Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Cabinet transfer of lands worth Rs 3,000 crore to anonymous company1
కేంద్ర సంస్థలకు రూ.కోట్లలో..'ఉర్సాకు ఊరికే'!

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర సంస్థలకైతే ఎకరా రూ.4 కోట్లు.. ఆర్మీకైనా సరే కోటికి తగ్గేది లేదు..! ఉర్సాకైతే ఊరికే! ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? ఊరూ పేరు లేని కంపెనీపై ఔదార్యం వెనుక గుట్టు ఏమిటి? ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు ఏర్పాటవుతుంటే ఏ ప్రభుత్వమైనా స్వాగతించి వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి భూముల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తుంది! కానీ.. ప్రముఖ కేంద్ర సంస్థల నుంచి ఎకరా రూ.నాలుగు కోట్ల చొప్పున వసూలు చేస్తూ.. ఊరూ పేరు లేని ఓ డొల్ల కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్లకుపైగా విలువ చేసే అత్యంత విలువైన దాదాపు 60 ఎకరాలను ఎకరా 99 పైసలకే కట్టబెట్టడం నాకింత.. నీకింత లాంటి లాలూచీ వ్యవహారాలకు పరాకాష్ట! పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలకు గతంలో చంద్రబాబు సర్కారు అమరావతిలో ఎకరా రూ.4 కోట్లు చొప్పున భూములను కేటాయించింది. హడ్కో, ఎల్‌ఐసీ, గెయిల్, ఎఫ్‌సీఐ, ఆర్బీఐ, ఎస్‌బీఐ, విజయా బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, రైల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనమిక్‌ సర్వీస్‌ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లు చొప్పున భూ కేటాయింపులు చేశారు. చివరకు దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్‌ ఆర్మీకి సైతం ఎకరా రూ.కోటి చొప్పున భూమిని కేటాయించడం గమనార్హం. ఇలా కేంద్ర, జాతీయ సంస్థలకు భూములిచ్చినందుకు భారీగా వసూలు చేస్తూ ఊరూ పేరు లేని అనామక ఉర్సా కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్ల విలువైన 59.86 ఎకరాల ఖరీదైన భూమిని అత్యంత కారు చౌకగా కట్టబెడుతూ తన బంధువులు, బినామీలు, సన్నిహితులకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడంలో చేతికి ఎముకే లేదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు మాత్రం మార్కెట్‌ ధరను తెరపైకి తేవడం.. బంధుగణం, బినామీలకు మాత్రం కారుచౌకగా ప్రభుత్వ భూములను రాసిచ్చేయడం సీఎం చంద్రబాబుకు రివాజు అని పారిశ్రామికవేత్తలు, అధికార వర్గాలే స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ తనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీ రావుకు చెందిన బోగస్‌ కంపెనీ ఐఎంజీ భారత్‌కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు.. శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో 450 ఎకరాల భూమిని కేటాయించడం చంద్రబాబు భూ సంతర్పణకు పరాకాష్టగా పేర్కొంటున్నారు. విభ­జన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను కొనసాగించారని ప్రస్తావిస్తున్నారు. భూ పందేరానికి ఆధారాలివిగో.. నారా లోకేశ్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్‌ తండ్రి ఎం.పట్టాభిరామారావుకు చెందిన వీబీసీ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన 498.93 ఎకరాల భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయిస్తూ 2015 జూలై 15న నాటి చంద్రబాబు సర్కార్‌ ఉత్తర్వులు (జీవో ఎంఎస్‌ నెంబరు 269) జారీ చేసింది. బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఆ భూముల విలువ అప్పట్లోనే రూ.498 కోట్లు. ఆ తర్వాత ఆ భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోకి తెస్తూ 2015 సెపె్టంబరు 22న ఉత్తర్వులు (జీవో ఎంస్‌ నెంబరు 207) జారీ చేయడం ద్వారా వాటి విలువను మరింతగా పెంచుకున్నారు. సత్తా లేని సంస్థకు సంతర్పణ..! జనసేన, బీజేపీతో జట్టుకట్టి 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన బంధువులు, సన్ని­హి­తులు, బినామీలకు ప్రభుత్వ భూములను ఇష్టారీతిన ధారాదత్తం చేస్తున్నారు. ఊరూ పేరూ లేని ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విశాఖలోని ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు.. ఎకరం కేవలం 99 పైసలకే కేటాయించడమే అందుకు నిదర్శనం. వాస్తవంగా ఆ భూముల విలువ రూ.3 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేవలం రెండు నెలల క్రితం ఏర్పాటైన కంపెనీకి రూ.5,278 కోట్ల పెట్టుబడి పెట్టి డేటా సెంటర్‌ ప్రాజెక్టును నెలకొల్పే సామర్థ్యం ఉందా.. లేదా? అన్నది పరిశీలించుకోకుండా భూ కేటాయింపులు చేశారంటే.. ఆ సంస్థ ఎవరి బినామీలదో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర సంస్థలకు మార్కెట్‌ ధరకే.. విశాఖలో గతంలో టీడీపీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మార్కెట్‌ ధరకే భూమిని కేటాయించారు. కీలకమైన నావికాదళ స్థావరం ఏర్పాటుకు ఇండియన్‌ నేవీతో పాటు ఎన్‌టీపీసీ విద్యుత్‌ ప్లాంటుకు కూడా మార్కెట్‌ ధరకే భూమి ఇచ్చారు. దీనికి భిన్నంగా ఉర్సాకు విశాఖలో అత్యంత ఖరీదైన ఐటీ పార్కులో 3.5 ఎకరాలతో పాటు కాపులుప్పాడలో ఏకంగా 56.36 ఎకరాలను కేటాయించేందుకు టీడీపీ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉర్సా కంపెనీ గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని నివాస ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాటు అడ్రస్‌తో ఏర్పాటు కాగా ‘ఎక్స్‌’ ఖాతాలో ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక పోస్టు పెట్టింది. అది కూడా భూ కేటాయింపులపై విమర్శల నేపథ్యంలో వివరణ ఇస్తూ చేసిన పోస్టు మాత్రమే. ఇక ఈ ఖాతాను కేవలం ఒకే ఒక్కరు ఫాలో అవుతుండటం గమనార్హం. దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రక్షణ వ్యవస్థలో భాగ­స్వామిగా ఉన్న ఇండియన్‌ నేవీకి కూడా మార్కెట్‌ ధరకే భూమిని కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఉర్సాకు మాత్రం నామమాత్ర ధరకే సంతర్పణ చేయడం వెనుక భారీ వ్యవహారమే ఉందనే ఆరోపణలున్నాయి. విశాఖలోని కీలకమైన ఏపీ సెజ్‌లో ఎకరా ధర లీజు రూ.35 లక్షల మేర పలుకుతోంది. ఏ సంస్థకు భూమి కావాలన్నా ఇదే ధర చెల్లించి భూమిని లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ సంస్థ కార్యాలయం నిర్మాణం కోసం అనకాపల్లిలోని రాజుపాలెం వద్ద మార్కెట్‌ ధర మేరకు ఎకరా రూ.80 లక్షల చొప్పున సర్వే నెంబరు 75/3లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 25 జనవరి 2016న టీడీపీ సర్కారు 326/2016 జీవోను జారీ చేసింది. నిబంధనలు ఏం చెబుతున్నాయి?2012లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు (జీవో నెంబరు 571– 14–9–2012) ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో.. మార్కెట్‌ విలువ మీద వార్షిక లీజు రెంటల్‌ పది శాతం కంటే తక్కువ ఉండకూడదు. లీజును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్‌æ ధర ఆధారంగా సవరించాలి. విశాఖలో టీసీఎస్‌తో పాటు ఉర్సాకు ఇవ్వనున్న భూమి రిజిస్ట్రేషన్‌ ధరల మేరకే చదరపు గజం రూ. 30 వేల వరకు ఉంది. ఇక మార్కెట్‌ ధరను గనుక తీసుకుంటే రూ.లక్ష వరకూ పలుకుతోంది. ఇంత విలువైన భూమిని ఊరూ పేరు లేని ఉర్సాకు ఎకరం 99 పైసలకే ఇచ్చేందుకు టీసీఎస్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి కథ నడిపినట్లు స్పష్టమవుతోంది.

