టీడీపీతో పొత్తు లేకపోయినా తాము గెలుస్తామని, మెజారిటీ స్థానాలు సొంతంగా గెలువగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మునుగోడు అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమవుతున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి తెలియజేసినట్టు చెప్పారు. గెలవగలిగే వారికే టిక్కెట్లు ఇవ్వాలని రాహుల్ను కోరానన్నారు.