junior assistant
-
ఇంటర్ విద్యలో వింత పోకడ!
సాక్షి, అమరావతి: ఏదైనా ప్రభుత్వ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉన్న ఉద్యోగికి పదోన్నతి ఇస్తే సినియర్ అసిస్టెంట్ అవుతారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి సెక్షన్ సూపరింటెండెంట్ అవుతారు. కానీ ఇంటర్మీడియట్ విద్యా మండలి(Board of Intermediate Education)లో జూనియర్ అసిస్టెంట్ నుంచి నేరుగా సూపరింటిండెంట్గా పదోన్నతి ఇచ్చేస్తారు. ఇదేలా సాధ్యమంటారా? ఇది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఏదైనా సాధ్యమే. ఇంటర్మీడియట్ విద్యా మండలిలో కొందరు జూనియర్ లెక్చరర్లకు ఏకంగా జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు (డీవీఈవో)లుగా పదోన్నతులిచ్చేందకు రంగం సిద్ధమైంది. వాస్తవానికి జూనియర్ లెక్చరర్ల (జేఎల్)కు సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపల్స్గా పదోన్నతి ఇస్తారు. ప్రిన్సిపల్స్కు డీవీఈవోగా పదోన్నతి ఇస్తారు. కానీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో ఇచ్చిన వివాదాస్పద జీవో నం.283లోని ‘ఇనిషియల్ గెజిటెడ్ ర్యాంక్’ పాయింట్కు కొత్త భాష్యం చెబుతూ కొందరు జేఎల్లకు డీవీఈవోలుగా నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జీవో ఇచ్చిన సందర్భం, పదోన్నతుల నిబంధనలతో సంబంధం లేకుండా చేస్తున్న ఈ ప్రక్రియ బోర్డు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది. మరోపక్క ప్రస్తుతం పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రిన్సిపల్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లేని పోస్టుల కోసం ఇచ్చిన జీవోతో లబ్ధి చేసేలా.. ఇంటర్ విద్యా శాఖలో ఒకేషనల్ కోర్సుల పర్యవేక్షణకు 2002–03లో జేఎల్తో సమానమైన కేడర్తో డిప్యూటీ డీవీఈవో (డీవైడీవీఈవో) పోస్టులు భర్తీ చేశారు. డీవీఈవోలుగా జేఎల్లకు పదోన్నతి కల్పించాలని ఉమ్మడి రాష్ట్రంలో 2008లో జీవో 283ని నాటి ప్రభుత్వం జారీ చేసింది. ఇలా జేఎల్లను నేరుగా జిల్లా అధికారులుగా నియమించడంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆ జీవో అమలును నిలిపివేసింది. 2012లో డీవైడీవీఈవోలకు పదోన్నతులిచ్చినా, ఈ జీవోను కాకుండా ప్రిన్సిపల్ సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంది. ఆ తర్వాత డిప్యూటీ డీవీఈవో పోస్టులను భర్తీ చేయలేదు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఈ కేడర్లో ఎవరూ పనిచేయడం లేదు. 16 ఏళ్లుగా అమలు కాని ఈ జీవోను ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూర్చేలా ముందుకు తెచ్చింది. జీవోలో ఉన్న లోపాలను అవకాశంగా తీసుకొని ప్రస్తుతం తక్కువ సర్వీసు ఉన్న ప్రిన్సిపల్స్ కోర్టుకెళ్లి జీవోను అమలు చేయాలని ఇంటర్ విద్యా కమిషనర్పై ఒత్తిడి తెస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ జీవో అమలైతే ఎన్నో ఏళ్లుగా ప్రిన్సిపల్స్గా పనిచేస్తున్న వారికి తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదముంది. ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా జేఎల్స్ అయినవారు, టీచర్లు, ఇతర కేడర్ల నుంచి జేఎల్స్గా పదోన్నతులు పొందిన వారి మధ్య ఇప్పటికే సీనియారిటీ వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు వివాదాస్పద జీవోను తెరపైకి తెచ్చి ప్రభుత్వం మరో కొత్త సమస్య తెచ్చిపెడుతోంది.జీవో 283ఏం చెబుతోంది?మూడేళ్ల సర్వీసు ఉన్న ప్రిన్సిపల్స్కు, మూడేళ్ల సర్వీసు ఉన్న డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు కలిపి కామన్ సీనియారిటీ చేసేటప్పుడు వారి ‘ఇనిషియల్ గెజిటెడ్ కేడర్ సర్వీస్’ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరి యూనిట్ సీనియారిటీ దెబ్బతినకుండా చూడాలి. కానీ ప్రస్తుతం డిప్యూటీ డీవీఈవో కేడర్లో లబ్దిదారులు లేకపోవడంతో ఈ జీవోను అమలు చేయాల్సిన అవసరం లేదన్నది సీనియర్ ప్రిన్సిపల్స్ వాదన.ఈ రెండు కేడర్లలో అర్హులైన వారు ఉంటేనే జీవోను అమలు చేయాలి. ఒక కేడర్లో పనిచేసే లబ్దిదారులు లేకుండా ఉమ్మడి సీనియారిటీ ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ విద్యా శాఖలో రూల్ 34, జీవో 283ని కొందరి స్వార్థం కోసం ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని చెబుతున్నారు.సీనియర్ ప్రిన్సిపల్స్కు అన్యాయం సర్వీసు నిబంధనల ప్రకారం జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కావాలంటే జేఎల్స్ గెజిటెడ్ ఆఫీసర్ టెస్ట్ (జీవోటీ), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్ (ఈవోటీ) పాసవ్వాలి. డీవీఈవోలుగా పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా ప్రిన్సిపల్ అయ్యుండాలి. అంటే జూనియర్ లెక్చరర్లలో సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా ఎవరైతే జీవోటీ, ఈవోటీ పాసవుతారో వారే ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందుతారు. జీవో 283లో పేర్కొన్న ‘ఇనిషియల్ గెజిటెడ్ కేడర్ సర్వీస్’ అనేది కేవలం డిప్యూటీ డీవీఈవోలు, ప్రిన్సిపల్స్కు మాత్రమే ఉద్దేశించింది. కానీ ఈ అంశాన్ని ఇప్పుడు జేఎల్గా సర్వీసులో చేరినప్పటి నుంచి సీనియారిటీని లెక్కించాలని కొందరు కొత్త భాష్యం చెబుతూ ప్రస్తుతం డీవీఈవోల పదోన్నతులకు దీనినే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల అన్ని టెస్టులు పాసై, అర్హతలు సాధించిన సీనియర్ ప్రిన్సిపల్స్ డీవీఈవోలుగా పదోన్నతి పొందే అవకాశం కోల్పోతున్నారు. జూనియర్ ప్రిన్సిపల్స్ లబ్ధి పొందుతున్నారని సీనియర్లు వాపోతున్నారు. హైకోర్టు సైతం యూనిట్ సీనియారిటీకి నష్టం జరగకుండా పదోన్నతులివ్వాలని చెప్పినా ఇనిషియల్ సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంటున్నారని, ఇదే జరిగితే తాము పూర్తిగా పదోన్నతులకు దూరమవుతామని ప్రిన్సిపల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అందరికీ సమన్యాయం చేయాలని కోరుతున్నారు. -
సూర్యాపేటలో విషాద ఘటన
మిర్యాలగూడ అర్బన్: తను చదువుకున్న చదువుకు.. చేసే కొలువుకు సంబందం లేని ఉద్యోగం.. వచ్చిన ఉద్యోగం చేసేందుకు ఇష్టం లేని యువకుడు సాగర్ కాల్వలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామానికి చెందిన నూనె రాములు, నిర్మల రెండవ కుమారుడు ప్రవీణ్కుమార్ (30) బీటెక్ పూర్తి చేసి గ్రూప్–4 పరీక్ష ఫలితాల్లో మెరిట్ సాధించాడు. దీంతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికై గత డిసెంబర్ 28న మిర్యాలగూడ తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరి మిర్యాలగూడ పట్టణంలో నివాసం ఉంటున్నాడు.