చంద్రబాబు నాయుడికి ఒక్కసారి ఓటేసినందుకు భూసేకరణ చట్టాన్ని పూర్తిగా సవరించారని, అలాగే భూరికార్డులను పూర్తిగా తారుమారు చేశారని అన్నారు. మరోసారి బాబుకు ఓటేస్తే మీకు భూములుండవని ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పుడు లారీ ఇసుక రూ.40 వేలు పలుకుతోందని, మరోసారి బాబుకు ఓటేస్తే లారీ ఇసుక రూ. లక్షకు చేరడం ఖాయమన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజురీయింబర్స్మెంట్ పథకాలన్నీ చంద్రబాబు పెట్టిన పథకాలు కాదు కాబట్టి క్రమ క్రమంగా తీసేస్తారని వైఎస్ జగన్ అన్నారు.