస్తున్న ఫొటోలు, వెకేషన్ ఫోటోలు ఉన్నాయి. వీరి వివాహానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. దానిలో వారు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అబ్బి, బ్రిట్నీ హెన్సెల్ల శరీరం కలసిపోయివుంటుంది. అబ్బి కుడి చేయి , కుడి కాలును నియంత్రిస్తుండగా, బ్రిట్నీ ఎడమ వైపు అవయవాలను నియంత్రిస్తుంది. -
అంబటి రాంబాబు హోలీ డాన్స్
-
ఉత్తరాఖండ్ సీఎం హోలీ డ్యాన్స్ - వీడియో
దేశంలో హోలీ సంబరాలు మొదలైపోయాయి. సాధారణ ప్రజల మాదిరిగానే.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 'పుష్కర్సింగ్ ధామి' కూడా తన కుటుంబ సభ్యులతో హోలీ జరుపుకున్నారు. తన తల్లి విష్ణదేవి, భార్య గీతా ధామితో కలిసి హోలీ పాటకు డ్యాన్స్ చేశారు. హోలీని ప్రేమ, సోదరభావం, సామరస్యానికి సంబంధించిన వేడుకగా సీఎం పుష్కర్సింగ్ ధామి అభివర్ణించారు. ఉత్తరాఖండ్లో హోలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆయన అన్నారు. సీఎం ధామి హోలీ జరుపుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి హోలీ రేపు (మార్చి 25) జరగాల్సి ఉండగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభించారు. పండుగ ముందు హోలికా దహన్ పేరుతో భోగి మంటలను వెలిగించే ఆచారం ఉంటుంది. ఇది హోలికా అనే రాక్షసిని దహనం చేసే కార్యక్రమం. ఆనందోత్సాహాల మధ్య, సాంప్రదాయ స్వీట్లు పంచుకుంటారు, ప్రజలలో స్నేహం, ఐక్యత భావాన్ని ఈ పండుగల ద్వారా పెంపొందించుకుంటారు. #WATCH | Dehradun | On the occasion of Holi, Uttarakhand Chief Minister Pushkar Singh Dhami dances to a Holi song with his mother Vishna Devi, wife Geeta Dhami and others. pic.twitter.com/p8JeSNSm8A — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 24, 2024 -
ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల పైత్యం : మండిపడుతున్న నెటిజన్లు
దేశవ్యాప్తంగా హోలీ వాతావరణం వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రదేశాల్లో హోలీ సంబరాలు ఊపందు కున్నాయి. అయితే ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకున్న ఘటన ఒకటి వివాదాన్ని రాజేసింది. ఇద్దరు అమ్మాయిలు అభ్యంతరకరంగా హోలీ ఆడటం విమర్శలకు తావిచ్చింది. విషయం ఏమిటంటే..దేశ రాజధాని నగరానికి తలమానికంగా పేరొందిన ఢిల్లీ మెట్రో ప్రతిసారీ ఏదో ఒక కారణంతో హెడ్ లైన్స్ లోకి వస్తుంది. అమ్మాయిలు పోల్ డ్యాన్స్, జంటల అశ్లీల వీడియోలు, రీళ్లు తయారు చేయడం, సెల్ఫీలతో వివాదాన్ని రేపడం పరిపాటిగా మారిపోయింది. దీనికి సంబంధించి డిఎంఆర్సి అనేక చట్టాలు చేసినా ప్రజలు పాటించడం లేదు తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు అసభ్యకరంగా హోలీ ఆడారు. వీరు తెల్లటి చీరలు సూట్లు ధరించి, నడుస్తున్న మెట్రోలో ఒకరికొకరు రంగులను పూసుకుంటూ హోలీ ఆడారు. డాన్స్ చేశారు. పవిత్ర హోలీని అవమనాపరుస్తూ, బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్కు అభినయిస్తూ, ఒకర్ని ఒకరు తాకుతూ, మెట్రోలో బహిరంగంగా, అభ్యంతకరంగా ప్రవర్తించారంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని గమనించిన తోటి ప్రయాణీకులు రెచ్చగొట్టే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా యూజర్ ఒకరు దీన్ని ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారు. ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు, విమర్శలుగుప్పిస్తున్నారు.దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఇది సరైంది కాదు అంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్లో చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. We need a law against this asap pic.twitter.com/3qH1aom1Ml — Madhur Singh (@ThePlacardGuy) March 23, 2024 -
అలా పట్టించుకోకుండా వెళ్లిపోతే ఎలా? : హిల్లేరియస్ వీడియో వైరల్
నెమలి మన జాతీయ పక్షి. అందమైన అపురూపమైన పక్షి. ఆడ నెమలిని ఇంప్రెస్ చేసేందుకు మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది. గున గున అడుగులేస్తూ ఆడ నెమలి వెంట తిరుగుతుంది. ఈ నాట్యం చేసేటప్పుడు తన పింఛాన్ని చుట్టూ వృత్తం లాగా చేస్తుంది. ఒక్కోసారి విసినకర్రలా వంచి అందంగా నాట్యం చేస్తుంది. ప్రేయసి సంతృప్తి చెంది, చెంతక చేరేదాకా మగ నెమలికి ఈ తిప్పలు తప్పవు. అకస్మాత్తుగా మబ్బులు కమ్మేసి, చినుకులు పడినపుడు, ప్రధానంగా వడగళ్లు పడినపుడు సంతోషంతో పింఛంతో మగ నెమలి చేసే నాట్యం వర్ణశోభితంగా, అత్యంత రమణీయంగా ఉంటుంది కదా. తాజాగా గ్రేట్ ఆర్గస్ నెమలి ఆడ నెమలిని ఆకట్టుకునేందుకు పాట్లు, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో దాదాపు 30 లక్షలకు పైగా వ్యూస్ను సాధించడం విశేషం. వాస్తవానికి ఈ వీడియో 2021లో ఫ్లోరిడాలోని బే లేక్లోని డిస్నీస్ యానిమల్ కింగ్డమ్లోని మహారాజా జంగిల్ ట్రెక్లో తీసింది. ఇపుడు మళ్లీ సందడి చేస్తోంది. ఈ తతంగం అంతా చూసి నెటిజన్లు చతురోక్తులతో స్పందిస్తున్నారు. ఇంత చేసినా అలా వెళ్లిపోతే ఎలా అంటూ ఫన్నీ కమెంట్లు పెడుతున్నారు. A male Pheasant is trying to impress her but she is not impressed! 😂 pic.twitter.com/dqfAj2icz4 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 20, 2024 An incredible leucistic peacock! (Video Laurel Coons) pic.twitter.com/H0eO6ID6TM — Natural Science & History (@joehansenxx) March 20, 2024 This is so so beautiful 🦚🥰😍 pic.twitter.com/XHwbmH5lUC — Aisha Abbasi (@aisha_FCB) March 20, 2024 -
డ్యాన్స్ చేస్తే గుండెపోటు వస్తుందా? ఎందుకిలా పిట్టల్లా రాలిపోతున్నారు!
ఏదైనా వేడుక, జాతర, పెళ్లిళ్లలో జరిగే బారత్లోనూ అంతా జోషఫుల్గా డ్యాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇలా చేయడమే శాపంగా మారి చివరికి ఆ వేడుక/పెళ్లి కాస్త విషాదంగా ముగుస్తుంది. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన పలు ఘటనలు ఎక్కువయ్యాయి కూడా. అసలు ఇలాంటి వేడుకల్లో ఆనందంగా డ్యాన్స్లు చేసి..చిన్నా, పెద్దా పిట్టల్లా రాలిపోతున్నారు. బతికించుకునే ఛాన్స్ కూడా దొరకడం లేదు. చెప్పాలంటే డీజేలాంటి మ్యూజిక్లు పెట్టుకుని ఎంజాయ్ చేద్దామంటేనే భయం వేస్తోంది. అసలెందుకు ఈ పరిస్థితి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని డ్యాన్స్లు చేయాలి?. ఎంత మేర మ్యూజిక్ వింటే బెటర్ తదితరాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం!. ఎన్ని ఘటనలు జరిగాయంటే.. ఇంతవరకు ఇలాంటి విషాదకర ఘటనుల గతేడాది నుంచి వరుసగా చోటు చేసుకున్నాయి. గతేడాది అక్టోబర్లో గుజరాత్లో గార్భా డ్యాన్స్ చేస్తూ ఏకంగా 10 మంది చనిపోయారు. అది మరువక ముందే అదే ఏడాది తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు తన బంధువు పెళ్లిలో డ్యాన్య్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు. అలాగే గతేడాది మార్చి4న బిహార్లో సీతామర్హి నివాసి 22 ఏళ్ల సురేంద్ర కుమార్ వేదికపై దండలు మార్చుకుని నవ వధువుతో కూర్చొని ఉండగా.. ఆకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. బాధితుడు చనిపోవడానకి ముందు డీజే సౌండ్ అసౌకర్యంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అదేలాంటి విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఓదెల మండలం కొలనూర్లో చోటు చేసుకుంది. రావు విజయ్కుమార్(33) అనే యువకుడు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఇలా చనిపోయినవారంతే యువకులు. చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎందుకు జరుగుతోందంటే..? ఏదైన ఉత్సవం, పెళ్లి వేడుకలో జనాల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్టు డీజే మ్యూజిక్ లాంటివి పెద్దగానే పెడతారు. ఆ చుట్టూ ఉన్న జనాలు, ఆ మ్యూజిక్కి, ఉత్సాహం వచ్చి.. చిన్నా, పెద్దా, కాలు కదిపి చిందులు వేసేందుక రెడీ అయిపోతారు. దీంతో అక్కడుండే వాళ్లు మరింత ఉత్సాహంతో సౌండ్ పెంచేస్తుంటారు. ఇక డ్యాన్స్ చేసేవాళ్లు చుట్టూ ఉన్నజనం ఎంకరైజ్మెంట్, ఈలలను చూసి మరింతగా డ్యాన్స్ చేస్తుంటారు. దీంతో శరీరం అలసటకు గురై గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంటుంది. ఇదేం పట్టించుకోకుండా ఆయా వ్యక్తులు శక్తికి మించి డ్యాన్స్లు చేసి కుప్పకూలి చనిపోవడం జరిగిపోతుంది. ఆ తర్వాత వైద్యులు గుండెపోటు లేదా గుండె ఆగిపోవడంతో చనిపోయారని ధృవీకరిస్తున్నారు. డ్యాన్స్ వల్ల వస్తుందా అంటే..? శరీరం బాగా అలిసిపోయేలా డ్యాన్స్ చేస్తే గుండెపోటు రావడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే..? అప్పటికే శరీరంలో గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఉంటాయి. ఎప్పుడైతే ఇలా అలసిపోతారు ఆ రక్త సరఫరా వేగం ఎక్కువ అవుతుంది. అది కాస్త గుండెపై ఒత్తిడి ఏర్పడి ఆగిపోవడం లేదా ఆకస్మికంగా రక్తం గడ్డకట్టి గుండె పోటు వచ్చి కుప్పకూలిపోవడం జరుగుతుంది. అందువల్ల శరీర సామర్థ్యానికి మించి డ్యాన్స్లు వంటివి చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు మ్యూజిక్ వల్ల కూడా వస్తుందా..? భారీ శబ్దాలు వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే! చెబుతున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు యూరోపియన్ హార్ట్ జర్నల్లో వెల్లడించారు. పెద్ద పెద్ద శబ్దాల వద్ద గుండె వేగంలో పెరుగుతున్న మార్పులను గుర్తించామని అన్నారు. ఈ బిగ్గర శబ్దాల కారణంగా వ్యక్తుల్లో గుండె దడ, స్ట్రోక్లు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని పేర్కొన్నారు. మానవ చెవికి 60 డెసిబుల్స్ వరకు సాధారణమని వైద్యులు చెబుతున్నారు. నిజానికి ఆహ్లాదకరమైన వాయిస్ లేదా శబ్దాన్ని వినగానే కేవలం చెవితోనే వినం. హృదయంతో ఆస్వాదిస్తాం. ఇది తెలియకుండానే జరుగుతుంది. సంగీతంతో కొన్ని జబ్బులు నయం చేయడం అనే పురాతన వైద్యం ఇందులోనిదే. భయోత్సాహమైన సౌండ్లతో సాగే మ్యూజిక్ తరంగాలు కారణంగా మన శరీరంలో ఒక రకమైన ఆందోళనకు గురవ్వుతుంది. అది నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఏవిధంగా మంచి సంగీతం హృదయాన్ని హత్తుకుని గుండె పదిలంగా ఉండేలా చేస్తుందో.. అదే మ్యూజిక్ మోతాదుకు మించితే గుండెకి డేంజరే అని అరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!) -
అవ్వ డప్పుకు అడుగు కదిపిన సీతక్క
-
తాత తగ్గేదేలే..