అయితే ప్రవీణ్ ఉద్యోగంలో చేరిన సమయంలోనే ప్రభుత్వ సంక్షేమ పధకాల క్షేత్రస్థాయి సర్వే ప్రారంభం కావడంతో క్షేత్ర స్తాయిలో పని ఒత్తిడి పెరిగి మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పలు సందర్బాల్లో తన తల్లిదండ్రులతో చెప్పుకున్నాడు. అయితే తెలంగాణ జెన్కో నిర్వహించిన పరీక్షలో విద్యుత్ ఏఈ పోస్టు ఇంటర్వూకు 1:2 లో ఎంపికైన అతడు కొద్ది తేడాతో ఏఈ ఉద్యోగం చేజారింది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అంతే కాకుండా వచ్చే నెలలో గ్రూప్స్ రిజల్ట్స్ కూడా ఉండటంతో తాను కచ్చితంగా గ్రూప్స్ సాధిస్తాననే నమ్మకం ఉందని.. ఈ ఉద్యోగం వదిలేస్తానని తల్లిదండ్రులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే గ్రూప్స్ ఉద్యోగం వచ్చే వరకు ఎలాగైనా ఓపిక పట్టుకుని ఉండమని తల్లిదండ్రులు అతడిని సముదాయించారు. ఉన్నత చదువులు తనకు చదవుకు తగ్గ కొలువు దక్కలేదని గత కొద్ది రోజులుగా తన తోటి సిబ్బంది వద్ద వాపోయేవాడని కూడా కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం డ్యూటికి వచ్చిన ప్రవీణ్కుమార్ రాత్రి ఇంటికి ఫోన్చేసి తల్లితో తన భాదను చెప్పగా.. ఎప్పటిలాగే వారు సర్దిచెప్పారు. అయితే, బుధవారం ప్రవీణ్కుమార్కు తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్చేసినా కలవకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం రాత్రి 11గంటల సమయంలో వేములపల్లి సమీపంలోని సాగర్ కాల్వ వద్ద చివరి సారిగా సెల్ఫోన్ సిగ్నల్స్ చూపించాయి. ప్రవీణ్కుమార్ స్కూటీ సాగర్ కాల్వ వద్ద నిలిపి ఉంచడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గురువారం దొండవారిగూడం వద్ద సాగర్కాల్వలో ప్రవీణ్కుమార్ మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్కుమార్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో జూనియర్ అసిస్టెంట్ మృతి
ఎమ్మిగనూరు రూరల్: గురురాఘవేంద్ర ప్రాజెక్ట్ డివిజన్–2 జూనియర్ అసిస్టెంట్ సురేష్బాబు మంగళవారం గుడేకల్ చెరువులో శవమై తేలాడు. అనుమానాస్పద స్థితిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. మద్దికెర మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన గొల్ల చిన్నహనుమంతు, భాగ్యమ్మకు సురేష్బాబు(32), మనోహర్ అనే ఇద్దరు కుమారులు. గురురాఘవేంద్ర ప్రాజెక్ట్ డివిజన్–2లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసే గొల్ల చిన్నహనుమంతు కరోనా సమయంలో మృతి చెందడంతో కుమారుడు సురేష్బాబుకు జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. విధుల నిమిత్తం ఎమ్మిగనూరులోని టీబీపీ కాలనీలో గది అద్దెకు తీసుకున్న ఈ యువకుడు శుక్రవారం స్వగ్రామానికి వెళ్లాడు. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లాల్సి ఉందని ఇంట్లో చెప్పి ఎమ్మిగనూరుకు వచ్చిన సురేష్బాబు ఆ తర్వాత తల్లి భాగ్యమ్మ ఫోన్కు స్పందించలేదు. అనుమానం వచ్చిన ఆమె ఆఫీస్కు ఫోన్ చేయగా డ్యూటీకి రాలేదని చెప్పడంతో వెంటనే ఎమ్మిగనూరుకు వచ్చి ఆచూకీ కోసం గాలిస్తుండగా మంగళవారం ఉదయం ఎల్ఎల్సీ కాలువ నుంచి గుడేకల్ చెరువులోకి ఓ మృతదేహం కొట్టుకొచ్చిందని తెలిసింది. అక్కడికి వెళ్లి చూడగా మృతదేహం కుమారుడిదై ఉండటంతో బోరున విలపించారు. పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. ఎల్ఎల్సీలో ప్రమాదవశాత్తు పడ్డాడా..లేక తానే దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ నిరంజన్రెడ్డి తెలిపారు. -
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నెల 4న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ–హెచ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ శనివారం రాత్రి విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను సింగరేణి సంస్థ వెబ్సైట్ www.scclmines.comలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 98,882 మంది అభ్యర్థులకు 77,898 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. నెగిటివ్ మార్కింగ్ విధానంలో పరీక్ష నిర్వహించగా.. 49328 మంది అభ్యర్థులు మాత్రమే కనీస అర్హత మార్కులు సాధించారు. 28,570 మంది పరీక్షలో అర్హత పొందలేదు. మూడు ప్రశ్నలకు సరైన సమాధానం నాలుగు ఆప్షన్లలో లేదని నిపుణులు తేల్చడంతో అభ్యర్థులకు మూడు మార్కులు కలపాలని నిర్ణయించారు. వారం రోజుల్లో ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను సంస్థ వెబ్సైట్లో ప్రకటిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, వారు సమర్పించిన అన్ని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాక తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. చదవండి: ఆ కోరిక తీరకుండానే మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు! -
లంచం అడిగి అడ్డంగా దొరికాడు.. ఇంటికి వెళ్లి వస్తాను సార్ వదలండి!
సాక్షి,కాశీబుగ్గ(శ్రీకుకుళం): కాశీబుగ్గ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం(కాశీబుగ్గ సర్కిల్)లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బాడ లక్ష్మీపతి మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. రూ.8వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించిన వివరాల మేరకు.. కవిటి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యా పారి జీఎస్టీ నిబంధనల మేరకు ట్యాక్స్లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో తనకు ప్రభుత్వం నుంచి రూ.82 వేలు రిఫండ్ రావాల్సి ఉందని తెలుసుకున్నారు. ఏప్రిల్ నెలలో తన రిటర్న్స్ చూసు కుని రూ.82వేలు అందాల్సిందిగా నిర్ధారించుకు ని తనకు రావాల్సిన నగదు కోసం కాశీబుగ్గ జీఎస్టీ కార్యాలయం, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న బాడ లక్ష్మీపతిని సంప్రదించారు. అయితే ఈ ఫైలు ముందుకు పంపించాలంటే తనకు రూ.10వేలు లంచం ఇవ్వాలని లక్ష్మీపతి డిమాండ్ చేశారు. ఆ వ్యాపారి లంచం ఇవ్వడం ఇష్టం లేక మూడు నెలలుగా తనకు రావాల్సిన రిఫండ్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా రు. అయితే ఎంతకూ ఫైలు ముందుకు కదలకపోవడంతో శ్రీకాకుళంలోని అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారులతో మాట్లాడిన తర్వాత ఆ వ్యాపారి జూనియర్ అసిస్టెంట్ వద్దకు వెళ్లి రూ.10వేలు ఇవ్వలేనని రూ.8వేలు ఇస్తానని చెప్పారు. ఫోన్ పే చేయాలని లక్ష్మీపతి సూచించగా.. అలా చే యకుండా ఏసీబీ అధికారులు చెప్పినట్లు మంగళవారం జూనియర్ అసిస్టెంట్ చాంబర్లోకి వెళ్లి రూ.8వేలు ఇచ్చారు. సరిగ్గా అదే సమయానికి అక్కడే మాటు వేసి ఉన్న డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ బృందం అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ మేరకు వ్యాపారి నుంచి వాంగ్మూలం తీసుకొని జూనియర్ అసిస్టెంట్ను విచారించి అక్కడున్న పెండింగ్ ఫైల్స్ పరిశీలించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మిపతిని అరెస్టు చేశామని, బుధవారం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ప్రకటించారు. ఇంటికి వెళ్లి వస్తాను.. విడిచి పెట్టండి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో 20వ వార్డు శివాజీనగర్లో నివాసం ఉంటున్న బాడ లక్ష్మీపతికి 2013లో వివాహం జరగ్గా భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన తండ్రి జీఎస్టీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలో తండ్రి ఉద్యోగం ఆయనకు 2017 లో వచ్చింది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన తర్వాత లక్ష్మీపతి ఇంటికి వెళ్తానంటూ, ఇంటి వారితో ఫోన్లో మాట్లాడతానంటూ ఏసీబీ అధికారులను కోరగా.. వారు దానికి అనుమతి ఇవ్వలేదు. వాంగ్మూలం తీసుకున్నాక కారులో తరలించారు. -
నవ్విపోదురు గాక..!
