చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లన్నీ మూతపడతాయనీ, ఇదివరకే 6 వేల ప్రభుత్వ స్కూళ్లు మూసేశారని, ఇకపై ఉన్న నాలుగు స్కూళ్లూ కూడా మూసేస్తారని అన్నారు. ఆ స్కూళ్ల స్థానంలో నారాయణ స్కూళ్లు వస్తాయని, ఆ స్కూళ్లలో ఇప్పుడు ఎల్కేజీ చదవడానికి రూ.25 వేలు వసూలు చేస్తున్నారని, బాబు అధికారంలోకి వస్తే ఫీజు రూ.లక్షకు పెంచుతారని విమర్శించారు. కాలేజీ చదువులకు తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం దాపురించిందని అన్నారు.