-
'ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని అస్సలు చేయను'..స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ గురించి తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది చంద్రముఖి-2 అలరించిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఇందిరాగాంధీ ప్రధాని ఉన్న సమయంలో విధించిన ఎమర్జన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా పెట్టిన తాజా పోస్ట్ వైరల్గా మారింది. తనకు తాను లతా మంగేష్కర్తో పోల్చుకున్న కంగనా.. డబ్బుల కోసం సెలబ్రిటీల వివాహాల్లో డ్యాన్స్ చేయనని తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్పై నెట్టింట చర్చ మొదలైంది. తనకు డబ్బుల కంటే.. ఆత్మ గౌరవమే ముఖ్యమని తెలిపింది. కాగా.. స్టార్ సింగర్ లతా మంగేష్కర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంత డబ్బిచ్చినా పెళ్లిళ్లలో పాడనని చెప్పారు. అయితే ఇటీవల అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు డ్యాన్స్లు వేస్తూ కనిపించారు. అంతే కాదు ఈ వేడుకల్లో డ్యాన్స్ చేసినందుకు భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కంగనా వారిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కంగనా చేసిన పోస్ట్కు కొందరు నెటిజన్స్ మద్దతుగా నిలవగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. -
దటీజ్ తలైవర్! జపాన్ తాతగారి ఆట, పాట.. వైరల్ వీడియో
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్కి పెట్టింది. ప్రతీ సినిమాలోనూ తన మార్క్ డైలాగ్గానీ, స్టయిల్ గానీ క్రియేట్ చేస్తాడు. ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు. చిన్నపిల్లల్ని దగ్గరనుంచి, పండు ముదుసలి దాకా ఆయన స్టయిల్కు ఫిదా అవ్వాల్సిందే. జపాన్ కంపెనీ మిత్సుబిషి ఎగ్జిక్యూటివ్, 77 ఏళ్ల పెద్దాయన చేసిన డ్యాన్స్ చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. విషయం ఏమిటంటే.. మిత్సుబిషి కార్పొరేషన్ లిమిటెడ్కు చెందిన కుబోకి శాన్ను ప్రత్యేక అతిథిగా పాండిచ్చేరి యూనివర్శిటీ ఆహ్వానించింది. ‘GLOBIZZ'24’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలా మాట్లాడుతూనే రజనీకాంత్ బ్లాక్బస్టర్ మూవీ ‘ముత్తు’లోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచాడు యేనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు’ అనే పాటకు తమిళ వెర్షన్ను పాడుతు డ్యాన్స్ చేస్తూ విద్యార్థును ఆశ్చర్యచకితుల్ని చేశాడు. విద్యార్థులు షాక్ అవ్వడమే కాదు, పాండిచ్చేరి యూనివర్శిటీలోని అడ్మినిస్ట్రేటర్లు , ప్రొఫెసర్లు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. (మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి! ) ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. జపాన్లో తలైవర్ క్రేజ్ అలాంటిది మరి అని కొందరు "వావ్. ..జపాన్కు చెందిన ఒక వ్యక్తి తమిళ పాడటం ఎప్పుడూ వినలేదు" అంటే మరొకరు కామెంట్ చేశారు.(ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్) కాగా రజనీకాంత్ నటించిన 'ముత్తు', 1995లో బాక్సాఫీస్ వద్ద 400 మిలియన్ల జపనీస్ యెన్లు( దాపు 23.5 కోట్లు) సాధించి జపనీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే ఈ రికార్డును రాంచరణ్; జూఎన్టీర్, రాజమౌళి కామలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2022లో 24 ఏళ్ల ఈ రికార్డ్ను బ్రేక్ చేసింది. (అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) At the age of 77, Mr. Kuboki San of Mitusubishi Corporation Ltd, Japan, at the GLOBIZZ'24 event conducted by Pondicherry University! He enthralled the MBA students with the Tamil Song from Rajnikanth starred movie "Muthu", which has been rocking in Japan since 1995! #Rajinikanth pic.twitter.com/ILG9WIkKie — Ananth Rupanagudi (@Ananth_IRAS) March 2, 2024 -
Vijay Devarakonda: కాలేజీ ఫంక్షన్లో మెరిసిన రౌడీ స్టార్, పూజా హెగ్డే (ఫోటోలు)
-
Rakul-Jackky Wedding : ఫస్ట్ వీడియో వచ్చేసింది, ఫ్యాన్స్ ఫిదా!
లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ మూడు ముళ్ల బంధంతో కపుల్గా మారిపోయారు. గోవాలో అత్యంత ఘనంగా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇపుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి సందడి కబుర్లే. రకుల్-భగ్నానీ వెడ్డింగ్ వేడుకుల వీడియోలు, ఫోటోలు కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో ఇప్పటికి ఈ జంట ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు మెహిందీ, సంగీత వేడుక వీడియోను బ్రైడ్స్ టుడేఇన్ ఇన్స్టా షేర్ చేసింది. ఇందలో తుం బినే సాంగ్కు వీరిద్దరూ స్టెప్పులేయడం ఫ్యాన్స్ను ఆకట్టుకుటోంది. View this post on Instagram A post shared by Brides Today (@bridestodayin) -
నాగ చైతన్య హీరోయిన్పై సమంత కామెంట్లు
సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ ఎంతో క్రేజ్, ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్లోనూ రాణిస్తున్నారు. అయితే మయోసైటిస్ వ్యాధి వల్ల ఏడాది పాటు సినిమాల నుంచి సమంత బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చినా ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు సమంత. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటున్న ఆమె మళ్లీ నటించడానికి సిద్ధం అంటూ ఇటీవల తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. హీరోయిన్ సాయిపల్లవిపై సమంత చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. సాయి పల్లవి హీరోయిన్ కాకముందు పలు డ్యాన్స్ షోలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. వాటిలో ఓ షోలో సాయి పల్లవి డ్యాన్స్ చేసిన ఓ ఎపిసోడ్కు సమంత జడ్జిగా వ్యవహరించారు. ‘‘సాయిపల్లవి మంచి డ్యాన్సర్ అనే విషయం నాకు తెలుసు. గతంలో తను పాల్గొన్న ఓ డ్యాన్స్ షోకి నేను జడ్జిగా కూడా వెళ్లాను. తను డ్యాన్స్ చేస్తుంటే దృష్టి మరల్చలేక కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయాను. తన డ్యాన్స్ అద్భుతం’’ అన్నారు. ఇలా తోటి హీరోయిన్పై ప్రశంసలు కురిపించిన సమంతపై ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే హిందీ వెబ్సిరీస్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు సమంత. నాగ చైతన్య తండేల్ సినిమాలో సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. -
'ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయా'.. నాగచైతన్య హీరోయిన్పై సామ్ కామెంట్స్!
హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్లో అగ్ర కథానాయకిగా రాణించిన ఈమె సినీ, వ్యక్తిగత జీవితాలు రెండు సంచలనమే. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత కొన్నేళ్లకే విభేదాలతో విడిపోయారు. అదే విధంగా కథానాయకిగా మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. ఇప్పుడుదాని నుంచి బయటపడటానికి శత విధాలుగా పోరాడుతున్నారు. ఈ కారణంగా సినిమాలను కూడా కోల్పోతున్నారు. కాగా తాజాగా వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. గతంలోనే అంగీకరించిన సిటాడెల్ అనే వెబ్సిరీస్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ వెబ్సిరీస్లో నటిస్తున్న సమయంలో ఒకసారి స్పృహతప్పి పడిపోయారు కూడా. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది మళ్లీ ఆ వెబ్సిరీస్ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. కాగా త్వరలోనే తాను నటించే నూతన చిత్రాల వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇటీవల ఆమె ఓ వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో ద్వారా విడుదల చేశారు. సాయిపల్లవిపై ప్రశంసలు మరో టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు. సాయిపల్లవి మంచి డాన్సర్ అన్న విషయం తనకు తెలుసన్నారు. గతంలో ఆమె పాల్గొన్న డాన్స్ కార్యక్రమం పోటీలకు తాను జడ్జిగా కూడా వెళ్లానన్నారు. అప్పుడు సాయి పల్లవి డాన్స్ను చూసి దృష్టి మరల్చలేక కళ్లప్పగించి చూస్తుండి అలాగే పోయానన్నారు. కాగా..ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సముద్ర జాలర్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తండేల్’ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెల్లడికానుందని సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
రష్యా డాన్స్ ఇంత అందంగా ఉంటుందా?
ఇంతవరకు ఎన్నో రకాల డ్యాన్స్లు చూసుంటారు. కానీ ఇలాంటి అద్భుతమై డ్యాన్స్ మాత్రం చూసి ఉండే అవకాశమే లేదు. కళ్లు ఆర్పడమే మర్చిపోయాలా చేస్తేంది ఆ నృత్యం. వావ్! ఎంత అద్భుతమైన డ్యాన్స్ అని అనుకుండా ఉండలేరు. ఎవరు చేశారు? ఎక్కడ అంటే.. డ్యాన్స్కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మహిళలు, పురుషుల సముహంతో కూడిన ఓ గ్రూప్ ఈ నృత్యాన్ని చేసింది. ఎంత అద్భుతంగా చేశారంటే..అలా చూస్తుండిపోతారు. అయ్యిపోయందా అని కూడా తెలియదు. ఏదో ఓ ట్రాన్స్లో తీసుకెళ్లిపోతుంది ఆ డ్యాన్స్. ఎవరు చేశారంటే..రష్యన్ వాసులు తమ సంప్రదాయం నృత్యంతో అలరించారు. చూసినవాళ్లు..రష్యా డ్యాన్స్ ఇంత అద్భుతంగా ఉంటుందా! అని ఆశ్చపోవడం మాత్రం ఖాయం. ఎంత బ్యాలెన్స్డ్గా అంతమంది జనం ఒకేసారి ఎంత బాగా చేశారబ్బా అనిపిస్తుంది. పెర్ఫామెన్స్ అంటే ఇది కదా!. ఎంతలా ప్రాక్టీస చేశారో గానీ చాలా అద్భుతంగా చేశారంతా. వారి డ్యాన్స్కి ఆ వేదికే అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఆ కూడా ఓ లుక్కేసేయండి. Another amazing skills from traditional Russian dance 😮 pic.twitter.com/0uebaS5LWS — Family Moments (@Family_viralvid) February 19, 2024 (చదవండి: అయింది వేలల్లో...వేసింది మాత్రం లక్షల్లో!) -
గిరిజనులతో కలిసి స్టెపులేసిన డీకే అరుణ
-
అలా ఆకాశంలో స్టెప్పేస్తున్నారు
-
'దమ్ మసాలా' సాంగ్కు సితార డ్యాన్స్..
