వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగోగులు, ఆయన చేపడుతున్న పాదయాత్ర గురించి రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో ఉండి టీడీపీ మంత్రులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, రాష్ట్రపతి ప్రసంగాన్ని కేబినెట్లో ఆమోదించిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 74, 75ను వారు అతిక్రమిస్తున్నారని కోవింద్కు వివరించినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.
Published Fri, Feb 9 2018 7:27 AM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement