Top Stories
ప్రధాన వార్తలు

IndiavsPak: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి: కేంద్రం
ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం ⇒ పాకిస్తాన్ ఫేక్ ప్రచారం నమ్మొద్దు... భారత సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయి... విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టీకరణ ⇒ భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత... పాక్ సైన్యం దాడిలో జమ్మూకశ్మీర్లో ఆరుగురి మృతి ⇒ భారత సైన్యం దాడుల్లో ఐదుగురు మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాదులు హతంశనివారం రాత్రి శ్రీనగర్లోని లాల్చౌక్ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ జమ్మూ బారాముల్లా, శ్రనగర్ టార్గెట్గా పాక్ డ్రోన్ల దాడులుపంజాబ్లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్ ప్రకటించిన సైన్యంజమ్మూకశ్మీర్, రాజస్తాన్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్గుజరాత్లోని కచ్లో పూరిస్థాయిలో బ్లాకౌట్డ్రోన్లు కనిపిస్తే కూల్చేసేలా BSFకు ఆదేశాలుశ్రీనగర్లోని ఆర్మీ చినార్ కోర్స్లో హెడ్క్వార్టర్ లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులుతదుపరి ఆదేశాలు వచ్చేవరకు పలు ప్రాంతాల్లో బ్లాకౌట్ విదించాలని ఆదేశాలుపాక్ కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులివ్వాలంటూ సైనికులకు విదేశాంగ శాఖ ఆదేశంఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశించిందిపరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయికాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో పాక్పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి ఫైర్ అయ్యారు. DGMOల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్దే పూర్తి బాధ్యత. ఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలి. ఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పాక్ జరిపిన ఈ చర్యకు భారత్ గట్టి సమాదానం చెప్తుంది. సరిహద్దు పొడవునా పాక్ దాడులకు తెగబడింది. LOC దగ్గర పాక్ కాల్పులు జరిపింది. దాన్ని భారత ఆర్మీ తిప్పి కొడుతోంది. పాక్ సైనికులు కాల్పులు జరపకుండా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అన్నారు విక్రమ్ మిస్త్రి.ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలుకాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్సీజ్ఫైర్ ఇక లేనట్లే.. కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లామళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ వీర మరణంమళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులుడ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలుజమ్మూ కశ్మీర్లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయిభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్ అబ్దుల్లా ట్వీట్శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుపాక్ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్ అవుట్3 గంట్లల్లోనే పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనభారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలుఅఖ్నూర్, రాజౌరి, పూంచ్ సెక్టార్ లో కాల్పులుపాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యంరాజస్థాన్ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ అవుట్జమ్మూ కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్

విరమణ.. ఉల్లంఘన
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్ కయ్యానికి కాలుదువ్విన దాయాదికి నాలుగు రోజుల్లోనే తత్వం బోధపడింది. సాయుధ ఘర్షణకు తెర దించుదామంటూ భారత్తో కాళ్లబేరానికి వచ్చింది. దాంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు ప్రభుత్వాలూ దాన్ని ధ్రువీకరించాయి. తమ మధ్యవర్తిత్వమే ఇందుకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా భారత్ దాన్ని తోసిపుచ్చింది. పాక్ విజ్ఞప్తి మేరకే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ‘‘శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. భూ, గగన, సముద్ర తలాల్లో పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ మీడియాకు వెల్లడించారు. కానీ కాసేపటికే పాక్ వంకర బుద్ధి ప్రదర్శించింది. శనివారం రాత్రి ఏడింటి నుంచీ మరోసారి దాడులకు దిగింది. సరిహద్దుల గుండా మళ్లీ డ్రోన్ ప్రయోగాలకు, కాల్పులకు తెగబడింది. కోరి కుదుర్చుకున్న విరమణ ఒప్పందానికి గంటల వ్యవధిలోనే తూట్లు పొడిచి తాను ధూర్తదేశాన్నేనని మరోసారి నిరూపించుకుంది. ఈ పరిణామంపై భారత్ మండిపడింది. రాత్రి 11 గంటలకు మిస్రీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఓవైపు విరమణ అంటూనే మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్ తిరిగి దాడులు, కాల్పులకు దిగిందంటూ ధ్వజమెత్తారు. ఒప్పందం కుదిరిందన్న ట్రంప్పాక్ దొంగ నాటకాల నడుమ శనివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటేదాకా పాక్ సైన్యం క్షిపణి, డ్రోన్ దాడులు, సరిహద్దుల వెంబడి కాల్పులు కొనసాగించింది. వాటికి దీటుగా బదులిచ్చిన భారత్ శనివారం తెల్లవారుజాము నుంచీ తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఆరు పాక్ వైమానిక, రెండు రాడార్ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు. సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్లో సాయంత్రం ఐదింటి ప్రాంతంలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు ఇరు దేశాలూ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’’ అని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ప్రధానులు నరేంద్ర మోదీ, షహబాజ్ షరీఫ్లకు అభినందనలు తెలిపారు. ట్రంప్ బృందం ఈ దిశగా అద్భుతంగా పని చేసిందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. సాయంత్రం ఆరింటికి విదేశాంగ కార్యదర్శి మిస్రీ మీడియా ముందుకొచ్చారు. ‘‘పాక్ విజ్ఞప్తి మేరకే విరమణకు ఒప్పుకున్నాం. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. వారి నడుమ చర్చల ఫలితంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది’’ అని స్పష్టం చేశారు. దీనిపై డీజీఎంఓల నడుమ సోమవారం పూర్తిస్థాయి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ‘‘శాంతి సాధనకు ఇది నూతన ప్రారంభం. కాల్పుల విరమణకు చొరవ చూపినందుకు ట్రంప్, వాన్స్, రూబియోలకు కృతజ్ఞతలు’’ అంటూ పాక్ ప్రధాని షహబాజ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టి(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో, ప్రజాప్రతినిధులు తదితరులు ఒప్పందాన్ని స్వాగతించారు. అనంతరం తన గగనతలాన్ని తెరుస్తున్నట్టు పాక్ ప్రకటించింది. బయటపడ్డ పాక్ నైజం కొద్ది గంటలైనా గడవకుండానే పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్లో భారీ పేలుడు శబ్దాలు విని్పంచాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కని్పంచాయి. దీనిపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలే. ఏమిటిది? విరమణకు అప్పుడే తూట్లా?’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కని్పంచినట్టు రాష్ట్ర మంత్రి హర్‡్ష సంఘవి ధ్రువీకరించారు. ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించింది. ఇది అత్యంత దుర్మార్గం. ఇందుకు పూర్తి బాధ్యత ఆ దేశానిదే. దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. మతిలేని చర్యలను ఇకనైనా కట్టిపెట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పూర్తిస్థాయిలో కట్టుబడాలి. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిక్రియ తప్పదు. దాడులను దీటుగా తిప్పికొట్టాల్సిందిగా సైన్యానికి పూర్తిస్థాయి ఆదేశాలిచ్చాం. – విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ

బంగ్లాదేశ్ హసీనా బిగ్ షాక్
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్రవ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్ను నిషేధించినట్లు శనివారం సాయంత్రం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి(కేబినెట్) నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.అవామీ లీగ్, ఆ పార్టీ అగ్ర నేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. షేక్హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత, పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్లోని బెంగాళీలకు స్వయంప్రతిపత్తి హక్కులు దఖలుపడాలన్న లక్ష్యంతో అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేసింది. చివరకు స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది.🇧🇩 In Bangladesh, students and the public have been continuously protesting for the past 48 hours, demanding a ban on the Awami League, the party of former autocratic and murderous Prime Minister Sheikh Hasina. ✊ #HasinaOut #BanAwamiLeague #BangladeshCrisis pic.twitter.com/YueL4gwhc4— Ibnul Wasif Nirob (@Wasifvibes) May 10, 2025NEW! #Bangladesh’s interim government on Saturday banned deposed prime minister Sheikh Hasina’s Awami League under anti-terrorism law.The announcement to ban Hasina’s Awami League came after the student-led newly-floated National Citizen Party (NCP) activists rallied since… pic.twitter.com/0Zwfd6DdU1— DOAM (@doamuslims) May 10, 2025

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...పనులలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన ఆదాయం సమకూర్చుకుంటారు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.వృషభం...చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తుల సహాయసహకారాలు తీసుకుంటారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని మిత్రులను ఆశ్చర్యపరుస్తారు. పారిశ్రామికవర్గాలకు భాగస్వాముల నుంచి సమస్యలు తీరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మిథునం...ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి కొంత బయటపడతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు,భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఏ మాత్రం అలసత్వం చూపక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.కర్కాటకం...అనుకున్న పనులు తక్షణం పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత మేరకు తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. ఎరుపు, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.సింహం....ఏ పని ప్రారంభించినా వెనుకడుగు వేయకుండా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం, నమ్మకమే మీ ఆయుధాలుగా నిలుస్తాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. గతంలో చేజారిన కొన్ని డాక్యుమెంట్లు అనుకోని విధంగా లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పారిశ్రామికవర్గాలకు లక్ష్యాలు నెరవేరతాయి. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. నీలం, నేరేడు రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.కన్య...కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.స్థిరాస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగాలలో ప్రశాంతత చేకూరుతుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.తుల....పనుల్లో అవాంతరాలు అధిగమించి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. కొన్ని వివాదాలు సోదరుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...అనుకున్న పనులు కొంత నిదానంగా సాగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు ఆశించిరీతిలో కొనసాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం.ఆరోగ్యం మందగిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మకరం...ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే ఏదోవిధంగా కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. బంధువులు, మిత్రులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. నిర్ణయాలు సైతం మార్చుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆహ్వానాలు అందుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.కుంభం...కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.మీనం...కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు కొంత నిదానించినా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

రెడ్బుక్ అండతో ‘ఖాకీ’ కావరం.. 'కారు లోంచి లాగి.. తోసేసి'..
చిలకలూరిపేట: పాలకులు రెడ్బుక్ మంత్రం జపిస్తుంటే కొంత మంది పోలీసు అధికారులు అందుకు వంత పాడుతూ సభ్యత సంస్కారాలు మరచి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి, బీసీ నేత, వైఎస్సార్సీపీ నాయకురాలు అని కూడా చూడకుండా విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు రెచ్చిపోయి అనుచితంగా ప్రవర్తించారు. ఎక్కువగా మాట్లాడితే నీపైనా కేసు పెడతానంటూ బెదిరించారు. చెబుతుంటే అర్థం కావడం లేదా.. పక్కకు తప్పుకోండంటూ హూంకరించారు. ఓ దశలో రజినిని కారులోంచి పక్కకు లాగి తోసేసి.. ఆయన కారులోకి ఎక్కారు. నడిరోడ్డుపై సీఐ బరితెగింపు చూసి ప్రజలు విస్తుపోయారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, గ్రామ సర్పంచ్ బత్తుల సీతారామిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఆయనను పరామర్శించేందుకు శనివారం మధ్యాహ్నం విడదల రజిని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాగానే.. చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు, పోలీసు సిబ్బంది ఆమె కారును చుట్టుముట్టారు. తన కారు వద్ద ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ ఆమె రూరల్ సీఐని ప్రశ్నించారు. మీ అనుచరుడు మానుకొండ శ్రీకాంత్రెడ్డిపై కేసులు ఉన్నాయని, అతన్ని అరెస్టు చేయడానికి వచ్చామని సీఐ బదులిచ్చారు. ఎఫ్ఐఆర్ లేదా అరెస్టు వారంట్ను చూపాలని రజనీ కోరగా.. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సీఐ దురుసుగా మాట్లాడారు. దీంతో ఆమె తన కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా, సీఐ వెంటనే ఆమెను కారులో నుంచి దురుసుగా బయటకు లాగారు. కారులోకి ఎక్కి శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. ‘సీఐ గారూ.. ఏమిటీ దురుసు ప్రవర్తన.. ఎఫ్ఐఆర్ లేదా ఇతర ఆధారాలు చూపి అరెస్టు చేయండి’ అని విడదల రజినీ కోరగా.. సీఐ మరింత రెచ్చిపోయి పక్కకు తప్పుకోవాలని హూంకరించారు. ‘చెబుతుంటే అర్థం కావడం లేదా.. ఎక్కువ మాట్లాడితే నా విధులకు ఆటంకం కల్పించినందుకు నీపై కూడా కేసు పెడతా’ అని బెదిరించారు. ఆమెను పక్కకు నెట్టివేసి శ్రీకాంత్రెడ్డిని తీసుకెళ్లిపోయారు. అనంతరం శ్రీకాంత్రెడ్డిని ప్రకాశం జిల్లా వైపు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై రూరల్ సీఐ సుబ్బానాయడును వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా.. రాష్ట్రంలో మహిళ పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలు శృతిమించుతున్నాయి. సభ్యతా సంస్కారాలు మరిచి పోలీసులు వారి పట్ల సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో రాత్రిపూట నైటీలో ఉన్న ఎస్సీ మహిళా ఎంపీటీసీ సభ్యురాలు వి.కల్పనను విచక్షణ మరచి అరెస్ట్ చేశారు. రెండు నిమిషాల్లో చీర కట్టుకుని వస్తానన్నా కూడా వినిపించుకోకుండా నైటీ మీదుగానే జీప్ ఎక్కించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతున్న తీరుకు అద్దం పడుతున్నాయి. ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల తీరులో మార్పు రాకపోవడం దారుణం అని ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని రెచ్చిపోతే మునుముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని కొందరు పోలీసులు మరచిపోయి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

విరమణ సరే, విధానం సంగతి!
భారత్ – పాకిస్తాన్ల మధ్య వివాదాలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేది చాలా కాలంగా భారత్ అనుసరిస్తున్న స్థిరమైన విధానం. కశ్మీర్ అంశాన్ని తొలి రోజుల్లో ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకుపోవడం వలన నష్టం జరిగిందనే అభిప్రాయం ఇండియాకు ఏర్పడింది. పాక్, భారత్ల మధ్య రెండు కీలకమైన ఒప్పందాలున్నాయి. 1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999లో ప్రకటించిన లాహోర్ డిక్లరేషన్. రెండు దేశాల నడుమ ఏ వివాదం తలెత్తినా ఈ రెండు ఒప్పందాల పరిధిలో, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ చాలా కాలంగా దృఢమైన వైఖరితో ఉండేది. మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదు.ఇందుకు భిన్నంగా రెండు దేశాల వివాదంలో ఇప్పుడు మూడో పక్షం తలదూర్చిందా? కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయనీ, ఇది వెంటనే అమల్లోకి వస్తుందనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా సాయంత్రం 5.30కి ప్రకటించారు. అమెరికా మధ్య వర్తిత్వం వహించి, రాత్రంతా చర్చలు జరిపిన ఫలితంగా ఈ ఒప్పందం సాధ్యమైందని కూడా ఆయన వెల్లడించారు. కామన్ సెన్స్నూ, తెలివిడినీ ఉపయోగించినందుకు రెండు దేశాలనూ ఆయన అభినందించారు.ఆ తర్వాత అరగంటకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయని ఆయన ధ్రువీకరించారు. సాయంత్రం ఐదు గంటలకే అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. అయితే ఆయన ట్రంప్ ట్వీట్ ప్రస్తావన గానీ, అమెరికా మధ్యవర్తిత్వం గురించి గానీ మాట్లాడలేదు. ఈరోజు మధ్యాహ్నం 3:30కు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో), ఇండియా డీజీఎంవోకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని మిస్రీ చెప్పారు.మూడో పక్షం జోక్యం లేకుండానే ఇరు దేశాలూ ఒప్పందానికి వచ్చాయనే విధంగానే ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ట్వీట్ చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంగానే దీన్ని అభివర్ణించారు. రేపు సోమవారం నాడు రెండు దేశాల మధ్య చర్చలు జరగబోతు న్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. రెండు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకోవడానికి ముందు నుంచే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రెండు దేశాల ముఖ్య నేతలతో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి.ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా నిర్వహించిన పాత్రేమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్తతల సడలింపునకు కాల్పులు విరమణ పాటించాలని స్నేహపూర్వక సలహా మాత్రమే రెండు దేశాలకు ఇచ్చిందా? లేక చర్చల ప్రాతిపదికను తయారు చేసే మధ్యవర్తిత్వ పాత్ర పోషించిందా? ఒకవేళ మధ్యవర్తిగానే చర్చల ప్రాతిపదికను కూడా సిద్ధం చేసి ఉంటే దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు వచ్చినట్టే భావించాయుద్ధం అమానుషమై నది. అనాగరికమైనది. యుద్ధం కారణంగా దేశాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. యుద్ధ ప్రమాదాన్ని నివారించడం వివేకవంతమైన చర్యే! కాల్పుల విరమణ ఆహ్వానించదగ్గదే! అయితే ఈ విరమణ వల్ల దేశం సాధించేది ఏమిటి? పోగొట్టుకునేదేమిటనే విశ్లేషణ కూడా అవసరం. యుద్ధం భారత్ ప్రారంభించలేదు. ఉగ్రవాదాన్ని ప్రయోగించి పాకిస్తానే కయ్యానికి కాలు దువ్వింది. బదులుగా పాక్లోని ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే భారత్ దాడులు చేసింది. నూరు శాతం కచ్చితత్వంతో చేసిన ఈ దాడులు పదును దేలిన భారత రణ వ్యూహానికీ, అద్భుతమైన సైనిక పాటవానికీ అద్దం పట్టాయి.భారత దాడులకు పాక్ నివ్వెరపోయింది. అధీన రేఖ వెంబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. జనావాసాలను టార్గెట్గా చేసుకొని దాడులకు దిగింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగానే జరిగినట్టు కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా అంగీకరించారు. మిగిలిన సరిహద్దు రాష్ట్రాల కంటే జమ్మూకశ్మీర్ ఈ దారుణాన్ని ఎక్కువగా భరించవలసి వచ్చింది. పసిపిల్లలతో సహా సాధారణ ప్రజలను బలి తీసుకుంటున్న మహమ్మారి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కశ్మీర్ ప్రతిపక్ష నేత మెహబూబా ముఫ్తీ కన్నీళ్ళతో వేడుకున్నారు.యుద్ధాలను వేగిరపడి ప్రారంభించడం కాకుండా పూర్తి ప్రణాళికను రచించుకొని మొదలుపెట్టాలనీ, వీలైనంత వేగంగా ముగించాలనీ, శత్రువు ప్రతిఘటనా శక్తిని దెబ్బకొట్టి పోరాడకుండానే యుద్ధాలను గెలిచే మార్గాలను అన్వేషించాలనీ సన్షూ తన యుద్ధతంత్ర గ్రంథమైన ‘ఆర్ట్ ఆఫ్ వార్’లో చెబుతాడు. ఈ నాలుగు రోజుల భారత దాడుల్లో సన్షూ చెప్పిన ‘ఆర్ట్ ఆఫ్ వార్’ కనిపించింది. ఉగ్రవాద స్థావరాలపై గురి తప్పకుండా, సరిహద్దులు దాటకుండా దాడి చేయడం, పలువురిని మట్టు పెట్టడంతోనే భారత్ సగం యుద్ధాన్ని గెలిచింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేయడం, ఎనిమిది కీలకమైన ఎయిర్ బేస్లను దెబ్బతీయటం, బాలిస్టిక్ మిసైల్ను గాల్లోనే పేల్చేయడంతో పాకిస్తాన్ దాదాపుగా చేతు లెత్తేసింది.ఈ దశలోనే పాక్ నేతలు అమెరికా శరణు కోరి ఉంటారనీ, అవమానకరమైన ఓటమి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసి ఉంటారనీ అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా జోక్యం చేసుకున్న విషయం యథార్థం. అది ఏ మేరకు అన్నది తేలవలసి ఉన్నది. సాధారణ ప్రజలపై మారణ హోమం చేయడం తప్ప పాకిస్తాన్ సాధించిందేమీ లేదు. భారత్ సాధించిన ఈ వేగవంతమైన విజయం రేపు జరిగే చర్చల్లో ప్రభావవంతమైన పాత్రను పోషించాలి. భారత్ కోరుతున్న విధంగా ఉగ్ర హంతకులకు స్థావరం లేకుండా చేస్తామని అంగీకరించాలి. భారత్లో నేరాలకు పాల్పడిన ఉగ్రవాదులను అప్పగించడానికి అంగీకరించాలి. భారత కశ్మీర్లో వేలు పెట్టబోమని అంగీ కరించే విధంగా పాక్పై ఒత్తిడి తేవాలి. సింధూనదీ జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో పునఃసమీక్షకు అంగీకరించరాదు. అప్పుడే ఇది విజేత షరతుల మేరకు జరిగే ద్వైపాక్షిక చర్చలుగా పరిగణించవలసి ఉంటుంది. లేకుంటే మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమన్న చారిత్రక విధానానికి వీడ్కోలు పలికినట్లవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే... కాల్పుల విరమణ ప్రకటించిన మూడు గంటల తర్వాత సరిహద్దుల వెంబటి పాకిస్తాన్ ఆర్మీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత భూభాగంపై కాల్పులు జరుపుతున్నాయి. ఇది పాకిస్తాన్ రాజకీయ నాయకత్వానికీ, ఆర్మీ నాయకత్వానికీ మధ్య సమన్వయ లోపమా? లేక రేపటి చర్చల్లో బేరమాడేందుకు తమ శక్తిని పెంచు కోవడానికి ఆ దేశం ఆడుతున్న నాటకమా? అదీ త్వరలోనే తేలుతుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