-
భార్యతో స్టార్ హీరో డ్యాన్స్..
-
Pooja Kannan: కాబోయే భర్తతో తీన్మార్ డ్యాన్స్.. అక్కను మించిపోయిన సాయిపల్లవి చెల్లెలు
-
Ayodhya Ram Mandir: ఆహూతులను ఆకట్టుకున్న నృత్య, సంగీత ప్రదర్శనలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన నృత్య, సంగీత,నాటక ప్రదర్శనలు మంత్రిముగ్ధుల్ని చేశాయి. రామ చరితతోపాటు, 500 ఏళ్ల నుంచి రామ మందిర ప్రాణ ప్రతిష్ట వరకు జరిగిన విశేషాలను ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. ‘బధాయ్, చారీ, గూమర్, భవాయ్, ఝుమర్, ధోబియా, రాయ్, రస్లీల, మయూర్, ఖయాల్ నృత్యం, సతారియా’వంటి జానపద నృత్యాలతో కళాకారులు అమితానందం కల్గించారు. భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి, మణిపూరి, మోహని ఆట్టం, కథాకళి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాల ప్రదర్శనలు జరిగాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ప్రాణ ప్రతిష్ఠ ముగిసేదాకా ఈ నృత్య ప్రదర్శనలు జరిగాయి. సినీ, క్రీడా రంగ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ దిగ్గజాలు ఈ నృత్య, సంగీత, నాటక ప్రదర్శనలను సెల్ఫోన్లలో బంధించారు. చలనచిత్ర, సంగీత కళాకారులు బాల రాముడిపై అభిమానాన్ని పాటల రూపంలో చాటారు. ప్రముఖ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, సోను నిగమ్ ‘రామ్ భజన్’ చేశారు. అనురాధ పౌడ్వాల్, మాలినీ అవస్తీ ‘రామాష్టకం’తో అలరించారు. ‘రాం సియా రాం’ అంటూ సోను నిగం పాడిన పాట ఆకట్టుకుంది. -
ఆ విషయం డైరెక్టర్ చెప్పగానే వణికిపోయా.. గుంటూరు కారం హీరోయిన్!
దళపతి, తమిళ స్టార్ హీరో విజయ్తో జత కట్టే అవకాశం అంత సులభంగా రాదు. అలా వచ్చిందంటే ఆమె లక్కీ హీరోయినే. తాజాగా ఆ ఛాన్స్ గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరిని వరించింది. విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ఆల్ టైం(GOAT). ఈ చిత్రంలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అయితే తాజాగా విజయ్ చిత్ర షూటింగ్లో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. విజయ్తో కలిసి పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్తో కలిసి ఓ పాటకు డాన్స్ చేయనున్నట్లు దర్శకుడు ముందుగా చెప్పగానే నాకు దడ మొదలైందని అన్నారు. దీనికి కారణం ఆయన గొప్ప డాన్సర్ కావడమేనని పేర్కొన్నారు. అయితే విజయ్ మాత్రం తనతో చాలా ఉన్నతంగా నడచుకున్నారని చెప్పారు. ఆయనకు తాను కూడా వీరాభిమానిని అన్నారు గుంటూరు కారం భామ. విజయ్ షూటింగ్ స్పాట్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని.. చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పారు. ఆయనతో కలిసి నటించడం సరికొత్త అనుభవమని పేర్కొన్నారు. కాగా.. మైక్ మోహన్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, ప్రేమ్జీ, వైభవ్ అరవింద్ ఆకాష్, నటి స్నేహ, లైలా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక మీనాక్షి సినిమాల విషయాకొనిస్తే.. ప్రస్తుతం టాలీవుడ్లో మీనాక్షి చౌదరి బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇంతకుముందే విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన కొలై చిత్రంలో కీలక పాత్రను పోషించారు. అదే విధంగా ఆర్జే బాలాజీ సరసన నటించిన సింగపూర్ సెలూన్ చిత్రం ఈ నెల 25వ తేదీన తెరపైకి రానుంది. -
అయోధ్యలో నటి హేమమాలిని నృత్య ప్రదర్శన!
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలోనే జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్య అమృత మహోత్సవం అయోధ్యలో జనవరి 14 నుండి జనవరి 22 వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని సహా పలువురు కళాకారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో హేమమాలిని తన నృత్య ప్రదర్శను ఇవ్వనున్నారు. ఈ సంగతిని ఆమె ఒక వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ రామ మందిర ప్రతిష్ఠాపన సమయంలో నేను అయోధ్యకు వెళ్తున్నాను. జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనతో అక్కడ ఒక భవ్యమైన ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జనవరి 17న అయోధ్యలో జరిగే స్వామి రామభద్రాచార్యుల అమృత మహోత్సవ కార్యక్రమంలో రామాయణం ఆధారంగా ఉండే నృత్యరూపకాలన్ని ప్రదర్శించే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. కాగా అయోధ్యలో ఈరోజు (జనవరి 14) నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మాలినీ అవస్తి మొదటి రోజు కార్యక్రమంలో తన ప్రతిభను ప్రదర్శించనున్నారు. జనవరి 22న జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 మధ్యాహ్నం రామాలయంలోని గర్భగుడిలో రామ్లల్లాను ప్రతిష్టించాలని నిర్ణయించింది. రాముడి జన్మస్థలమైన అయోధ్య దేశ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది. -
అంబటి భోగి డ్యాన్స్...
-
ఒక్క వీడియోతో నేషనల్ ట్రెండింగ్
-
శ్రీరాముని పాటకు విద్యార్థుల నృత్యం.. వీడియో వైరల్!
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య, నూతన రామాలయం గురించే చర్చ జరుగుతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొంతమంది చిన్నారులు శ్రీరాముని పాటకు నృత్యం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో చాలా మంది సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు. అయితే తాజాగా చిన్నారుల నృత్యానికి సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారి, అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఈ వీడియోలో ‘మేరీ రామ్ జీ సే కహ్ దేనా జై సియా రామ్’ అనే పాట వినిపిస్తుంటుంది. ఈ పాటకు అనుగుణమైన నృత్యాన్ని ఒక గురువు అక్కడున్న చిన్నారులకు నేర్పిస్తుంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతోంది. ఈ వీడియో @desimojito అనే పేరుతో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేశారు. ‘నా దేశం మారుతోంది’ అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటి వరకు తొమ్మి వేల మందికి పైగా వీక్షించారు. వీడియోను చూసిన యూజర్స్ కామెంట్ బాక్స్లో ‘జై శ్రీరాం’ అని రాస్తున్నారు. Mera desh badal raha hai ❤️❤️ pic.twitter.com/BCBjphqROn — desi mojito 🇮🇳 (@desimojito) January 2, 2024 -
మందుబాబులకు వీఐపీ ట్రీట్మెంట్.. హిమాచల్ సీఎం ఆదేశాలు!
హిమాచల్ ప్రదేశ్లో పర్వతరాణిగా పేరొందిన సిమ్లాలో తొలిసారిగా సిమ్లా వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. ఏడు రోజుల పాటు కొనసాగే ఈ శీతాకాలపు కార్నివాల్.. సాంస్కృతిక కవాతు, గ్రాండ్ డ్యాన్స్తో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ సాంస్కృతిక కవాతును వీక్షించారు. కార్నివాల్ సందర్భంగా రిడ్జ్ గ్రౌండ్, మాల్ రోడ్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్నివాల్లో మద్యం తాగి డ్యాన్స్ చేసే వారితో సీఎం స్నేహపూర్వకంగా కనిపించారు. అతిగా తాగి వచ్చే పర్యాటకులను పోలీస్ లాకప్లో కాకుండా హోటల్కు తరలించాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎవరైనా టూరిస్ట్ మద్యం తాగి రచ్చ చేస్తే పోలీసులు వారికి వీఐపీ ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. సిమ్లా వింటర్ కార్నివాల్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ విపత్తు సమయంలో హిమాచల్ ప్రదేశ్లో పర్యాటక వ్యాపారం భారీగా నష్టపోయిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందన్నారు. భారీ సంఖ్యలో జనం హిమాచల్ ప్రదేశ్కు తరలివస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఫుడ్ స్టాల్స్ను 24 గంటలూ తెరిచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా పర్యాటకులను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులు నానా హంగామా చేయకూడదని, చట్టాన్ని గుర్తుంచుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సిమ్లా, మనాలిలకు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలో బస చేస్తున్నారు. కాగా మనాలిలో పర్యాటకులు ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఉదంతాలు వెలుగు చూశాయి. కొందరు పర్యాటకులు మద్యం సేవించి లోయల్లో హల్చల్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇది కూడా చదవండి: యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది? -
‘ఇదేందిది... హల్దీ ఫంక్షన్లో ఇంత అవసరమా?’
దేశంలోని చాలా ప్రాంతాల్లో హోరెత్తించే పాటలకు నృత్యాలు లేకుండా వివాహాలు పూర్తికావు. పెళ్లిలో వధువు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలుస్తుంది. ఇక పెళ్లి కూతురే స్వయంగా నృత్యం చేస్తే, అతిథుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఇటువంటి సమయంలో తమ ఇంటి అమ్మాయి వేరొకరి ఇంటికి వెళ్లిపోతున్నదనే బాధ ఆడపిల్ల తరపువారి ముఖాల్లో కనిపిస్తుంది. పెళ్లికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో వధువు తన హల్దీ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అదే సమయంలో ఆమె, ఆమె తల్లి కూడా రోదిస్తుంటారు. అలా ఏడుస్తూనే పెళ్లికుమార్తె డాన్స్ చేస్తూ ఉంటుంది. దేశిమోజిటో అనే పేరుతో సోషల్మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో వధువు డాన్స్ చేస్తూవుంటుంది. అక్కడే ఉన్న ఆమె బంధువులు ఆమె నృత్యాన్ని చూస్తుంటారు. ఇంతలో పెళ్లి కుమార్తె భావోద్వేగానికి లోనవుతోంది. కన్నీళ్లను నియంత్రించుకోలేకపోతుంది. పక్కనేవున్న తల్లి కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతటి భావోద్వేగాల మధ్య కూడా వధువు ఆపకుండా తన నృత్యాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ వీడియోకు 3.5 లక్షలకుపైగా వ్యూస్ దక్కాయి. యూజర్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి డ్రామాలు పెరిగిపోయాయని, అందుకే ఈ రోజుల్లో సినిమాలు ఆడడం లేదని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ఇది బాలీవుడ్ అందించిన బహుమతి అని మరొక యూజర్ రాశారు. ఇది కూడా చదవండి: నవరత్న ఖచిత సుమేరు పర్వతంపై శ్రీరాములవారు.. Performance nahi rukni chahiye pic.twitter.com/JxNEEbbP4U — desi mojito 🇮🇳 (@desimojito) December 7, 2023 -
'మీరు నాకు అన్యాయం చేశారు'.. ఆట సందీప్పై టేస్టీ తేజ పోస్ట్ వైరల్!