Indian Govt Banned Pakistan YouTube Channels2
పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన భారత్‌.. వాటిపై నిషేధం

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం మరో షాకిచ్చింది. పాకిస్తాన్‌ యూట్యూబ్‌ ఛానళ్ల(Ban on Youtube Channels)పై భారత్‌ ఉక్కుపాదం మోపింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లపై భారత్‌లో నిషేధం విధించారు. ఇక, నిషేధం విధించిన వాటిలో మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఛానల్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే పాకిస్తాన్‌ ట్విట్టర్‌, సినిమాలపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో బీబీసీ చానల్స్‌కు సైతం భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఉగ్రవాదులను మిలిటెంట్లుగా అభివర్ణించిన బీబీసీకి ప్రభుత్వం నోటీసులు అందజేసింది.భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాకిస్థాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించింది. పాక్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్‌ న్యూస్‌, జియో న్యూస్‌, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది.🚨 BIG BREAKING Modi govt BANS 16 #Pakistani #YouTube channels, including Dawn, Samaa TV, ARY, Geo News etc for spreading provocative content and false narratives against India, Army, and security forces after the Pahalgam terror attack.— Shoaib Akhtar’s channel also BLOCKED pic.twitter.com/DOzHwxgp4N— HIND KE SITARA ✨ (@ChanakyaRashtra) April 28, 2025ఇందులో భాగంగా.. ఈ ఛానళ్లను తెరవగానే.. కంటెంట్‌ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని కనిపిస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్‌, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Kuppam Municipal Chairman Election Updates3
కుప్పం మున్సిపల్‌ చైర్మైన్‌ ఎన్నిక.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల రాక