విజయనగరం ఫోర్ట్: విద్యుత్శాఖలో జూనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ను విజయనగరంలో ఉన్న తన సొంత ఇంటికి అక్రమంగా వినియోగించుకుంటున్నారు. విద్యుత్శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ను తన సొంత ఇంటికి మూడేళ్లుగా వాడుకుంటున్నారు. విద్యుత్శాఖలో జూనియర్ అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన సొంత ఇంటికి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ను వినియోగించుకుంటున్నారు. ఈ ముగ్గురు ఉద్యోగులే కాదు. అనేక మంది ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ లబ్ధిని అక్రమ మార్గాన పొందుతూ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల్లో అధికశాతం మంది విద్యుత్ బిల్లులు కూడా చెల్లించుకోలేని పరిస్థితి. అటువంటి వారికి చేయూత నివ్వాలనే ఉద్దేశ్యంతో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అయితే కంచే చేను మేసినట్లు విద్యుత్శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ను పొందుతుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్శాఖ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిపొందుతున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 1,00,987మంది జిల్లాలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ పథకం కింద లబ్ధిదారులు 1,00,987 మంది. వారికి ఏడాదికి ప్రభుత్వం ఉచిత విద్యుత్కు చెల్లిస్తున్న నిధులు రూ.10.95 కోట్లు. గుర్తించిన అనర్హులు 19,996 మంది జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకాన్ని అక్రమంగా పొందుతున్న వారు 19, 996 మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి జాబితాను విద్యుత్ శాఖ అధికారులకు పంపించింది. 2019 నుంచి ఉచిత విద్యుత్ పొందుతున్న వీరికి ప్రభుత్వం వెచ్చించింది రూ.6 కోట్లు. అనర్హులపై జాబితాపై సర్వే ప్రభుత్వం అందించిన అనర్హుల జాబితా ప్రకారం విద్యుత్శాఖ అధికారులు ఇప్పటివరకు 2,880 మందిని సర్వే చేశారు. ఇంకా 17,116 మందిని సర్వే చేయాల్సి ఉంది. సర్వేలో విస్తుగొల్పే విషయాల్లో వెల్లడవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు కాని బీసీ, ఓసీ వర్గాల వారు కూడా ఉచిత విద్యుత్ పొందుతుండడం గమనార్హం. నెలాఖరు లోగా సర్వే పూర్తి అనర్హుల జాబితా ప్రకారం ఇప్పటి వరకు 2,880 మందిని సర్వే చేశాం. ఈ నెలాఖరు లోగా పూర్తి చేస్తాం. అనర్హుల్లో ఉద్యోగులు ఉంటే వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటాం. – పి.నాగేశ్వరావు, విద్యుత్శాఖ ఎస్ఈ (చదవండి: సారా రహిత పార్వతీపురమే లక్ష్యం...) -
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్.. జూనియర్ అసిస్టెంట్(క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 120(ఎస్సీ–08, ఎస్టీ–14, ఓబీసీ–32, ఈడబ్ల్యూఎస్–12, అన్రిజర్వ్డ్–54) ► అర్హత: కనీసం 40శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్లో ఇంటర్మీడియట్(10+2)ఉత్తీర్ణతతోపాటు కనీసం 6 నెలల వ్యవధితో కంప్యూటర్ అప్లికేషన్స్లో డిప్లొమా సర్టిఫికేట్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్పాయింట్, ఎంఎస్ ఎక్స్ఎల్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. ► వయసు: 15.08.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.26,600 నుంచి రూ.90,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. ► ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్/అవేర్నెస్, ఆయిల్ ఇండియాపై ప్రశ్నలకు 20 శాతం మార్కులు కేటాయిస్తారు. ► రీజనింగ్, అర్థమేటిక్/న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 20శాతం మార్కులు కేటాయిస్తారు. ► డొమైన్/సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్(సంబంధిత పోస్టు విద్యార్హతల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి)కు 60శాతం మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నలు మల్టిఫుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ లే దు. పరీక్ష ఇంగ్లిష్, అస్సామీ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షాసమయం రెండు గంటలు. తుది ఎంపిక రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021 ► వెబ్సైట్: https://www.oil-india.com/Current_openNew.aspx -
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్: జూనియర్ అసిస్టెంట్ కొలువులు
పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(పీవీఎన్ఆర్టీవీయూ), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ)ల్లో కొలువుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ).. ఆయా వర్సిటీల్లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా పూర్తి సమాచారం... ► మొత్తం పోస్టుల సంఖ్య: 127 ► పోస్టుల వివరాలు: సీనియర్ అసిస్టెంట్(పీవీన్ఆర్టీవీయూ): 15; జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(పీవీన్ఆర్టీవీయూ): 10; జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(పీజేటీఎస్ఏయూ): 102. అర్హతలు ► డిగ్రీతోపాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్/బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్/కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్ టైప్ రైటింగ్(లోయర్ గ్రేడ్)లో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు ► జూలై 1, 2021 నాటికి 18–34 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు వయోసడలింపు ఉంటుంది. వేతనం ► సీనియర్ అసిస్టెంట్: రూ.22,460–రూ.66,330 ► జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపింగ్: 16,400–రూ.49,870 పరీక్ష విధానం సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కొలువులకు సంబంధించి పరీక్ష విధానం కింది విధంగా ఉంటుంది. ప్రశ్నప్రతం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2లోని సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో, కంప్యూటర్ అప్లికేషన్ విభాగం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. సిలబస్ ఇలా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ► కరెంట్ అఫైర్స్–రీజనల్ నేషనల్ ఇంపార్టెన్స్. ► అంతర్జాతీయ సంఘటనలు, సమావేశాలు. ► జనరల్ సైన్స్: సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ ఘనత. ► పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ. ► భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలు. ► భారత భౌగోళిక శాస్త్రం(తెలంగాణ భౌగోళిక అంశాలకు ప్రాధాన్యత). ► తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం. ► తెలంగాణ రాష్ట్ర విధానాలు. ► ఆధునిక భారతదేశ చరిత్ర(భారత స్వాతంత్రోద్యమం ప్రాధాన్యం). ► తెలంగాణ చరిత్ర(తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంపై ప్రత్యేక దృష్టి). ► ప్రాథమిక ఇంగ్లిష్ (పదోతరగతి స్థాయి). సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్–డిప్లొమా స్టాండర్డ్ ► మెంటల్ ఎబిలిటీ(వెర్బల్, నాన్ వెర్బల్). ► లాజికల్ రీజనింగ్. ► కాంప్రహెన్షన్ అండ్ రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ► న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్. ► బేసిక్ కంప్యూటర్స్. ► మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్: ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్. ► ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్. ► బేసిక్స్ ఆఫ్ డేటాబేస్. ముఖ్యసమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 25, 2021 ► దరఖాస్తు ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల అభ్యర్థులకు రూ.80. ► వెబ్సైట్: https://www.tspsc.gov.in/index.jsp -
ఏపీ, విశాఖపట్నంలో 21 దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం విభిన్న ప్రతిభావంతుల(దివ్యాంగులకు)కు కేటాయించిన బ్యాక్లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 21 » పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్–03, ల్యాబ్ టెక్నీషియన్–01, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫిమేల్)–03, వర్క్ ఇన్స్పెక్టర్–03, షరాఫ్–01, స్వీపర్–01, ఫిట్టర్ హెల్పర్–02, ఆఫీస్ సబార్డినేట్–06, కుక్–01. » అర్హత: పోస్టును అనుసరించి చదవడం, రాయడం, ఏడు, పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లు ఉండాలి. » దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సహాయ సంచాలకులు, దివ్యాంగులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ,రాణి చంద్రమణిదేవి ఆసుపత్రి ప్రాంగణం, పెద్ద వాల్తేర్ జంక్షన్, విశాఖపట్నం–530017 చిరునామాకు పంపించాలి. » దరఖాస్తులకు చివరి తేది: 18.03.2021 » వెబ్సైట్: visakhapatnam.ap.gov.in ఏపీ–కడప పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ అటెండెంట్లు -
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
సాక్షి, పటమట(విజయవాడ తూర్పు) : నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయంలో అవినీతికి పాల్పడిన ఓ జూనియర్ అసిస్టెంట్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పేరు మార్పునకు వచ్చిన దరఖాస్తుదారుడి నుంచి రూ.9 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించడంతో వారు వల పన్ని ఉద్యోగిని పట్టుకున్నారు. వివరాల మేరకు పటమట సర్కిల్–3 కార్యాలయ పరిధిలోని ఎన్ఎంఎం స్కూల్ వద్ద ఉండే కోనేరు శైలజ పటమటలోని శ్రీరామ్స్ కోనేరు ఎన్క్లేవ్ అపార్టుమెంటులో ఆస్తి పన్నుకు మ్యుటేషన్ (పేరు మార్పు) కోసం దరఖాస్తు చేసుకున్నారు. సర్కిల్–3 కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పొన్నపల్లి సూర్యభగవాన్ రూ.9 వేలు డిమాండ్ చేశారు. సుమారు ఆరు నెలలుగా నిత్యం తనకు లంచం ఇస్తేనే పని పూర్తి చేస్తానని వే«ధింపులకు గురి చేయడంతో బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ ప్రసాదరావు వ్యూహాత్మకంగా లంచం ఇచ్చే సమయంలో అవినీతి ఉద్యోగిని వలపన్ని పట్టుకున్నారు. బాధితురాలి నుంచి తీసుకున్న రూ.9 వేలు, సూర్యభగవాన్ టేబుల్ సొరుగులో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రకటించారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరి చారు. కాగా, బిల్ కలెక్టర్గా అడుగిడిన సూర్యభగవాన్ రెండేళ్లలో రిటైర్డ్ కాబోతున్నాడు. బిల్ కలెక్టర్గా విధులు నిర్వహించిన సమయంలో పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు అయిన మొత్తంలో కొంత స్వప్రయోజనాలకు వినియోగించుకునేవాడని, ఈ విషయం వెలుగులోకి రావటంలో అప్పట్లో అకౌంట్స్ సెక్షన్కు బదిలీ చేశారని తెలిసింది. అక్కడా తన పద్ధతిని మార్చుకోకపోవటంతో సర్కిల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా బదిలీ చేశారని, అయినా తన ప్రవర్తనలో మార్పు లేకపోవడం శోచనీయమని వీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అకౌంట్స్ విభాగంలో పని చేసిన సమయంలో కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరుకు ముడుపులు తీసుకునే వారని సమాచారం. కాంట్రాక్టర్లకు ప్రతి నెల టార్గెట్ పెట్టి మరీ వసూలు చేసే వారని, వీరపాండ్యన్ కమిషనర్గా విధులు నిర్వహించిన సమయంలో సూర్యభగవాన్ను సర్కిల్ కార్యాలయంలో రెవెన్యూ విభాగానికి సరెండర్ చేశారని వీఎంసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
బార్గా మారిన మున్సిపల్ ఆఫీస్
-
అక్రమాలు రాజేశాడు!