బిగ్బాస్ రియాలిటీ షో ఎంతోమంది ఫేమస్ అవుతున్నారు. వారిలో చాలామంది సెలబ్రిటీలయ్యారు కూడా. అలానే ఈ ఏడాది సీజన్-7లో కొందరు సినీ ఇండస్ట్రీతో సంబంధంలేనివారు కూడా ఎంట్రీ ఇచ్చారు. బిగ్బాస్ షోలో అడుగుపెట్టగానే వారికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. అలాంటి వారిలో ఫేమస్ అయిన యూట్యూబర్, ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ. హౌస్లో అందరినీ అలరించిన టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అతనితో పాటు బిగ్బాస్లో కంటెస్టెంట్స్గా పాల్గొన్న శుభశ్రీ రాయగురు, కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కూడా హోస్ నుంచి బయటకొచ్చేశారు. వీరంతా కలిసి బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లికి హాజరయ్యారు. అయితే వీరు ముగ్గురు కలిసి పెళ్లిలో సందడి చేశారు. డ్యాన్సులు చేస్తూ చిల్ అవుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే పెళ్లి వేడుకలో ఆటసందీప్, శుభశ్రీ కలిసి ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇది చూస్తూ పక్కనే ఉన్నా టేస్టీ తేజ వాళ్లద్దరి కెమిస్ట్రీని చూసి తట్టుకోలేకపోయారు. దీంతో వాళ్లిద్దరూ డ్యాన్స్ చేయడాన్ని చూస్తూ పక్కనే ఉన్న చెట్టుకు తల బాదుకుంటూ కనిపించారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఇది చాలా అన్యాయం సార్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇదంతా టేస్టీ తేజ సరదా కోసమే చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) -
బాల్క సుమన్ తో కలిసి ఎంపీ డ్యాన్స్
-
అందుకే భావోద్వేగానికి లోనయ్యాను: చంద్రబోస్
‘‘నేనిప్పటివరకు 3700 పాటలు రాశాను. ఈ రోజు నా మీద పాట రాసి, పాడారు. ఆ పాటను నాకు బహుమతిగా ఇచ్చిన ‘పర్ఫ్యూమ్’ టీమ్కి కృతజ్ఞతలు. నేను ఆస్కార్ అందుకున్న వీడియోను మళ్లీ ఇక్కడ చూడటంతో భావోద్వేగానికి లోనయ్యాను. ‘పర్ఫ్యూమ్’ పెద్ద విజయం సాధించాలి. నా భార్య సుచిత్ర ఈ చిత్రంలో ఒక పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు’’ అని రచయిత చంద్రబోస్ అన్నారు. చేనాగ్,ప్రాచీ థాకర్ జంటగా జేడీ స్వామి దర్శకత్వం వహించిన చిత్రం ‘పర్ఫ్యూమ్’. శ్రీమాన్ మూవీస్ సమర్పణలో జె. సుధాకర్, శివ .బి, రాజీవ్ కుమార్ .బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆస్కార్ అవార్డుగ్రహీత చంద్రబోస్ను యూనిట్ సత్కరించింది. ఈ వేడుకకి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్. విష్ణుమూర్తి, ఐఆర్ఎస్ అధికారి మురళీమోహన్, గ్రీన్ హార్స్ కంపెనీ అధినేత ప్రవీణ్ రెడ్డి, ఆచార్య భట్టు రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘‘కొత్త పాయింట్తో రూపొందిన చిత్రమిది’’ అన్నారు జేడీ స్వామి, చేనాగ్. -
గులాబీల జెండాలమ్మ పాటకు ఎమ్మెల్సీ కవిత, ప్రశాంత్ రెడ్డి డ్యాన్స్
-
హైటెక్ డాన్స్మ్యాట్! ఈజీగా నేర్చుకోవచ్చు!
కింద ఒక చాపలాంటిది పరచుకుని చిన్నారి డాన్స్ చేస్తోంది. చూశారు కదా! ఇది మామూలు చాప కాదు. ఇది హైటెక్ డాన్స్మ్యాట్. ఇందులో రిథమ్ సెట్ చేసుకుంటే, రిథమ్కు అనుగుణంగా ఈ చాప మీద లైట్లు వెలుగుతాయి. వెలిగే లైట్ల మీద అడుగులు వేస్తుండటమే! చిన్నారులు డాన్స్ నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ హైటెక్ డాన్స్మ్యాట్ ఎంతో అనువుగా ఉంటుంది. అమెరికన్ కంపెనీ ఫావో ష్వార్జ్ దీనిని ‘డాన్స్ మిక్సర్ రిథమ్ స్టెప్ ప్లేమేట్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రెండు మోడ్స్లో పనిచేస్తుంది. ‘కీప్ ద బీట్’, ‘ఫ్రీస్టైల్’ మోడ్స్లో కోరుకున్న మోడ్ ఎంపిక చేసుకుని, దీని మీద తకిట తధిమి అంటూ ఇంచక్కా గంతులేయవచ్చు. మూడేళ్ల వయసు పైబడిన పిల్లలకు ఇది చక్కని ఆటవస్తువు. దీని ధర 30 డాలర్లు (రూ.2,497) మాత్రమే! (చదవండి: పిల్లలు బాణాసంచా కాల్చేటప్పడూ జరభద్రం..ఈ జాగ్రత్తలు తప్పనసరి..) -
కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసిన కౌశిక్ రెడ్డి
-
డ్యాన్స్ అదరగొట్టిన సిద్దరామయ్య..!
-
అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను మీరెప్పుడైనా చూశారా?
దేవుడున్నాడన్నది ఎంత నిజమో దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం. కూడా దెయ్యాలకూ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి. అదే హలోవీన్ ఫెస్టివల్. ఈ పండగను పురస్కరించుకొని రకరకాల వికృత వేషాలు చూస్తుంటాం. తాజాగా దుబాయ్లో అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. భారతీయ సాంప్రదాయంలో పలు పండగలకు ప్రత్యేకమైన విశిష్టతలున్నాయి. అదే విధంగా దెయ్యాలకూ స్పెషల్గా పండగలున్నాయి. అదేనండీ మన హలోవీన్ పండగ. ఐర్లాండులో పుట్టిన ఈ పండగ తర్వాతి రోజుల్లో ప్రపంచ దేశాలకూ పట్టింది. హాలోవీన్ అనే స్కాట్లాండ్ పదం ఆల్ హాలో ఈవ్ నుంచి వచ్చింది. 1846లో ఏర్పడిన తీవ్రమైన కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండు ప్రజలు.. ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. దీన్ని సాంహైన్ పండుగ అని కూడా అంటారు. 2,000 సంవత్సరాల కిందట ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్లోని కొన్ని ప్రాంతాలలో నివసించిన సెల్ట్స్ జాతి ప్రజలు నవంబరు 1ని కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు. దానికి ఒకరోజు ముందే హాలోవీన్ వేడుకలు నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది.పండుగ రోజున మంటలను వెలిగించి, దెయ్యాలను పారదోలాలనే ఉద్దేశంతో ప్రజలు విచిత్రమైన వస్త్రధారణలో ఉంటారు. హలోవీన్ పండ అంటే ప్రాణం ఉన్నవారికి, మరణించినవారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని అప్పటి ప్రజలు నమ్మేవారు. పూర్వం ‘హాలోవీన్’ రోజున పశువులను బలి ఇచ్చి, వాటి ఎముకలను కాల్చేవారు. ఈ రోజున చెడు ఆత్మలను అనుకరిస్తూ.. దెయ్యాలు, మంత్రగత్తుల్లా వేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. హలోవీన్ డే వస్తుందంటే చాలు ప్రజలు పలు హర్రర్ సినిమాల్లోని భయానక పాత్రలను అనుసరిస్తూ వికృత వేషాల్లో కనిపిస్తారు. తాజాగా దుబాయ్లో హలోవీన్ డేను పురస్కరించుకొని భారీ డ్రోన్ షోను నిర్వహించారు. ఇందులో ఓ అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. -
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి.. డ్యాన్స్తో అదరగొట్టిన నిహారిక!
మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరు దంపతులు కూడా పాల్గొన్నారు. (ఇది చదవండి: వరుణ్ తేజ్ పెళ్లి.. మెగా ఫోటో షేర్ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే) అయితే ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అన్న పెళ్లి వేడుకల్లో సందడి చేసింది. అన్న పెళ్లిలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి తీన్ మార్ డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరవుతోంది. కాగా..అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి. కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 5న మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది. (ఇది చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 28 సినిమాలు రిలీజ్) Congratulations to the beautiful couple @IAmVarunTej & @Itslavanya. Wishing a lifetime of happiness! 💖 #VarunLav pic.twitter.com/2OmR5SUIt9 — Vamsi Kaka (@vamsikaka) November 1, 2023 -
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
మంత్రి జగదీష్ కోలాటం..
-
నవరాత్రుల టైంలో చేసే ఆరోగ్య తాండవం!
నవరాత్రి సందర్భంగా దాండియా ఆడటం సంప్రదాయం. చేతిలో కోలాటం కర్రలతో ఆడటమే ‘దాండియా’. కాని కర్రలు లేకుండా చేసే నృత్యం కూడా గుజరాత్ తోపాటు ఉత్తర భారతంలో అంతే ప్రముఖమైనది. దాని పేరు ‘గర్బ’. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు చేసే ఈ నృత్యం కేవలం పారవశ్య తాండవమే కాదు ఆరోగ్య తాండవం అని కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ‘గర్బ’ అనే మాట ‘గర్భ’ నుంచి వచ్చింది. స్త్రీ శక్తికి చిహ్నం గర్భధారణం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జీవశక్తికి ప్రాణం పోసే స్త్రీ శక్తిని సూచించేందుకు గుజరాత్ అంతా ‘గర్బ’ నృత్యం చేస్తారు. దాండియా అంత విస్తృతంగానే గర్బ కూడా ఆడతారు. అందులో కర్రలు ఉంటాయి. ఇందులో ఉండవు. కాని గర్బ నృత్యం శరీరానికి చాలా మేలు చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా 9 రోజుల పాటు స్త్రీలు ఈ నృత్యం చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు. కేలరీల ఖర్చు గంటసేపు గర్బ డాన్స్ చేయడం వల్ల 300 నుంచి 500 కేలరీలు ఖర్చవుతాయి. అంతే కాదు, శరీరాంగాలకు ఇందులో గొప్ప వ్యాయామం లభిస్తుంది. ఈ నృత్య భంగిమల వల్ల భుజాలు, మెడ, వీపు, మోకాళ్లు బాగా కదిలి కండరాలన్నీ చైతన్యంలోకి వస్తాయి. సునీల్ బఫ్నా అనే ఆరోగ్య నిపుణుడి ప్రకారం గంట సేపు గర్బ చేస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి ఒక ప్రశాంత స్థితి వస్తుంది. గర్బ చేసే సమయంలో శరీరం ఎండార్ఫిన్స్ను విడుదల చేయడమే ఇందుకు కారణం. అదీగాక ఇది బృందంతో చేసే నృత్యం కాబట్టి మనతో పాటు ఒక సమూహం ఉంది అనే భరోసా మనసుకు లభించి మంచి అనుభూతి కలుగుతుంది. అందుకే నవరాత్రుల సమయంలోనే కాదు సంవత్సరం పొడగునా గర్బా డ్యాన్స్ చేయమని ఫిట్నెస్ నిపుణులు కూడా చెబుతున్నారు. గుండెకు మంచిది గర్బలో ఆధ్యాత్మికత ఉంది. నృత్యం ద్వారా చేసే ఆరాధన కనుక దీనిని చేయడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇందులో చప్పట్లతో, సంగీతానికి తగినట్టుగా లయ కలిగిన కదలికలు ఉంటాయి కనుక అవన్నీ గుండెకు, నృత్య సందర్భంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగం పెరుగుతుంది కనుక ఊపిరితిత్తులకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్బ ఆధ్యాత్మిక, ఆరోగ్య తాండవం. (చదవండి: అందగాడు, ఆయుష్మంతుడు కన్నా గుణవంతుడే అన్ని విధాల..) -
నవరాత్రి ఉత్సాహం
దాండియా నృత్యానికి కళ తెచ్చే దుస్తుల జాబితాలో ముందు వరసలో ఉండేది లెహెంగా చోలీ. చనియా చోలీగా గిరిజన సంప్రదాయ కళ ఓ వైపు అబ్బురపరుస్తుంది.మనవైన చేనేతల గొప్పతనం మరోవైపు కళ్లకు కడుతుంది.అద్దకం కొత్తగా మెరిసిపోతుంటుంది. ఎరుపు, పచ్చ, పసుపు... రంగుల ప్రపంచంలో మునిగిపోయినట్టుగా ఉంటుంది.లెహంగా అంచులు నృత్యంతో పోటీపడుతుంటే ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుంది. రాజస్థానీ కళ గిరిజన సంప్రదాయ కళ ఉట్టిపడే ఎంబ్రాయిడరీ చనియా చోలీలు ఇప్పుడు నగరాల్లో జరిగే దాండియా వేడుకలలో తెగ వెలిగిపోతున్నాయి. వాటిని ధరించిన అమ్మాయిలు ఆటపాటల కోలాటంలో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. మనవైన ఫ్లోరల్స్ నృత్యం ఎప్పుడూ ఆనందాన్ని రెట్టింపు చేస్తూనే ఉంటుంది. ఆ ఆనందంతో పోటీ పడే దుస్తుల్లో ఫ్లోరల్స్ కూడా తమ స్థానాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. సంప్రదాయ కళతో పాటు కొద్దిగా ఆధునికత కూడా ఉట్టిపడాలనుకునేవారు ఫ్లోరల్ గాగ్రా చోలీలు ఎంచుకోవచ్చు. బ్లాక్ ప్రింట్స్ కలంకారీ, గుజరాతీ బ్లాక్ ప్రింట్స్ గాగ్రా చోలీలు దాండియాలో తమ వైభవాన్ని చాటడానికి పోటీపడుతుంటాయి. టాప్ టు బాటమ్ ఒకే కలర్, ప్రింట్స్తో ఉండే ఈ డ్రెస్సులు గ్రాండ్గా కనిపిస్తుంటాయి. -
అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!