కుప్పం మున్సిపల్‌ చైర్సన్‌ ఎన్నికల అప్‌డేట్స్‌..కుప్పంలో 144 సెక్షన్‌నేడు ఉదయం 11 గంటలకు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికబెంగళూరు క్యాంపు నుంచి వైఎస్సార్‌సీపీ పార్టీ కౌన్సిలర్లతో కుప్పంకు ట్రైన్‌లో బయలుదేరిన ఎమ్మెల్సీ భరత్కుప్పం రైల్వేస్టేషన్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు పోలీస్ భద్రతతో రానున్న కౌన్సిలర్లుఎమ్మెల్సీ భరత్ ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశంబెంగళూరు క్యాంపు నుంచి వస్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు బందోబస్తు కల్పించాలని హైకోర్టు ఆదేశాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 మంది కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన రెండో వార్డు కౌన్సిలర్ మునిరాజా ఈరోజు కుప్పంలో 144 సెక్షన్ అమలు..పోలీసుల కనుసన్నల్లోనే కుప్పంమున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులుఅడిషనల్ ఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, ఐదు మంది సీఐలు, ఏడుగురు ఎస్సై లు, కానిస్టేబుల్స్, 92 మందితో మున్సిపల్ ఎన్నికలు గుంటూరు..నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికబలం లేకపోయినా మేయర్ అభ్యర్థి నిలబెట్టిన కూటమి ప్రభుత్వంగుంటూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 57 డివిజన్లువైఎస్సార్‌సీపీ-46, టీడీపీ-9, జనసేన-2 స్థానాల్లో గత ఎన్నికల్లో విజయంవైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన నాయకులుఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టి తమ వైపుకు తిప్పుకున్న కూటమి నేతలువైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు కూటమి నేతలు ప్రలోభాలు, బెదిరింపులుకార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్న కూటమి నేతలుమేయర్ ఎన్నికల్లో విప్ జారీచేసిన వైఎస్సార్‌సీపీ..అచ్చాల వెంకటరెడ్డిని మేయర్ అభ్యర్థిగా ఎన్నుకున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు 👉ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో దౌర్జన్యం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వైఎస్సార్‌సీపీకి సంఖ్యా బలం అధికంగా ఉన్నప్పటికీ.. ప్రలోభాలు, దౌర్జన్యాలతో ఎలాగైనా సరే ఆ పదవిని చేజిక్కించుకోవడానికి టీడీపీ బరితెగించింది. కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.👉వైఎస్సార్‌సీపీకి చెందిన డా. సుధీర్‌ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్‌పర్సన్‌ పదవితో పాటు కౌన్సిలర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం 25 వార్డులకు గాను వైఎస్సార్‌సీపీ 19, టీడీపీ కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సుధీర్‌ రాజీనామా చేసినప్పటికీ 18 మందితో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయినప్పటికీ టీడీపీ ‘ముఖ్య’ నేత సూచన మేరకు ఆ పార్టీ నేతలు కొందరు బరితెగిస్తూ నేరుగా రంగంలోకి దిగారు. బెదిరింపులు, తాయిలాలతో కౌన్సిలర్లను దారిలోకి తెచ్చుకుని చైర్మన్‌ గిరీ కొట్టేయాలని కుట్రకు తెరతీశారు. నేడు విశాఖ, గుంటూరు మేయర్ల ఎన్నిక👉అలాగే.. విశాఖపట్నం, గుంటూరు నగర మేయర్‌ పదవులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు మున్సిపాలిటీలలో మొత్తం తొమ్మిది పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కుప్పం, తుని, పాలకొండలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులకు.. మాచర్ల, తాడిపత్రి (2), తునిలో వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఈనెల 22న నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

Supreme Court Lawyer Prashant Bhushan Raises Concerns Over Ursa Land Deal4
‘ఇది చాలా తప్పు చంద్రబాబు’.. ఉర్సా ల్యాండ్‌ డీల్‌పై సుప్రీం న్యాయవాది ఆగ్రహం

సాక్షి,విజయవాడ: ఉర్సా ల్యాండ్‌ డీల్‌పై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉర్సాకి రూ.3వేల కోట్ల విలువైన భూముల్ని చంద్రబాబు కట్టబెట్టారు. అయితే, ఊరుపేరు లేని ఉర్సాకి వేలకోట్ల భూముల్ని కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆఫీస్‌,ట్రాక్‌ రికార్డ్‌ లేని ఉర్సాకి భూ కేటాయింపులపై ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాకు కోట్ల విలువైన భూముల్ని కేటాయించడంపై విమర్శలు గుప్పించారు. ఆఫీసు లేదు, ట్రాక్ రికార్డ్ లేదు. రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంది? వావ్! చంద్రబాబు ప్రభుత్వం ఘోస్ట్‌ కంపెనీకి 59.6 ఎకరాల భూమిని దాదాపు ఉచితంగా బహుమతిగా ఇచ్చింది! పూర్తిగా చట్టవిరుద్ధం! 59.6 ఎకరాలు ఘోస్ట్‌ కంపెనీకి కేటాయించడం చట్ట వ్యతిరేకం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. No Office, No Track Record: How a Two-Month-Old Firm Landed a Multi-Crore Deal With Andhra Govt. Wow!59.6 Acres of land gifted virtually free to this ghost company by the CB Naidu govt! Totally illegal!Is it kickbacks or connections with Top officials? https://t.co/XzoU8HVCp4— Prashant Bhushan (@pbhushan1) April 22, 2025ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? అంటూ ఉర్సా ల్యాండ్‌ డీల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీసీఎస్ కంటే ఎక్కువగా ఉర్సాకి భూ కేటాయింపులపై అనుమానాలు తలెత్తతున్నాయి.అయినా సరే ఉర్సా ల్యాండ్ డీల్‌పై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నోరు మెదకపోవడం గమనార్హం. ఉర్సా డైరెక్టర్ అబ్బూరి సతీష్‌తో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి భాగస్వామ్యం ఉంది. కేశినేని చిన్ని, అబ్బూరి సతీష్ బంధం బయటపడటంతో ఉర్సా ల్యాండ్ డీల్‌పై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చాంశనీయంగా మారింది.

IPL 2025, DC VS RCB: Virat Kohli Missed The Record Of Most Runs Scored Against An Opponent In IPL By 5 Runs5
DC VS RCB: భారీ రికార్డును తృటిలో మిస్సైన విరాట్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 27) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఓ భారీ రికార్డును తృటిలో మిస్‌ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ మరో 5 పరుగులు చేసుంటే ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్థిపై (ఏ ప్రత్యర్థిపై అయినా) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పి ఉండేవాడు. ఈ రికార్డు డేవిడ్‌ వార్నర్‌ పేరిట ఉంది. వార్నర్‌ పంజాబ్‌ కింగ్స్‌పై 1134 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్థిపై ఓ ఆటగాడు చేసిన అత్యధిక పరగులు ఇవే. నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీపై చేసిన 51 పరుగులతో ఆ ఫ్రాంచైజీపై విరాట్‌ చేసిన పరుగుల సంఖ్య 1130 పరుగులకు చేరింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ మరో 5 పరుగులు చేసుంటే వార్నర్‌ రికార్డు బద్దలు కొట్టి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకుని ఉండేవాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ 47 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి దుష్మంత చమీరా బౌలింగ్‌లో మిచెల్‌ స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు1134 - డేవిడ్ వార్నర్ vs PBKS1130 - విరాట్ కోహ్లీ vs DC*1104 - విరాట్ కోహ్లీ vs PBKS1093 - డేవిడ్ వార్నర్ vs KKR1084 - విరాట్ కోహ్లీ vs CSK1083 - రోహిత్ శర్మ vs KKRకాగా, నిన్నటి మ్యాచ్‌లో విరాట్‌ బాధ్యాతాయుతమైన హాఫ్‌ సెంచరీతో సత్తా చాటడంతో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అ‍గ్రస్థానానికి ఎగబాకింది. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్‌ సైతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నాడు. విరాట్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 6 అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్‌వుడ్‌ 2, యశ్‌ దయాల్‌, కృనాల్‌ తలో వికెట్‌ తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేసి ఢిల్లీని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (41), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్‌ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్‌ (47 బంతుల్లో 51; 4 ఫోరు​), కృనాల్‌ (47 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్‌ తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.టిమ్‌ డేవిడ్‌ (5 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ‌ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటిన కృనాల్‌ పాండ్యాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) సీఎస్‌కేతో (బెంగళూరులో) తలపడనుంది.

Enforcement Directorate Not Responded To Mahesh Babu's Letter6
విచారణకు రానన్న మహేశ్‌.. ఈడీ స్పందనపై ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: సాయిసూర్య డెవలపర్స్‌ కేసులో ఆ సంస్థ ప్రచారకర్త మహేశ్‌బాబు (Mahesh Babu)ను ఈడీ (Enforcement Directorate) విచారణకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే! అయితే షూటింగ్స్‌తో బిజీగా ఉన్న కారణంగా నేడు (ఏప్రిల్‌ 28) విచారణకు రాలేనని, మరో తేదీ ఇవ్వాలని మహేశ్‌ అధికారులకు లేఖ రాశాడు. దీనిపై ఈడీ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. మరి నేటి విచారణకు ఈడీ మినహాయింపు ఇస్తుందా? విచారణ కోసం మరో తేదీ కేటాయిస్తుందా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.ఏం జరిగింది?సాయిసూర్య డెవలపర్స్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేశ్‌బాబుకు రూ.3.5 కోట్లు చెక్‌ ద్వారా, రూ.2.4 కోట్లు క్యాష్‌ రూపంలో డబ్బు చెల్లించినట్లు ఆధారాలు సేకరించింది. మహేశ్‌బాబుకు అందిన డబ్బుపై ఆరా తీసేందుకు ఈడీ అతడిని విచారణకు రమ్మని ఆదేశించింది. కానీ రాజమౌళి సినిమా (SSMB29) షూటింగ్‌తో బిజీగా ఉన్నందున నేడు విచారణకు రాలేనని మహేశ్‌ ఈడీకి లేఖ రాశాడు. మరి దీనిపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి!చదవండి: హిట్‌ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని

Bill Gates Predicts 2-Day Work Week For Employees7
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్‌..