వేసవొచ్చింది... సెలవులు తెచ్చింది
వేసవి వచ్చిందంటే చాలు... స్కూల్స్, కాలేజీలు క్లోజ్ అవుతాయి. స్టూడెంట్స్కు సెలవులొచ్చేస్తాయి. అలాగే ప్రతి ఏడాది సినిమా స్కూల్స్కు కూడా వేసవి సెలవులు వస్తుంటాయి. ఈ సెలవుల్లో మెజారిటీ స్టార్ హీరోలు షూటింగ్ నుంచి బ్రేక్స్ తీసుకుంటుంటారు. అలా ఈ ఏడాది షూటింగ్స్కు బ్రేక్ ఇచ్చిన కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్ వేయండి.లండన్లో ల్యాండ్ నిన్న మొన్నటివరకు ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవలే లండన్లో ల్యాండ్ అయ్యారు. ఆయన తనయుడు, హీరో– నిర్మాత రామ్చరణ్ మైనపు విగ్రహం లండన్లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం కోసం చిరంజీవి ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు చిరంజీవి. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిసింది.ఈ మూవీలో నయనతార, కేథరీన్ హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. సాహు గార పాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘విశ్వంభర’ సినిమాకు చిన్న పాటి ΄్యాచ్ వర్క్, ఓ స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయట. వీలు చూసుకుని, ‘విశ్వంభర’ సినిమా షూటింగ్కు గుమ్మడికాయ కొట్టే ఆలోచనలో ఉన్నారు చిరంజీవి. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, విక్రమ్, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషా, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తారు. ఇక ‘విశ్వంభర’ సినిమా కొత్త విడుదల తేదీపై అతి త్వరలోనే ఓ స్పష్టత రానుంది.ఓవర్ టు ఓజీ కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉంటూ, సినిమా షూటింగ్లకు దూరంగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇది. దీంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ కల్యాణ్ వంతు షూటింగ్ పూర్తయింది. జాగర్లమూడి రాధాకృష్ణ, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ నిర్మించారు. అయితే ఈ సినిమాను తొలుత మే 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ...పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాని నేపథ్యంలో రిలీజ్ను వాయిదా వేశారని, అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుందని తెలిసింది. రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల కానుంది.తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ విడుదలవుతుంది. ఇలా ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ పూర్తి కావడంతో, ఇక పవన్ ఫోకస్ అంతా ‘ఓజీ’ సినిమాపైనే. అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన పవన్ కల్యాణ్ షూటింగ్కు చిన్న విరామం ఇచ్చారు. అతి త్వరలోనే ఆయన ‘ఓజీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, బాబీ డియోల్, నాజర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తారు.ఫారిన్ వెకేషన్ ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్తుంటారు హీరో మహేశ్బాబు. అయితే ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు సినిమాప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహేశ్బాబుకు ఈ ఏడాది ఫారిన్ హాలిడే బ్రేక్ దొరక్కపోవచ్చని కొందరు అనుకున్నారు. కానీ మహేశ్బాబుకు ఆ అవకాశం లభించింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా లాంగ్ షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసిన తర్వాత ఫారిన్ ఫ్లైట్ ఎక్కారు మహేశ్బాబు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి యూఎస్లో ఉన్నారని సమాచారం.ఇంకా రెండు వారాలు మహేశ్బాబు అక్కడే ఉంటారట. వచ్చిన తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్ను మళ్లీ షురూ చేస్తారు. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2027 వేసవిలో ఈ చిత్రం విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది.ఇటలీలో... ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో కొన్ని రోజులు క్రితం బిజీ బిజీగా గడి పారు ప్రభాస్. దాంతో ఈ సినిమా చిత్రీకరణలకు బ్రేక్ ఇచ్చి, ఇటీవల ఫారిన్ వెళ్లారు ప్రభాస్. దాదాపు ఇరవై రోజుల నుంచి ప్రభాస్ ఇటలీలోనే ఉంటున్నారని తెలిసింది. అతి త్వరలోనే ప్రభాస్ ఇండియాకు తిరిగి రానున్నారు. వచ్చిన తర్వాత ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలనుప్రారంభిస్తారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరో నటి రిద్దీ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘ఫౌజి’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026లో ‘ఫౌజి’ సినిమా విడుదల కానుంది.లండన్లో... లండన్ వెళ్లారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ చిత్రకరణ కర్ణాటకలో జరిగింది. ఎన్టీఆర్ పాల్గొనగా, యాక్షన్ సీక్వెన్స్లు, కొంత టాకీ పార్టును చిత్రీకరించారు ప్రశాంత్ నీల్. కాగా ఈ కర్ణాటక షూటింగ్ షెడ్యూల్ తర్వాత ఎన్టీఆర్ లండన్ వెళ్లారని తెలిసింది. లండన్లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్క్రీనింగ్ జరగనుందని తెలిసింది. అలాగే ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కాన్సెర్ట్ కూడా ఉంది.ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ లండన్ వెళ్తున్నారని తెలిసింది. ఈ వేడుకలో ‘ఆర్ఆర్ఆర్’లో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్చరణ్, ఈ చిత్రదర్శకుడు రాజమౌళిలతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్లోని మరికొందరు పాల్గొంటారట. తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు ఎన్టీఆర్. కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డ్రాగన్’ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.విదేశాల్లో వెరీ బిజీ ‘పెద్ది’ సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి, లండన్ వెళ్లారు రామ్చరణ్. లండన్లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ, ‘ఆర్ఆర్ఆర్’ వేడుకల్లో పాల్గొనేందుకు రామ్చరణ్ ఆల్రెడీ లండన్లోనే ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలతో ప్రస్తుతం రామ్చరణ్ బిజీగా ఉన్నారు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో ఆరంభిస్తారు రామ్చరణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు, శివ రాజ్కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు హీరోలు ఈ వేసవికి షూటింగ్ బ్రేక్స్ ఇచ్చారు.– ముసిమి శివాంజనేయులువేసవి తర్వాతే... ఈ వేసవికి కొందరు హీరోలు షూటింగ్స్కు బ్రేక్ ఇవ్వగా, ఈ వేసవి తర్వాతనే కొత్త సినిమా షూటింగ్లనుప్రారంభించాలని మరి కొందరు హీరోలు ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ నెక్ట్స్ సినిమాపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. వెంకటేశ్ కూడా చాలా కథలు వింటున్నారు. కాగా వెంకటేశ్ నెక్ట్స్ మూవీ దర్శకుడు త్రివిక్రమ్తో ఉంటుందని, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారని, వేసవి తర్వాత అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. ఇక మరో సీనియర్ హీరో నాగార్జున సోలో హీరోగా కొత్త సినిమాపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. అయితే తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ చెప్పిన ఓ కథ నాగార్జునకు నచ్చిందని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్నగర్ సమాచారం. వేసవి తర్వాతనే ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలని నాగార్జున భావిస్తున్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి తర్వాతే ఈ సినిమా చిత్రీకరణనుప్రారంభించాలని అట్లీ అండ్ టీమ్ ప్లాన్ చేసిందట. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇలా మరికొంతమంది తెలుగు హీరోలు ఈ వేసవి సెలవుల తర్వాత తమ కొత్త సినిమాల సెట్స్లోకి అడుగుపెట్ట నున్నారని తెలిసింది.