ఖాళీ గ్యాస్ సిలిండర్ అయినా సరే, నెత్తి మీద పెట్టుకోవడం కష్టం. అలాంటింది డ్యాన్స్ చేయాలాంటే ‘అయ్ బాబోయ్’ అంటాం. దుర్గ అనే ఈ మహిళ మాత్రం ‘అయామ్ ఓకే’ అంటూ నెత్తి మీద గ్యాస్బండ పెట్టుకొని చిన్న స్టీలు బిందె ఎక్కి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో 23 లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేయవద్దు’ అంటూ నెటిజనులు ఆమెను హెచ్చరించారు. కొందరు మాత్రం ఆమె ‘బ్యాలెన్సింగ్ స్కిల్స్’కు భేష్ అన్నారు. ‘ఈ డేంజరస్ డ్యాన్స్ను పొరపాటున కూడా అనుకరించవద్దు’ అంటూ కొందరు హెచ్చరిక కామెంట్లు పెట్టారు. -
'అందుకే జైలులో నాగిని డ్యాన్స్ చేశా'.. సుశాంత్ ప్రియురాలు!
ఎంఎస్ ధోని మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం ఆయన అభిమానుల్లో తీవ్రంగా కలిచివేసింది. 2020లో ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ సూసైడ్ తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తిపై ఆరోపణలు రావడంతో ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె సోదరుడు షోక్ చక్రవర్తి కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రియా.. తన జైలు జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. జైలులో ఉన్న ఇతర మహిళలను చూసి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది. ఈ కేసులో నేను కేవలం నిందితురాలినే తప్ప.. దోషిని కాదని రియా స్పష్టం చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత అక్కడున్న జైలులో మహిళలతో కలిసి నాగిన్ డ్యాన్స్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు బెయిల్ వచ్చిన రోజు తన సోదరుడికి బెయిల్ రాలేదని.. ఆరోజు తాను చాలా బాధపడ్డానని తెలిపారు. అయితే తనకు బెయిల్ వచ్చిన రోజు డ్యాన్స్ చేస్తానని నా తోటి మహిళా ఖైదీలకు మాట ఇచ్చానని.. అందుకే అలా చేశానని తెలిపింది రియా. వారిని నేను మళ్లీ చూడలేను కాబట్టే.. వారితో ఐదు నిమిషాల పాటు డ్యాన్స్ చేసి ఆనందాన్ని ఇవ్వగలిగానని చెప్పుకొచ్చింది. ఇది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణమని వెల్లడించింది. మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు వారి కళ్లలో కనిపించిన ఉత్సాహం, ఆనందం, సంతోషం బహుశా ఇప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడు చూడలేదని రియా అన్నారు. ఈ కేసులో రియా దాదాపు ఆరు వారాల పాటు బైకుల్లా జైలులో రిమాండ్లో ఉన్నారు. కాగా.. రియా ప్రస్తుతం ఎంటీవీ రోడీస్: కర్మ యా కాంద్లో కనిపించనుంది. ఇందులో ఆమె గ్యాంగ్ లీడర్ పాత్ర పోషిస్తోంది. -
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు (ఫోటోలు)
-
దీపికా పదుకొణె సాంగ్.. హీరోయిన్ కంటే బాగా చేసింది!
డ్యాన్స్ అనేది ఓ అందమైన కల. సినీ తారలకైతే వారి డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. కేవలం వారి డ్యాన్స్ చూసి పిచ్చా ఫ్యాన్గా మారిపోతుంటారు. అంతే కాకుండా వారిలా డ్యాన్స్ చేస్తూ తన అభిమాన తారలను మరిపిస్తుంటారు. బాలీవుడ్ భామ దీపికా పదుకొణె డ్యాన్స్ చాలా సినిమాల్లో చూసే ఉంటారు. కానీ రణ్వీర్సింగ్తో కలిసి నటించిన గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా చిత్రంలో నగదా అనే సాంగ్ బాగా ఫేమస్ అయింది. ఏ ఈవెంట్ జరిగినా ఈ సాంగ్ కచ్చితంగా ఉంటుంది. అయితే నవరాత్రుల సందర్భంగా చాలా చోట్ల ఈ పాటను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. (ఇది చదవండి: చాలా ఎమోషనల్గా సాగిన సిద్ధార్థ్ 'చిన్నా' ట్రైలర్) తాజాగా ఈ పాటకు ఓ మహిళ చేసిన డ్యాన్స్కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అచ్చం దీపికా పదుకొణెను మరిపించేలా డ్యాన్స్ చేసింది. గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలాలోని నగదా సాంగ్కు తన స్టెప్పులతో మరిపించింది. ఆమె బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ప్లే అవుతుండగా.. ఏమాత్రం తేడా లేకుండా ఆ మహిళ పాటలోని స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఏకంగా ఏడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల ప్రశంసలు ఆమె డ్యాన్స్ను చూసిన నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. వావ్... ఇది ఓ అద్భుతమైన నృత్యం.. నాకు బాగా నచ్చింది అంటూ కామెంట్ చేశారు. ఈ పాటకు ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసింది అంటూ పోస్టులు పెడుతున్నారు. అచ్చం దీపికా పదుకొణెను మరిపించిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా చిత్రం 2013లో విడుదలైంది. ఈ చిత్రంలో సుప్రియా పాఠక్, శరద్ కేల్కర్, రిచా చద్దా నటించారు. ఈ చిత్రం ద్వారానే రణవీర్ సింగ్, దీపికా పదుకొణెల మొదటిసారి కలిసి నటించారు. (ఇది చదవండి: యుద్ధ విమానం నడిపే పైలెట్గా కంగనా.. ‘తేజస్’ వచ్చేస్తుంది!) View this post on Instagram A post shared by kreethi (@_.kretx_.k) -
డీజే పాటకు డ్యాన్స్ ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి
-
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో పోలీస్ డ్యాన్స్ అదుర్స్
-
గణేష్ నిమజ్జనంలో సీపీ రంగనాథ్ డాన్స్
-
Iraq wedding fire: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం
మోసల్ (ఇరాక్): ఇరాక్లోని ఒక పెళ్లి వేడుకల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది. అతిథులతో కిక్కిరిసిపోయిన హాలులో వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి 114 మంది మరణించారు. మరో 150 మంది వరకు గాయపడ్డారు. ఆస్పత్రితో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇరాక్లోని నినెవెహ్ ప్రావిన్స్ ఖరఖోష్ పట్టణంలో పెళ్లి వేడుకలో హాలులో బాణాసంచా కాల్చడంతో ఒక్కసారి డెకరేషన్కు మంటలు అంటుకొని వ్యాపించాయి. ఆ హాలు నిర్మాణంలో ఉపయోగించిన సామాగ్రి, పెళ్లి కోసం చేసిన డెకరేషన్ కూడా మండించే స్వభావాన్ని కలిగి ఉండడంతో అగ్ని కీలలు త్వరితగతిన విస్తరించాయి. కళ్ల ముందే షాండ్లియర్లు, సీలింగ్ నుంచి పెచ్చులు కింద పడడంతో పెళ్లికి హాజరైన అతిథులు అటూ ఇటూ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో వధూవరులు తీవ్రంగా గాయపడినా వారి ప్రాణాలకు ప్రమాదం లేదని స్థానిక మీడియా వెల్లడించింది. పెళ్లి వేడుకలు అంబరాన్నంటుతున్న సమయంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న అతిథులు ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో హాహాకారాలు చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పెళ్లి వేడుకలు జరిగే మండపం అంతా ప్లాస్టిక్తో డెకరేషన్ చేశారు. వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా హాలులోనే బాణాసంచా కాల్చారు. అవి నేరుగా రూఫ్కి తాకాయి. సీలింగ్కి మంటలు అంటుకోవడంతో అవి విస్తృతంగా వ్యాపించాయి. ఆ ఫంక్షన్ హాలుని శాండ్విచ్ ప్యానెల్స్, వినిల్ షీట్స్, ఫ్యాబ్రిక్తో నిర్మించడంతో మంటలు ఎగిసెగిసి పడ్డాయి. దీంతో పై నుంచి డెకరేషన్ సామాగ్రి కింద పడి ఎవరూ కదలడానికి వీల్లేకుండా పోయింది. అతిథుల సంఖ్య భారీ స్థాయిలో 1,000 నుంచి 1100 మంది ఉండడంతో అటూ ఇటూ వెళ్లాడానికి దారి లేక అందరూ అక్కడే చిక్కుకుపోయి మంటలకి ఆహుతైపోయారు. -
గణేష్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు.. కుప్పకూలిన యువకుడు
-
చింటూ అంటే చిన్నోడు అనుకున్నావా..స్టేజి మీద దుమ్ము దులిపేసాడు..
-
‘లోకల్’లో యువతి ‘బెల్లీ’ డాన్స్.. పోలీసులకు నెటిజన్ల ఫిర్యాదు!
ముంబై లోకల్ ట్రైన్లో ఓ యువతి బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. ముంబైలోని సాండ్హర్స్ట్ రోడ్- మస్జిద్ స్టేషన్ల మధ్య సాగుతున్న రైలు ప్రయాణం మధ్యలో ఈ వీడియో రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫుటేజీ చూసిన నెటిజన్లు పలు విధాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియో ముంబై పోలీసుల దృష్టిలో పడింది. ఆ యువతి లోకల్ ట్రైన్లో అసభ్యకర రీతిలో బెల్లీ డ్యాన్స్ చేస్తున్నదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ముంబై పోలీసులు ఆ యువతిపై చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సంఘటన ముంబైలోని లోకల్ రైళ్లలో దిగజారుతున్న పరిస్థితికి దర్పణం పడుతున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: 5 దారుణ అల్లర్లు.. దేశాన్ని వణికించి, రక్తపాతాన్ని సృష్టించి.. Entertainment Now Belly Dancing inside Mumbai Local Train. It seems #MumbaiLocal Trains are the most happening place..to showcase talent. Locations seems to be @Central_Railway between Sandhurst Road & Masjid stations.@drmmumbaicr @RailMinIndia @RailMinIndia pic.twitter.com/LI1vFchnHw — मुंबई Matters™ (@mumbaimatterz) September 19, 2023 -
కథక్ నుంచి తీన్మార్ వరకు ఏదైనా..వారెవా! అనేలా ఇరగదీస్తాడు!