విపరీతమైన పని గంటలు, వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ వంటి అంశాలపై ఇటీవల చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న ఆందోళనలూ మరోవైపు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన అంచనాను వెల్లడించారు.వారానికి ఐదు.. ఆరు రోజులు పని, 9 టు 5 జాబ్‌.. ఈ సంప్రదాయ భావనలకు కాలం చెల్లిపోనుందా? ఈ పరిస్థితి మరీ అంత ఎక్కువ దూరంలో ఏమీ ఉండకపోవచ్చు. కృత్రిమ మేధస్సు ప్రపంచ శ్రామిక శక్తిని పునర్నిర్మించగలదని, వచ్చే దశాబ్దంలో ప్రామాణిక పని వారాన్ని కేవలం రెండు రోజులకు తగ్గించగలదని బిల్ గేట్స్ చెప్పారు.బిల్ గేట్స్ బోల్డ్ జోస్యంజిమ్మీ ఫాలన్ ది టునైట్ షోలో ఇటీవల కనిపించిన గేట్స్, ప్రస్తుతం మానవులు చేస్తున్న చాలా పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో నిర్వహిస్తుందని జోస్యం చెప్పారు. తత్ఫలితంగా, సాంప్రదాయ ఐదు రోజుల పని వారం అంటే వారంలో పనిచేసే రోజులు తగ్గిపోతాయని, విశ్రాంతి, సృజనాత్మకత, వ్యక్తిగత సంతృప్తి కోసం ఉద్యోగులకు ఎక్కువ సమయం లభిస్తుందని చెప్పుకొచ్చారు. దైనందిన జీవితంలో అపారమైన మార్పులను తీసుకురావడంతో పాటు వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత వంటి ప్రధాన సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కరించగలదని గేట్స్ పేర్కొన్నారు.పని గంటల్లో ఊహించని మార్పువారానికి ఐదు రోజులు, 40 పని గంటల విధానం దశాబ్దాలుగా ఆధునిక సమాజంలో లోతుగా పాతుకుపోయింది. కానీ ఇది నాటకీయంగా మారుతుందని గేట్స్ భావిస్తున్నారు. తయారీ, లాజిస్టిక్స్ దగ్గర నుండి విద్య, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటా కృత్రిమ మేధ (ఏఐ) సహాయం చేయడమే కాదు.. మనుషులు చేసే పనిని కూడా భర్తీ చేస్తుందని ఆయన ఊహిస్తున్నారు. ఈ మార్పు ఉద్యోగం అర్థాన్నే పునర్నిర్వచించగలదని గేట్స్ సూచిస్తున్నారు. వారంలో రెండు లేదా మూడు రోజులే పనిచేసే రోజులొస్తాయంటున్నారు.సృజనాత్మకత పెంపు, సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఆర్టిఫీషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స​ (ఏజీఐ) సామర్థ్యం గురించి గేట్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఇది కలిగించే సామాజిక, ఆర్థిక అంతరాయాల గురించి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. తయారీ, రవాణా, వ్యవసాయం వంటి కార్యకలాపాల్లో యంత్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, సాంస్కృతిక, భావోద్వేగ కారణాల వల్ల సమాజం కొన్ని మానవ కేంద్రీకృత కార్యకలాపాలను సంరక్షిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Chilakaluripeta TDP Chunduri Uday Mother and Son Incident8
టీడీపీ నాయకుడి దురాగతం.. ఆస్తి కోసం అక్క, తల్లిపై దాడి

సాక్షి, చిలకలూరిపేట: ఆస్తి కోసం సొంత అక్క, తల్లిపైనే టీడీపీ యువనాయకుడు కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం జరిగినదిగా తెలుస్తున్న ఈ ఘటన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చిలకలూరిపేట పట్టణ పోలీసులను ఆశ్రయించినా నిందితుడు స్థానిక ఎమ్మెల్యేకు అనుంగ అనుచరుడు కావడంతో పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనపై బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని పండరీపురానికి చెందిన టీడీపీ యువనాయకుడు చుండూరి ఉదయ్‌ వడ్డీ వ్యాపారం చేస్తాడు. రూ.3కోట్ల విలువ చేసే ఆస్తి వ్యవహారానికి సంబంధించి తల్లి, అక్క నాగలక్షి్మతో ఉదయ్‌కు వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో అతని తల్లి నాగలక్ష్మికి డబ్బు చెల్లించాలని అడిగారు. దీనికి ఉదయ్‌ అంగీకరించకపోవడంతోపాటు తల్లి, అక్కను కిందపడేసి కాళ్లతో కర్రలతో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాధితురాలు నాగలక్ష్మి ఉదయ్‌ దాడికి పాల్పడిన దృశ్యాలతో కూడిన వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదని, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ తమ ప్రాణాలు కాపాడాలని సోషల్‌మీడియా వేదికగా వేడుకున్నారు. ఈ విషయంపై అర్బన్‌ సీఐ పి.రమేష్‌ను ఫోన్లో వివరణ కోరగా బాధితులు పోలీసు స్టేషన్‌కు వచి్చన మాట వాస్తవమేనని అయితే, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వ్యవహారం మాట్లాడి రాజీ చేసుకుంటామని వెళ్లిపోయారని వివరించారు. బాధితులు కేసు నమోదు చేయమంటే నమోదు చేస్తామని వివరించారు.