100 ఏళ్ల చదువుల గుడి ఎయూ శతవార్షికోత్సవాలు
ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా ఆవిర్భవించిన మొదటి విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వ కళాపరిషత్. తెలుగు ప్రజల కోసం ఏర్పడిన భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయం ఆంధ్రవిశ్వవిద్యాలయం. దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ విశ్వకళాపరిషత్ అనే పేరుతో వ్యవహరించేది మాత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మాత్రమే! దేశంలో మరో విశ్వవిద్యాలయానికి లేని ప్రత్యేకత ఇది. పేరుకు తగినట్లే లలిత కళలైన నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, రంగస్థలం, నటన వంటి కళలకు యూనివర్సిటీలో స్థానం కల్పించారు. స్వతహాగా కళా సాహిత్యాల పట్ల మక్కువ ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్’ పేరును ప్రతిపాదించారు. 1926లో మద్రాసు విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైన రెసిడెన్షియల్ టీచింగ్– కమ్– అనుబంధ విశ్వవిద్యాలయంగా ఘనతకెక్కిన ఏయూ శతాబ్ది ఉత్సవాలను జరుపుకొంటోంది. మొదటగా విజయవాడలో 1926 ఏప్రిల్ 24న ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి పునాదిని మొట్టమొదటి వీసీ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి వేయగా, అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ గోచెన్ చాన్సలర్గా వ్యవహరించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని 1930 సెప్టెంబరు 5న ఈ యూనివర్సిటీ ప్రాంగణాన్ని విశాఖపట్నానికి తరలించారు. ప్రతి ఏటా సగటున వెయ్యి నుంచి పన్నెండు వందల మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాలు తీసుకునే ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రస్తుతం 58 విభాగాలు, 18 పరిశోధన కేంద్రాల్లో 20 వేలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు.ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలు...!ఏయూ ఏర్పాటై 2026 నాటికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకునేందుకు ఏయూ సిద్ధమయ్యింది. ఏడాదిపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఔట్రీచ్– ఈ మూడు విభాగాల్లో పనిచేయాలని విజన్ డాక్యుమెంట్ను ఏయూ ప్రకటించింది. శతాబ్ది ఉత్సవాల లోగోను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ లోగోను యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగంలోని బీఎఫ్ఏ విద్యార్థి షేక్ రఫీ రూపొందించారు. ఏయూ లోగో ప్రత్యేకత!ఆంధ్రా యూనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారుచేసి, లోగోలోని ప్రతి చిహ్నానికి అర్థం స్ఫూరించేలా తయారు చేశారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడు విశ్వవిద్యాలయాన్ని, దాని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుంది. ఇక కమలం శ్రేయో దేవత లక్ష్మీ, జ్ఞాన దేవత సరస్వతి– ఇద్దరినీ ప్రతిబింబిస్తుంది. సూర్యకిరణాలపై ఆర్యులలో దీవెన చిహ్నమైన స్వస్తిక ఉంటుంది. అరవై నాలుగు తామర రేకులతో కూడిన శిఖరం బయటి వృత్తం, భారతదేశ శాస్త్రీయ సంప్రదాయంలోని అరవై నాలుగు కళలను, శాస్త్రాలను సూచిస్తుంది. ఇక సముద్రాన్ని– విద్యార్థులు ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తారమైన జ్ఞానకేంద్రం అనే అర్థంలో తయారు చేశారు. ఉపనిషత్తులలోని ‘తేజస్వినావధితమస్తు’ అనే నినాదాన్ని కూడా లోగోలో భాగం చేశారు. దీని అర్థం ఏమిటంటే ‘దైవిక కాంతి మన అధ్యయనాలను ప్రకాశింపజేయుగాక‘ అని. ఈ జ్ఞాన చిహ్నం కింద అన్ని మతాలలోనూ ప్రాశస్త్యం కలిగిన నెలవంక ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని కళల అభివృద్ధికి నెలకొల్పిన సంస్థ అనే అర్థంతో ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్’ అని దీనికి నామకరణం చేశారు. లోగోలోని దిగువభాగంలో ఉన్న రెండు సర్పాలు తామర రేకుల నుంచి జ్ఞానాన్ని కోరుకునేవారిని, జ్ఞాన సంరక్షకులను సూచిస్తాయి. అంతేకాకుండా, పురాతనకాలం నుంచి ఆంధ్రులలో నాగారాధన సంప్రదాయం ఉంది. ఈ లోగోను కౌతా రామమోహనశాస్త్రి రూపొందించగా, ఏయూ వ్యవస్థాపక వీసీ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఆమోదించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో...వాస్తవానికి మొట్టమొదటగా బెజవాడలోని (ఇప్పటి విజయవాడ) తాత్కాలిక భవనాల్లో ఏర్పాటైన ఏయూ 1930లో విశాఖకు తరలివచ్చింది. అయితే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మాత్రం ఏయూ ప్రాంగణం అంతా సైనిక స్థావరంగా మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఏప్రిల్ 6న విశాఖ హార్బర్పై జపాన్ బాంబులు వేసింది. ఆ దాడి తర్వాత యూనివర్సిటీ భూమిని, భవనాలను తమ అవసరాలకు ఉపయోగించుకోవాలని అప్పటి బ్రిటిష్ సైన్యం నిర్ణయించుకుంది, యూనివర్సిటీని మార్చమని బలవంతం చేసింది. బాంబు దాడి జరిగిన పది రోజుల తర్వాత– అంటే 1942 ఏప్రిల్ 16న యూనివర్సిటీని తరలించడానికి సన్నాహాలు చేసుకోవడం కోసం మూసివేశారు. కెమిస్ట్రీ మినహా చాలా విభాగాలు గుంటూరుకు మారగా, కెమిస్ట్రీ విభాగం మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలకు మారింది. భవనాలన్నింటినీ సైన్యం ఆక్రమించడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం జూన్ 1945 వరకు అంటే మూడేళ్లపాటు విశాఖపట్నం వెలుపలి నుంచే పనిచేసింది.న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్తో...!తెలుగు ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పడటంతో తెలుగు ప్రజలు యూనివర్సిటీతో మానసికంగా అనుబంధం పెంచుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ దేశంలోని పురాతన విద్యాసంస్థలలో ఒకటి మాత్రమే కాదు, రెసిడెన్షియల్ మల్టీ–డిసిప్లినరీ యూనివర్సిటీగా ఏర్పడిన విశ్వవిద్యాలయాలలో మొదటిది. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైన ఈ యూనివర్సిటీకి కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపక వైస్ చాన్సలర్గా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండో వైస్ చాన్సలర్గా, తిరిగి సీఆర్ రెడ్డి, అనంతరం డాక్టర్ వీఎస్ కృష్ణు్ణడు– ఈ ముగ్గురు దార్శనికులు వేసిన పునాదులు ఆ తర్వాతి దశాబ్దాల్లో ఫలవంతమై, ఏకంగా దేశంలోనే న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ పొందిన మొట్టమొదటి ప్రభుత్వ యూనివర్సిటీగా 2024లో చరిత్రకెక్కింది. ఏయూలో 59 దేశాల విద్యార్థులు...దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు విదేశాల్లోని విద్యార్థులనూ ఏయూ ఆకర్షిస్తోంది. ఇక్కడ చదువుకునేందుకు విదేశీ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఏకంగా 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుకుంటున్నారు. ఎక్కువగా ఇంజినీరింగ్ కోర్సుల్లో 472 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. 2019–20 సంవత్సరంలో 190 మంది ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య గత ప్రభుత్వ హాయంలో ప్రత్యేకంగా హాస్టల్స్ ఏర్పాటుతో పాటు ప్రత్యేక మెనూను అమలు చేయడంతో ఈ సంఖ్య 1,130కి చేరుకుంది. ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రధానంగా విశాఖలో జరిగే వివిధ రకాల సినిమా షూటింగుల కోసం అవసరమైన విదేశీయుల కోసం ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను దర్శకులు వెదుక్కుంటూ వచ్చి మరీ తీసుకెళుతున్నారు. ఇస్మార్ట్ శంకర్, శివం వంటి సినిమాల్లో ఇక్కడి విదేశీ విద్యార్థులు నటించారు. ఎందరో మహానుభావులు...ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్న అనేక మంది ఎంతో గొప్ప స్థానాలకు చేరుకున్నారు. ఆచార్య సూరి భగవంతం (భౌతికశాస్త్రం), ఆచార్య జ్ఞానానంద (అణుభౌతిక శాస్త్రం), ఆచార్య సి.మహదేవన్ (జియాలజీ), ఆచార్య టీఆర్. శేషాద్రి (రసాయన శాస్త్రం), ఆచార్య బి. రామచంద్రరావు(స్పేస్ ఫిజిక్స్), ఆచార్య సి.ఆర్రావు (స్టాటస్టిక్స్), ఆచార సీవీ రామన్(భౌతికశాస్త్రం), ఆచార్య ఆర్.రంగదామరావు (మీటీయరాలజీ) వంటి అనేక మంది ప్రపంచస్థాయిలో శాస్త్రవేత్తలుగా రాణించినవారే! ఇక భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రస్తుత ఒడిశా గవర్నర్ ఆచార్య కంభంపాటి హరిబాబు, రాజ్యసభ మాజీ సభ్యుడు, విశ్వ హిందీపరిషత్ అద్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, పెన్స్టేట్ యూనివర్సిటీ (అమెరికా) అద్యక్షురాలు నీలి బెండపూడి, జీఎంఆర్ గ్రూప్ అధినేత డాక్టర్ జి.ఎం.రావు, ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు, లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తదితర ప్రముఖులు ఏయూ పూర్వవిద్యార్థులలో ఉండటం విశేషం. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు నాయకత్వం వహిస్తున్న 50 మంది వీసీలను, 10 మంది చాన్సలర్లనూ అందించిన ఘనత ఏయూ సొంతం. ఇదిలా ఉంటే, ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల్లో ఎనిమిది మంది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు, ముగ్గురు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు, నలుగురు పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో పాటు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఒకరు ఉన్నారు. డిసెంబర్లో పూర్వ విద్యార్థుల సమావేశం...ఏయూ పూర్వ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నవారు ఉన్నారు. దేశంతో పాటు విదేశాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, కెనడా, ఆఫ్రికా, జర్మనీ, ఫ్రా¯Œ ్స, రష్యా, థాయ్లండ్, మలేషియా మొదలైన దేశాల్లో మంచి సంఖ్యలో పూర్వ విద్యార్థులు స్థిరపడి పని చేస్తున్నారు. వీరందరూ కలిపి ఏర్పాటు చేసుకున్న ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం యూనివర్సిటీ అభివృద్ధిలోనూ ఎంతగానో సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ సంఘం ద్వారా యూనివర్సిటీలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఏటా డిసెంబర్లో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక వీసీ సీవీ రెడ్డి జయంతి సందర్భంగా పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. ‘నాసా’ పరిశోధనల్లోనూ...ప్రారంభంలో ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్ కళాశాలలు ఉమ్మడిగా ఉండేవి. ఈ ఉమ్మడి విభాగాలకు ప్రిన్సిపల్గా పనిచేసిన ఎం. వెంకటరంగయ్య ‘పద్మవిభూషణ్’ అందుకున్నారు. అయితే, 1931లో ఈ రెండు విభాగాలను వేరు చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల తొలి ప్రిన్సిపాల్గా ఆర్.రామనాథం పనిచేశారు. జయపూర్ మహారాజా విక్రమ్దేవ్ వర్మ ఏయూకు విలువైన భూములను, భారీగా నగదును విరాళంగా ఇచ్చారు. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలను గుర్తించి కొత్త కోర్సులను విద్యార్థులకు అందించడంలో ఆంధ్రా యూనివర్సిటీ అగ్రగామిగా ఉంటోంది. ఏయూ మీటియరాలజీ, ఓషనోగ్రఫీ, జియాలజీ, నూక్లియర్ ఫిజిక్స్ వంటి వైవిధ్యభరితమైన ప్రత్యేక శాస్త్ర విభాగాలను నిర్వహిస్తోంది. దేశంలోనే మొదటిసారిగా న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసిన యూనివర్సిటీగా ఏయూ పేరు సంపాదించింది. ఇక వివిధ రకాల పరిశోధనల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అడ్వాన్స్డ్ అనలిటికల్ లేబొరేటరీ, ఎన్ఎంఆర్ స్పెక్టోస్కోపీలు వర్సిటీ విశిష్టతను చాటుతున్నాయి. ఇక ‘నాసా’ చేపట్టిన లూనార్ ప్రయోగాలకు ఏయూ తన వంతు సహాయాన్ని అందించింది. తూర్పు కనుమలలోని పలు రకాల రాళ్లను సేకరించి, చంద్రమండలంలోని పదార్థాలలో పోలి ఉన్నాయా లేదా అనే ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందుకు అవసరమైన సహకారాన్ని ఏయూ జియాలజీ విభాగం అందించింది. తమకు అందించిన సహకారానికి ‘నాసా’ స్వయంగా ఏయూకు కృతజ్ఞత లేఖ రాసింది. అలాగే ఏయూ ఫ్రాన్స్కు కూడా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించింది.మరో ఎత్తుకు వైఎస్ జగన్ హాయంలో....!నూతన పోకడలకు అనుగుణంగా ఆంధ్రా యూనివర్సిటీలో కొంగొత్త మార్పులకు గత వైఎస్సార్సీపీ హాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఎన్నడూ లేని విధంగా స్టార్టప్ల కోసం ప్రత్యేకంగా ఏ–హబ్ను ఏర్పాటు చేయడంతో పాటు పేటెంట్ల కోసం ఏకంగా నూటికిపైగా దరఖాస్తులు చేయడంలో ఏయూ మరో శిఖరానికి చేరుకుంది. పేటెంట్లకు దరఖాస్తు చేసేందుకు ప్రత్యేకంగా ఆంధ్రా యూనివర్సిటీలో మేధాసంపత్తి హక్కులను పొందేందుకుగానూ ప్రత్యేకంగా మేధాసంపత్తి హక్కుల కేంద్రాన్ని (సీఐపీఆర్) గత ప్రభుత్వ హాయంలో అప్పటి వీసీ ప్రసాద్రెడ్డి సెప్టెంబరు 2020లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా నూటికిపైగా దరఖాస్తులను పంపారు. ఇక గత ప్రభుత్వ హాయంలో చేపట్టి, పూరైన 5 ప్రత్యేక భవనాలను సీఎం హోదాలో 2023 ఆగస్టు 1వ తేదీన వైఎస్ జగన్ ప్రారంభించారు. అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఏయూ ఈ ప్రగతిని సాధించింది. ఆ భవనాలు ఇవే... ఏ–హబ్ (ఆంధ్రా యూనివర్సిటీ స్టార్టప్ – టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్): దీనిని రూ. 21కోట్ల వ్యయంతో 30,000 చదరపు అడుగుల స్థలంలో కొత్తగా నిర్మించారు. ఇందులో 121 స్టార్టప్స్ తమ కార్యాలయాలను ప్రారంభించి సేవలందిస్తున్నాయి. రాష్ట్రంలో స్టార్టప్స్కు అంకురార్పణ కూడా ఇక్కడి నుంచే ఊపందుకుందని చెప్పవచ్చు.ఎలిమెంట్(ఆంధ్రా యూనివర్సిటీ ఫార్మా ఇంక్యుబేషన్ మరియు బయోలాజికల్ మానిటరింగ్ హబ్): ఫార్మా/బయోటెక్/ జెనోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్ కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించారు. దీని నిర్మాణానికి రూ. 44 కోట్లు ఖర్చు చేశారు.ఆల్గోరిథమ్(ఆంధ్రా యూనివర్సిటీ డిజిటల్ జోన్ –స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్): దీనిని 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో 250 మంది కూర్చునేందుకు వీలు కలిగిన రెండు ఆధునిక సెమినార్ హాళ్లు, 15 స్మార్ట్ క్లాస్ రూమ్లలో 500 కంప్యూటర్లతో విద్యార్థులకు శిక్షణ, ఆన్లైన్ పరీక్షలను నిర్వహించుకునే వీలు కలిగింది. ఇందుకోసం ప్రత్యేక ఫ్లోర్ను నిర్మించారు.ఏయూ–సిబ్ (ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్): ఐఐఎం–విశాఖపట్నంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుని, రూ. 18 కోట్ల వ్యయంతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఇందులో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ అనలిటిక్స్లో ప్రత్యేకమైన బ్యాచిలర్ మరియు మాస్టర్ ప్రోగ్రామ్లను అందిస్తున్నారు.ఏయూ–అవంతి ఆక్వాకల్చర్ ఇనోవేషన్ మరియు స్కిల్ హబ్మొదటి దశలో రూ. 11 కోట్లతో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మెరైన్ ఫార్మింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్లో నైపుణ్య శిక్షణను అందించడానికి దీనిని నిర్మించారు.

పాక్ రెక్కలు కత్తిరించాం
యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్తానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్కు కోలుకోలేని నష్టం మిగిల్చింది. అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. తమ దేశ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయిందని పాక్ పౌరులు కూడా వాపోతున్నారు. సామాన్యులను వేధించడానికే తప్ప యుద్ధానికి తమ సైన్యం పనికిరాదంటూ అక్కడి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సైన్యం కదలికలను అడ్డుకునేందుకే?పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలపై భారత్ భారీ స్థాయిలో దాడికి వెనక ప్రబల కారణాలే ఉన్నట్టు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచే తన సైన్యాన్ని వీలైనంతగా భారత సరిహద్దులకు తరలించేందుకు పాక్ సిద్ధమైందని నిఘా వర్గాలు కేంద్రానికి సమాచారమిచ్చాయి. దాంతో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే పాక్ నిర్ణయించుకుందని స్పష్టమైపోయింది. దాంతో సైనిక తరలింపులను అడ్డుకోవడమే లక్ష్యంగా అప్పటికప్పుడు వైమానిక స్థావరాలను మన బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులు వాటిని గురి తప్పకుండా ఢీకొట్టి శిథిలాల దిబ్బలుగా మార్చేశాయి. తద్వారా పదాతి దళానికి అతి కీలకమైన వైమానిక దన్ను అందకుండా చేశాయి. అంతేగాక పాక్ యుద్ధ సన్నద్ధతపైనే చావుదెబ్బ కొట్టాయి. ‘‘ఈ పరిణామం వల్లే మరో గత్యంతరం లేక పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. సాయంత్రానికల్లా కాల్పుల విరమణకు ఒప్పుకుంది’’ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు.వైమానిక స్థావరాలుచకాలానూర్ ఖాన్ ఎయిర్బేస్గా పిలుస్తారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో రావల్పిండిలో ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉంటుంది. ఆ దేశానికి అత్యంత కీలకమైన వైమానిక స్థావరమిది. వాయుసేన కార్యకలాపాలతో పాటు వీఐపీల రవాణా తదితరాలు కూడా ఇక్కడినుంచే కొనసాగుతాయి. ప్రధాని తదితర అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, అత్యున్నత సైనికాధికారుల ప్రయాణాలకు ఉపయోగించే ఆధునిక విమానాలకు ఇది విడిది కేంద్రం. సీ–130, ఐఎల్–78 విమానాలకు స్థావరం. పాక్ ఎయిర్ మొబిలిటీ కమాండ్కు ప్రధాన కేంద్రం కూడా. భారత్తో 1965, 1971 యుద్ధాల్లో ఈ బేస్ అత్యంత కీలక పాత్ర పోషించింది. భారత్పై జరిపిన డ్రోన్ దాడులను ఇక్కడినుంచే పర్యవేక్షించారు. సైనిక విమానాల ఏరియల్ రీ ఫ్యూయలింగ్, రవాణా తదితర కార్యకలాపాలకు ఇది ప్రధాన బేస్. పాక్ వైమానిక దళానికి చెందిన ఆరు అత్యాధునిక ట్రాన్స్పోర్ట్ స్క్వాడ్రన్లకు అడ్డా. అంతేగాక ఎయిర్ఫోర్స్లో చేరేవారికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చే పాక్ వైమానిక దళ (పీఏఎఫ్) కాలేజీ కూడా ఇక్కడే ఉంది. అంతేగాక పాక్ వైమానిక దళానికి అతి కీలకమైన ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ (ఏఈడబ్ల్యూఈ) ‘సాబ్ ఎరీఐ’ వ్యవస్థకు కేంద్రం. కనుక చకాలా బేస్ అత్యాధునిక రక్షణ వలయం నడుమ ఉంటుంది. అంత కీలకమైన ఎయిర్బేస్పైనే మన వైమానిక దళం భారీ ఎత్తున దాడి చేసి ధ్వంసం చేసింది. తద్వారా పాక్లో ఏ సైనిక స్థావరం కూడా సురక్షితం కాదని దాయాదికి స్పష్టమైన సందేశమిచ్చింది.రఫీకీపంజాబ్ ప్రావిన్స్లో జాంగ్ జిల్లాలోని షోర్కోట్లో ఇస్లామాబాద్కు 330 కి.మీ. దూరంలో ఉంటుంది. తొలుత షోర్కోట్ బేస్గా పిలిచేవారు. తర్వాత 1965 యుద్ధంలో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ సర్ఫరాజ్ అహ్మద్ రఫీకీ పేరు పెట్టారు. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన జేఎఫ్–17, మిరాజ్ వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లు ఉండేదిక్కడే. వీటితోపాటు రవాణా తదితర అవసరాలకు వాడే సైనిక హెలికాప్టర్లకు కూడా రఫీకీ ఎయిర్బేస్ ప్రధాన కేంద్రం. ఇది సెంట్రల్ పంజాబ్లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. 10 వేల అడుగుల పొడవైన రన్వే, దానికి సమాంతరంగా ట్యాక్సీవే దీని ప్రత్యేకతలు. దాంతో ఇక్కడి యుద్ధ విమానాలు భారత సరిహద్దులపై దాడులకు అతి తక్కువ సమయంలో సన్నద్ధం కాగలవు. పాకిస్తాన్ రక్షణ నెట్వర్క్లో అతి కీలకమైన భాగమిది.మురీద్చక్వాల్ జిల్లాలో ఉన్న వైమానిక స్థావరం. పలు వైమానిక స్క్వాడ్రన్లకు కూడా నిలయం. దేశీయ షాపర్–1, తుర్కియే నుంచి తెచ్చుకున్న బైరక్తర్ టీబీ2, అకిన్సీ డ్రోన్లతో పాటు మానవ రహిత విమానాలు/యుద్ధ విమానాలు (యూఏవీ/యూసీఏవీ) తదితరాలకు కూడా ఇదే కేంద్రం. మూడు రోజులుగా భారత్పై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించింది. మనపైకి దూసుకొచ్చిన డ్రోన్లను ఇక్కడినుంచే ప్రయోగించారు. పాక్ డ్రోన్ వార్ఫేర్కు చక్వాల్ ప్రధాన కేంద్రంగా మారింది. డ్రోన్ల పర్యవేక్షణ, నిఘా సమాచార సేకరణతో పాటు దాడుల వంటివాటికి కూడా బేస్ ఇదే. డ్రోన్ల వాడకంలో సైనిక శిక్షణ కూడా ఇక్కడే ఇస్తుంటారు. మనపై డ్రోన్ దాడులకు ప్రతి చర్యగా మురీద్ ఎయిర్ బేస్ను సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. మతిలేని దాడులకు గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.రహీం యార్ఖాన్దక్షిణ పంజాబ్లో రహీం యార్ఖాన్ నగరంలోని వైమానిక స్థావరం. రాజస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. తూర్పు పాకిస్తాన్ మీదుగా మన సరిహద్దులపై దాడులకు అత్యంత అనువుగా ఉంటుంది. రాజస్తాన్లోని శ్రీగంగానగర్, జైసల్మేర్ వంటి పట్టణాలపై వైమానిక దాడులు ఇక్కడినుంచే జరిగాయి. ఇక్కడినుంచి పౌర విమానాల రాకపోకలు కూడా జరుగుతుంటాయి. మన వైమానిక దాడులతో ఈ బేస్తో పాటు ఇక్కడి రన్వే కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.సుక్కుర్భొలారీ ఎయిర్బేస్గా పిలుస్తారు. సింధ్ ప్రావిన్స్లో కరాచీ, హైదరాబాద్ నడుమ జంషోరో జిల్లాలో ఉంటుంది. పాక్కు జీవనాడి వంటి కరాచీ నగర రక్షణను కట్టుదిట్టం చేసే లక్ష్యంతో 2017లో ఈ ఎయిర్బేస్ను ఏర్పాటు చేశారు. సదరన్ ఎయిర్ కమాండ్ పరిధిలోకి వస్తుంది. ఆపరేషనల్ కన్వర్షన్ యూనిట్ తాలూకు 19 స్క్వాడ్రన్కు కేంద్రం. ఎఫ్–15ఏ, ఎఫ్–16, కొన్ని జేఎఫ్–17లతో పాటు ఏడీఎఫ్ యుద్ధ విమానాలకు విడిది కేంద్రం. పాక్ సైన్యం ఉపరితల ఆపరేషన్లకు అత్యవసరమైన లాజిస్టిక్ సపోర్ట్ తదితరాల్లో దీనిది కీలకపాత్ర. పాక్ వైమానిక స్థావరాలన్నింట్లోనూ అత్యాధునికమైనదిగా దీనికి పేరు. ఇక్కడ ఎస్ఏఏబీ 2000 ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏఈడబ్ల్యూసీఎస్) ఉంది.రాడార్ కేంద్రాలుసియాల్కోట్పంజాబ్లోని సియాల్కోట్ వైమానిక కేంద్రంలో ఉంది. ఇక్కడ ఒక అంతర్జాతీయ విమా నాశ్రయం, మరో సైనిక విమానాశ్రయం ఉన్నాయి. ఇక్కడి రాడార్ కేంద్రం వైమానికంగా పాక్కు అతి కీలకమైనది. దాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పౌర విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.పస్రూర్ఇది కూడా పంజాబ్లోనే సియాల్కోట్ జిల్లాలో ఉంది. ఇక్కడి రాడార్ కేంద్రాన్ని కూడా మన వైమానిక దళం నేలమట్టం చేసింది.చునియన్పంజాబ్ ప్రావిన్స్లో లాహోర్కు 70 కి.మీ. దూరంలో చునియన్ వద్ద ఉంటుంది. పాక్లోని ప్రాథమిక వైమానిక స్థావరాల్లో ఒకటి.– సాక్షి, నేషనల్ డెస్క్