బెల్జియన్ కంటెంట్ క్రియేటర్ ఈడీ పీపుల్ వివిధ ప్రాంతాలలో లోకల్స్తో కలిసి చేసే డ్యాన్స్ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ అయ్యాయి. ఏదైనా ప్రాంతానికి వెళ్లిన పీపుల్ స్థానికులను ‘మీకు ఇష్టమైన డ్యాన్స్ ఏమిటి?’ అని అడగడమే కాదు ‘నాకు నేర్పించగలరా?’ అని రిక్వెస్ట్ చేసి ఓపిగ్గా నేర్చుకుంటాడు. అలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు చెందిన డ్యాన్స్లను నేర్చుకుంటూ, స్థానికులతో పోటీ పడి డ్యాన్స్ చేస్తుంటాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మన దేశానికి సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందిన డ్యాన్స్లు చేసి ‘వారేవా’ అనిపించుకున్నాడు. ‘మీ డ్యాన్స్ చూస్తుంటే భారతీయ పౌరసత్వం ఇవ్వాలనిపిస్తుంది’. ‘మా దేశంలోని కొన్ని అద్భుతమై డ్యాన్స్లను మిస్ అయ్యారు. వాటిని కూడా చేస్తే బాగుంటుంది’ అంటూ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈడీ పీపుల్ షేర్ చేసిన డ్యాన్స్ వీడియోలపై నెటిజనులు స్పందించారు. View this post on Instagram A post shared by Ed People (@ed.people) (చదవండి: ఏం చిక్కొచ్చి పడింది! అటు చూస్తే.. జవాన్!.. ఇటు చూస్తే.. ఆఫీస్..!) -
పెళ్లిలో యువతుల జోరు.. బ్లాక్ డ్రెస్లో కుమ్మేశారు..!
పెళ్లిలో వధువు లేదా వరుని స్నేహితుల డ్యాన్సులు చాలా ప్రత్యేకం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్పెషల్గా ప్లాన్ చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓ పెళ్లి వేడుకలో జరిగింది. స్నేహితురాల్ని సర్ప్రైజ్ చేస్తూ ప్రత్యేక దుస్తుల్లో చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వధువు స్నేహితులు పెళ్లికి వెళ్లారు. ఆమెను సర్ప్రైజ్ చేయడానికి ప్రత్యేకమైన డ్యాన్సులు చేశారు. ప్రత్యేకమైన విషధారణతో వేడుకకు హాజరైన బంధుమిత్రులను ఆశ్చర్యానికి గురిచేశారు. నల్లని డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, తెల్లని దుస్తులు ధరించిన అబ్బాయిలు కలిసి డ్యాన్సులతో అబ్బురపరిచారు. View this post on Instagram A post shared by Betty Who (@bettywho) వేదికమీదకు ఎక్కి ఉత్తరకొరియాకు చెందిన పింక్ వీనోమ్ సాంగ్ని ప్లే చేశారు. ఆ ట్యూన్కు దగ్గట్టుగా మెలికలు తిరుగుతూ చిందులు వేశారు. ఆ డ్యాన్సును వరునికి డిడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు వధువు స్నేహితుల డ్యాన్సులు చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు పెట్టారు. ఈ వీడియోను సంగీతకారుడు బెట్టీ హూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో అమెరికన్ గాయకుడు స్కాట్ హోయింగ్, కొరియోగ్రఫీ జంట ఆస్టిన్, మారిడెత్లను ట్యాగ్ చేశారు. ఈ వీడియోకు ఒక్క రోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. వేదికపై డ్యాన్సులు చేసిన వారి వేషధారణ చాలా బాగుందని కొందరు నెటిజన్లు స్పందించారు. ప్రోఫెషనల్ డ్యాన్స్ అంటూ మరికొందరు కామెంట్ పెట్టారు. బ్లాక్ పింక్ డ్యాన్స్కు ఫిదా అయినట్లు స్పందించారు. ఇదీ చదవండి: బస్సులో సీటు కోసం మహిళ ఫీట్లు -
భావోద్వేగాలు పంచుకుంటున్నారా!..బలైపోవడం ఖాయం!
కొందరు వ్యక్తులు వ్యక్తిగత ఒత్తిడి, చికాకులు, కోపం, నిరాశ ... వంటి భావోద్వేగాలను సోషల్మీడియా వేదికగా పంచుకుంటూ జనాల మద్దతు కోరుకుంటూ ఉంటారు. ఈ విధానం వల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. మానసిక సమస్యలను మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. దీనివల్ల కొత్త ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. యువత, మహిళల్లో ఎక్కువగా ఉండే ఈ సమస్య గురించి, జాగ్రత్తల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే! సోషల్ మీడియాలో తమ భావోద్వేగాలు, ఆశనిరాశలు, ఆలోచనలు, ఆవేదనలు, వ్యక్తిగత అనుభవాలు, సమస్యలను విస్తృతంగా పంచుకునే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. ఇతరుల సానుభూతిని కోరుకోవడానికి ఇలా చేస్తుంటారు. దీనికి కొందరు వ్యక్తులు తీర్పులు ఇస్తుంటారు లేదా తప్పుగా అర్థం చేసుకుంటారు. కలిగే నష్టాలు సంఘర్షణ తీవ్రత పెరుగుతుంది అనవసరమైన వాటిపైన శ్రద్ధ నిరంతర సానుభూతి వచనాలను కోరుకుంటారు. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. దీనికన్నా భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి నమ్మదగిన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల నుండి మద్దతు పొందడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే, మీ భావోద్వేగాల పరిస్థితిని మోసగాళ్లు ఓ కంట గమనిస్తుంటారు. వాటిని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు ఫ్రెండ్స్ జాబితాలో చేరి, అనుకూలంగా మాట్లాడుతూ చివరకు ఆర్థికపరమైన నేరాలకు పాల్పడవచ్చు. సానుభూతి కోరుకునేవారు.. ⇔ప్రజల దృష్టిని ఆకర్షించడానికి భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంటారు. లైక్లు, కామెంట్స్, ఫాలోవర్స్ ద్వారా మనకున్న ప్రాముఖ్యతను చూసుకుంటారు కాబట్టి చాలామంది ⇔వ్యక్తులు తమ ఫాలోవర్ బేస్ను పెంచుకోవడానికి దృష్టిని ఆకర్షించడానికి సోషల్ మీడియాలోకి వస్తారు. ⇔తమ భావోద్వేగాలను సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఎవ్వరికీ కనిపించకుండా వ్యక్తీకరించడానికి సోషల్ మీడియా మాత్రమే అనుకూలంగా భావిస్తారు. ⇔మంచి, చెడు ఏదైనా సోషల్ మీడియాలో ముందుగా విషయాలను పంచుకోవాలనే ఆత్రుత, మనల్ని ఇతరులు గమనిస్తున్నారా లేదా అనే నిరీక్షణ ఉంటుంది. ⇔సోషల్ మీడియాలో ఆలోచనలు, భావాలను పంచుకోవడం వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా అపరిచితుల నుండి కూడా మద్దతు పొందవచ్చు. ⇔కొందరు వ్యక్తులు ఎవ్వరికీ తెలియకుండా అజ్ఞాతంగా ఉంటూ సోషల్ మీడియాలో చురుకుదనాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎందుకంటే వారు తమ వ్యక్తీకరణను అనామకంగా చేస్తారు. ఇది భద్రతా భావాన్ని అందిస్తుంది, తక్షణ పరిణామాల భయం లేకుండా ఉండటమే దీనికి గల కారణం. ⇔మార్పు కోసం వాదించడానికి లేదా ప్రభుత్వాలు, కార్పొరేట్లు, రాజకీయ పార్టీలు తీసుకున్న ముఖ్యమైన విషయాలపై (అంటే విధానాలు లేదా నిర్ణయాలు) దృష్టిని ఆకర్షించడానికి ఇదొక మార్గం. ⇔ఒంటరితనం, సన్నిహిత సంబంధాలు లేకపోవటం లేదా ఎవరితోనైనా మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటే, సోషల్ మీడియా మాత్రమే వారి వ్యక్తీకరణ సాధనంగా పనిచేస్తుంది. ⇔సోషల్ మీడియాలో తమను తాము వ్యక్తీకరించడం, వారి భావాలను పంచుకోవడంలో ఉపశమనం పొందుతుంటారు. ⇔కష్టాలు, సవాళ్లను పంచుకోవడం ద్వారా వ్యక్తులు తమలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వవచ్చు. ⇔కొందరితో వ్యక్తిగతంగా చెప్పలేని విషయాలు ఆన్లైన్లో పంచుకోవడం సుఖంగా ఉంటుంది. ఎలా ఉండాలి.. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో విభిన్న రకాల వ్యూవర్స్ మీకు ఉండే అనుకూలమైన సోషల్ మీడియా సైట్ను ఎంచుకోవాలి. (ఉదాహరణకు.. వ్యక్తిగత వ్యక్తీకరణల కోసం Facebook, ప్రజల కోసం Twitter ఎంచుకోవచ్చు. సహాయం కోరుతున్నారా, నైపుణ్యాన్ని పంచుకుంటున్నారా లేదా మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకుంటున్నారా అనే దానిపైన స్పష్టత ఉండాలి. మీ ఉద్వేగాల పరిస్థితిని కంప్లైంట్గా కాకుండా మీరు ఎలా, ఎందుకు దేనిగురించి భావిస్తున్నారో వివరించడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఇతరులు అర్థం చేసుకునే వీలుంటుంది. మీ భావాలను వ్యక్తపరిచేటప్పుడు, సున్నితమైన లేదా విభజన సమస్యలను తెచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. లేదంటే సంఘర్షణకు దారితీయవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్లు నిర్దిష్ట స్నేహితులు లేదా అనుచరులతో పోస్ట్లను పూర్తిగా పబ్లిక్ షేర్ చేయడానికి అనుమతిస్తాయి కాబట్టి గోప్యతా సెట్టింగ్లపై నియంత్రణ ఉండాలి. మీ గోప్యతకు భంగం కలిగించే మీ వివరాలను బహిర్గతం చేయకుండా ఉండాలి. (అనగా.. పేరు, చిరునామా, ప్లేస్, టెలిఫోన్ నంబర్, ఇ–మెయిల్, చిరునామా మొదలైన వ్యక్తిగత సమాచారం) ఫీడ్బ్యాక్ విషయంలో ఓపెన్గా ఉండాలి. గౌరవప్రదంగా ప్రవర్తించాలి. లేకపోతే ప్రతికూల చర్యలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. మీ విజయాలు, జీవిత అనుభవాలు లేదా సంతోషకరమైన క్షణాలను పంచుకోవడం ద్వారా ప్రోత్సాహకరమైన ఉనికిని పొందవచ్చు. మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకోవడం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుందో లేదో, మీరు పోస్ట్ చేసిన దానితో సంతృప్తి చెందుతున్నారో లేదో ఒకటికి రెండుసార్లు సమీక్షించుకోవాలి. సోషల్ మీడియాలో మీ వ్యక్తీకరణను ఎలా తెలియజేస్తున్నారో స్నేహితుడితో, కుటుంబ సభ్యునితో, థెరపిస్ట్తో మాట్లాడటం మేలు చేస్తుంది. వాటిలోని మంచి చెడులను బేరీజు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత ప్రతిష్టకు సమస్యలు ఎదురైతే రిపోర్ట్ చేయడానికి... https://www.facebook.com/help/ 1753719584844061/?helpref=uf_share Instagram:https://help.instagram.com/ contact/ 383679321740945 Twitter: https://help.twitter.com/en/forms/ safety-and-sensitive-content LinkedIn: https://www.linkedin.com/help/ linkedin/answer/a1378278/report-inappropriate-content-messages-or-safety-concerns?lang=en (చదవండి: ఇండియన్ బ్యాలెరినా! బ్యాలె డ్యాన్స్లో రాణిస్తున్న హైదరాబాదీ!) -
బ్యాలె డ్యాన్స్లో రాణిస్తున్న హైదరాబాదీ!
