జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో భేటీ అయ్యారు. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఈనెల 23న జరిగే తన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కుమారస్వామి వారిని ఆహ్వానించారు.