భారత్ ‘పాంచ్ పటాకా’
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత కాంపౌండ్ ఆర్చర్లు 5 పతకాలతో సత్తాచాటారు. వ్యక్తిగత విభాగంలో మధుర స్వర్ణ పతకంతో మెరిసింది. దీంతో ఈ టోర్నీలో భారత ఆర్చర్లకు మొత్తంగా 2 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు దక్కాయి. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో మధుర 139–138తో కార్సన్ (అమెరికా)పై గెలుపొందింది. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల మధుర ఈ టోర్నీలో ఓవరాల్గా మూడు పతకాలు గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మధుర... టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ విభాగంలో కాంస్యం గెలిచిన జట్లలో కూడా సభ్యురాలు. ఫైనల్లో మొదట ‘పర్ఫెక్ట్ 30’ పాయింట్లు సాధించిన మధుర ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. ఒకదశలో వరుసగా రెండు సార్లు 8 పాయింట్లతో పాటు ఒకసారి 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని 81–85తో వెనుకంజలో పడింది. తర్వాతి రౌండ్లో మెరుగైన ప్రదర్శనతో స్కోరును 110–110తో సమం చేసి... అదే జోరు కొనసాగిస్తూ పసిడి ఖాతాలో వేసుకుంది. అంతకుముందు కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు స్వర్ణం గెలుచుకుంది. అభిషేక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ దేవ్తలేలతో కూడిన భారత పురుషుల జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో 232–228 పాయింట్ల తేడాతో మెక్సికో జట్టుపై గెలుపొందింది. ఇక పురుషుల వ్యక్తిగత విభాగంలో 22 ఏళ్ల రిషభ్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు. షూటాఫ్లో అతడు దక్షిణ కొరియా ఆర్చర్పై విజయం సాధించాడు. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర) లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకం చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సురేఖ, చికిత, మధుర త్రయం. 221–234తో మెక్సికో జట్టు చేతిలో ఓడింది. ఇక మిక్స్డ్ టీమ్ విభాగంలో మధుర–అభిõÙక్ వర్మ జంట కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో భారత జోడీ 144–142 పాయింట్ల తేడాతో ఫాటిన్ నూర్ఫతే–మొహమ్మద్ జువైదీ (అమెరికా)పై గెలుపొందింది. తాజా ప్రదర్శనతో భారత కాంపౌండ్ జట్టు భవిష్యత్తుపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సారి 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్ను ప్రవేశపెడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే మనకు ఒలింపిక్స్కు పతకం సాధించేందుకు మంచి అవకాశం ఉంది.
కమికాజ్ డ్రోన్లను ప్రయోగించిన పాక్
పాక్కు ఐఎంఎఫ్ రుణంపై విమర్శల వెల్లువ
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఐదుగురు హతం!
సరిహద్దుల్లో కాల్పుల మోత
ర్యాంప్ ఆరంభం
కొనేవారేరీ..!
లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి
దేవగా ధనుష్
తగ్గనున్న వరి, గోధుమ, మొక్కజొన్న దిగుబడి
రూ.70 లక్షల లంచం డిమాండ్
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
ఆపరేషన్ సిందూర్
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
జమ్మూకశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
రీరిలీజ్లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
మోదీ చేస్తే గొప్ప... మేం చేస్తే తప్పా?
కమికాజ్ డ్రోన్లను ప్రయోగించిన పాక్
పాక్కు ఐఎంఎఫ్ రుణంపై విమర్శల వెల్లువ
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఐదుగురు హతం!
సరిహద్దుల్లో కాల్పుల మోత
ర్యాంప్ ఆరంభం
కొనేవారేరీ..!
లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి
దేవగా ధనుష్
తగ్గనున్న వరి, గోధుమ, మొక్కజొన్న దిగుబడి
రూ.70 లక్షల లంచం డిమాండ్
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
ఆపరేషన్ సిందూర్
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
జమ్మూకశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
రీరిలీజ్లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
మోదీ చేస్తే గొప్ప... మేం చేస్తే తప్పా?
భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
సినిమా

ఆగస్టులో శక్తిమతి
హెబ్బా పటేల్, సుమన్, శ్రావణ్, శ్రీధర్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘శక్తిమతి’. డి. రామకృష్ణ దర్శకత్వంలో హనీ బన్నీ క్రియేషన్స్ పతాకంపై వెంకటేశ్ గౌడ్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ను డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డి. రామకృష్ణ మాట్లాడుతూ– ‘‘మా గురువు వినాయక్గారి చేతుల మీదుగా ‘శక్తిమతి’ మోషన్పోస్టర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.ఈ చిత్రంలో దాదాపు 30 నిమిషాలు వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. దాని వల్లపోస్ట్ప్రోడక్షన్కు చాలా టైమ్ పట్టింది. ఆగస్టులో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు. వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘మా డైరెక్టర్ రామకృష్ణగారు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీశాను. నేటితరం వాళ్లు తప్ప కుండా చూడాల్సిన చిత్రమిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: పి. రమణా రెడ్డి, సంగీతం: భీమ్స్, కెమేరా: కె. చిట్టిబాబు.

క్రైమ్ థ్రిల్లర్ షురూ
బ్రహ్మాజీ, యశ్వంత్ పెండ్యాల ప్రధానపాత్రల్లో ‘కథకళి’ అనే సినిమా షురూ అయింది. ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హర్షిత్ రెడ్డి కెమేరా స్విచ్చాన్ చేయగా, నిహారిక కొణిదెల క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్కి డైరెక్టర్ ప్రసన్నకుమార్ నాని దర్శకత్వం వహించగా, బ్రహ్మాజీ స్క్రిప్ట్ని యూనిట్కి అందించారు.అనంతరం ప్రసన్న కుమార్ నాని మాట్లాడుతూ– ‘‘ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్గా ‘కథకళి’ ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో కథే హీరో’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘బ్రహ్మాజీగారు ఈ చిత్రంలో ముఖ్యమైనపాత్ర చేస్తున్నారు. మంచి టీమ్తో కలిసి ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు రవికిరణ్ కలిదిండి. ‘‘ఈ సినిమాలో హీరో లంటూ ఎవరూ ఉండరు. కథను నడిపించేపాత్రలు ఉంటాయి’’ అని యశ్వంత్ పెండ్యాల చెప్పారు. మధు దామరాజు, మైమ్ మధు కీలకపాత్రలుపోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పవన్, కెమేరా: జితిన్ మోహన్.

వీర చంద్రహాస రెడీ
‘‘వీర చంద్రహాస’ టైటిల్తోపాటు ట్రైలర్ కూడా ఆసక్తిగా ఉంది. రవి బస్రూర్ ఇప్పటివరకు తనదైన సంగీతంతో అలరించగా, ఈ సినిమాతో డైరెక్టర్గానూ నిరూపించుకున్నారు. ఎమ్వీ రాధాకృష్ణగారు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అని హీరో విశ్వక్ సేన్ చెప్పారు. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వీర చంద్రహాస’. శివ రాజ్కుమార్ కీలకపాత్రపోషించగా, శిథిల్ శెట్టి, నాగశ్రీ జీఎస్ ప్రధానపాత్రలుపోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై, హిట్గా నిలిచింది.ఈ సినిమాని కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్పై ఎమ్వీ రాధాకృష్ణ త్వరలో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఎమ్వీ రాధాకృష్ణ మాట్లాడుతూ– ‘‘వీర చంద్రహాస’ చిత్రం కన్నడలో హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని రవి బస్రూర్ తెలిపారు.

ఇప్పుడు అంతా బోనస్: ‘వెన్నెల’ కిశోర్
‘‘నా కెరీర్లో కామెడీపాత్రలు చాలా చేశాను. వీటిలో నా ఫేవరెట్ రోల్స్ చాలానే ఉన్నాయి. కానీ ‘వెన్నెల, బిందాస్, దూకుడు’ సినిమాల్లో చేసినపాత్రలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏవీ లేవు. ‘దూకుడు’ సినిమాలో నేను చేసిన రోల్ (ఎమ్ఎస్. రామానుజమ్ శాస్త్రి)తోనే నా డ్రీమ్ నెరవేరిపోయింది. ఇప్పుడు అంతా బోనస్’’ అన్నారు ‘వెన్నెల’ కిశోర్. శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సింగిల్’లో ‘వెన్నెల’ కిశోర్ ఓ కీలకపాత్ర చేశారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న (శుక్రవారం) విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో ‘వెన్నెల’ కిశోర్ మాట్లాడుతూ – ‘‘సింగిల్’లో నేను చేసిన అరవింద్పాత్రకు మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సినిమాలను నేనెక్కువగా థియేటర్స్లో చూసుకోను. కానీ ఈ సినిమాను థియేటర్స్లో చూశాను. నాపాత్రను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న తీరు నాకు సంతోషాన్నిచ్చింది. నేను ఏపాత్ర చేసినా ఆపాత్ర వల్ల సినిమా కథ ముందుకెళితే చాలు.ప్రస్తుతం రచయితలకు సరైన గౌరవం,పారితోషికం లభించడం లేదు. అందుకే వాళ్లు డైరెక్టర్స్ అయిపోతున్నారు. ఇక హీరోగా ఒకట్రెండు సినిమాలు చేశాను. కానీ ఎక్కువగా లవ్స్టోరీ సినిమాలు వస్తున్నాయి. రొమాన్స్, సాంగ్స్ నాకు నప్పవు. అలాగే నాపాత్ర చనిపోయే కథలు కూడా వచ్చాయి. కానీ అలాంటిపాత్ర చేయడం నాకు ఇష్టం లేదు. ఇక మంచి కామెడీ కథ కుదిరితే హీరోగా చేస్తా. ‘జఫ్ఫా’ సినిమాతో దర్శకుడిగా ఫెయిల్ అయ్యాను. భవిష్యత్లో దర్శకత్వం చేస్తాను. థ్రిల్లర్ మూవీస్ చేయాలని ఉంది’’ అన్నారు.
న్యూస్ పాడ్కాస్ట్

కాల్పుల విరమణకు అంగీకారం.. కొద్దిసేపట్లోనే మళ్లీ కాల్పులు... పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం
క్రీడలు

భారత్ ‘పాంచ్ పటాకా’
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత కాంపౌండ్ ఆర్చర్లు 5 పతకాలతో సత్తాచాటారు. వ్యక్తిగత విభాగంలో మధుర స్వర్ణ పతకంతో మెరిసింది. దీంతో ఈ టోర్నీలో భారత ఆర్చర్లకు మొత్తంగా 2 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు దక్కాయి. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో మధుర 139–138తో కార్సన్ (అమెరికా)పై గెలుపొందింది. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల మధుర ఈ టోర్నీలో ఓవరాల్గా మూడు పతకాలు గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మధుర... టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ విభాగంలో కాంస్యం గెలిచిన జట్లలో కూడా సభ్యురాలు. ఫైనల్లో మొదట ‘పర్ఫెక్ట్ 30’ పాయింట్లు సాధించిన మధుర ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. ఒకదశలో వరుసగా రెండు సార్లు 8 పాయింట్లతో పాటు ఒకసారి 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని 81–85తో వెనుకంజలో పడింది. తర్వాతి రౌండ్లో మెరుగైన ప్రదర్శనతో స్కోరును 110–110తో సమం చేసి... అదే జోరు కొనసాగిస్తూ పసిడి ఖాతాలో వేసుకుంది. అంతకుముందు కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు స్వర్ణం గెలుచుకుంది. అభిషేక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ దేవ్తలేలతో కూడిన భారత పురుషుల జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో 232–228 పాయింట్ల తేడాతో మెక్సికో జట్టుపై గెలుపొందింది. ఇక పురుషుల వ్యక్తిగత విభాగంలో 22 ఏళ్ల రిషభ్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు. షూటాఫ్లో అతడు దక్షిణ కొరియా ఆర్చర్పై విజయం సాధించాడు. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర) లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకం చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సురేఖ, చికిత, మధుర త్రయం. 221–234తో మెక్సికో జట్టు చేతిలో ఓడింది. ఇక మిక్స్డ్ టీమ్ విభాగంలో మధుర–అభిõÙక్ వర్మ జంట కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో భారత జోడీ 144–142 పాయింట్ల తేడాతో ఫాటిన్ నూర్ఫతే–మొహమ్మద్ జువైదీ (అమెరికా)పై గెలుపొందింది. తాజా ప్రదర్శనతో భారత కాంపౌండ్ జట్టు భవిష్యత్తుపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సారి 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్ను ప్రవేశపెడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే మనకు ఒలింపిక్స్కు పతకం సాధించేందుకు మంచి అవకాశం ఉంది.

ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. స్వింగ్ కింగ్కు పిలుపు? భారత జట్టు ఇదే?
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్తో టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్కు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు విడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్తో మెన్ ఇన్ బ్లూ ఇంగ్లండ్కు పయనం కానుంది.ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనుంది. దీంతో బలమైన టీమ్ను ఇంగ్లండ్కు పంపించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ముఖ్యంగా పేస్ బౌలింగ్ విభాగంపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైట్ బాల్ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్న అర్ష్దీప్ సింగ్కు పిలుపునివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. గత కొనేళ్ల నుంచి భారత టెస్టు జట్టులో ఎడమచేతి వాటం పేసర్ లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఆ లోటు అర్ష్దీప్తో భర్తీ చేయాలని అగర్కాకర్ అండ్ కో యోచిస్తున్నట్లు వినికిడి. కాగా వన్డే, టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసిన అర్ష్దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా డెబ్యూ చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెగ్యూలర్గా ఆడుతున్నప్పటికి టీమిండియా తరపున టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం సింగ్కు రాలేదు. తన కెరీర్లో ఇప్పటివరకు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అర్ష్దీప్.. 66 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్లో అతను రెండు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా 26 ఏళ్ల అర్ష్దీప్కు ఉంది. 2023లో కౌంటీ సీజన్లో కెంట్ తరపున సింగ్ ఆడాడు. ఒకవేళ అర్ష్దీప్ ఇంగ్లండ్ టూర్కు ఎంపికైతే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్లతో బంతిని పంచుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు ప్రసిద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ పేర్లను కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రోహిత్ శర్మ స్దానాన్ని తమిళనాడు బ్యాటర్ సాయిసుదర్శన్తో భర్తీ చేయనున్నట్లు సమాచారం.ఇంగ్లండ్తో సిరీస్కు భారత జట్టు(అంచనా)కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.చదవండి: ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది: రాయుడు

క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ తిరిగి ప్రారంభం?
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..! మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి వచ్చే వారం ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో త్వరలోనే ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పోర్ట్స్ టాక్ తమ కథనంలో పేర్కొంది. పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం.. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్ధావరాలపై దాడులు చేసింది. ఈ ఆపరేషన్లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులను భారత సాయుధ దళాలు మట్టుబెట్టాయి. అనంతరం పాకిస్తాన్ సైన్యం సరిహద్దు వెంబడి కాల్పులు జరపడం, అందుకు భారత్ ధీటుగా బదులివ్వడం వంటి చర్యలు జరిగాయి. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే శనివారం ఇరు దేశాలు సీజ్ఫైర్కు ఒప్పుకొన్నాయి. ఈ విషయాన్ని భారత్-పాకిస్తాన్ అధికారికంగా ధ్రువీకరించాయి. మే 10 సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. మే 12న ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. మే 8న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు అయింది. ఈ మ్యాచ్ మళ్లీ తొలి బంతి నుంచి ప్రారంభం కానున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. రెండు మూడు రోజుల్లో కొత్త షెడ్యూల్ను ఐపీఎల్ పాలకమండలి ఖారారు చేసే అవకాశముంది.చదవండి: ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది: రాయుడు

'ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది'
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. టెస్టు క్రికెట్ నుంచి రిటైరవ్వాలని అనుకుంటున్నట్లు బీసీసీఐకి కోహ్లి లేఖ రాసాడన్న వార్త కలకలం రేపుతోంది. అయితే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు వరకు కొనసాగాలని కోహ్లిని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.ఇప్పటికే రెడ్ బాల్ క్రికెట్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ పకటించాడు. ఇప్పుడు కోహ్లి కూడా టెస్టుల నుంచి తప్పుకుంటే అది టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బే అవుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లికి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక సూచనలు చేశాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని విరాట్ను రాయుడు కోరాడు."విరాట్ కోహ్లి.. దయచేసి రిటైర్ అవ్వొద్దు. భారత జట్టుకు మీ అవసరం ఇప్పుడు చాలా ఉంది. ప్రస్తుతం మీలో ఆడే సత్తా ఇంకా ఉంది. ఇప్పటికీ చాలా ఫిట్గా కన్పిస్తున్నారు. మీరు టీమిండియా తరుపున పోరాడేందుకు బరిలోకి దిగకపోతే టెస్టు క్రికెట్ స్వరూపమే మారిపోతుంది. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి" అని రాయుడు ఎక్స్లో రాసుకొచ్చాడు. అయితే టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై మాత్రం కోహ్లికి మంచి రికార్డులేదు. ఇంగ్లండ్లో 17 టెస్టులు ఆడిన విరాట్.. 33.21 సగటుతో 1096 పరుగులు చేశాడు. ఓవరాల్గా కోహ్లి తన టెస్టు కెరీర్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు, ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. కానీ గత 4 సంవత్సరాల నుంచి అతని సగటు 50 కంటే తక్కువగా ఉంది. కాగా ఇంగ్లండ్ టూర్కు మే 23న భారత జట్టుతో పాటు కొత్త టెస్టు జట్టు కెప్టెన్ను కూడా బీసీసీఐ ప్రకటించనుంది.
బిజినెస్

‘ఆఫీసు’ల్లో హైదరాబాద్ దూకుడు!
రియల్ ఎస్టేట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం కీలకమైంది. హైదరాబాద్ స్థిరాస్తికి ఐటీ బూస్ట్లా మారింది. ఐటీ ఉద్యోగులపై ఆధారపడి గృహ విక్రయాలు ఎంత జరుగుతాయో.. అంతకు రెట్టింపు స్థాయిలో ఐటీ సంస్థల లావాదేవీలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమాది ప్రాంతాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఆఫీస్ స్పేస్.. గ్రోత్ ఇన్ డిస్పర్షన్(గ్రిడ్) పాలసీతో నగరం నలువైపులా విస్తరించింది. ఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఔటర్ వెంబడి ఉత్త్తర, తూర్పు ప్రాంతాల్లో ఉన్న 11 పారిశ్రామిక పార్క్లను ఐటీ పార్క్లుగా మార్చింది. దీంతో పాటు కొంపల్లిలో ఐటీ టవర్, కొల్లూరులో ఐటీ పార్క్లను నిర్మిస్తోంది. ఫలితంగా పశ్చిమం వైపు కాకుండా ఇతర ప్రాంతాలలో కొత్తగా 3.5–4 కోట్ల చ.అ. ఐటీ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుందని ఓ సంస్థ తెలిపింది. – సాక్షి, సిటీబ్యూరోగ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో హైదరాబాద్ దూసుకువెళ్తోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం 9.04 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉన్న హైదరాబాద్.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 కోట్ల చ.అ. మైలురాయిని దాటనుందని ఓ సంస్థ సర్వేలో తేలింది. ఆఫీస్ స్పేస్ మార్కెట్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ తర్వాత హైదరాబాద్ నాల్గో స్థానంలో నిలిచింది. కొంతకాలంగా కొంపల్లి, బాచుపల్లి, మేడ్చల్ వంటి ఉత్తరాది ప్రాంతాలు, ఎల్బీనగర్, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలలో నివాస క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఆయా ప్రాంతాలలోని అందుబాటు గృహాలను ఐటీ ఉద్యోగులు కొనుగోలు చేస్తున్నారు.81 శాతం వృద్ధి రేటు.. కొన్నేళ్లుగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో మన నగరం మెరుగైన స్థానాన్ని నమోదు చేస్తోంది. 2016 నుంచి 2021 వరకు పరిశీలిస్తే.. ఏకంగా 81 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం విశేషం. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇదెంతో మెరుగైన స్థానం. మన నగరం తర్వాత రెండో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ ఆరేళ్లలో 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ విభాగంలో మన నగర భాగస్వామ్యం ఇటీవలి వరకు 12.7 శాతంగా ఉండగా.. కొత్తగా అందుబాటులోకి వచి్చన స్పేస్తో 25 శాతానికి పెరిగింది. గ్రిడ్ పాలసీ అమలుతో.. గ్రిడ్ పాలసీతో నగరం నలువైపులా ఐటీ విస్తరించింది. డెవలపర్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అమలు చేస్తోంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 500 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లకు యాంకర్ యూనిట్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో సంబంధిత భూమిని 50 శాతం ఐటీ, ఐటీఈఎస్ ప్రయోజనాల కోసం వినియోగించగా.. మిగిలిన సగంలో నివాస, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించవచ్చనే వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ అనేది కేవలం రెండు ప్రధాన కారిడార్లలోనే కేంద్రీకృతమై ఉంది. హైటెక్సిటీ, గచి్చ»ౌలి ప్రాంతాలు గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. 96 శాతం స్పేస్ ఈ ప్రాంతాల నుంచే ఉంది.