కర్నూలు(అగ్రికల్చర్): ఆయన కేవలం జూనియర్ అసిస్టెంట్. ఉద్యోగంలో చేరి పదేళ్లు మాత్రమే అయ్యింది. ఈ వ్యవధిలోనే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి.. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసులో పది రోజుల క్రితమే బెయిల్పై విడుదలయ్యారు. ఆయన సాగించిన అక్రమాలు ఒక్కసారిగా వెలుగు చూడటంతో అధికారులు అవాక్కయ్యారు. ఏకంగా రూ.28.65 లక్షలు భార్య పేరుతో ఏర్పాటు చేసిన బోగస్ ఏజెన్సీలకు మళ్లించుకున్నారు. కర్నూలులోని అపూర్వ సరోవర్లో ఆస్తులు కూడా కొన్నారు. మొత్తమ్మీద వ్యవసాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ జి.రాజేష్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిధుల స్వాహాపై కలెక్టర్ ఆదేశాల మేరకు జేడీఏ ఠాగూర్నాయక్ కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెనువెంటనే పోలీసులు రాజేష్ను, ఆయన భార్య స్వాతిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో అధికారుల బాధ్యతారాహిత్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై జేడీఏ విచారణకు ఆదేశించారు. ‘కారుణ్యం’ చూపితే..కన్నం వేశాడు! నందికొట్కూరు పట్టణానికి చెందిన సాయి వెంకటరమణ పోలీసు కానిస్టేబుల్గా పనిచేస్తూ మరణించారు. దీంతో ఆయన కుమారుడు రాజేష్కు కారుణ్య నియామకం కింద వ్యవసాయ శాఖలో ఉద్యోగం వచ్చింది. 2008 జూలై 1న నందికొట్కూరు ఏడీఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా చేరారు. అక్కడి నుంచి బదిలీపై 2013 మే 21న కర్నూలు జేడీఏ కార్యాలయానికి వచ్చారు. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే అభియోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 8న ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆయన నెలసరి వేతనం రూ.35,903 మాత్రమే. కానీ రూ.1.40 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. జేడీఏ కార్యాలయానికి బదిలీ అయినప్పటి నుంచి ఒకే సీటులో కొనసాగడం బాగా కలిసొచ్చింది. జాతీయ ఆహార భద్రత మిషన్, ఎన్ఎంఓఓపీ (జాతీయ నూనె గింజల అభివృద్ధి పథకం) వ్యవహారాలు చూసేవారు. జాతీయ ఆహార భద్రత మిషన్ కింద రైతులకు ఆయిల్ ఇంజిన్లు, వాటర్ క్యారియింగ్ పైపులు 50 శాతం సబ్సిడీపై ఇస్తారు. వీటిని సంబంధిత ఏడీఏ సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసి .. ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడానికి వీలుగా జేడీఏ కార్యాలయానికి నివేదికలు పంపుతారు. ఏడీఏలు ఇచ్చిన బిల్లుల ఆధారంగా జేడీఏ కార్యాలయంలో ప్రొసీడింగ్ తయారు చేసి.. ఆర్టీజీఎస్ ద్వారా ఏజెన్సీలకు నగదు బదిలీ చేస్తారు. ఇక్కడే రాజేష్ తెలివి ప్రదర్శించారు. భార్య పేరుతో బోగస్ ఏజెన్సీలు తన భార్య స్వాతి పేరుతో స్వాతి ఏజెన్సీస్, స్వాతి పైప్ ప్రైయివేటు లిమిటెడ్ అనే సంస్థలు ఏర్పాటు చేశారు. భార్య పేరుతోనే కర్నూలు శ్రీనగర్ కాలనీలోని ఎస్బీఐలో సేవింగ్ ఖాతా 20215151833 తెరిచారు. రెండు సంస్థలకూ ఇదే ఖాతా నంబర్ ఇచ్చారు. ఏడీఏల నుంచి వచ్చిన బిల్లులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి సబ్సిడీ మొత్తాన్ని వాటికి విడుదల చేసిన తర్వాత అవే బిల్లులకు స్వాతి ఏజెన్సీస్ పేరుతో మళ్లీ ప్రొసీడింగ్స్ తయారు చేసి.. సాంకేతిక అధికారి, జేడీఏలను తప్పుదోవ పట్టించి సంతకాలు చేయించారు. ఆర్టీజీఎస్ ద్వారా నిధులు భార్య ఖాతాకు మళ్లించారు. 2018–19కి సంబంధించి ఆగస్టులో ఒకటి, నవంబరు 2, డిసెంబరు 1, ఫిబ్రవరిలో 1 ప్రకారం ప్రొసీడింగ్స్ సృష్టించి పీడీ అకౌంట్ నుంచి మొత్తం రూ.28.65 లక్షలు కొల్లగొట్టారు. 286 మంది రైతుల పేర్లను పేర్కొని.. సబ్సిడీ మొత్తాన్ని స్వాతి ఏజెన్సీస్కు రూ.28.25 లక్షలు, స్వాతి పైప్స్ ప్రైవేటు లిమిటెడ్కు రూ.40 వేలు చొప్పున మళ్లించారు. ప్రస్తుతానికి బయటకు వచ్చింది ఇంతే! 2018–19కి ముందు కూడా అక్రమాలు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం ఎక్కువే రాజేష్ వ్యవహారాలపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి పెట్టలేదు. కేవలం సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం 2018–19కి సంబంధించి స్కీమ్లను ఆడిట్కు సిద్ధం చేస్తుండగా...రాజేష్ అక్రమాలు బయట పడ్డాయి. అధికారులు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు వెళ్లి బోగస్ బిల్లులపై సంతకాలు చేయించినట్లు తెలుస్తోంది. ఆయనపై అంతవరకు ఎలాంటి ఆరోపణలు లేనందున అధికారులు కూడా ముందూ వెనుక చూడకుండా సంతకాలు పెట్టినట్లు సమాచారం. తీరా రూ.28.65 లక్షలు కాజేసి సంతకాలు పెట్టిన అధికారులను కూడా అక్రమాల ఊబిలోకి లాగారు. స్వాతి ఏజెన్సీస్, స్వాతి పైప్స్ ప్రైవేటు లిమిటెడ్కు ఒకే ఖాతా నంబరు ఉన్నా అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. సమగ్ర విచారణకు ఆదేశం జూనియర్ అసిస్టెంట్ రాజేష్ అక్రమాలపై జేడీఏ ఠాగూర్ నాయక్ సమగ్ర విచారణకు ఆదేశించారు. రాజేష్ జేడీఏ కార్యాలయానికి వచ్చినప్పటి నుంచి ఆయన చూసిన వ్యవహారాలను క్షుణంగా పరిశీలించేందుకు ఐప్యాడ్ డీపీడీ వెంకటేశ్వరరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
అవినీతి@100కోట్లు
-
అతనో చిరుద్యోగి.. రూ. కోట్ల ఆస్తికి యజమాని..
తణుకు: అతనో చిరుద్యోగి.. రూ. కోట్ల ఆస్తికి ఆయన యజమాని.. అత్యంత విలాసవంతమైన జీవితం.. ఖరీదైన కార్లు... కళ్లు చెదిరిపోయే ఇల్లు.. సినిమా హాల్ను తలపించే భారీ తెర.. ఒక్కోటి రూ. లక్షలు విలువ చేసే చేతి గడియారాలు.. ఇలా అతని ఆర్థిక వ్యవహారాలను చూస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం.. జిల్లా కేంద్రం ఏలూరులోని పంచాయతీరాజ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న రాంపల్లి సత్యఫణి దత్తాత్రేయ దివాకర్కు చెందిన అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని దివాకర్ నివాసంతోపాటు తణుకులోని ఆయన కార్యాలయంలో, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని ఆయన బంధువుల ఇంటిపైనా ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు అడిషినల్ ఎస్పీ ఎ.రమాదేవి స్వయంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ దాడుల్లో దివాకర్తోపాటు అతని తల్లి రాంపల్లి వెంకట సుబ్బలక్ష్మి, సోదరుడు రాంపల్లి శ్రీనివాస రామకృష్ణ కిరణ్కుమార్ పేర్లపై సుమారు రూ. 100 కోట్లు ఆక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2012 నుంచి 2017 వరకు ఐదేళ్ల వ్యవధిలోనే ఈ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఏడాదిగా దివాకర్ సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగి నుంచి రియల్టర్గా... ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామానికి చెందిన దివాకర్ పంచాయతీరాజ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ విభాగం చింతలపూడిలో 2009 జూన్ 15న జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. ఇతని తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మృతి చెందడంతో దివాకర్కు ఉద్యోగం ఇచ్చారు. అయితే కొద్ది కాలంలోనే రియల్టర్గా అవతారం ఎత్తిన దివాకర్ డెప్యూటేషన్పై ఏలూరు ఎస్ఈ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఏడాదిగా సెలవులో కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాలతో అడిషినల్ ఎస్పీ ఎ.రమాదేవి స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం వేకువజామున పాలంగిలోని దివాకర్ నివాసానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఇంట్లోని నగదు, బంగారు, వెండి ఆభరణాలు, అత్యంత ఖరీదైన చేతిగడియారాలు, విలాసవంతమైన ఐదు కార్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తణుకులోని రాఘవేంద్ర రెసిడెన్సీలోని దివాకర్కు చెందిన కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ గుర్తించిన అక్రమాస్తులు ఇవే... దివాకర్ కుటుంబానికి వ్యవసాయ భూమి 85.62 ఎకరాలు, బంగారం అరకిలో, వెండి 5 కిలోలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. హౌస్ ఫ్లాట్లు, 19, ఫామ్ హౌస్ 1, జీప్లస్2 నివాసగృహం 1, కమర్షియల్ జీప్లస్3 భవనం, గోదాం 1 ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇంట్లో నగదు రూ. 6.25 లక్షలు, విదేశీ కరెన్సీ రూ. 60 వేలు, బ్యాంకు నిల్వ రూ. 3 లక్షలు, ఇంట్లోని ఫర్నీచర్ రూ. 30 లక్షలు, కార్లు 5, మోటారుసైకిళ్లు 2 ఉన్నట్టు గుర్తించారు. పెద్దలే బినామీలు ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న దివాకర్ అక్రమార్జనతోనే ఇన్ని ఆస్తులు కూడబెట్టారా? లేక ఎవరికైనా ఇతను బినామీగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం చిరుద్యోగిగా జీవితం ప్రారంభించిన దివాకర్ కొద్దికాలంలోనే పెద్ద ఎత్తున ఆస్తులు ఎలా కూడబెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులకు ఇతను బినామీగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధి అత్యంత సమీప బంధువుతో ఇతను కొంతకాలంగా ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తడంతోనే దివాకర్ ఆర్థిక వ్యవహారాలపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. దివాకర్ను అరెస్టు చేశారు. సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు బి.సుదర్శన్రెడ్డి, ఎల్.సన్యాసినాయుడు, భాస్కరరావు, మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. -
లుంగీతో ఆఫీస్కు.. ఉద్యోగినుల ఫిర్యాదు!
మధిర : మహిళల అభివృద్ధికోసం ఏర్పాటుచేసిన ఐసీడీఎస్ శాఖలో ఉద్యోగినులకు భద్రత కరువైంది. పద్ధతి మార్చుకోమని సూచించిన పై స్థాయి అధికారిపై జూనియర్ అసిస్టెంట్ దురుసుగా ప్రవర్తించిన సంఘటన గురువారం మధిర ఐసీడీఎస్ కార్యాలయంలో చోటుచేసుకుంది. మధిర ఐసీడీఎస్ కార్యాలయ ఇన్చార్జ్ సీడీపీఓగా కనకదుర్గ విధులు నిర్వరిస్తున్నారు. గతంలో మధిర ఐసీడీఎస్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వహించేవారు. దాన్ని కనకదుర్గ గ్రహించి పనితీరును మార్చుకోవాలని వారికి సూచించారు. అదే సమయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉన్న దేవకుమార్ను సైతం మందలించారు. అయితే దేవకుమార్ ఆమె మాటలను పెడచెవినపెట్టి లుంగీతో కార్యాలయానికి రావడం ప్రారంభించారు. దీంతో తమకు ఇబ్బందిగా ఉందని మహిళా ఉద్యోగులు సీడీపీఓకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇది సరైన విధానం కాదని, పద్ధతి మార్చుకోవాలని మరోసారి తీవ్రంగా దేవకుమార్ను సీడీపీఓ మందలించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ కేంద్రాల అద్దె చెల్లింపు విషయంపై ఉన్నతాధికారులకు ఆన్లైన్ద్వారా సమాచారం అందిస్తుండగా.. అప్పుడే కార్యాలయానికి వచ్చిన దేవకుమార్ తన కంప్యూటర్ను ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ ఉన్నతాధికారిణి అనికూడా చూడకుండా దుర్భాషలాడాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సిబ్బంది.. దేవకుమార్ వ్యవహార శైలిపై ఖమ్మం పీడీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సీడీపీఓ కనకదుర్గ కన్నీటి పర్యంతమై.. ఈ ఉద్యోగి తమకొద్దని.. ఉన్నతాధికారులకు దండం పెడతానని ఇక్కడినుంచి పంపించాలంటూ విలేకరుల ఎదుట వాపోయారు. -
ఏసీబీ వలలో ఇద్దరు లంచావతారులు
నెల్లూరు(క్రైమ్): రెండేళ్ల ప్రొబేషనరీ కాలం అనంతరం సర్వీసు రెగ్యులరైజ్ చేసేందుకు క్లారిఫికేషన్ ఉన్నతాధికారులకు పంపడానికి జూనియర్ అసిస్టెంట్ నుంచి లంచం తీసుకుంటున్న ఇద్దరు నెల్లూరు డీఎంహెచ్ఓ కార్యాలయ ఎస్టాబ్లిష్మింట్ విభాగ ఉద్యోగులను ఏసీబీ అధికారులు గురువారం రెడ్హ్యాండ్గా పట్టుకొన్నారు. ఏసీబీ అధికారుల సమాచారం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన కె.వెంకట మహేష్బాబు తండ్రి జిల్లా వైద్యారోగ్యశాఖలో వాహన డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ 2009లో మృతి చెందారు. తండ్రి మరణించే నాటికి మహేష్ మైనర్ కావడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందలేకపోయాడు. మైనార్టీ తీరిన తర్వాత ట్రిబ్యునల్ను ఆశ్రయించాడు. ట్రిబ్యునల్ 2013లో మహేష్బాబుకు జూనియర్ అసిస్టెంట్ లేదా అందుకు సమాన ఉద్యోగం ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. మహేష్ కారుణ్య నియామకం కింద నెల్లూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో 2014 డిసెంబర్ 26వ తేదీన అకౌంట్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా విధుల్లో చేరారు. 2016 డిసెంబర్లో ఆయన ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయింది. సర్వీసు రెగ్యులర్ అయితే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి. దీంతో సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని మహేష్ డీఎంహెచ్ఓను కోరారు. రెగ్యులరైజేషన్కు సంబంధించిన అంశాలను పరిశీలించి క్లారిఫికేషన్ను పంపాలని కార్యాలయ ఎస్టాబ్లిష్మెంట్ విభాగ సూపరింటెండెంట్ పయ్యావుల శ్రీనివాసులను డీఎంహెచ్ఓ ఆదేశించారు. మహేష్ సూపరింటెండెంట్ను కలిసి అందుకు సంబంధించిన వివరాలన్నింటిని అందజేశారు. రోజులు గడుస్తున్నా సూపరింటెండెంట్ రెగ్యులరైజేషన్కు సంబంధించి పట్టించుకోకపోగా అందుకు సంబం ధించిన పత్రాలు కనిపించడం లేదనీ మరోమారు పత్రాలను ఇవ్వాలని సూచించాడు. దీంతో మహేష్ తిరిగి పత్రాలన్నింటిని అందజేశారు. అయినా చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల మహేష్ ఏడాదిన్నర గడుస్తున్నా ఇంత వరకూ ఎందుకు క్లారిఫికేషన్ పంపరని సూపరింటెండెంట్ను నిలదీశారు. దీంతో సూపరింటెండెంట్ రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రూ 25 వేలు ఇస్తానని మహేష్ అంగీకరించాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని మహేష్ రెండు రోజుల కిందట ఏసీబీ డీఎస్పీ పి. పరమేశ్వర్రెడ్డికి సూపరింటెండెంట్పై ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు గురువారం మహేష్ డీఎంహెచ్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్టాబ్లిష్మెంట్ విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసులను కలిసి లంచంగా రూ. 25 వేలు ఇవ్వబోగా శ్రీనివాసులు ఆ నగదును సీనియర్ అసిస్టెంట్ గోపాల్కు ఇవ్వాలని సూచించాడు. సీనియర్ అసిస్టెంట్కు నగదు ఇవ్వగా అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ శివకుమార్రెడ్డి తన సిబ్బందితో కలిసి గోపాల్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్నారు. శ్రీని వాసులు, గోపాల్ను అదుపులోకి తీసుకుని వారికి రసాయన పరీక్షలు నిర్వహించారు. లంచం తాలు కు నగదును స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం స్టోన్హౌస్పేటలోని శ్రీనివాసులు ఇంట్లో, డీఎం హెచ్ఓ కార్యాలయ సమీపంలోని గోపాల్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇది ఇలా ఉంటే శ్రీనివాసులుపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అన్ని అంశాలపై ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేస్తున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శివకుమార్రెడ్డి, దిలీప్లు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి జలగ..!
-
ఏసీబీ వలలో అవినీతి జలగ..!