అంతర్జాతీయ వేదికలపైన ప్రసిద్ధిగాంచిన బ్యాలె డ్యాన్స్లో హైదరాబాద్ వాసి13 ఏళ్ల ఇష్నా చౌదరి రాణించడమే కాదు ప్రతిష్ఠాత్మక కెనడా నేషనల్ బ్యాలె స్కూల్ (ఎబీఎస్)లో ప్రవేశానికి ఎంపికైంది. ప్రపంచంలోని టాప్ 10 బ్యాలే స్కూల్స్లో ఒకటైన ఎన్బీఎస్ అకడమిక్ కరిక్యులమ్లో ప్రవేశం పొందిన మొదటి భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది ఇష్నా. ‘వివిధ దేశాలలో ఉన్న నా ఫ్రెండ్స్ ఇండియన్ బ్యాలెరినా’ అని పిలుస్తున్నారు బ్యాలె ఈజ్ బ్యూటిఫుల్ అంటూ తన ఆనందాన్ని తెలియజేస్తోంది. మూడేళ్ల వయసు నుంచే బ్యాలెపై మక్కువ పెంచుకున్న ఇష్నా ప్రముఖ టెలివిజన్ సిరీస్ ‘‘ఏంజెలీనా బ్యాలేరినా’ చూస్తూ తన ఆసక్తిని మరింత పెంచుకుంది. ఐదేళ్ల వయస్సులో ముంబైలో క్లాసికల్ బ్యాలెలో శిక్షణ ప్రారంభించింది. ఏడేళ్ల వయసులో ఇష్నా తల్లిదండ్రులు పూణేకు మారడంతో అక్కడే మూడేళ్లపాటు బ్యాలె ప్రాథమిక దశల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుంది. ఇందులో భాగంగానే లండన్ని రాయల్ అకాడమీ ఆఫ్ డ్యాన్స్ గ్రేడెడ్ పరీక్షల్లో విజేతగా నిలిచి, ప్రత్యేకతను సంపాదించుకుంది. వదలని పట్టుదల కరోనా మహమ్మారి విజృంభించడంతో బ్యాలె స్టూడియోలు భౌతికంగా మూసేశారు. ‘‘ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ శిక్షణ సంస్థలు అందించే ఆన్లైన్ క్లాస్లపైన దృష్టి పెట్టాను. ఇందులో భాగంగా వాగనోవా బ్యాలె అకాడమీ ఆఫ్ రష్యా వంటి ప్రముఖ వేదికలు సమ్మర్ ఇంటెన్సివ్ శిక్షణ కోసం ఇష్నాను ఆడిషన్ చేశాయి. ఈ ఆడిషన్స్లో అంతర్జాతీయ విద్యార్థులతో కలిసి శిక్షణ పొందాను. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన వాగనోవాలోని బ్యాలేరినాలతో శిక్షణ పొంది, ప్రీ ప్రొఫెషనల్ బ్యాలె ప్రోగ్రామ్ కోసం ఆసియాలోని టాప్ బ్యాలె స్కూల్ అయిన మార్లుపి డ్యాన్స్ అకాడమీ(ఇండోనేషియా)కి ఎంపికయ్యాను. కానీ ఇండోనేషియాకు మకాం మార్చడం కష్టం కాబట్టి మళ్లీ ఆన్ లైన్ తరగతుల ద్వారానే ట్రైనింగ్ తీసుకున్నాను’ అని వివరిస్తుంది ఇష్నా. అవార్డులు.. స్కాలర్షిప్లు బ్యాలెలో ఆసియాలోనే అత్యుత్తమ స్కూల్ అయినటువంటి మార్లుపి డ్యాన్స్ అకాడమీ (ఎమ్డీఏ) క్లాసికల్ బ్యాలెలో ప్రీ ప్రొఫెషనల్ శిక్షణను అందిస్తుంది. ఈ వేదికగా అంతర్జాతీయ స్థాయి డ్యాన్సర్లును తయారు చేసిన ప్రముఖ బ్యాలె శిక్షకురాలు మిస్ జోనాథ ఆధ్వర్యంలో ఇష్నా పదేళ్ల వయసున్నప్పటి నుంచే ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఎన్నో అవార్డులను గెలుచుకుంది. సింగపూర్ యూత్ ఆర్ట్ ఫెస్టివల్లో క్లాసికల్ బ్యాలెలో వెండి, కాంస్య అవార్డులు, సింగపూర్ ఐబీజీపీఎస్లో పొటెన్షియల్ అవార్డు, జకార్తాలోని ఏషియన్ గ్రాండ్ ప్రిక్స్లో మెరిట్ అవార్డు, గ్రేట్ ఇండియా బ్యాలె పోటీలో గోల్డ్మెడల్ తదితర అవార్డులను ఇష్నా చౌదరి అందుకుంది. అంతేకాకుండా యూత్ అమెరికన్ గ్రాండ్ ప్రిక్స్ (వైఏజీపీ)లో సెమీఫైనల్కు కూడా అర్హత సాధించింది. కెనాన్ డ్యాన్స్ ఫెస్టివల్ సింగపూర్ ఫర్ సమ్మర్ ఇంటెన్సివ్ టు ఆసియా బ్యాలెట్ అకాడమీ (మలేషియా), నేషనల్ బ్యాలె అకాడమీ ఆఫ్ న్యూయార్క్ సమ్మర్ ఇంటెన్సివ్, జువాన్ పాయింట్ ప్రోగ్రామ్ న్యూజిలాండ్ వంటి వేదికల్లో స్కాలర్షిప్లను సైతం పొందింది. జువాన్ పాయింట్లో తన నైపుణ్యాల ఆధారంగా ఆమె స్కాలర్షిప్ను అడ్వాన్స్డ్ పాయింట్ ప్రోగ్రామ్కు పొడిగించడం విశేషం. ఎంబీఎస్ కెనడా, ఏఆండ్ఏ బ్యాలె(చికాగో)లో శిక్షణ పొందేందుకు స్కాలర్షిప్ సాధించింది. అంతర్జాతీయ బ్యాలె వేర్ బ్రాండ్ ‘బ్యాలె లైఫ్’కు ఇష్నా బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహారిస్తుంది. నిరంతర కృషి ఈ ఏడాది ప్రపంచంలోని టాప్ బ్యాలె అకాడమీలతో వ్యక్తిగతంగా శిక్షణ పొందాలనుకుంది ఇష్నా. ఇందులో భాగంగా బోస్టన్ బ్యాలె (బోస్టన్, ఎమ్ఏ), రష్యన్ మాస్టర్స్ బ్యాలె (అలికాంటే, స్పెయిన్), ప్రతిష్టాత్మక స్కూల్ ఆఫ్ అమెరికన్ బ్యాలె (ఎస్ఏబీ, న్యూయార్క్)లో 8 శాతంతో సమ్మర్ ఇంటెన్సివ్ల ఆడిషన్లో ఎంపికైంది. నిరంతర కృషితో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఇష్నా., సమ్మర్ ఆఫ్ 2023ని కెనడా నేషనల్ బ్యాలెలో శిక్షణ పొందాలని నిర్ణయించుకుంది. ఇంటెన్సివ్లో తన ప్రదర్శన ఫలితంగా కెనడా ఎన్బీఎస్లో ప్రొఫెషనల్ బ్యాలె ప్రోగ్రామ్ కోసం ఆఫర్ అందుకుంది. 1959లో స్థాపించబడిన ఎన్బీఎస్ ., ఔత్సాహిక యువ నృత్యకారులు, ఉపాధ్యాయుల కోసం ప్రపంచంలోని అగ్రగామి శిక్షణా సంస్థలలో ఒకటి. ఈ వేదికగా శిక్షణ పొందుతున్న మొట్టమొదటి భారతీయ బాలేరినాగా ఇష్నా చౌదరి చరిత్ర సృష్టించింది. – హనుమాద్రి శ్రీకాంత్ (చదవండి: మీకు తెలుసా! ఆ చారిత్రాత్మక భారత రెస్టారెంట్ హఠాత్తుగా మూతపడుతోంది!) -
విమానం రెక్కలపై సిబ్బంది డ్యాన్సులు..
విమానం రెక్కపై డ్యాన్స్ చేస్తూ స్విస్ ఎయిర్పోర్టు లైన్స్ సిబ్బంది బుక్కయ్యారు. బోయింగ్ 777 విమానం రెక్కపై సిబ్బంది డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో విమానయాన సంస్థ చర్యలకు సిద్ధపడింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం సహించరానివని స్పష్టం చేసింది. బోయింగ్ 777 విమానం ఎయిర్పోర్టులో ఆగింది. ఈ క్రమంలో ఓ మహిళా సిబ్బంది విమానం రెక్కపై డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అధికారిగా కనిపించే మరో వ్యక్తి కూడా బాడీ బిల్డింగ్ పోజులు ఇచ్చారు. ఈ దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ వద్ద వేచి చూస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్గా మారి స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు యాజమాన్యానికి చేరింది. Moment air hostesses for #Swiss International Air Lines are caught on camera posing for selfies as they dance on wing of Boeing 777 in #BuenosAires, #Argentina pic.twitter.com/9lCwCrjVRA — Hans Solo (@thandojo) August 27, 2023 బోయింగ్ విమానం రెక్క ఐదు మీటర్ల వెడల్పు, 16.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు నుంచి కిందపడితే తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందని ఎయిర్ పోర్టు యాజమాన్యం తెలిపింది. సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చూడటానికి సరదాగా అనిపించినా.. ఇలాంటి ఘటనలు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
పబ్లో చిల్ అవుతున్న కీర్తి సురేశ్.. డ్యాన్స్ వీడియో వైరల్
తమిళసినిమా: కీర్తిసురేశ్ ఇప్పుడు విజయాల మీద సవారీ చేస్తుందనే చెప్పాలి. ఆమధ్య వరుస ఫ్లాప్లతో సతమతమైన ఈ కేరళ కుట్టి నటిగా మాత్రం ఫెయిల్ కాలేదు. నటనపై ఈమె అంకితభావమే ఇప్పుడు మళ్లీ గాడిలో పడేలా చేసిందని చెప్పవచ్చు. మహానటి వంటి అద్భుత విజయం సాధించిన చిత్రం తర్వాత కీర్తి సురేశ్ కథానాయకి పాత్రలకు ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటించడం మొదలెట్టింది. అలా అనడం కంటే ఆమెను దర్శక, నిర్మాతలు అలాంటి పాత్రలకు ఎంపిక చేశారు అని చెప్పవచ్చు. అయితే ఆ చిత్రాలు కీర్తిసురేశ్కు ఆశించిన విజయాలను తెచ్చిపెట్టలేదు. ఇటీవల తెలుగులో నటించిన దసరా చిత్రం , తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతోపాటు కీర్తిసురేశ్ సహజత్వంతో కూడిన నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. అంతేకాదు ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇప్పటివరకు తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న కీర్తిసురేశ్కు ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా పిలుపు రావడం విశేషం. హిందీలో వరుణ్ ధావన్ సరసన నటించబోతోంది. అదేవిధంగా తెలుగులో నాగచైతన్య సరసన నూతన చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. తమిళంలో జయంరవి సరసన సైరన్, రివాల్వర్ రోటా, రఘు తాత అనే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు చేస్తున్నారు. ఇంత బిజీలోనూ కీర్తిసురేశ్ పబ్ల్లో పాటలతో చిల్ అవుతోంది. ఈమె స్నేహితులతో ఒక పబ్లో డాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
దేశాలు వేరైనా డ్యాన్స్ నీదేనయా!
టాంజానియాలో కంటెంట్ క్రియేటర్ కలీపాల్ తన సోదరి నీల్పాల్తో కలిసి చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’ సినిమాలోని ‘ఝుమ్ఖా’ పాటకు కలీపాల్, నీమ్పాల్లు స్టెప్పులు వేశారు. తమ సంప్రదాయ దుస్తులు ధరించి చేసిన ఈ డ్యాన్స్ వీడియో 1.4 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ► ఏ దేశమేగినా గానం నుంచి నృత్యం వరకు ఏదో ఒక రూపంలో దేశం మనతో ఉంటుంది. తాజాగా ఐకానిక్ వాషింగ్టన్ మాన్యుమెంట్ (యూఎస్) బ్యాక్గ్రౌండ్గా స్వాతి జయశంకర్ భరతనాట్యం చేసింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో లక్షలాది వ్యూస్ను సొంతం చేసుకుంది. ‘బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ బ్యూటిఫుల్ డ్యాన్స్’ అంటూ కామెంట్ సెక్షన్ ప్రశంసలతో నిండిపోయింది. -
పెళ్లిలో ఫొటోగ్రాఫర్ స్టెప్పులు.. నెటిజన్స్ ఫిదా..!
ఎక్కడైనా ఫొటోగ్రాఫర్ అంటే వేడుకల్లో మంచి స్టిల్స్ తీస్తూ బిజీగా ఉంటాడు. తనపని తాను చేసుకుంటూ ఫంక్షన్లో సందడిని చూస్తుంటాడు. కానీ ఫొటోగ్రాఫర్ ఏకంగా డ్యాన్సులు వేస్తే..? ఫొటోలు ఎవరు తీస్తారనే ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే రెండు పనులను ఒంటి చేత్తే చేసేశాడు మీరు ఇప్పుడు చూడబోయే ఫొటోగ్రాఫర్. పెళ్లికి బంధువులంతా గుమికూడారు. ఇంట్లో సందడి బాగా నెలకొంది. ఆ సందడిని మరింత పెంచాడు పెళ్లికి వచ్చిన ఫొటోగ్రాఫర్. బంధువులతో పాటు కలిసి చిందులు వేశాడు. ఓ వైపు ఫొటోలు తీస్తూనే మరోవైపు వీడియోలు తీశాడు. పెళ్లికి వచ్చిన బంధువులు కూడా అతనితో పాటు కలిసి స్టెప్పులు వేశారు. if your wedding camera man ain’t doing this …..ask for refund pic.twitter.com/UGOwDdedi5 — Punjabi Touch (@PunjabiTouch) August 14, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేవలం రెండు రోజుల్లోనే 2 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ డ్యాన్సుకు నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. డ్యాన్సు చేస్తూ ఫొటోలు తీసినందుకు అతన్ని మెచ్చుకున్నారు. అతను తీసిన ఫొటోలు ఎలా ఉన్నాయో చూడాలని ఉందంటూ మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ఇదీ చదవండి: స్టైలిష్ లుక్లో రాహుల్ గాంధీ.. లద్దాఖ్లో బైక్ టూర్.. -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ
-
ఆదివాసీలతో మంత్రి అప్పలరాజు డ్యాన్స్
-
ఐస్ క్రీం ఫ్రీగా ఇస్తామంటే డాన్స్ చేయకుండా ఆగుతామా?
ఉచితంగా ఇస్తామంటే ఏ పని చేయడానికి వెనకాడరు కదా!. అందులోకి ఫుడ్కి సంబంధిచింది అంటే ఇంక జనాలు ఎలా ఎగబడతారో చెప్పనవసరం లేదు. అందుకు పెద్ద చిన్నా అనే తేడా లేదు. అలాంటి ఘటనే బెంగళూరు చోటు చేసుకుంది. ఓ ఐస్క్రీం ఫాపు వాళ్లు డ్యాన్స్ చేస్తే ఐస్క్రీం ఫ్రీ అని ఆఫర్ ఇచ్చింది. అంతే ఇక..ఆ ఉచిత ఐస్క్రీంల కోసం వృద్ధులు యువత అనే తేడా లేకుండా పోటాపోటీగా డ్యాన్సుల చేసి మరీ ఐస్క్రీంని ఆరగించి వెళ్తున్నారు. మాములుగా ఏదైన ఈవెంట్ పరంగా చేయాల్సి వస్తే డ్యాన్స్ చేసేందుకు ఎవరూ ముందుకు రారు. ఇలాంటప్పుడూ మాత్రం డ్యాన్స్లు వచ్చినా రాకపోయినా రెండు స్టెప్లు ఏదోరకంగా వేసి మరీ తమ తడాఖా ఏంటో చూపిస్తారు. ఇలాంటి విచిత్రమైన ఆఫర్లు ఉంటే జనాల్లో దాగున్న అన్ని టాలెంట్లు బయటకు వచ్చేస్తాయి కూడా. అయితే ఎందుకిలా బెంగళూరుషాపు వాళ్లు ఈ ఆఫర్ పెట్టారంటే..ఐస్క్రీం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఔనా! అయితే ప్రతి జూలై మూడోవ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా నేషనల్ ఐస్క్రీం డేని జరుపుకుంటారు. ఈ ఏడాది అదికాస్త జూలై 16న వచ్చింది. ఆ సందర్భంగా బెంగళూరులోని ప్రఖ్యాతిగాంచిన ఓ ఐస్క్రీం షాపు ఏదైన వినూత్న రీతిలో కస్టమర్లకు ఐస్క్రీంని సర్వ్ చేయాలనుకుంది. అందులో భాగంగా ఇలాంటి వైరైటీ ఆఫర్ ఇచ్చింది కస్టమర్లకు. ఆ షాపు వాళ్లు కస్టమర్లు అదిరిపోయే డ్యాన్స్లు చేస్తే ఐసీక్రీం ఫ్రీ అని బోర్డు పెట్టింది. అంతే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జనాలు ఇలా ఉత్సాహంగా ముందుకు వచ్చి తమ టాలెంట్ని చూపించారు. ఈ మేరకు సదరు ఐస్క్రీం షాపు అందుకు సంబందించిన వీడియోని ఇన్స్టాగ్రాంలో నెటిజన్లతో పంచుకుంది. ఈ వేడుక మీ ప్రేమతో దిగ్విజయం జరిగింది అందుకు మా కస్టమర్లకు ధన్యావాదాలు అని ఇన్స్టాలో పేర్కొంది సదరు ఐస్క్రీం షాపు యాజమాన్యం. View this post on Instagram A post shared by Corner House Ice Creams (@cornerhouseicecreams) (చదవండి: సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!) -
లండన్ వీధుల్లో నాటు నాటు సాంగ్.. అదరగొట్టిన మహిళలు!
ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే నాటునాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఓ రేంజ్లో ఊపేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో దక్కించుకుంది. తాజాగా నాటునాటు పాటకు లండన్లో డ్యాన్స్ చేస్తూ అలరించారు. ఏకంగా 700 మంది లండన్ వీధుల్లో స్టెప్పులేస్తూ సందడి చేశారు. (ఇది చదవండి: సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!) ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. మహిళలంతా శారీలతో ఆర్ఆర్ఆర్ సాంగ్కు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరలు ధరించిన మహిళలు లండన్ వీధుల్లో దుమ్ములేపారు. లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల నాటు నాటు స్టెప్పులతో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సాంగ్ క్రేజీ మామూలుగా లేదంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్. (ఇది చదవండి: సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!) Naatu Naatu opposite 10 Downing Street today https://t.co/neqM08DJuu pic.twitter.com/WMIUfvSqqD — Naomi Canton (@naomi2009) August 7, 2023 The saree walkathon ended up at Gandhi's statue in Parliament Square opposite Big Ben. The aim was to promote hand-woven sarees from across India to mark national handloom day. https://t.co/neqM08DJuu pic.twitter.com/kcqqPR1gil — Naomi Canton (@naomi2009) August 7, 2023 -
థియేటర్లో యాంకర్ రచ్చ రచ్చ.. భర్తతో కలిసి!
ప్రముఖ యాంకర్, బిగ్బాస్ ఫేం లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో యాంకర్ రవితో జతకట్టి బుల్లితెరపై అలరించిన భామ.. ఆ తర్వాత మంజునాథ్ను ప్రేమ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత లాస్య యాంకరింగ్ గుడ్బై చెప్పిన లాస్య.. గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనివ్వగా.. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే యూట్యూబ్ చానల్ను రన్ చేస్తుంది. ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన లాస్య సోషల్ మీడియాలో ఎప్పుడు చురుక్కుగ్గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. (ఇది చదవండి: నీ భార్యగా గర్వపడుతున్నా.. భర్తపై యాంకర్ లాస్య ఎమోషనల్ పోస్ట్) తాజాగా లాస్య తన ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తన భర్తతో కలిసి థియేటర్లో హంగామా చేసింది. ఈ జంట మరింత రొమాంటిక్గా అందరి ముందే రెచ్చిపోయారు. ఆమె భర్త మంజునాథ్ థియేటర్లోనే లాస్యకు మరోసారి ప్రపోజ్ చేస్తూ రచ్చ చేశారు. ఇదంతా సూర్య హీరోగా నటించిన సూర్య సన్ఆఫ్ కృష్ణన్ రీ-రిలీజ్ థియేటర్లో జరిగింది. ఆ చిత్రంలోని సీన్ను అనుకరిస్తూ లాస్య చేసిన హంగామా చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: 'ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ ) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
రోడ్డుపై అర్థనగ్నంగా యువతి నృత్యం.. ఒళ్లు మండిన యువకుడు చేసిన పని ఇదే..
రీల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న యువత ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఏమి చేసేందుకైనా వెనుకాడటం లేదు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిపివేసి డ్యాన్స్ చేయడం, రైలుకు ఎదురుగా నిలుచుని పోజులు కొట్టడం లాంటి ఎన్నో చేష్టలు చేసేవారు కూడా ఎందరో ఉన్నారు. అయితే ఇటువంటి సందర్బాల్లో కొందరు.. పోలీసుల చేతికి చిక్కుతున్నారు. తాజాగా ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. వీడియోలో రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక యువతి అర్థనగ్నంగా నిలుచుని డాన్స్ చేస్తూ ఉంటుంది. మ్యూజిక్కు అనుగుణంగా తన నడుమును వయ్యారంగా తిప్పుతుంది. ఆమె రోడ్డు మధ్యలో నిలుచుని వయ్యారాలు ఒలకబోస్తుడటంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఈ డాన్స్ వేన్తున్న యువతి స్నేహితురాలు దీనినినంతా వీడియో తీస్తుంటుంది. డాన్స్ చేస్తున్న యువతి ఈ రోడ్డుంతా తనదే అన్నట్లు ఎవరినీ పట్టించుకోకుండా డాన్స్ చేస్తుంటుంది. అయితే ఆమె తీరుకు ఆగ్రహించిన ఒక యువకుడు తన బైక్ ముందుకు పోనిచ్చి , ఆ యువతిని ఒక్క దెబ్బ కొట్టి వెళ్లిపోతాడు. ఈ వీడియో @Bornakang అనే పేరుగల యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 8 మిలియన్లు వ్యూస్ దక్కాయి. 85 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకారకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రోడ్డుపై ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తూ ఇలా డాన్స్ చేయడం తగినది కాదని వారంటున్నారు. ఇది కూడా చదవండి: 6 అంగుళాల భూమి కోసం దారుణ హత్య.. కాల్ చేసినా స్పందించని పోలీసులు! I can’t even blame him pic.twitter.com/lWydnPjk7b — Lance🇱🇨 (@Bornakang) July 26, 2023