వార్ టెన్షన్.. నిత్యావసరాల కొరత భయం..
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అధిక ప్రభావం పడేది నిత్యావసరాల సరఫరా మీదే. అందుకే పాకిస్తాన్తో యుద్ద పరిస్థితులు తీవ్రమవుతున్న క్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నిత్యావసరాల కొరత భయం సామాన్య ప్రజల్లో నెలకొంది. జమ్మూ, జైపూర్, శ్రీనగర్ వంటి కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న యుద్ధ ప్రయత్నాల కారణంగా కొరత వస్తుందనే భయంతో ప్రజలు వస్తువులను నిల్వ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ఆందోళన వద్దు..నిత్యావసరాల కొరత భయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశంలో ఆహారం, ఎరువులు, ఇంధనం వంటి అన్ని నిత్యావసర సరుకుల నిల్వలు తగినంత ఉన్నాయని వెల్లడించింది. ధరలపై ఎటువంటి ప్రభావం లేకుండా దేశవ్యాప్తంగా సరఫరా లైన్లు నిరాటంకంగా పనిచేస్తున్నాయని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించిన తర్వాత అధికారులు తెలిపారు. రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో సరుకుల రవాణాకు ఎలాంటి అంతరాయం లేదని, దేశంలోని దాదాపు 500 మార్కెట్లలో కీలక వస్తువుల ధరల స్థాయిలు స్థిరంగానే ఉన్నాయని ఆందోళన చెందవద్దని ప్రజలను కోరారు.పుష్కలంగా ఇంధన నిల్వలుపెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి ఇంధనాల కొరత ఆందోళనలపై ప్రముఖ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా తాజాగా స్పందించింది. ఇండియన్ ఆయిల్ కు దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, తమ సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఆహార భద్రతకు కీలకమైన ఖరీఫ్ లేదా వేసవిలో పంటలను వేయడానికి లక్షలాది మంది రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎరువులు, ఇతర ఇన్పుట్స్ లభ్యతను ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్ సమీక్షించింది. దేశంలో ఆహార, నిత్యావసర వస్తువుల నిల్వలు, ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయా విభాగాల ఉన్నతాధికారులతో ఇదివరకే చర్చించారు. ప్రభుత్వ సంస్థలు ఇటీవలే 25 మిలియన్ టన్నుల గోధుమలను కొనుగోలు చేశాయని ఆహార మంత్రిత్వ శాఖ వర్గాల ద్వారా తెలిసింది.నిల్వ చేస్తే కఠిన చర్యలుఆహార కొరతకు సంబంధించిన ఫేక్ వార్తలను, అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రజలను కోరారు. దేశంలో అవసరానికి మించి ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ‘ఎక్స్’(ట్విటర్) పోస్ట్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ అసత్య ప్రచారాన్ని వాడుకుని ట్రేడర్లు, హోల్సేలర్లు, రిటైలర్లు లేదా వ్యాపారులు నిత్యావసర సరుకులను నిల్వ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హెచ్చరించారు.Don’t believe in propaganda messages regarding food stocks in the country. We have ample food stocks, far exceeding required norms. DONT PAY HEED TO SUCH MESSAGES.Traders, wholesalers, retailers or business entities which engage in trading of Essential Commodities are directed… pic.twitter.com/KTK68qw85T— Pralhad Joshi (@JoshiPralhad) May 9, 2025

ఎస్బీఐ, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై భారీ జరిమానా
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిబంధనలు పాటించలేదనే కారణంతో ప్రముఖ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై జరిమానా విధించింది. ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడానికి, నిర్దేశించిన మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండేలా ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.బ్యాంకుల రుణాలు, అడ్వాన్స్లు, అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కస్టమర్ ప్రొటెక్షన్కు సంబంధించిన అంశాలు, కరెంట్ అకౌంట్ ఖాతాలు ఓపెన్ చేయడంలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. దాంతో ఎస్బీఐకి రూ.1.72 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.1 కోటి జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. ఈ జరిమానాలు బ్యాంకింగ్ రంగంలో మరింత జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి దిద్దుబాటు చర్యగా పనిచేస్తాయని పేర్కొంది.ఇదీ చదవండి: సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంబ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావంరెగ్యులేటరీ నిబంధనల అమలు ఆర్థిక సంస్థలపై ఆర్బీఐ కఠినమైన పర్యవేక్షణను ప్రతిబింబిస్తుంది. అంతర్గత నియంత్రణలను బలోపేతం చేయడానికి, కస్టమర్ రక్షణ యంత్రాంగాలను మెరుగుపరచడానికి బ్యాంకులను ప్రోత్సహిస్తుంది. ఈ చర్యలు ఇతర బ్యాంకులకు హెచ్చరికగా కూడా పనిచేస్తాయని కొందరు భావిస్తున్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని, వాటిని పాటించడంలో లోపాలను నివారించాలని కోరుతున్నారు.

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు సరిహద్దు రాష్ట్రాల్లోని తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇరు దేశాల పరస్పర దాడులకు ప్రతిస్పందనగా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఈవై ఇండియా సూచించింది. యుద్ధ కార్యకలాపాలు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ఎన్సీఆర్, ఛండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్లోని సిబ్బంది ఈ మేరకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.డెలాయిట్, కేపీఎంజీ, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా సహా ఇతర ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. అత్యవసరం కాని ప్రయాణాలపై ఆంక్షలు విధించామని, సరిహద్దు రాష్ట్రాల్లోని ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే సూచించారు. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్లలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్ విధించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాస్మతి బియ్యం ధరల పెరుగుదలకు యుద్ధం కారణం..?సమస్యాత్మక జిల్లాల్లో తాత్కాలిక పాఠశాలల మూసివేతలు, విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన పలు డ్రోన్లు, క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి.
ఫ్యామిలీ

Miss World 2025: అందమూ.. అంతకుమించి...
‘దేవుదే దిగొచ్చి మిమ్మల్నేమైనా కోరుకోమంటే ఏం కోరుకుంటారు?’ ‘పిల్లలు అమాయకులు.. పువ్వులాంటి వారు. దేవుడికి అత్యంత ఇష్టమైన వారు. అందుకే సమాజం చేసే తప్పులకు వాళ్లు బలి కాకూడదు.. వాళ్లు మంచి వాతావరణంలోనే పెరగాలని కోరుతాను!’ అని సమాధానమిచ్చింది కె. అభిమానికా యాదవ్! ఈ జవాబుతో ఆమె ‘2016 మిసెస్ ఇండియా’ పోటీలో నెగ్గారు. తర్వాత మిసెస్ ఆసియా పసిఫిక్ యూనివర్స్ కిరీటాన్ని పొందారు. ‘2017.. మిసెస్ యూనివర్స్ పోటీ’కీ వెళ్లారు. అక్కడ ఆమెను జడ్జెస్ మూడు నిమిషాల్లో డొమెస్టిక్ వయొలెన్స్ గురించి మాట్లాడమన్నారు. దానిమీద మూడు నిమిషాల్లో ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషనే ఇచ్చారు. జడ్జెస్ ఇంప్రెస్ అయ్యి.. ‘2017.. మిసెస్ యూనివర్స్ ఇంటెలిజెన్స్’ సబ్టైటిల్నిచ్చారు. హైదరాబాద్ వాసి అయిన ఆమె.. సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్, పాజెంట్ గ్రూమర్, మోటివేషనల్ స్పీకర్, ఫ్యాషన్ స్టయిలిస్ట్! ఇప్పుడు తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో అసలు బ్యూటీ పాజెంట్స్ ఎలా జరుగుతాయి, ఎలాంటి రౌండ్స్ ఉంటాయి, ఎలా గ్రూమ్ అవుతారు వంటి విషయాలను ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారు.‘2016లో జరిగిన మిసెస్ ఇండియా పోటీల టైమ్కి నేను డివోర్సీని. అప్పుడు మా బాబుకు అయిదేళ్లు. నా పెంపకంలోనే ఉన్నాడు. బీటెక్ చదివి, కొన్నాళ్లు కార్పొరేట్ జాబ్ చేసి వదిలేసి.. జుంబా ట్రైనర్గా మారాను. క్లాసికల్ డాన్సర్ (ఆంధ్రనాట్యం)ని కూడా! ఫిట్నెస్లోనూ ట్రైనింగ్ తీసుకుని ఫిట్నెస్ కోచ్గానూ ఉన్నాను. డివోర్స్ మీద సమాజంలో ఉన్న అప్రకటిత నిషేధాలు, సంకోచాలను కాదని దానిమీద చాలా మాట్లాడేదాన్ని, విరివిగా చర్చించి దాన్ని నార్మలైజ్ చేయడానికి ప్రయత్నించాను. దాంతో అందరికీ సుపరిచితురా లనయ్యా. బ్యూటీ పాజెంట్లో పాల్గొనాలనేది మాత్రం అప్పటికప్పుడు తీసుకున్న డెసిషనే. దీనికి సంబంధించి అప్పుడిక్కడ గ్రూమింగ్ సెంటర్స్ లేవు. ముంబై, లేదంటే ఢిల్లీ వెళ్లాలి. నేను ఢిల్లీ వెళ్లాను. లక్కీగా మంచి కోచ్ దొరికారు. కాన్ఫిడెంట్గా నన్ను నేను ప్రెజెంట్ చేసుకున్నాను. టైటిల్ గెలుచుకున్నాను. ఆ ఉత్సాహంతోనే మిసెస్ యూనివర్స్ పాజెంట్కీ వెళ్లాను. అయితే మిసెస్ ఇండియా, మిసెస్ యూనివర్స్ పాజెంట్స్ మధ్య సంవత్సరం టైమ్ ఉండింది. అయినా గ్రూమింగ్ కోసం బాబును వదిలిపెట్టి వేరే సిటీకి వెళ్లే పరిస్థితి లేదు. దాంతో అంతకుముందు కోచ్ దగ్గర్నుంచే కొన్ని టిప్స్, యూట్యూబ్లో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పాజెంట్స్కి సంబంధించిన వీడియోలు, అందులోని పార్టిసిపెంట్స్ ఇంటర్వ్యూలు చూసి నన్ను నేను గ్రూమ్ చేసుకున్నాను.→ ఆ పోటీలు ఎలా ఉంటాయంటే.. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిసెస్ యూనివర్స్.. ఇలా ఏ అందాల పోటీలైనా దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. నెల రోజులు జరుగుతాయి. అయితే నెలంతా పోటీలుండవు. ఈ పోటీలను ఏ దేశం హోస్ట్ చేసినా దాని ప్రధాన లక్ష్యం.. అక్కడి టూరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే! సో.. మా పోటీలు దక్షిణాఫ్రికాలో జరిగాయి. 86 దేశాల నుంచి కంటెస్టెంట్స్ వచ్చారు. పోటీల షెడ్యూల్ అంతా కంటెస్టెంట్స్కి ముందే ఇచ్చేస్తారు. పోటీలు లేని రోజుల్లో ఆ దేశంలోని చారిత్రక ప్రాంతాల పర్యటన ఉంటుంది. వాళ్లు ఫుడ్, కల్చర్ను తెలుసుకునే పర్యటనలుంటాయి. పోటీల విషయానికి వస్తే.. ఏ రోజు ఏ ఈవెంట్ ఉంటుందో దానికి సంబంధించిన కాస్ట్యూమ్ ఉంటుంది. ఈ కాస్ట్యూమ్స్ కోసం కొంతమంది కంటెస్టెంట్స్ స్పాన్సర్స్ని వెదుక్కుంటారు. స్విమ్ వేర్ రౌండ్ ఉంటుంది. స్విమ్ సూట్తో స్టేజ్ మీద కనిపించాలి. దానికి ఫొటో షూట్ ఉంటుంది. ఆ కాస్ట్యూమ్ని మనమెంత కాన్ఫిడెంట్గా క్యారీ చేస్తున్నాం, బాడీలాంగ్వేజ్ వంటివన్నీ అసెస్ చేస్తారు. ఇంటెలిజెన్స్ రౌండ్ ఉంటుంది. ఇందులో క్విజ్ ఉండొచ్చు, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల మీద చర్చలు, మహిళల సమస్యలకు సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. పవర్పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు. వాళ్లిచ్చిన టాపిక్ని వాళ్లిచ్చిన వ్యవధిలో ఎంత చక్కగా మాట్లాడామనేది చూస్తారు. బ్యూటీ విత్ పర్పస్ రౌండ్ ఉంటుంది. కంటెస్టెంట్స్ ఏదైనా స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగస్వాములై ఉండాలి. ఆ పోటీ కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు అందులో దానిగురించి పొందుపరచాలి. ఈ రౌండ్లో దాని గురించి అడుగుతారు. మనం చేసిన పనిని ఎంత స్మార్ట్గా ప్రెజెంట్ చేశామనేదాన్ని బట్టి పాయింట్స్ ఉంటాయి. దీనిమీద ఆన్లైన్ ఓటింగ్ ఉంటుంది. మాగ్జిమమ్ ఓట్లు వచ్చిన వాళ్లకు మిస్ పాపులర్ అనే సబ్ టైటిల్ ఇస్తారు. ఫిట్నెస్ రౌండ్ ఉంటుంది. అలాగే టాలెంట్ రౌండ్ ఉంటుంది. మనకొచ్చిన కళలను ప్రదర్శించాలి. ఇందులో ది బెస్ట్ పెర్ఫార్మర్కు మిస్ టాలెంటెడ్ సబ్ టైటిల్ ఇస్తారు. ట్రెడిషనల్ రౌండ్ కూడా ఉంటుంది. ఇందులో మనం దేన్ని, ఎంత క్రియేటివ్గా రిప్రెజెంట్ చేస్తున్నామనేది ఫోకస్ అవుతుంది. → తలపై బోనంతో....నేను లంగా, ఓణీ వేసుకుని, తల మీద బోనం పెట్టుకుని ర్యాంప్ వాక్ చేసి, బోనం గురించి వర్ణించాను! గౌన్ రౌండ్, ఇంట్రడక్షన్ రౌండ్, వన్ టు వన్ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్, ప్రిలిమినరీ రౌండ్స్ ఉంటాయి. ఇవేకాక ఫినాలే రోజు.. టైమ్ లేకుంటే అంతకంటే ముందు రోజు మిస్ బ్యూటిఫుల్ స్కిన్,హెయిర్, ఫొటోజెనిక్, స్మైల్, బెస్ట్ స్విమ్ సూట్ లాంటి సబ్టైటిల్స్నిస్తారు. ర్యాంప్ వాక్ ఉంటుంది. ఫినాలే రోజు అందరూ తప్పకుండా గౌనే వేసుకోవాలి. కొన్నిసార్లు ఏ దేశం హోస్ట్ చేస్తుందో ఆ దేశానికి సంబంధించిన ట్రెడిషనల్ వేర్ని ఇస్తారు. మాకు సౌత్ ఆఫ్రికన్ ప్రింట్స్, యాక్ససరీస్తో డిఫరెంట్ అవుట్ఫిట్స్ ఇచ్చారు. కిందటిసారి ముంబైలో జరిగిన మిస్వరల్డ్ పోటీల్లో అందరికీ లెహెంగాలు ఇచ్చారు. ఫినాలే రోజు టాప్ టెన్, లేదా టాప్ ఫైవ్ స్టేజ్ మీద ఉంటారు. వాళ్లందరికీ ఒక క్వశ్చన్ ఇస్తారు. ఒకవేళ మల్టిపుల్ జడ్జెస్ ఉంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఎంత వేగంగా స్పందించి.. ఎంత కాన్ఫిడెంట్గా.. ఎంత కూల్గా ఆన్సర్ చేస్తారో దాన్ని బట్టి టైటిల్ విన్నర్ని, ఫస్ట్ అండ్ సెకండ్ రన్నరప్స్ని అనౌన్స్ చేస్తారు.→ కొరియోగ్రఫీ..గ్రూమింగ్ అవుతున్నప్పుడు ఆర్గనైజర్స్ వస్తారు.. ఎవరు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారో చూస్తుంటారు. ఈ పోటీలకు కొరియోగ్రఫీ ఉంటుంది. ఎవరు ఎక్కడ నిలబడాలి, ఎలా నడవాలి.. ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి వంటివన్నీ ట్రైన్ చేస్తారు. దీనికి పాజెంట్ కోచ్ ఉంటారు. వాళ్లే నేర్పిస్తారు. మిసెస్ ఇండియా మొదలు మిసెస్ యూనివర్స్ వరకు గ్రూమింగ్కి కాస్ట్యూమ్స్, ఫుట్వేర్,యాక్ససరీస్ సహా నాకు రూ. 12 లక్షల వరకు ఖర్చయింది. పాజెంట్లో పార్టిసిపేట్ అవడమనేది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఏమైనా నాకు ఫిట్నెస్ కోచ్గా కొనసాగడమే ఇష్టం. పదేళ్లుగా అదే రంగంలో కొనసాగుతున్నాను. పాజెంట్స్కి సంబంధించి వర్క్షాప్స్ పెట్టాను. త్వరలోనే ఇక్కడొక గ్రూమింగ్ సెంటర్ పెట్టాలని ΄్లాన్ చేస్తున్నాను. – సరస్వతి రమ