Rajasthan Medical Graduate Bhawana Yadav Is No More9
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్‌

జైపూర్‌: పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థిని భావన యాదవ్‌ (25) జీవితం అర్ధాంతరంగా ముగిసింది. శరీరంపై కత్తిపోట్లు, తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భావన మృత్యువుతో పోరాడి మృతి చెందారు.పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ ప్రకారం..రాజస్థాన్‌ రాష్ట్రం హిసార్ జిల్లాకు చెందిన భావన యాదవ్‌ (25) వైద్య విద్యార్థిని. 2023లో పిలిప్పిన్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. విదేశాల్లో తన పోస్టు గ్రాడ్యుయేషన్‌ మెడికల్‌ కోర్సులైన డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌(ఎండీ), మాస్టర్‌ ఆఫ్‌ సర్జరీ(ఎంఎస్‌)చదివేందుకు కావాల్సిన మెడికల్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) నిర్వహించే పరీక్షల కోసం ఢిల్లీలో కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆమె వారం వారం రాజస్థాన్‌ నుంచి ఢిల్లీకి వస్తారు. అనంతరం, తిరిగి తన స్వగ్రామానికి వెళ్లే వారు.ఎప్పటిలాగే రాజస్థాన్‌ నుంచి ఢిల్లీలో ఉంటూ యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న తన అక్క రూంకు వచ్చారు. ఏప్రిల్ 21, 22న పరీక్షలు రాసి ఏప్రిల్‌ 23న తన తల్లితో ఫోన్‌లో మాట్లాడారు. ఏప్రిల్‌ 24న ఉదయం ఇంటికి వస్తానని చెప్పారు. కానీ ఆమె ఇంటికి వెళ్లలేదు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చేరింది. ఏప్రిల్ 24 న ఉదేష్ యాదవ్ అనే వ్యక్తి ఆమె తల్లి గాయత్రికి ఫోన్‌ చేశాడు. భావన తీవ్రంగా కాలిన గాయలయ్యాయని, అత్యవసర చికిత్స నిమిత్తం హిసార్‌లోని సోని హాస్పిటల్‌లో చేరినట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో గాయత్రి సోని ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఘటన తాలుకూ వివరాలు కనిపెట్టలేకపోయింది. భావన తీవ్రంగా కాలిపోవడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం జైపూర్‌ తరలించారు. చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 24న రాత్రి మరణించడం విషాదంగా మారింది.వైద్యం జరిగే సమయంలో భావన శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించానని, ఆ తర్వాత ఆమెను తగలబెట్టిన ఆనవాళ్లు ఉన్నట్లు గాయత్రి యాదవ్‌ జైపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెది సహజ మరణం కాదని, హత్య చేసేందుకు కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తూ.. భావన ల్యాప్‌ టాప్, మొబైల్ ఫోన్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు అందుబాటులో లేవని కూడా చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

IRCTC Karnataka Tour Package: Karnatakas Temple And Tourist Spots10
ఐఆర్‌సీటీసీ డివైన్‌ కర్నాటక ప్యాకేజ్‌..! ఏమేమి దర్శించొచ్చంటే..

