రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు రక్షణ కరువైంది. దేశంలో ఎక్కడో ఒకచోట నిత్యం అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
హైదరాబాద్: రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు రక్షణ కరువైంది. దేశంలో ఎక్కడో ఒకచోట నిత్యం అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఈ అత్యాచార ఘటనలు ఆగడం లేదు.
నగరంలోని వనస్థలిపురంలో రెండు రోజుల క్రితం బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ అత్యాచారం కేసులో నిందితులుగా భావిస్తూ ట్రాఫిక్ హోంగార్డ్ ముత్యంరెడ్డి సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.