కృష్ణాజిల్లా మొవ్వ మండలం అయ్యంకి రోడ్డు వద్ద ఆదివారం కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది.
కృష్ణాజిల్లా మొవ్వ మండలం అయ్యంకి రోడ్డు వద్ద ఆదివారం కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించిన 108కు సమాచారం అందించారు. దాంతో క్షతగాత్రులను మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆటో డ్రైవర్ మితిమీరిన వేగం కారణంగానే ఆ ప్రమాదం ఓచటు చేసుకుందని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.