ఉడుపి శ్రీకృష్ణుడిని చూడాలి. శృంగేరి శారదామాతను దర్శించాలి. కుక్కె సుబ్రహ్మణ్యం... మంగళాదేవి...కుద్రోలి గోకర్ణనాథేశ్వర స్వామి ఆలయం. కద్రి... ధర్మస్థల మంజునాథులనూ చూడాలి.అన్నింటినీ ఓకే ట్రిప్‌లో చుట్టేయవచ్చు. ఐఆర్‌సీటీసీ డివైన్‌ కర్నాటక ప్యాకేజ్‌ ఉంది. పై వాటితోపాటు మాల్పె... తన్నేర్‌బావి బీచ్‌లు. మినీ గోమఠేశ్వరుడు ఈ టూర్‌లో బోనస్‌.మొదటి రోజుఈ రైలు హైదరాబాద్‌లో బయలుదేరి తెలంగాణలో జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్‌ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్, డోన్, గుత్తి, యరగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తమిళనాడులోకి ప్రవేశించి కాట్పాడి, జోలార్‌పేట, సేలం జంక్షన్, ఈ రోడ్‌ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూర్‌ జంక్షన్‌ తర్వాత కేరళలో అడుగుపెట్టి పాలక్కాడ్, షోర్‌నూర్, తిరూర్, కోళికోద్, వాడకర, తలస్సెరి, కన్నూరు, పయ్యనూర్, కన్హాగాడ్, కాసర్‌గోడ్‌ దాటిన తర్వాత కర్నాటకలో ప్రవేశించి మొత్తం 33 గంటలకు పైగా ప్రయాణించి 1532 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుని మంగళూరు సెంట్రల్‌ స్టేషన్‌కు చేరుతుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక ఐదు దక్షిణాది రాష్ట్రాలను చుట్టేస్తుందన్నమాట. ఇది కేవలం మన గమ్యాన్ని చేరే ప్రయాణంగా భావిస్తే మంగళూరు చేరేలోపే బోర్‌ కొడుతుంది. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, కంటికి కనిపించిన అన్నింటినీ గమనిస్తూ, మనోనేత్రంతో విశ్లేషించుకుంటూ సాగితే ఐదు రాష్ట్రాల వైవిధ్యాన్ని, ప్రజల జీవనశైలిని ఒకే ప్రయాణంలో ఆస్వాదించవచ్చు.రెండోరోజుఉదయం తొమ్మిదన్నరకు మంగళూరుకు చేరుతుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉడుపికి ప్రయాణం. హోటల్‌లో చెక్‌ ఇన్‌. శ్రీకృష్ణ ఆలయ దర్శనం, మాల్పే బీచ్‌ విహారం తర్వాత రాత్రి బస ఉడుపిలోనే. ఉడుపిలోని శ్రీకృష్ణుడిని ద్వైత తత్వాన్ని బోధించిన మధ్వాచార్యుడు స్థాపించాడు. ఈ ఆలయానికి వెళ్లినప్పుడు కళ్లు మూసుకుని స్మరించుకుని వెనక్కి వచ్చేశారంటే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని కనులారా వీక్షించాలి. దర్శనం కోసం క్యూలో ఉన్నంత సేపు ఆలయ ప్రాంగణాన్ని, అక్కడి ఆచార సంప్రదాయాలను గమనించాలి. బయటకు వచ్చిన తర్వాత గోపురాన్ని, శిల్పాలను నిశితంగా పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే వెనుదిరగాలి. ఎందుకంటే ఈ నిర్మాణం ఓ వైవిధ్యం. ఇలాంటి ఆలయం దేశంలో మరొకటి లేదు. శ్రీకృష్ణుడి దర్శనం తర్వాత మాల్పె బీచ్‌ విహారానికి వెళ్లవచ్చు. దీనిని ఒక అడ్వెంచర్‌ పార్క్‌ అని చెప్పాలి. స్టాల్స్‌లో దొరికే కన్నడ చిరుతిళ్లను రుచి చూస్తూ అరేబియా తీరాన సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ సమయం గడపవచ్చు. టైమ్‌ ఉంటే సెయింట్‌ మేరీ ఐలాండ్‌కు వెళ్లిరావచ్చు. ఉడుపిలో ఉన్న రోజు మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనంలో రకరకాల ఉడుపి రుచులను ఆస్వాదించడం మర్చిపోవద్దు. ఉడుపి హోటళ్లలో శాకాహారంతోపాటు మాంసాహారంలో స్థానిక స్పెషల్‌ వంటకాలను రుచి చూడాలి. ఎప్పుడూ సందడిగా ఉంటాయి. దేశమంతటా విస్తరించిన ఉడుపి హోటళ్లు ఎప్పుడూ సందడిగా ఉంటాయి. అలాంటిది ఉడుపిలో అసలు సిసలైన ఉడుపి రుచులను అసలే మిస్‌ కాకూడదు. ఇక్కడ తుళు భాష ఎక్కువగా మాట్లాడతారు. తుళు అంటే... దేశ భాషలందు తెలుగు లెస్స అని మన తెలుగును ప్రశంసించిన కృష్ణదేవరాయల మాతృభాష.మూడోరోజుశృంగగిరి చల్లదనం..