ఖమ్మం : ఖమ్మంలోని వీడీవోస్ కాలనీలోగల మహిళ, శిశు సంక్షేమ–అభివృద్ధి శాఖ కార్యాలయంలోనే ఒక పక్కన వికలాంగులు–వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం ఉంది. వికలాంగులకు రుణాలు మంజూరు చేసేందుకు ఇక్కడ ఒక జూనియర్ అసిస్టెంట్, మరొక ఔట్సోర్సిం గ్ ఉద్యోగి ఉన్నారు. ఆ జూనియర్ అసిస్టెంట్ పేరు రేగళ్ల వేణుగోపాల్. ఆయన నెలసరి వేతనం 40 – 50వేల రూపాయలు ఉంటుంది. పాపం.. అది చాల్లేదేమో..! లంచాలకు అలవాటుపడ్డాడు. రుణం మంజూరైన లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తున్నాడు. ఏ ఆసరా లేకనే రుణం కోసం ఇక్కడిదాకా వచ్చిన ఆ వికలాంగులు.. లంచం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు..? ఆ జూనియర్ అసిస్టెంట్ లంచం అడుగుతున్న విషయాన్ని ఆ శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. ప్చ్.. వారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇలా వేధించాడు... తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లికి చెందిన నాగలక్ష్మికి 90 శాతం అంగవైకల్యముంది. జీవనాధారం కోసం పిండి మర పెట్టుకుంటానంటూ రుణం కోసం ప్రభుత్వానికి 2016లో దరఖాస్తు చేసుకుంది. 2017 చివరిలో ఆమెకు లక్ష రూపాయలు మంజూరయ్యాయి. చెక్కు తీసుకునేందుకు జూనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ వద్దకు తన భర్త శ్రవణ్తో కలిసి నాగలక్ష్మి వచ్చింది. అతడు ఐదువేల రూపాయలు లంచం అడిగాడు. వారు ఇవ్వలేకపోయారు. తమ ఆర్థిక పరిస్థితిని వివరించారు. కష్టాల్లో ఉన్నమన్నారు. కరుణించాలని వేడుకున్నారు. వేణుగోపాల్ చెవికి ఇవేవీ ఎక్కలేదు. ‘‘ప్రభుత్వం నుంచి రుణం మంజూరు కావడమంటే మాటలా..? ఎంత కష్టపడితే వస్తుంది..? నన్ను ఆమాత్రం చూసుకోలేరా..? ఐదువేలు ఇస్తేనే చెక్కు ఇస్తాను’’ అని చెప్పాడు. అయినప్పటికీ, వారు దాదాపు రెండు నెలల నుంచి ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. విసిగిపోయారు. చివరకు, ఏసీబీ సీఐ రమణమూర్తిని ఆశ్రయించారు. ఇలా చిక్కాడు... ఏసీబీ సీఐ రమణమూర్తి స్పందించారు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మరో సీఐ రామలింగారెడ్డితో కలిసి పథకం వేశారు. వేణుగోపాల్ వద్దకు నాగలక్ష్మి దంపతులు శుక్రవారం వెళ్లారు. ఐదువేలు ఇచ్చుకోలేమని, రెండువేలు ఇస్తామని బేరమాడారు. వేణుగోపాల్ ఒప్పుకున్నాడు. అప్పటికే ఏసీబీ అధికారులు రసాయనం పూసి ఇచ్చిన నోట్లను ఆ దంపతులు వేణుగోపాల్కు ఇచ్చారు. వాటిని అతడు అలా తీసుకోవడం, ఏసీబీ అధికారులు లోపలికి దూసుకురావడం, ఆ నోట్లను లాక్కోవడం.. అంతా కేవలం కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. అతడిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకే ఫిర్యాదులు లంచం కోసం వేధిస్తున్నాడంటూ వేణుగోపాల్పై గతంలోనే కారేపల్లికి చెందిన వెంకన్న అనే వికలాంగుడు కలెక్టర్కు, ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. వెంకన్న డబ్బులు ఇస్తుండగా పట్టుకుందామని ఏసీబీ అధికారులు పథకం వేశారు. కానీ, అది విఫలమైంది. అప్పటి నుంచి అతడిపై నిఘా పెట్టారు. చివరకు ఇలా పట్టుబడ్డాడు. ‘‘వేణుగోపాల్కు కార్యాలయంలో ఎవరెవరు సహకరిస్తున్నారు..? గతంలో కూడా ఫిర్యాదులు వచ్చినప్పటికీ పై అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు..? వీటన్నిటిని విచారిస్తున్నాం’’ అని, విలేకరులతో ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ చెప్పారు. -
ఇంటి దొంగల పనే !
సాక్షి, తెనాలి: నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో తెనాలిలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ జూనియర్ అసిస్టెంట్ తుమ్మల కిరణ్కుమార్ పాత్ర స్పష్టమైంది. విజయవాడలోని ట్రాన్స్పోర్టు కార్యాలయాల్లో భారీ మొత్తంలో పట్టుబడిన రెక్టిఫైడ్ స్పిరిట్ (ఆర్ఎస్) దిగుమతి చేసుకోవటం ఇందుకు నిదర్శనం. రేపల్లె ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని తుమ్మల పంచాయతీ శివారు గాదెవారిపాలెంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం కోసమే ఆర్ఎస్ను తెప్పిస్తున్నట్టు రూఢీ అయినట్టే. గాదెవారిపాలెంలో నకిలీ మద్యానికి కీలకమైన పూర్ణిమ వైన్స్ లైసెన్సుదారుడు గుమ్మడి సాంబశివరావు, కిరణ్కుమార్ బినామీగా, నకిలీ మద్యం తయారీ సూత్రధారి అతడేనన్న లింకూ స్పష్టమైనట్టే. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్కు అక్కడ నుంచి విజయవాడకు ఆర్ఎస్ను తెప్పిస్తూ నకిలీ మద్యాన్ని యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఏజెంటు సాధుల ఆదిత్యను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు, అతడికి సప్లయి చేస్తున్న మహారాష్ట్ర స్మగ్లర్ వేటకు బయలుదేరి వెళ్లారు. పట్టిచ్చిన ఫోన్ కాల్ జాబితా... నకిలీ మద్యం సూత్రధారి తుమ్మల కిరణ్కుమార్కు డిపార్టుమెంటులో సంబంధాలు బలంగా ఉన్నాయి. నకిలీ మద్యం రాకెట్ను పట్టుకున్న రోజున, తెనాలి జూనియర్ అసిస్టెంట్ ఫోన్ కాల్ జాబితాను పరిశీలించిన అధికారులకు ఈ విషయం స్పష్టమైంది. అతడి నుంచి రేపల్లె సర్కిల్ కార్యాలయానికి దాదాపుగా అరవై కాల్స్ వెళ్లాయి. మళ్లీ అటువైపు నుంచి అదే సంఖ్యలో కాల్స్ ఇతడికీ వచ్చినట్టు తెలుసుకున్నారు. నకిలీ మద్యం సూత్రధారికి, సర్కిల్ కార్యాలయంతో ఉన్న అనుబంధంతోనే రెస్క్యూ కోసం పడరానిపాట్లు పడ్డారని ఫోన్ కాల్స్ జాబితా చెబుతోంది. పూర్వ భాగస్వామి సమాచారంతోనే..! తెనాలి జూనియర్ అసిస్టెంట్ కిరణ్కుమార్, దుగ్గిరాల సర్కిల్లో పని చేస్తూ ‘సిండికేట్ కింగ్’గా పేరు తెచ్చుకున్న కానిస్టేబుల్, తెనాలి డివిజనులో మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. మద్యం వ్యాపారంలో వీరితో గత కాలంలో భాగస్వామిగా వ్యవహరించిన ఒకరి పక్కా సమాచారంతోనే తుమ్మల పంచాయతీ నకిలీ మద్యం రాకెట్ను ఎక్సైజ్ టాస్క్ఫోర్స్/ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఛేదించగలిగారని సమాచారం. కొంచెం అప్రమత్తమైతే నాడే వెలుగులోకి.. కొల్లూరు మండలం క్రాపలో అనధికార దుకాణం పట్టుబడ్డ కేసును పట్టించుకున్నట్టయితే ఆనాడే నకిలీ మద్యం బాగోతం వెల్లడయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెనాలికి సమీపంలోని వేమూరులో లైసెన్సు దుకాణం నుంచి క్రాపలో అనధికార దుకాణం నడుపుతున్నారు. దుగ్గిరాల ఎక్సైజ్ సర్కిల్ పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడ 4–5 కేసుల మద్యం, బస్తా కొత్త మూతలు దొరికాయి. అక్కడ అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ప్రశ్నిస్తే, తెనాలి ఓవర్ బ్రిడ్జి దగ్గర్లోని వైన్స్లో పని చేసే శంకర్ అనే యువకుడు, తానూ కలిసి సీసాలకు మూతలు వేసి బెల్టు షాపులకు వేస్తున్నట్టు చెప్పాడు. దీనికి ముందు గతేడాది దుగ్గిరాల సర్కిల్లోని ఈమని గ్రామంలో టాస్క్ఫోర్స్ దాడిలో సుమారు 20 కేసుల మద్యం, బస్తా కొత్త మూతలు దొరికాయి. ఈ రెండు ఘటనల్లోనూ కీలకమైన యువకుడిని విచారిస్తే తుమ్మలకు చేరుతున్న ఆర్ఎస్, ఈ చివరకూ మద్యం రూపంలో అందుతోందని రూఢీ అయ్యేదనే వాదన ఉంది. తుమ్మల ఘటన తర్వాతనైనా అటుకేసి దృష్టి సారిస్తారో? లేదో? వేచి చూడాలి. -
ఒంగోలులో ఏసీబీకి పట్టుబడ్డ అధికారి
సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో ఓ అవినీతి అధికారి వ్యవహారం వెలుగు చూసింది. గురువారం ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. జూనియర్ అసిస్టెంట్గా పని చేసే రావిపాటి పూర్ణ చందర్రావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం అధికారులు అతన్ని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
గుంటూరు: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ జిల్లా కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్ ఏసీబీ అధికారుకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 3 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు బషీర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు. -
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు
కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ శాఖకు ప్రభుత్వం 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను మంజూరు చేసినట్లు జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్బాబు, గిరికుమార్రెడ్డి తెలిపారు. గురువారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని తహసీల్దారు కార్యాలయాలకు ఒక్కో పోస్టు రానుందన్నారు. ప్రస్తుతం తహసీల్దారు కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్పై పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు హవా నడుపుతున్నారని.. అనేక అక్రమాలకు వీరే బాధ్యులు అవుతున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వం తహసీల్దార్లకు సహాయకంగా ఉండేందుకు కొత్త పోస్టులు మంజూరు చేసిందన్నారు. ఇన్ని పోస్టుల మంజూరుకు రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కృషి కారణమని వివరించారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా నాయకులు రామన్న, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రొయ్యూర్ పీహెచ్సీ జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
ఏటూరునాగారం : మండలంలోని రొయ్యూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఫయాజ్ను సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ సాంబశివరావు శనివారంఉత్తర్వులుజారీ చేశారు. శుక్రవారం రొయ్యూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటీడీఏ పీఓ అమయ్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఫయాజ్ ఆస్పత్రి గదిలో పడుకొని ఉన్నాడు. పీఓ వెళ్లి ఎం దుకు పడుకున్నావని ప్రశ్నించగా మీరు ఎవరు నన్ను అడుగుతున్నారని అమర్యాదగా ప్రవర్తించాడు. దీంతో పీఓ ఇచ్చిన సిఫారసు మేరకు సస్పెండ్ చేసినట్లు సాంబశివరావు పేర్కొన్నారు. -
ఏసీబీ అదుపులో జూనియర్ అసిస్టెంట్
మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం డీసీహెచ్ఎస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నతస్లీమ్ బేగ్ శానిటేషన్ కాంట్రాక్టర్కు బిల్లు మంజూరు చేయడానికి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తస్లీమ్ లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. -
'రాత పరీక్షలో అవకతవకల్లేవు'
హైదరాబాద్: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామక పరీక్ష పూర్తి పారదర్శకంగా జరిగిందని సింగరేణి, జేఎన్టీయూ అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో అవినీతి ఆరోపణలపై జరుగుతున్న ప్రచారం నిరాధారమైనవని వారు చెప్పారు. అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్ రాతపరీక్షలో అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వివరణ ఇవ్వడానికి సింగరేణి అధికారులు, జేఎన్టీయూ అధికారులతో కలిసి గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కానీ సీఐడీ విచారణకు సిద్ధమేనా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. -
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల
గోదావరిఖని: సింగరేణిలో 471 జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్) ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను ఆదివారం ప్రకటించారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈనెల 11న ఈ పరీక్ష నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో జేఎన్టీయూ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ విశ్వనాథ్ సింగరేణి రిక్రూట్మెంట్ సెల్ జీఎం సి.మల్లయ్యపంతులుకు ఫలితాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 170 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 70,509 మంది హాజరుకాగా, వీరిలో 96% మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో మొత్తం 150 మార్కులకు 90.66 మార్కులు సాధించి ఆది లాబాద్ జిల్లాకు చెందిన మాటేటి కృష్ణ మొదటి స్థానంలో నిలిచాడు. ఫలితాలను సింగరేణి వెబ్సైట్లో పెట్టామని రిక్రూట్మెంట్ సెల్ జీఎం తెలిపారు. తప్పొప్పులపై తమ విజ్ఞప్తులను ఈ నెల 28 వరకు రిక్రూట్మెంట్ సెల్ దృష్టికి తీసుకురావాలని కోరారు. వీరు ఈ నెల 10కి ముందు తీసిన సర్టిఫికెట్ల ఆధారాలతో రావాలని సూచించారు. ఆ తర్వాతే తుది జాబితా విడుదల చేస్తామన్నారు. -
సింగరేణి పరీక్షకు 70 వేల మంది హాజరు
కొత్తగూడెం: సింగరేణిలో ఖాళీగా ఉన్న 471 జూనియర్ అసిస్టెంట్ (క్లరికల్) పోస్టులకు ఆరు జిల్లాల్లోని 170 కేంద్రాలలో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. మొత్తం 83,225 మందికి హాల్ టిక్కెట్లు పంపిణీ చేయగా 70,561 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం హైదరాబాద్లోని జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో సింగరేణి సంస్థ డెరైక్టర్ (ఫినాన్స్, పా) పవిత్రన్కుమార్ లాటరీ ద్వారా పరీక్ష పత్రాన్ని ఎంపిక చేశారు. ఆదిలాబాద్లో 22 పరీక్ష కేంద్రాల్లో 7,915 మందికి గాను 6,271, హైదరాబాద్లో 6 కేంద్రాల్లో 5,277 మందికి 3,787 మంది, కరీంనగర్లో 53 పరీక్ష కేంద్రాల్లో 25,429 మందికి గాను 21,895 మంది, వరంగల్లో 21 కేంద్రాల్లో 14,576 మందికి గాను 12,366 మంది, ఖమ్మంలో 41 కేంద్రాల్లో 20,799 మందికి గాను 17,810 మంది, మంచిర్యాలలో 27 పరీక్ష కేంద్రాల్లో 9,229 మందికి గాను 8,432 మంది హాజరయ్యారు. -
జూనియర్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటు
అనంతపురం టౌన్: విధులు సక్రమంగా నిర్వర్తించనందుకు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ షఫీయుల్లాఖాన్పై శుక్రవారం సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు మున్సిపల్ కమిషనర్ నాగవేణి ఉత్తర్వులు జారీ చేశారు. రామసుబ్బారెడ్డి అనే రిటైర్డ్ వర్క్ ఇన్స్పెక్టర్కు చెందిన సర్వీస్ రికార్డులు మున్సిపల్ కార్యాలయంలో కనిపించకుండా పోయినందుకు బాధ్యుడుని చేస్తూ షఫీయుల్లాఖాన్పై చర్యలు తీసుకున్నారు. -
ప్రమాదవశాత్తు కిందపడి జూనియర్ అసిస్టెంట్ మృతి
షాబాద్ మండల కేంద్రంలో ఘటన మృతుడు మహబూబ్నగర్ జిల్లావాసి షాబాద్: ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడిన ఓ జూనియర్ అసిస్టెంట్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ సంఘటన షాబాద్ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ డివిజన్ బొంరాస్పేట్ మండలానికి చెందిన కుర్వ శంకరప్ప(40) మూడు సంవత్సరాలుగా షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడే అద్దె ఇంట్లో ఉం టూ ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం 6 గంటల వరకు కార్యాలయంలో విధులు ముగించుకున్న ఆయన గదికి వెళ్లాడు. వంటగదిలో నుంచి బయటకు వ స్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయా డు. తల వెనుకభాగం గోడకు తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం 10 గంటలు దాటిన శంకరప్ప బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని వెంకటయ్య తలుపుతట్టాడు. లోపలి నుంచి గడియ ఉంది. ఎంతకూ స్పందన లేకపోవడంతో స్థానికులతో కలిసి తలుపులు విరగ్గొట్టి చూడగా అప్పటికే శంకరయ్య విగతజీవిగా కనిపించాడు. దీంతో ఆయన ఎంపీడీఓ పద్మావతితో పాటు కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ శ్రీధర్రెడ్డి, ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతి, ఎంపీడీఓ పద్మావతి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు పెళ్లీడుకొచ్చిన కూతుళ్లు ఉన్నారు. శంకరప్ప కుటుంబీకులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీపీ, ఎంపీడీఓలు హామీ ఇచ్చారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న శంకరప్ప మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. చేవెళ్ల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అ ప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. -
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
వరంగల్: వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక జూనియర్ అసిస్టెంట్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. తెలంగాణ సర్కార్ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం విడుదల చేసేందుకు రూ.10వేల రూపాయలు లంచం ఇవ్వాలని కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సునిల్ డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీని ఆశ్రయించగా వారు వలపన్ని బుధవారం పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.10వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్
మెదక్: కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా జోగిపేటలోని మహిళా పాల్టెక్నిక్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం జరిగింది. కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శివశంకర్ అటెండర్ శ్రీకాంత్ నుంచి రెండువేలు లంచంతీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. (జోగిపేట) -
జూనియర్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటు
తోట్లవల్లూరు పంచాయతీలో నిధుల దుర్వినియోగం వ్యవహారంలో డీపీవో చర్య కంకిపాడు : ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన జూనియర్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా పంచాయతీ అధికారి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ సిబ్బంది బదిలీల్లో తోట్లవల్లూరు పంచాయతీ కార్యాలయం నుంచి కంకిపాడుకు మేరుగు రాజేష్, మరికొందరు వచ్చారు. తోట్లవల్లూరులో పంచాయతీ ఆదాయాన్ని రాజేష్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఈనెల ఎనిమి దో తేదీన డీపీవో విచారణ నిర్వహించారు. పంచాయతీలో నిధులు దుర్వినియోగానికి రాజేష్ను బాధ్యుడిని చేస్తూ డీపీవో శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కంకిపాడు పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి మైథిలి సస్పెన్షన్ ఉత్తర్వులను శనివారం రాజేష్కు అందించారు. తోట్లవల్లూరు పంచాయతీలో రూ 10,36,030 నగదు దుర్వినియోగం అయినట్లు అధికారులు తేల్చారని ఈవో తెలియజేశారు. -
అయినా మారలేదు