ఇషా అంబానీ డైమండ్ నెక్లెస్ రూ. 1,267 కోట్లా? నెయిల్ ఆర్ట్ స్పెషల్ ఏంటి?
రిలయన్స్ సామ్రాజ్యానికి వారసురాలు, ఫ్యాషన్ ఐకాన్ బిడ్డ, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ న్యూయార్క్ లో జరిగిన ప్రతిష్టాత్మక మెట్ గాలా 2025లో తళుక్కున మెరిసింది. ష్యాషన్, స్టైల్లో తన ప్రత్యేకతను చాటుకునే ఇషా మెగా ఈవెంట్లో తన ఫ్యాన్స్ను ఎక్కడా నిరాశపర్చలేదు. ఆమె ధరించిన దుస్తులు, నగలు, చివరికి ఆమె నెయిల్ పాలిష్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. మరీ ముఖ్యంగా ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్, దాని ధర విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. పదండి మరి ఆ షాకింగ్ సంగతులేంటో తెలుసుకుందాం. డిజైనర్ అనామిక ఖన్నా రూ పొందించిన ఇషా డైమండ్ హారాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దాని ధర ఎంత, దాని మూలాలేంటి అనేది ఇంటర్నెట్ లో ఆసక్తిని రేకెత్తించింది.భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా ధరించిన హారం ధర రూ. 1,267 కోట్లు (150 మిలియన్ డార్లు) అని అంటున్నారు నెటిజన్లు.అంతేకాదు 2018 నాటి సెన్సేషన్ మూవీ ‘ఓషన్స్ 8’ లో దీన్ని ప్రదర్శించారని అంటున్నారు. ఈ సినిమాలో దొంగతనం కోసం అన్నే హాత్వే పాత్ర ధరించిన ఈ హారం. ఇది ఒకప్పుడు నవానగర్ మహారాజుకు చెందినది.కార్టియర్ డైమండ్ నెక్లెస్ను ఒకప్పుడు నవానగర్ మహారాజు ధరించారంటూ వ్యాఖ్యానించారు. ఇషా అంబానీ ఏమన్నారు?సోషల్ మీడియా వినియోగదారులు అది నిజంగా ఓషన్స్ 8 నెక్లెస్ అవునా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఇషా అంబానీ "ఇది మా అమ్మది" అని సింపుల్గా తేల్చి చెప్పేసింది. టిఫనీ ఉంగరాలు తప్ప, ఆ రాత్రి తాను ధరించిన దాదాపు ప్రతి నగ తన తల్లి నీతా అంబానీవేనని తెలిపింది. అయితే నవానగర్ మహారాజు ప్రేరణతో ఇషా అంబానీ తల్లి నీతా అంబానీ ఖరీదైన నెక్లెస్ను స్టేట్మెంట్ లేయర్డ్ పెర్ల్ , డైమండ్ నెక్లెస్తో మరింత స్టైల్ చేసింది. దీనిబరువు దాదాపు 136.25 క్యారెట్లు.ఇషా తన దుస్తులను 'సూపర్ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్ ఆధారంగా స్టైల్ చేసింది. ఇక మేకప్, డిఫైన్డ్ ఐబ్రోస్, న్యూడ్-టోన్డ్ లిప్ స్టిక్ తో ఇషా తన లుక్ ని అందంగా తీర్చిదిద్దింది. దీంతోపాటు ప్రత్యేకమైన నెయిల్ ఆర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.బ్లాక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ఫ్యాన్సీ నెయిల్ ఎక్స్ టెన్షన్ ని ఎంచుకోవడానికి బదులుగా, ఇషా ట్విస్ట్ తో కూడిన షీక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ ని ఎంచుకుంది. తన క్రిస్పీ లుక్కు బ్లాక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్తో జతచేసింది. ఆమె నెయిల్స్ ని సెలబ్రిటీ మానిక్యూరిస్ట్ జూలియా స్టైల్ చేసింది. అప్రెస్ నెయిల్ రాసిన జెల్ కూలర్ ని ఉపయోగించినట్లు జూలియా వెల్లడించింది. ఆమె రెండు షేడ్స్ ని ఎంచుకుంది: ఒకటి 'ఫర్గాటెన్ ఫిల్మ్' అనే న్యూడ్ షేర్డ్, , మరొకటి 'ఫ్రెంచ్ బ్లాక్'. ప్రతి నెయిల్ లక్కర్ ధర 14.99 అమెరికా డాలర్లు. అంటే రూ. 1,252 రూపాయలు. రెండు షేడ్స్ కలిసి మొత్తం ఇషా అంబానీ నెయిల్ ఆర్ట్ ధర రూ. 2,504 లన్నమాట.

ఈ సమ్మర్లో చిన్నారులకు కథ రాయడం నేర్పండిలా..!
ఒక హీరో, ఒక విలన్, ఒక క్లయిమాక్స్... అంతే కథ. చెడు మీద మంచి గెలవడం... ప్రాబ్లమ్ మీద పరిష్కారం గెలవడంభయం మీద ధైర్యం గెలవడం... ఇదే కథ రాయడం అంటే.కథలు రాస్తే మీరు క్రియేటర్ అవుతారు. క్యారెక్టర్స్ను క్రియేట్ చేసి గేమ్ ఆడతారు. ఇది చాలా ఫన్గా ఉంటుంది. ‘రైటర్’, ‘ఆథర్’ అనిపించుకోవాలంటే కథలు రాయాలి. ఈజీగా రాయగలరు. ఎలాగో వినండి.కథ రాయడం భలే వీజీ. చిట్టి చిలకమ్మ ఒక రోజు అల్లరి చేసింది. అల్లరి చేస్తే అమ్మ చిన్న దెబ్బ కొట్టింది. చిట్టి చిలకమ్మ బుంగమూతి పెట్టింది. అలిగి తోటకు వెళ్లింది. అక్కడ పండిన జాంకాయ కనిపించింది. దానిని తెచ్చుకుని తీరిగ్గా కొరికి గుటుక్కున మింగింది. అలకా గిలకా అన్నీ పోయాయి. మళ్లీ హాయిగా ఆటల్లో పడింది. చూశారా ఇంతే కథ. చిన్నప్పుడు మనం విన్న రైమ్... ‘చిట్టి చిలకమ్మా.. అమ్మ కొట్టిందా... తోట కెళ్లావా... పండు తెచ్చావా... గూట్లో పెట్టావా... గుటుక్కున మింగావా’... దానినేగా మనం పైన కథగా రాసింది. ప్రతి కథలో చిన్న ప్రాబ్లమ్ ఉంటుంది. దానికి సొల్యూషన్ ఉంటుంది. ఇవి రెండూ ఉంటే అది కథ. పైన కథలో అమ్మ కొట్టడం ప్రాబ్లమ్. పండు తిని ఆ సంగతి మర్చిపోవడం సొల్యూషన్.ఇప్పుడు చెప్పబోయే కథలో ప్రాబ్లమ్’, ‘సొల్యూషన్ ’ కనిపెట్టండి.ఒక ఆవు దారి తప్పి అడవిలోకి వెళ్లిపోతే పులి పట్టుకుంది. ‘పులి బ్రో.. పులి బ్రో... ఇంటి దగ్గర నాకు చంటి దూడ ఉంది. దానికి పాలివ్వకపోతే ఏడుస్తుంది. వెళ్లి పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నన్ను కిల్ చేసి తినెయ్’ అంది. ‘నో. వదల్ను. నువ్వు వెళితే రావు’ అంది పులి. ‘వస్తాను. ప్రామిస్’ అంది ఆవు. పులికి జాలి పుట్టి వస్తే వస్తుంది రాక΄ోతే రాదు అని పంపింది. పాపం ఆవు ఇంటికి వెళ్లి ఇచ్చిన ప్రామిస్కు కట్టుబడి తిరిగి పులి దగ్గరకు వచ్చింది. పులి చాలా ఇంప్రెస్ అయ్యింది. నీలాంటి గుడ్ కౌను నేను చూడలేదు. నిన్ను వదిలేస్తున్నా. వెళ్లు’ అంది.పులి ఆవును పట్టుకోవడం ప్రాబ్లమ్. తన నిజాయితీతో ఆవు ఆ ప్రాబ్లం నుంచి బయట పడటం సొల్యూషన్ . చిన్న కథైనా ఎంత బాగుందో చూడండి. పంచతంత్రంలో ఈ కథ మీరు చదివే ఉంటారుగా.మనం తెలుగు వాళ్లం కాబట్టి తెలుగులో కథలు రాయడం ప్రాక్టీసు చేయాలి. తెలుగు బాగా రాకపోతే పర్వాలేదు.. ఇంగ్లిష్లో కథలు రాయొచ్చు. ఆ భాష ఈ భాష ఏదీ సరిగ్గా రాలేదంటే కొంచెం ప్రాబ్లమే. కథలు ఎందుకు రాయాలంటే వాటి ద్వారా మన థాట్స్ షేర్ చేసుకోవచ్చు. అవేర్నెస్ తేవచ్చు. సెన్సిటైజ్ చేయొచ్చు. చూడండి... ఇది సమ్మర్. ఎంత వేడిగా ఉంటోంది. ఫారెస్ట్లు పెంచడం ఎంత అవసరమో చెప్తూ ఒక కథ రాయొచ్చు. ఒక అడవిలో చెట్లు కొట్టేయడం వల్ల ఒక పక్షికి గూడు పెట్టుకునే చోటు దొరకదు. అది సిటీకి వస్తుంది. చాలా కష్టాలు పడుతుంది. చివరకు ఒక అపార్ట్మెంట్ కిటికీ దగ్గర గూడు ఏర్పాటు చేసుకుంటుంది. నాలుగురోజులు గడుస్తాయో లేదో వేడి గాలి దాని గూడు మీదకు వస్తూ ఉంటుంది. కారణం ఏమిటని చూస్తే ఏసి ఔట్డోర్ యూనిట్ నుంచి ఆ గాలి వస్తుంటుంది. ఆ ఔట్ డోర్ యూనిట్ ఆగదు. పక్షి ఆ గూటిలో ఉండలేదు... ఇలా ఒక స్టోరీ రాయొచ్చు.కథలు రాయాలంటే ముందు కథలు చదవాలి. స్టోరీ బుక్స్ చదివితే కథలు ఎలా రాయాలో తెలుస్తుంది. స్టోరీలు చదివి బెడ్ మీదకు చేరితే మీకూ రకరకాల స్టోరీ ఐడియాస్ వస్తాయి. వాటిని బాగా స్కీమ్ చేసుకుని పేపర్ మీద రాయాలి అంతే. కథ రాసి దానికో టైటిల్ పెట్టాలి. ‘మేకపిల్ల హోమ్వర్క్’, ‘ఆక్సిజన్ ట్యాంకర్ దొంగలు’, ‘ఫ్లయింగ్ బైస్కిల్’... ఇలా. కథలు రాస్తే మిమ్మల్ని రైటర్ అంటారు. రైటర్ గారూ అని పిలుస్తారు. చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కదా. ఆ యుద్ధాన్ని చూసి క్లౌడ్స్ ఏమనుకుంటాయి? బ్లూ కలర్ క్లౌడ్, వైట్ కలర్ క్లౌడ్ను కేరెక్టర్లుగా చేసి కథ రాయాలి. రాయండి. అలాంటి కథలు రాయడమే ఈ సమ్మర్లో మీకు సరైన హోమ్వర్క్. చివరగా కథలు లేకుండా లోకం ఉండదు. ఎప్పుడూ అందరికీ కథలు కావాలి. ఆ కథల్లో ఎంత గట్టి ప్రాబ్లమ్ ఉంటే అంత బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ స్పేస్లో చిక్కుకుపోయింది. ఆమెను క్యారెక్టర్గా తీసుకుని ఒక స్టోరీ రాయొచ్చు. ఎంత ధైర్యంగా ఆమె అన్నాళ్లు స్పేస్లో ఉందో చెప్పి ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియకపోవడం వల్ల టెన్షన్ బిల్డప్ చేసి క్లయిమాక్స్లో స్పేస్షిప్ వెళ్లి ఆమెను తీసుకురావడంతో హ్యాపీ ఎండింగ్ చేస్తే అది కథ. – కె.(చదవండి: అలనాటి వేసివి ముచ్చట్లు..! చిన్నారులు తప్పక తెలుసుకోవాల్సిన సరదాలు..)

బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ డైట్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..
ఎముకల ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనది. వయసు పెరిగేకొద్దీ ఎముకలు సాంద్రతను కోలపోతాయి. పైగా పగుళ్లు ఏర్పడి ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీనికి ప్రధాన కారణం విటమిన్ లోపాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఎముకలను బలహీనపర్చడాన్ని వేగవంతం చేస్తాయి. తరుచుగా గాయలయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటా వేలల్లో ఉంటుందోని గణాంకాలు చెబుతున్నాయి. అయితే వైద్యలు మాత్రం ఇండియన్ డైట్తోనే నివారించుకోవచ్చని చెబుతున్నారు. ఎముక ఆరోగ్యాన్నికాపాడంలో భారతీయ ఆహారాలు చాలా కీలకపాత్ర పోషిస్తాయిని చెబుతున్నారు. పైగా అవి అందుబాటులో ఉండే ఆహారాలేనని అంటున్నారు. అంతేకాదండోయ్ బలమైన ఎముకల బెస్ట్ ఇండియన్ ఫుడ్ గైడ్ ఏంటో కూడా వివరించారు. మరీ అవేంటో తెలుసుకుందామా..!.కాల్షియం అధికంగా ఉండే ఆహారాలుఎముకల బలానికి కాల్షియం అత్యంత ముఖ్యమైన ఖనిజం. పెద్దలకు రోజుకు 1000–1200 mg కాల్షియం అవసరం. భారతీయ ఆహారంలో సహజంగానే అనేక కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు ఉన్నాయి.పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, పనీర్ , మజ్జిగ వంటివి కాల్షియం అద్భుతమైన వనరులు.ఆకుకూరలు: పాలకూర (పాలక్), మెంతులు (మేథి), ఉసిరి వంటి మొక్కల ఆధారిత కాల్షియంనువ్వులు: భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే నువ్వులు (టిల్) గింజలు కాల్షియంతో సమృద్ధిగా ఉంటాయి.రాగి: సాంప్రదాయ భారతీయ ధాన్యం, రాగులు కాల్షియంతో నిండి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అద్భుతమైనవి.అంటే పైన చెప్పిన వాటిల్లో కనీసం ఒక గ్లాసు పాలు లేదా మజ్జిగ తీసుకున్నాచాలు కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.మెరుగైన కాల్షియం శోషణకు విటమిన్ డికాల్షియం శోషణకు విటమిన్ డి అవసరం. సూర్యరశ్మికి గురికావడం ఉత్తమ సహజ వనరులే కానీ ఫుడ్ పరంగా ఏవంటే..గుడ్డు పచ్చసొనసాల్మన్, సార్డిన్ వంటి కొవ్వు చేపలుబలవర్థకమైన పాల ఉత్పత్తులుపుట్టగొడుగులుఇక్కడ అందరికీ ఈజీగా అందుబాటులో ఉండే సూర్యరశ్మిలో గడిపే యత్నం చేయటం వంటివి చేస్తే చాలు.ఎముక ద్రవ్యరాశికి ప్రోటీన్ప్రోటీన్లు ఎముకల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. భారతీయ ఆహారాంలో ప్రోటీన్ని జోడిస్తే ఈ ఎముకల సమస్యను అధిగమించొచ్చు.పప్పుధాన్యాలు, కాయధాన్యాలు (పప్పు, రాజ్మా, శనగ, మూంగ్)పాల ఉత్పత్తులుబాదం, వాల్నట్లు, అవిసె గింజలు, విత్తనాలులీన్ మాంసాలు, గుడ్లుప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం కండరాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఎముక సాంద్రతను పెంచుతుంది, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు వైద్యులుఎముక సాంద్రతకు మెగ్నీషియం, ఫాస్ఫరస్ఎముకల నిర్మాణాన్ని నిర్వహించడానికి కాల్షియంతో పాటు మెగ్నీషియం, పాస్ఫరస్ కూడా కీలకమే. ఈ ఖనిజాలు అధికంగా ఉండే భారతీయ ఆహారాలలో ఇవి ఉన్నాయి:అరటిపండ్లు, అంజూర పండ్లు, ఖర్జూరాలుగోధుమ బియ్యం, ఓట్స్ వంటి తృణధాన్యాలుజీడిపప్పు, వేరుశెనగ వంటి గింజలుగుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలుఎముకలకు హాని కలిగించే ఆహారాలు..పోషకాలు అధికంగా ఉండే ఆహారం కీలకం అయినప్పటికీ, కొన్ని ఆహారాలు ఎముకలను బలహీనపరుస్తాయని విషయం గ్రహించాలని హెచ్చరిస్తున్నారు నిపుణులుతినకూడనవి..చక్కెర పానీయాలుశీతల పానీయాలుఎముకల నుంచి కాల్షియం లీక్ అయ్యే అధిక ఉప్పుఅధిక మొత్తంలో కెఫిన్నడక, జాగింగ్, బరువు మోసే వ్యాయామాలు, సమతుల్య ఆహారం తదితరాలు జీవితాంతం ఎముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. అందువల మనకు అందుబాటులో ఉండే ఈ సాధారణ ఆహారాలతో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..)
ఫొటోలు


సీరియల్ నటి విష్ణుప్రియ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)


లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)


పాకిస్తాన్తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్ (ఫొటోలు)


‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)


అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర (ఫొటోలు)


హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)


HIT3 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)


భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)


ట్రెడిషనల్ + వెస్ట్రన్... లాపతా లేడీ సరికొత్త స్లైల్ (ఫొటోలు)


ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)
అంతర్జాతీయం

భారత్తో కాళ్ల బేరానికి పాకిస్తాన్.. పాక్ ఉప ప్రధాని కీలక ప్రకటన!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ యుద్ధం వేళ దాయాదికి చుక్కలు కనిపిస్తున్నాయి. భారత్ దాడుల కారణంగా పాకిస్తాన్కు తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ డిప్యూటీ పీఎం, విదేశాంగమంత్రి ఇషాక్ దార్ కీలక ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.పాకిస్తాన్పై భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని పాక్ మంత్రి ఇషాక్ దార్ ప్రకటన చేశారు. భారత్ ఆగిపోతే, మేం కూడా అలాగే చేస్తామని ఇషాక్ దార్ తెలిపారు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, భారతదేశం ఈ సమయంలో ఆగిపోతే మేము కూడా శాంతిని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ప్రతీకారం తీర్చుకోమని, ఏమీ చేయమని కూడా చెప్పుకొచ్చారు. తాము నిజంగా శాంతిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్దితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఉద్రిక్తతను తగ్గించాలని కోరుకుంటుందని , భారత్తో చర్చల కోసం కొత్త కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాలు సీఎన్ఎన్ న్యూస్కు వెల్లడించాయి.అయితే, పాక్ మంత్రి ప్రకటనకు ముందు.. పాకిస్తాన్కు అమెరికా కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే భారత్తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్తాన్కు అమెరికా సూచనలు చేసింది. సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాక్కు సూచించారని విదేశాంగశాఖ తెలిపింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు అవసరమైతే ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం చేస్తామని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పాక్ ఇలా ప్రకటన చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Breaking: Global pressure on Pak mounts following escalatory action against India targeting civilian targets.Pak Deputy PM & Foreign Minister Mohammed Ishaq Dar tells a Pak channel that we have conveyed to the US, if India doesn’t respond any further we will not escalate.… pic.twitter.com/KcjaKrShCi— Saurabh Shukla सौरभ शुक्ल (@isaurabhshukla) May 10, 2025మరోవైపు.. ఇప్పటికే పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా భారత్ సరిహద్దులో తన కార్యకలాపాలను నిలిపివేస్తే తదుపరి చర్యలకు దూరంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో భారత్ దాడులు పాకిస్తాన్ను ఓ రేంజ్లో ఇబ్బందులు పెడుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఇస్లామాబాద్లో పెట్రోల్ బంకులను 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

పాకిస్తాన్లో టెన్షన్.. పీఎం షరీఫ్ సంచలన నిర్ణయం!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పాక్ ఆర్మీ దాడులను భారత దళాలు తిప్పి కొడుతున్నాయి. పాక్ చర్యలకు చెక్ పెడుతూ భారత్ అలర్ట్గా ఉంది. భారత్ దాడులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ పాకిస్తాన్ ప్రధాని చర్యలు సంచలనంగా మారాయి. న్యూక్లియర్ బాంబ్ను పర్యవేక్షించే అథారిటీతో పాక్ ప్రధాని సమావేశం కావడం పలు అనుమానాలను తావిస్తోంది.ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతూ పశ్చిమ సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, లాయిటరింగ్ మ్యూనిషన్, ఫైటర్ జెట్లను వాడి.. భారత మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. సామాన్య పౌరుల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపుతోంది. అయితే వాటిని భారత్ తిప్పికొట్టింది. భారత సైన్యం తమ దాడులను తిప్పికొడుతుండటంతో.. ఇక లాభం లేదని పాకిస్తాన్ ఏకంగా అణుబాంబును రెడీ చేస్తున్నట్లు అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. అందుకు కారణం తాజాగా పాక్ ప్రధాని షహెబాజ్ షరీఫ్ నిర్వహించిన ఓ మీటింగ్. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది.తాజాగా పాకిస్తాన్ ప్రధాని షహెబాజ్ షరీఫ్ నేషనల్ కమాండ్ అథారిటీతో సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ అథారిటీ అనేది దేశ అణ్వాయుధ నిల్వలతో సహా భద్రతా నిర్ణయాలు తీసుకునే పౌర, సైనిక అధికారుల అత్యున్నత సంస్థ. ఈ వారంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని పంపడం ద్వారా వారి వైమానిక సరిహద్దులను ఉల్లంఘించారని, కనీసం 48 మంది మరణించారని రెండు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అణ్వాయుధాలను పర్యవేక్షించే అథారిటీతో పాక్ ప్రధాని సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. అయితే.. పాక్ బెదిరింపులకు పాల్పడుతుందని నిపుణులు అంటున్నారు.మరోవైపు.. తాజాగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటన చేశారు. భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని పేర్కొన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.🇵🇰🔥 (Reuters) - Pakistan Prime Minister Shehbaz Sharif has called a meeting of the National Command Authority on Saturday, the military said, after Islamabad launched a military operation against India and targeted multiple bases.The authority is the top body of civilian and… pic.twitter.com/dE6mtrwuEw— Dan-i-El (@Danielibertari0) May 10, 2025

అమెరికన్లకు కొత్త కష్టాలు.. లిప్ స్టిక్ ముద్దు.. చెడ్డీలు వద్దు!
దేశంలో .. కాదు కాదు.. అమెరికాలో ఐటీ ఇండస్ట్రీ ఏం బాలేదు. పెద్ద పెద్ద సంస్థలే వేలల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఉన్న వాళ్ళతో సర్దుకోండి కొత్త స్టాఫ్ను ఇచ్చేది లేదంటున్నాయి. హైక్స్ .. ఇంక్రిమెంట్స్ గురించి పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు. ఉన్న ఉద్యోగం ఊడిపోకుండా చూసుకోండి.. అదే పదివేలు అంటూ సూచనలు చేస్తున్నాయి. అమెరికా ఐటీలో వచ్చిన పెనుమార్పు ఆయా రంగాల్లోని పనిచేస్తున్న వాళ్ల జీవితాలనే కాదు మొత్తం అమెరికా జీవితాల్లో పెనుమార్పులు తెచ్చిందట. అసలు పొదుపు.. ప్లానింగ్. డబ్బంటేనే లెక్కలేకుండా జీవించే అమెరికన్లు ఈ ఆర్థిక మాంద్యం పరిస్థితులను ముందే ఊహించి.. కుటుంబ ఖర్చులను భారీగా తగ్గిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.ఖరీదైన ఆహారం తినడం తగ్గించారట. అంటే లంచ్ టైములో స్టాఫ్తో పాటు అలా వెళ్లి రెస్టారెంట్లో తినే అలవాటున్న వాళ్ళు సైతం ఇప్పుడు ఆ పద్ధతి మానుకుని పద్ధతిగా ఇంటి నుంచి డబ్బా తీసుకువెళ్తున్నారట. బుద్ధిగా ఇంటి భోజనం చేస్తూ.. దిసీజ్ హెల్దీ యూ నో అంటున్నారట. దీంతోబాటు జెంట్స్ కూడా సెలూన్లలో ఖర్చు తక్కువ.. అంటే చావకరకం మసాజులు.. క్రాఫ్ స్టైల్స్ వంటివి కోరుతున్నారు తప్ప అప్పట్లా ఖరీదైన సేవలకు నో అంటున్నారట. అంటే ఓ నాలుగువేల ఖరీదుండే మసాజ్ ఎందుకులే గురూ ఓ. వెయ్యితో ముగించు.. అసలే రోజులు బాలేవు అంటున్నారట. దీంతోబాటు గోళ్ళ సంరక్షణ కు ఎక్కువ ఖర్చు చేయడం ఎందుకని ఏకంగా కృత్రిమ గోళ్లు రకరకాల డిజైన్లలో రెడీమేడ్ కొనుక్కుని పెట్టుకుంటున్నారట. పెడిక్యూర్.. మానిక్యూర్ వంటివి చేయించాలంటే బోలెడు ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద ఖర్చుతో టూర్లు తగ్గిస్తున్నారు.లిప్ స్టిక్ కొందాం.. చెడ్డీలు వద్దులే ఇదంతా ఒకెత్తు అయితే .. ఆర్థిక మాంద్యం ప్రభావమో.. భయం కారణంగానో కానీ రెండు అంశాల్లో మాత్రం చిత్రమైన తేడా కనిపిస్తోంది. దేశంలో లిప్ స్టిక్ కొనుగోళ్లు భారీగా పెరిగాయట. ఇదే తరుణంలో పురుషుల లో దుస్తులు.. ముఖ్యంగా డ్రాయర్లు కొనుగోళ్లు తగ్గినాయి అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఖరీదైన సౌందర్య సాధనాలు.. క్రీములు కొనడానికి మహిళలు వెనుకాడుతున్నారు. వేలకువేలు పెట్టి పార్లర్లకు వెళ్ళడానికి ఇష్టపడని మహిళలు.. పోనీ మంచి లిప్ స్టిక్ అయినా కొనుక్కుందాం అని నిర్ణయించుకుని వాటితో సర్దుకుంటున్నారట. అందంగా ఉండాలంటే పార్లర్ కు మాత్రమే వెళ్లాలా ఏంటి వదినా.. ఇదిగో ఈ లిప్ స్టిక్ వేసుకున్నాక నేను చాలా అందంగా ఉన్నానని మీ అన్నయ్యగారు మెచ్చుకున్నారు అంటూ ఒకరికోరు చెప్పుకుంటున్నారట.దీంతో మహిళలు జస్ట్ లిప్ స్టిక్ కొనుక్కుంటో సంతృప్తి చెందుతూ ఖర్చులు తగ్గిస్తున్నారట. అందుకే లిప్ స్టిక్ అమ్మకాలు పదిశాతం పెరిగాయట. మరోవైపు పురుషులు కూడా ప్యాంట్ షర్ట్. వంటివి బావుంటే చాలు లోపల వేసుకునే చెడ్డీలకు అంత ఖర్చు ఎందుకు ఉన్నవాటినే ఏదోలా సర్దుబాటు చేసుకుందాం.. వాటికోసం మళ్ళీ డాలర్లు ఎందుకు తగలెయ్యాలి.. లోపల వేసేది ఎవరు చూస్తారు అంటున్నారట. మొత్తానికి మాంద్యం ప్రభావం చెడ్డీల మీద కూడా పడింది. -సిమ్మాదిరప్పన్న.

భారత్-పాక్ యుద్ధం.. మరోసారి స్పందించిన చైనా
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా స్పందించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని గట్టిగా కోరింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ సమస్యను ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉద్రిక్తత పెరగడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.భారత్-పాకిస్థాన్ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా.. నిన్న కూడా(శుక్రవారం) స్పందించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.కాగా, భారత్–పాక్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదు’ అని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ విస్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే.. భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు
జాతీయం

విరమణ.. ఉల్లంఘన
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్ కయ్యానికి కాలుదువ్విన దాయాదికి నాలుగు రోజుల్లోనే తత్వం బోధపడింది. సాయుధ ఘర్షణకు తెర దించుదామంటూ భారత్తో కాళ్లబేరానికి వచ్చింది. దాంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు ప్రభుత్వాలూ దాన్ని ధ్రువీకరించాయి. తమ మధ్యవర్తిత్వమే ఇందుకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా భారత్ దాన్ని తోసిపుచ్చింది. పాక్ విజ్ఞప్తి మేరకే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ‘‘శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. భూ, గగన, సముద్ర తలాల్లో పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ మీడియాకు వెల్లడించారు. కానీ కాసేపటికే పాక్ వంకర బుద్ధి ప్రదర్శించింది. శనివారం రాత్రి ఏడింటి నుంచీ మరోసారి దాడులకు దిగింది. సరిహద్దుల గుండా మళ్లీ డ్రోన్ ప్రయోగాలకు, కాల్పులకు తెగబడింది. కోరి కుదుర్చుకున్న విరమణ ఒప్పందానికి గంటల వ్యవధిలోనే తూట్లు పొడిచి తాను ధూర్తదేశాన్నేనని మరోసారి నిరూపించుకుంది. ఈ పరిణామంపై భారత్ మండిపడింది. రాత్రి 11 గంటలకు మిస్రీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఓవైపు విరమణ అంటూనే మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్ తిరిగి దాడులు, కాల్పులకు దిగిందంటూ ధ్వజమెత్తారు. ఒప్పందం కుదిరిందన్న ట్రంప్పాక్ దొంగ నాటకాల నడుమ శనివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటేదాకా పాక్ సైన్యం క్షిపణి, డ్రోన్ దాడులు, సరిహద్దుల వెంబడి కాల్పులు కొనసాగించింది. వాటికి దీటుగా బదులిచ్చిన భారత్ శనివారం తెల్లవారుజాము నుంచీ తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఆరు పాక్ వైమానిక, రెండు రాడార్ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు. సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్లో సాయంత్రం ఐదింటి ప్రాంతంలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు ఇరు దేశాలూ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’’ అని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ప్రధానులు నరేంద్ర మోదీ, షహబాజ్ షరీఫ్లకు అభినందనలు తెలిపారు. ట్రంప్ బృందం ఈ దిశగా అద్భుతంగా పని చేసిందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. సాయంత్రం ఆరింటికి విదేశాంగ కార్యదర్శి మిస్రీ మీడియా ముందుకొచ్చారు. ‘‘పాక్ విజ్ఞప్తి మేరకే విరమణకు ఒప్పుకున్నాం. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. వారి నడుమ చర్చల ఫలితంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది’’ అని స్పష్టం చేశారు. దీనిపై డీజీఎంఓల నడుమ సోమవారం పూర్తిస్థాయి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ‘‘శాంతి సాధనకు ఇది నూతన ప్రారంభం. కాల్పుల విరమణకు చొరవ చూపినందుకు ట్రంప్, వాన్స్, రూబియోలకు కృతజ్ఞతలు’’ అంటూ పాక్ ప్రధాని షహబాజ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టి(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో, ప్రజాప్రతినిధులు తదితరులు ఒప్పందాన్ని స్వాగతించారు. అనంతరం తన గగనతలాన్ని తెరుస్తున్నట్టు పాక్ ప్రకటించింది. బయటపడ్డ పాక్ నైజం కొద్ది గంటలైనా గడవకుండానే పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్లో భారీ పేలుడు శబ్దాలు విని్పంచాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కని్పంచాయి. దీనిపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలే. ఏమిటిది? విరమణకు అప్పుడే తూట్లా?’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కని్పంచినట్టు రాష్ట్ర మంత్రి హర్‡్ష సంఘవి ధ్రువీకరించారు. ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించింది. ఇది అత్యంత దుర్మార్గం. ఇందుకు పూర్తి బాధ్యత ఆ దేశానిదే. దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. మతిలేని చర్యలను ఇకనైనా కట్టిపెట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పూర్తిస్థాయిలో కట్టుబడాలి. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిక్రియ తప్పదు. దాడులను దీటుగా తిప్పికొట్టాల్సిందిగా సైన్యానికి పూర్తిస్థాయి ఆదేశాలిచ్చాం. – విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ

IndiavsPak: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి: కేంద్రం
ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం ⇒ పాకిస్తాన్ ఫేక్ ప్రచారం నమ్మొద్దు... భారత సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయి... విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టీకరణ ⇒ భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత... పాక్ సైన్యం దాడిలో జమ్మూకశ్మీర్లో ఆరుగురి మృతి ⇒ భారత సైన్యం దాడుల్లో ఐదుగురు మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాదులు హతంశనివారం రాత్రి శ్రీనగర్లోని లాల్చౌక్ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ జమ్మూ బారాముల్లా, శ్రనగర్ టార్గెట్గా పాక్ డ్రోన్ల దాడులుపంజాబ్లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్ ప్రకటించిన సైన్యంజమ్మూకశ్మీర్, రాజస్తాన్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్గుజరాత్లోని కచ్లో పూరిస్థాయిలో బ్లాకౌట్డ్రోన్లు కనిపిస్తే కూల్చేసేలా BSFకు ఆదేశాలుశ్రీనగర్లోని ఆర్మీ చినార్ కోర్స్లో హెడ్క్వార్టర్ లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులుతదుపరి ఆదేశాలు వచ్చేవరకు పలు ప్రాంతాల్లో బ్లాకౌట్ విదించాలని ఆదేశాలుపాక్ కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులివ్వాలంటూ సైనికులకు విదేశాంగ శాఖ ఆదేశంఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశించిందిపరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయికాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో పాక్పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి ఫైర్ అయ్యారు. DGMOల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్దే పూర్తి బాధ్యత. ఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలి. ఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పాక్ జరిపిన ఈ చర్యకు భారత్ గట్టి సమాదానం చెప్తుంది. సరిహద్దు పొడవునా పాక్ దాడులకు తెగబడింది. LOC దగ్గర పాక్ కాల్పులు జరిపింది. దాన్ని భారత ఆర్మీ తిప్పి కొడుతోంది. పాక్ సైనికులు కాల్పులు జరపకుండా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అన్నారు విక్రమ్ మిస్త్రి.ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలుకాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్సీజ్ఫైర్ ఇక లేనట్లే.. కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లామళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ వీర మరణంమళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులుడ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలుజమ్మూ కశ్మీర్లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయిభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్ అబ్దుల్లా ట్వీట్శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుపాక్ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్ అవుట్3 గంట్లల్లోనే పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనభారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలుఅఖ్నూర్, రాజౌరి, పూంచ్ సెక్టార్ లో కాల్పులుపాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యంరాజస్థాన్ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ అవుట్జమ్మూ కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్

కాల్పులకు విరమణ: కీలక పాత్ర వీరిదే!
పహాల్గమ్ ఉగ్రదాడి తరువాత.. భారత్ ప్రతీకారదాడులకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. పాక్ ప్రతిదాడులకు ప్రయత్నించినప్పటికీ.. ఇండియన్ ఆర్మీ ముందు నిలబడలేకపోయింది. చేసేదేమీ లేక ఉద్రిక్తతలు తగ్గించాలని వేసుకోవడంతో.. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసారు.భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణలో డీజీఎంవో (డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) అధికారులే కీలక పాత్ర పోషించారు. కాల్పుల విరమణ ప్రకటన రావడానికి ముందు పాకిస్తాన్కు చెందిన ఒక ఉన్నత సైనిక అధికారి భారతదేశానికి ఫోన్ చేశారని, ఆ తర్వాత రెండు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకున్నారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.కాల్పుల విరమణ ప్రకటన రావడానికి గంట ముందు, పాకిస్తాన్ భవిష్యత్తులో చేసే ఏదైనా ఉగ్రవాద చర్యను యుద్ధ చర్యగా పరిగణిస్తామని, భారతదేశం దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుందని భారతదేశం తెలిపింది. గత మూడు రాత్రులుగా ఉత్తర భారతదేశంలోని సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలపైకి పాకిస్తాన్ డ్రోన్ & క్షిపణి దాడులకు పాల్పడినప్పటికి వాటన్నింటినీ భారత వైమానిక రక్షణ శాఖ విజయవంతంగా అడ్డుకుంది.సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడం, సమన్వయం చేయడం వంటి వాటిలో.. డీజీఎంఓల పాత్ర చాలా కీలకం. ఆర్మీలో సీనియర్ అధికారి స్థాయిలో ఉండే వీరు.. సైనిక ఆపరేషన్లలో వ్యూహాత్మక, కార్యాచరణలను అమలు చేస్తుంటారు. ఆర్మీ చీఫ్తో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంటారు. అంతే కాకుండా ప్రత్యర్థులపై దాడులు, శత్రుమూకలను దీటుగా ఎదుర్కొనే సైనిక ఆపరేషన్లకు సంబంధించిన వ్యూహాలు కూడా రచిస్తుంటారు.బలగాలను సిద్ధం చేయడం మాత్రమే కాకుండా.. వాటిని రంగంలోకి దించడం వంటి విధులతో పాటు శాంతి పరిరక్షణలోనూ డీజీఎంఓలు కీలకంగా వ్యవహరిస్తారు. ఒకవైపు నిఘా వ్యవస్థలతోనూ సమన్వయం చేసుకుంటూ.. మరోవైపు వ్యూహాలు రచిస్తారు. మనదేశంలో కాల్పుల విరమణ ఒప్పందాలు, సరిహద్దు ఉద్రిక్తతల వేళ కూడా డీజీఎంవోదే ప్రధాన పాత్ర అని చెప్పాల్సిందే. ఎందుకంటే కాల్పుల విరమణకు ముందు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విరమణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు.

యుద్దానికి బ్రేక్!.. స్పందించిన జమ్మూ కాశ్మీర్ సీఎం
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా ఉండటానికి ఇది ముందుగానే వచ్చి ఉంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే పాక్ కాల్పుల వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియాను ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.గత నాలుగు రోజుల్లో పూంచ్, రాజౌరి, జమ్మూ, బారాముల్లా సెక్టార్లలో 19 మంది గ్రామస్తులు మరణించారు. బుధవారం పూంచ్లో 12 మంది పౌరులు మరణించగా.. శుక్రవారం ఉరి, పూంచ్లో మరో ఇద్దరు మరణించారు. శనివారం ఉదయం పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారితో సహా మరో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.ఘర్షణ సమయంలో జరిగిన అగ్నిప్రమాదాల వల్ల జరిగిన విస్తృతమైన నష్టాన్ని ఎత్తిచూపుతూ, నష్ట అంచనాలను ఖరారు చేయవలసిన ఆవశ్యకతను అబ్దుల్లా నొక్కి చెప్పారు. ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడం ప్రారంభించడానికి వీలుగా వెంటనే తుది సర్వేలు నిర్వహించి నివేదికలు పంపాలని డీసీలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా మా విమానాశ్రయం చాలా రోజులుగా మూసివేయడం జరిగింది. కాల్పుల విరమణ తర్వాత అది తిరిగి ప్రారంభమవుతుందని మేము ఆశిస్తున్నామని ఆయన అన్నారు.#WATCH | On the India- Pakistan ceasefire agreement, Jammu and Kashmir CM Omar Abdullah says, "I welcome the ceasefire. If it had happened 2-3 days ago, the lives we lost would not have been lost. Pakistan's DGMO called our DGMO and the ceasefire was implemented. It is the… pic.twitter.com/uXxlTfnRzJ— ANI (@ANI) May 10, 2025కాల్పుల విరమణభారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విమరణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.
ఎన్ఆర్ఐ

వైట్హౌస్లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్కు చెందిన ప్రేమ్సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

పెళ్లి ఇంట మృత్యు గంట!
హనుమాన్జంక్షన్ రూరల్/గన్నవరం రూరల్: చెన్నై–కోల్కతా జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నవ వరుడు, అతడి బావ మృతి చెందగా, ముగ్గురు చిన్నారులుసహా ఆరుగురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన ఇరువురిలో ఒకరికి గత నెల 30వ తేదీన వివాహమయ్యింది. కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, వీరవల్లి వద్ద శనివారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, హనుమాన్జంక్షన్కు చెందిన మూడెడ్ల స్వామి వెంకట ధీరజ్ (37) సీఏ పూర్తి చేసి హైదరాబాద్లో ఆడిటర్గా పనిచేస్తున్నాడు. అతడి చిన్న బావ చీరా నవీన్ (35) కెనరా బ్యాంక్ మేనేజర్గా పని చేస్తున్నారు. గత నెల 30న ధీరజ్కు వివాహమైంది. ధీరజ్ భార్య రూప (32)తో కలిసి శనివారం సాయంత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. వీరితో పాటుగా ధీరజ్ అక్క అలేఖ్య, మరో సోదరి ప్రవల్లిక, ఆమె భర్త చీరా నవీన్తో పాటు ముగ్గురు చిన్నారులు కూడా విజయవాడకు కారులో పయనమయ్యారు. ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి.. మార్గం మధ్యలో వీరవల్లి వద్ద ఎదురుగా అవతలి వైపు రోడ్డులో వేగంగా వస్తున్న కారు ఒకటి అదుపు తప్పి డివైడర్ను ఢీకొని, ఎగిరి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. అప్పటి వరకూ కారులో సరదాగా మాటలు చెప్పుకుంటూ వెళుతున్న వీరంతా తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. అంబులెన్స్, ట్రక్కు ఆటోలో క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన చిన్నవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ ఆస్పత్రికి తరలించారు. ధీరజ్, నవీన్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ధీరజ్ భార్య రూప అపస్మారక స్థితిలో ఉంది. మృతుడు నవీన్కు కూడా రెండేళ్ల క్రితమే ప్రవల్లికతో వివాహం కావడం గమనార్హం. అలేఖ్య, ఆమె మూడేళ్ల కుమార్తె హంస్విక (4), కుమారుడు తనుష్ సాయి (2), ప్రవల్లిక, ఆమె రెండేళ్ల కుమార్తె ఎస్.జాని్వక గాయత్రి (1) కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఎదుటి కారు డ్రైవర్ నిర్లక్ష్యంఎదురుగా వస్తున్న కారు డ్రైవర్, వీడియోగ్రాఫర్ కోసూరు శ్రీనివాసరావు తీవ్ర నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఘటనను బట్టి స్పష్టమవుతోంది. విజయవాడకు చెందిన అతడు హనుమాన్జంక్షన్లో ఒక శుభకార్యానికి వీడియోగ్రఫీ పని నిమిత్తం వస్తున్నాడు. శ్రీనివాసరావు కూడా గాయాలపాలై ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.మానవత్వం చాటుకున్న వైద్యుడురోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను గుర్తించిన డాక్టర్ బి.కిషోర్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఈ మార్గంలో కారులో వెళుతున్న హైదరాబాద్ ఎమ్మోర్ హస్పటల్స్ ఎండీ డాక్టర్ బి.కిషోర్రెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గమనించి హుటాహుటిన కిందకు దిగారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు ప్రాథమిక చికిత్స అందించారు.

పోలీసులకే చుక్కలు చూపించాడు
సంగారెడ్డి జిల్లా(నారాయణఖేడ్): పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పెద్దముబారక్పూర్లో శుక్రవారం వెలుగులోకి వచి్చంది. ఎస్ఐ డీ.వెంకట్రెడ్డి కథనం ప్రకారం.. పెద్దముబారక్పూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేశ్ మద్యానికి బానిసయ్యాడు. రోజుకో పేరు, ఊరు పేరు మార్చుకుంటూ సాయంత్రం కాగానే డయల్ 100కు కాల్ చేయడం మొదలు పెట్టాడు. భార్య తప్పిపోయింది.. పెట్రోల్ పోసుకుంటున్నా.. మందు తాగి చనిపోతున్నా.. అంటూ రోజుకో మాట చెబుతూ డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసులు వెళ్తే ఎవరూ ఉండేది కాదు. ఆరు నెలలుగా రోజూ పోలీసులకు చుక్కలు చూపించాడు. విసిగిపోయిన పోలీసులు డయల్ 100కు ఎవరూ కాల్ చేస్తున్నారనే కోణంలో విచారణ చేపట్టారు. సంబంధిత వ్యక్తి ఎవరని గుర్తించారు. ఎట్టకేలకు సురేశ్ను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎవరైనా డయల్ 100కు అనవసరంగా కాల్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకట్రెడ్డి హెచ్చరించారు.

బావతో సహజీవనం చేస్తోందంటూ..
నెల్లూరు సిటీ: మహిళపై కొడవలితో దాడి చేసిన ఘటన నెల్లూరు రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన శేషమ్మ అనే మహిళను 20 ఏళ్ల క్రితం భర్త వదిలేశాడు. ప్రస్తుతం ధనలక్ష్మీపురంలో నివాసం ఉంటూ కేజీకే కల్యాణ మండపం వద్ద పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన కరుణాకరన్తో ఆమె సహజీవనం చేస్తోంది. అతను ఇంటికి వెళ్లకుండా ఎక్కువ సమయం శేషమ్మ వద్ద ఉండటం అతడి బావమరిది శ్రీనివాసులుకు తెలిసింది. తన సోదరికి అన్యాయం జరుగుతోందని అతను శేషమ్మపై కోపం పెంచుకున్నాడు. శుక్రవారం పండ్ల దుకాణం వద్ద శ్రీనివాసులు కొడవలితో శేషమ్మ మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సై‘బరి’ తెగింపు
‘విజయవాడ చిట్టినగర్కు చెందిన ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్కు ఓ వెరిఫికేషన్ కోడ్, ఓటీపీ వచ్చాయి. వెంటనే ఓ ఆగంతకుడి నుంచి కాల్ వచ్చింది. పొరపాటున మీ నంబర్కు నాకు సంబంధించిన కోడ్, ఓటీపీ వచ్చిందని, దయచేసి దాన్ని తనకు చెప్పాలని ఆగంతకుడు అభ్యర్ధించాడు. ఫోన్లలో ఇలాంటి పొరపాటు మెసేజ్లు రావడం సహజమేనని నమ్మి. ఆ ఆగంతకుడికి ఆ వ్యక్తి కోడ్, ఓటీపీ చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే గుడ్మార్నింగ్ మెసేజ్ తన స్నేహితులకు పంపేందుకు ఆ వ్యక్తి విఫలయత్నం చేశాడు. 12 గంటల పాటు తన వాట్సాప్కు ఎలాంటి మెసేజ్లు, ఫొటోలు రావడం లేదని, తన నుంచి ఎవరికీ మెసేజ్లు వెళ్లడం లేదని గ్రహించాడు. ఎట్టకేలకు తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయిందని గ్రహించి హుటాహుటిన సైబర్ పోలీస్ స్టేషన్కు పరుగు పెట్టాడు’.విజయవాడస్పోర్ట్స్: డిజిటల్ అరెస్ట్, జాబ్ఫ్రాడ్, హనీ ట్రాప్, ఫిషింగ్, డేటా బ్రీచ్ తదితర వందకుపైగా స్కామ్లతో ప్రజలను ఆరి్ధక దోపిడీ చేసిన సైబర్ నేరగాళ్లు.., తాజాగా రూటు మార్చారు. ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్తో వ్యక్తిగత సమాచార మార్పిడికి రక్షణగా ఉన్న వాట్సాప్పైనా కేటుగాళ్లు కన్నేశారు. వాస్తవ ఖాతాదారులను బురిడీ కొట్టించి హ్యాక్ చేస్తూ సరికొత్త నేరాలకు పాల్పడుతున్నారు. ఒకే నంబర్తో వేర్వేరు ఫోన్లలో ఎన్నైనా వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసుకునే వెసులుబాటును సైబర్ నేరస్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ‘‘ నేరగాళ్లు వారి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న వాట్సాప్కు మీ నంబర్ ఇస్తారు. దీంతో వాట్సాప్ సంస్థ నుంచి మీ మొబైల్కు వెరిఫికేషన్ కోడ్, ఓటీపీ వస్తుంది. ఈ రెండూ తెలుసుకునేందుకు మిమ్మల్ని ఫోన్లో సంప్రదిస్తారు. పొరపాటున కోడ్, ఓటీపీ మీ నంబర్కు వచ్చిందని, దాన్ని కాస్త చెప్పాలని అభ్యర్థిస్తారు. కోచ్, ఓటీపీ వారికి చెప్పగానే మీ వాట్సాప్ ఖాతా వారి ఫోన్లో ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి డిజెప్పీరింగ్ ఆప్షన్ను ఎనేబుల్ చేస్తారు. మీ వాట్సాప్ వచ్చే అన్ని మెసేజ్, ఫోటోలు పూర్తిగా వారి ఫోన్కు వెళ్లేలా సెట్టింగ్స్ చేసి హ్యాక్ చేస్తారు. వాట్సాప్ సంభాషణ పూర్తిగా వారి ఆ«దీనంలోకి తీసుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలు, వ్యక్తిగత హననానికి, ఆర్థిక దోపిడీకి పాల్పడతారు. హ్యాకింగ్తో అపరిమితమైన నేరాలువాట్సాప్లో చాటింగ్, గ్రూప్ల ఆధారంగా ఆ వాట్సాప్ వినియోగించే వ్యక్తి మనస్తత్వాన్ని నేరగాళ్లు అంచనా వేస్తున్నారు. ఏయే గ్రూప్లకు మెసేజ్లు పార్వాడ్ చేస్తున్నారో.., ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నారో.., ఎలాంటి సంభాషణలు చేస్తున్నారో.., క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీని ఆధారంగా స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు, వ్యాపార భాగస్వాములను వాట్సాప్ ద్వారా డబ్బులు అభ్యర్థిస్తారు. వాస్తవ ఖాతాదారుడికి తెలియకుండానే అతని పేరుతో చాటింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. వాట్సాప్ బ్యాంకింగ్ వ్యాలెట్లో ఉన్న నగదునూ లూటీ చేస్తారు. డీపీ (డిస్ప్లే పిక్చర్) ఫొటోను మారి్ఫంగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరిస్తారు. వాట్సాప్ కాంటాక్ట్, గ్రూప్లలో ఉన్న మహిళల డీపీలను మారి్ఫంగ్ చేస్తారు. మహిళలకు అసభ్య మెసేజ్లు పంపి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. డేటింగ్, బెట్టింగ్, గేమింగ్ యాప్లను వినియోగించడమే కాకుండా గ్రూప్లలో ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటారు. వాట్సాప్ గ్రూప్లలోకి, వ్యక్తిగత నంబర్లకు ఏపీకే ఫైల్స్, మాల్వేర్లను పంపిస్తారు. పొరపాటున వాటిని క్లిక్ చేసిన వ్యక్తుల అకౌంట్లను హ్యాక్ చేస్తారు. చైల్డ్ పోర్నోగ్రఫి, పోర్న్ వీడియోలను, న్యూడ్ ఫొటోలను వాట్సాప్ అకౌంట్ ద్వారా ఇతరులకు షేర్ చేస్తారు. స్త్రీ/పురుషు వ్యభిచారుల(మేల్ ఎస్కార్ట్ సర్వీస్, ఫిమేల్ ఎస్కార్ట్ సర్వీస్) వివరాలను ఇతరులకు షేర్ చేసేందుకు ఈ వాట్సాప్ను వినియోగిస్తారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచార మారి్పడికి హ్యాక్ చేసిన అకౌంట్లను వినియోగిస్తారు. వాట్సాప్ చానల్ ద్వారా సంఘ వ్యతిరేక, అసభ్య సమాచార మార్పిడి చేసి కేసుల్లో ఇరికిస్తారు.లా ఎన్ఫోర్స్మెంట్ పోర్టల్లో ఫిర్యాదు చేయండికీ ప్యాడ్ ఫోన్ వినియోగించే వారు సైబర్ నేరస్తుల ట్రాప్లో అత్యధికంగా పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగించే ఉన్నత విద్యావంతులూ బాధితులుగా ఉన్నారు. వాట్సాప్ మాత్రమే కాకుండా ఇన్స్టా, టెలిగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ ఖాతాలకు సంబంధించిన వెరిఫికేషన్ కోడ్, ఓటీపీలను ఇతరులకు చెప్పడం, షేర్ చేయడం చేయరాదు. సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్ హ్యాకింగ్కు గురైతే వెంటనే లా ఎన్ఫోర్స్మెంట్ పోర్టల్లోకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. గూగుల్లోకి వెళ్లి లా ఎన్ఫోర్స్మెంట్ అని టైప్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అందులో ‘మీరు పోలీసా’ అని అడుగుతుంది, ‘నో’ అనే ఆప్షన్ను క్లిక్ చేయగానే కొత్త ఫారం ఓపెన్ అవుతుంది. అందులోని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, ఇష్యూష్ ఆప్షన్లో హ్యాకింగ్కు సంబంధించిన వివరాలను నమోదు చేస్తే ఫిర్యాదు ఆన్లైన్లో రికార్డవుతుంది. ఫిర్యాదు చేయడంలో ఏమైనా సందేహాలుంటే సైబర్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలి. –శ్రీరామచంద్రమూర్తి రాళ్లపల్లి, ఎస్ఐ, సైబర్ క్రైం, ఎన్టీఆర్ జిల్లా
వీడియోలు


కాల్పుల విరమణ వెనుక కండీషన్స్..!


Vikram Misri : కాల్పుల విరమణ


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన


ఒకే దెబ్బ.... 14 మంది పాక్ సైనికులు ఖతం


దేశాన్ని రక్షించడానికి నా సిందూరాన్ని పంపుతున్నా


26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులు.. నేలమట్టం చేసిన భారత సైన్యం


ప్రజలకు ఇవ్వాల్సింది పోయి వారి దగ్గర నుంచే దోచుకుంటున్నారు: Karumuri Nageswara


గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్


సీమ రాజాకు ఇక చుక్కలే. .. అంబటి సంచలన నిర్ణయం


నడిరోడ్డుపై ఒక మహిళను.. వీళ్లు పోలీసులేనా..!