శారదామాత వీక్షణంశృంగేరిలోని శారదాపీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాల్లో ఒకటి. రామాయణంలోని బాలకాండలో రుష్యశృంగుడి గురించిన ప్రస్తావన ఉంది. ఆ రుష్యశృంగుడు తపస్సు చేసుకున్న కొండ కావడంతో దీనికి శృంగగిరి శృంగేరి అనే పేరు వచ్చింది. ఎండకాలం చల్లగా ఉంటుంది. విద్యాశంకర ఆలయ నిర్మాణ కౌశలాన్ని ఆస్వాదించి, శారదామాత దర్శనంతో ఆశీస్సులు పొందిన తర్వాత ఆది శంకరాచార్యుని ఆలయం, శృంగేరి మఠం చూడాలి. హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి శృంగేరి వైపు సాగి΄ోవాలి. శారదాంబ ఆలయ దర్శనం తర్వాత మంగళూరుకు ప్రయాణం. రాత్రి బస మంగళూరులో.నాల్గోరోజునేత్రానందం మంజునాథాలయంధర్మస్థలకు ప్రయాణం, మంజునాథ ఆలయ దర్శనం, ఆ తర్వాత కుక్కె సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని సాయంత్రానికి మంగుళూరు చేరాలి. ఆ రాత్రి బస కూడా మంగళూరులోనే. ఇక ధర్మస్థల... నేత్రావతి నది తీరం. ఇక్కడ మంజునాథ ఆలయంతోపాటు మంజూష మ్యూజియాన్ని కూడా చూడాలి. ఇది పరిశోధన గ్రంథాల నిలయం. మాన్యుస్క్రిప్ట్‌లు, పెయింటింగ్‌లున్నాయి. పక్కనే ఒక కొండ మీద 39 అడుగుల గోమఠేశ్వరుడిని చూడాలి. ఇది యాభై ఏళ్ల కిందట చెక్కిన శిల్పం. బాహుబలిగా చెప్పుకునే అసలు గోమఠేశ్వరుడి విగ్రహం కాదిది. అసలు గోమఠేశ్వరుని ప్రతిరూపాలు మరో నాలుగున్నాయి కర్నాటకలో. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న వింటేజ్‌ కార్‌ మ్యూజియాన్ని కూడా విజిట్‌ చేయవచ్చు. పరశురాముడి క్షేత్రంకుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలయం... ఇది కుమారధార నది తీరాన ఉంది. ఐదు వేల ఏళ్ల నాటి ఆలయం. ఇది కార్తికేయుడి ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి పేరుతో పూజలందుకుంటున్నాడు. గరుడుని బారి నుంచి తప్పించుకోవడానికి వాసుకి ఇక్కడకు వచ్చాడని చెబుతారు. పురాణేతిహాసాల ప్రకారం ఈ ప్రదేశం పరశురాముడు స్థాపించిన ఏడు క్షేత్రాల్లో ఇదొకటి.ఐదోరోజుమంగళాదేవి ఆలయం విశాలంగా ఉంటుంది. చక్కటి గోపురం, లోపల నిర్మాణాలకు ఎర్ర పెంకు పై కప్పు, వర్షపునీరు జారి΄ోవడానికి వీలుగా ఏటవాలుగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటుంది. కద్రి మంజునాథ ఆలయ గోపురం ప్రత్యేకమైన వాస్తుశైలిలో ఉంటుంది. ఇక టూర్‌లో సేదదీరే ప్రదేశం తన్నేర్‌బావి బీచ్‌. ఇది పర్యటనకు అనువైన ప్రదేశంగా బ్లూ ప్లాగ్‌ గుర్తింపు పొందిన బీచ్‌. వీలైతే సూర్యాస్తమయాన్ని వీక్షించవచ్చు. ఇక చివరగా కుద్రోలి గోకర్ణనాథేశ్వర ఆలయం కొత్తది. రాజులు నిర్మించినది కాదు. కేవలం వందేళ్ల దాటింది. కన్నడ సంప్రదాయ యక్షగాన కళాకారుడు, యుద్ధవిద్య గారడి విన్యాసాలు చేసేవాళ్లు సమూహంగా మారి నిర్మించుకున్నారు. ఆరవ రోజురాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు కాచిగూడకు చేరుతుంది. పర్యటన అలసట తీరే వరకు విశ్రాంతి తీసుకున్న తర్వాత టూర్‌ మొదటి రోజు చూసిన ప్రదేశాల విండో టూర్‌ను మరోసారి ఆస్వాదించవచ్చు.ప్యాకేజ్‌ ఇలా...ప్యాకేజ్‌లో బస త్రీ స్టార్‌ హోటల్‌లో ఉంటుంది. ఏసీ వాహనాల్లో ప్రయాణం. మూడు రోజులు బ్రేక్‌ఫాస్ట్‌ ఉంటుంది. భోజనాలు, ట్రైన్‌లో కొనుక్కునే తినుబండారాలు, సైట్‌ సీయింగ్‌ ప్రదేశాల ఎంట్రీ టికెట్‌లు, బోటింగ్‌ – హార్స్‌ రైడింగ్‌ వంటి వినోదాల ఖర్చులు ప్యాకేజ్‌లో వర్తించవు. ఈ రైలు వారానికొకసారి మాత్రమే ఉంటుంది. ప్రతి మంగళవారం కాచిగూడలో బయలుదేరుతుంది.సింగిల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపు 39 వేలవుతుంది. ట్విన్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 23 వేలవుతుంది. ట్రిపుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలవుతుంది.డివైన్‌ కర్నాటక (ఎస్‌హెచ్‌ఆర్‌086). ఇది ఆరు రోజులు ఐదు రాత్రుల టూర్‌ ప్యాకేజ్‌. ఇందులో ప్రధానంగా ధర్మస్థల, మంగళూరు, శృంగేరి, ఉడిపి కవర్‌ అవుతాయి.– వాకా మంజులారెడ్డి,సాక్షి, ఫీచర్స్‌ ప్రతినిది (చదవండి: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్‌ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..! స్పెషాలిటీ ఏంటంటే..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement