ఏసిబి అధికారులు ఈ రోజు విశాఖలో ఓ జూనియర్ అసిస్టెంట్ను, కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పంచాయతీరాజ్ ఏఇని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
హైదరాబాద్: ఏసిబి అధికారులు ఈ రోజు విశాఖలో ఓ జూనియర్ అసిస్టెంట్ను, కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పంచాయతీరాజ్ ఏఇని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. విశాఖపట్నం జివిఎంసిలో జూనియర్ అసిస్టెంట్ నాగేశ్వర్ రావు ఓ వ్యక్తి నుంచి 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తసుకున్నారు.
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పంచాయతీరాజ్లో ఏఇ శ్రీహరి 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.