- రూ.15 వేలు లంచం తీసుకుంటూ.. - ఏసీబీకి పట్టుబడ్డ ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ - ఇది రెండోసారి.. ఓ సారి ఏసీబీకి చిక్కి సస్పెండయినా... ఆ అధికారి తీరు మారలేదు. ‘జూనియర్’ స్థాయిలో చేసిన తప్పునే ‘సీనియర్’ స్థాయిలోనూ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. కరీంనగర్ క్రైం : చెట్లు ఎక్కేందుకు లెసైన్స్ కోసం ఓ గీత కార్మికుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సిరిసిల్ల మండలం జిల్లెల్లకు చెందిన కందుకూరి హన్మండ్లు అనే గీతకార్మికుడు జూన్ 9న తాటిచెట్లు ఎక్కేందుకు లెసైన్స్ కావాలని కోరుతూ జగిత్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 3న తన దరఖాస్తు గురించి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ ఎన్.శంకర్ను కలవగా దరఖాస్తు కనిపించడం లేదని, మళ్లీ ఇవ్వాలని సూచించాడు. మళ్లీ దరఖాస్తు చేయగా రూ.3 వేలు ఇస్తే ఫైల్ను పై అధికారులకు పంపిస్తానని అడగడంతో హన్మండ్లు ఇచ్చాడు. అక్కడినుంచి ఫైల్ విచారణకోసం సిరిసిల్ల ఎక్సైజ్ సీఐకి చేరగా ఆయన విచారించి హన్మండ్లు అర్హుడే అని ఈ నెల 7న నివేదిక ఇచ్చారు. లెసైన్సులు జారీ చేసే అధికారం డెప్యూటీ కమిషనర్ది కావడంతో జగిత్యాల ఎక్సైజ్ కార్యాలయం నుంచి ఫైల్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయానికి చేరింది. అనంతరం హన్మండ్లు మళ్లీ సీనియర్ అసిస్టెంట్ శంకర్కు ఫోన్ చేసి లెసైన్స్ త్వరగా ఇప్పించాలని కోరాడు. ఫైల్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఉందని, నివేదికలన్నీ పూర్తయ్యాయ ని, లెసైన్స్ ఇవ్వాలంటే రూ.15 వేలు ఇవ్వాలని శంకర్ డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని బతిమిలాడినా వినిపించుకోలేదు. దీంతో బాధితుడు ఈ నెల 18న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం హన్మండ్లు తాటికొండ శ్రీనివాస్తో కలిసి కరీంనగర్లోని డెప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చి శంకర్కు సమాచారం ఇచ్చారు. అందరూ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఓ హోటల్లో కలుసుకున్నారు. హన్మండ్లు నుంచి శంకర్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే శంకర్ను పట్టుకున్నారు. అక్కడినుంచి డెప్యూటీ కమిషనర్ కార్యాలయానికి తరలించి విచారించారు. శంకర్పై కేసు నమోదు చేసి సోమవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్గౌడ్ తెలిపారు. పలు కార్యాలయాల్లో కొందరు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని లంచాలు తీసుకుంటున్నారనే సమాచారం ఉందని, పక్కా సమాచారంతో దాడులు చేస్తామని, ఎంతటివారైనా వదిలిపెట్టబోమని డీఎస్పీ సుదర్శన్గౌడ్ తెలిపారు. గతంలోనూ... జగిత్యాల/ జగిత్యాల అర్బన్ : శంకర్నాయక్ సుమారు 25 ఏళ్ల క్రితం సైతం ఇలాగే ఏసీబీకి చిక్కాడు. శంకర్నాయక్ జూనియర్ అసిస్టెంట్గా సిరిసిల్ల ఎక్సైజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో 1989 జూన్ 26న చందుర్తి మండలం లింగంపేటకు చెందిన లక్ష్మణ్రావు వద్ద రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆ కేసు నుంచి బయటపడి కొంతకాలంగా జగిత్యాల సూపరింటెండెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కార్యాలయంలో ఉద్యోగుల జీతభత్యాలతోపాటు, జీపులు, వాహనాల వ్యయం చెల్లింపులు, ఇతర లిక్కర్ లావాదేవీల సంబంధించిన వ్యవహారాలను ఈయన పర్యవేక్షిస్తుంటారు. అంతర్గతంగా ఉన్న వివాదాలు సైతం ఇతడిని ఏసీబీకి పట్టించాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డారన్న సమాచారంతో ఇతర సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
సమస్యలు ఉన్నా సర్దుకుపోండి!
శ్రీకాకుళం/రిమ్స్ క్యాంపస్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో వైద్యసేవలు సక్రమంగా అందకపోవడానికి ప్రభుత్వ లోపం కూడా కారణమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకుని రోగులకు సేవలందించాలని వైద్యులకు సూచిం చారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల పనితీరు సంతృప్తికరంగా లేదని, పొరపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ఎక్కువని, దీనిపై తక్షణమే సర్వే చేరుుస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో అన్ని ఆరోగ్యశాఖలను డైరక్టర్ ఆఫ్ హాస్పిటల్స్ పేరిట ఓ గొడుగు కిందకు తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రతి జిల్లాకూ ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని కో-ఆర్డినేటర్గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. సిగ్గుచేటు... మంత్రి స్థాయిలో జరిగిన సమీక్షల్లో వైద్యాధికారులు, కిందిస్థాయి సిబ్బంది పనితీరు బాగులేదన్న ఆరోపణలపై మాట్లాడుకోవాల్సి రావడం సిగ్గు చేటని కార్మికశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సిబ్బందిపై ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదని డీఎంహెచ్వో, డీసీహెచ్లను నిలదీశారు. ఇటువంటి వాటిపై కలెక్టర్ దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది, మౌలిక వసతుల కొరతపై ఫిర్యాదు... ఆస్పత్రుల్లో సిబ్బంది, మౌలిక వసతుల కొరత ఉందని, ఆముదాలవలస ఆస్పత్రిలో రెండేళ్లుగా శస్త్ర చికిత్సలు జరుగలేదని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చెప్పడంతో వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిరమండలం, కొత్తూరు, పాతపట్నం ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలలో అధికారులకు తెలిసి వైద్యులు, సిబ్బంది గైర్హాజరు అవుతుండడాన్ని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హిరమండలంలో జూనియర్ అసిస్టెంట్ తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నట్టు వైద్యాధికారి జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని డీఎంహెచ్వోను మంత్రులు నిలదీశారు. అనేక సందర్భాల్లో డీసీహెచ్ఎస్, డీఎంహెచ్వోలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోగా సరికాదని హితవు పలికారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ పాలకొండ ఆస్పత్రిని జిల్లా స్థాయికి పెంచుతామని చెప్పినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు. సీతంపేటతో పాటు గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం ఆస్పత్రి స్థాయి పెంచినా పోస్టులను పెంచకపోవడంతో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదని, భవనాల మరమ్మతులు, సీజనల్ వ్యాధులకు సంబంధిం చిన మందులు అందించాలని కోరారు. తాను ఇటీవలే జిల్లాకు రావడం వలన ప్రస్తుత సమావేశంలో వచ్చిన సమస్యలేవీ తన దృష్టికి రాలేదని తక్షణం వీటిని పరిశీలించి సరిచేస్తామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. దీనికి స్పందిం చిన మంత్రులు కేవలం సరిచేయడమే కాదని ఎవరిదైనా తప్పనుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, బెం దాళం అశోక్, బగ్గు రమణమూర్తులు కూడా ప్రసంగించగా రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ అరుణకుమారి డీఎంహెచ్వో డాక్టర్ గీతాం జలి, డీసీహెచ్ఎస్ సునీలా పాల్గొన్నారు. రిమ్స్ పరిశీలన... రిమ్స్ ఆస్పత్రిలోని పలు ఓపీ విభాగాలు, వార్డులను మంత్రి కామినేని పరిశీలించారు. ముందుగా గైనిక్ ఓపిని పరిశీలించారు. సేవలపై ఆరా తీశారు. నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన బ్లాకులను పరిశీలించి, అక్కడ నెలకొన్న అపారిశుద్ధ్యం నెలకొని ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆపరేషన్ థియేటర్, డయాలసిస్ సెంటర్ను పరిశీలించి అక్కడి సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ వార్డు ను పరిశీలించారు. అక్కడ తక్కువ మంది రోగులు ఉండటంతో ఆరోగ్యశ్రీ సేవలను విసృ్తతం చేయాలని సూచించారు. రిమ్స్ తీరును మార్చాలని డెరైక్టర్ను ఆదేశించారు. పలు ప్రారంభోత్సవాలు రిమ్స్లో పునర్నిర్మించిన అత్యవసర విభాగాన్ని తొలుత మంత్రి ప్రారంభించారు. క్యాజువాల్టికే రంగులు వేసి, పునర్నిర్మించినట్టు శిలాఫలకం ఏర్పాటు చేసి మంత్రితో ప్రారంభోత్సవం జరిపించడంతో విమర్శలు వినిపించాయి. తరువాత రిమ్స్ ఆడిటోరింయలో స్టాఫ్ అండ్ స్టూడెంట్ క్యాంటీన్ను ప్రారంభించారు. అక్కడే కాఫీ పాయింట్ను, రిమ్స్ ఉద్యోగుల కోసం ‘మ్యూచ్యువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ స్టోర్సు’ను ప్రారంభించారు. అన్నపూర్ణ పథకం బాగుంది రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీసత్యసాయి ఆన్నపూర్ణ నిత్యఅన్నదాన సేవా పథ కం నిర్వహణ బాగుందని మంత్రి కితా బిచ్చారు. వీటి నిర్వహణపై సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు గంగుల రమణబాబుని అడిగి తెలుసుకున్నారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు శ్రీనివాస్కు మంత్రి పరామర్శ... రిమ్స్ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ వార్డులో చికిత్స పొందుతున్న రాష్రీయ స్వయం సేవక సంఘం(ఆర్.ఎస్.ఎస్) నాయకులు శ్రీనివాస్ను మంత్రి పలకరించారు. కళ్లు తిరిగి కిందపడిన ఘటనలో శ్రీనివాస్కు రెండు చేతులు భుజాలు తప్పిపోవటంతో శస్త్రచికిత్స చేశారు. దీంతో ఆయన్ను పరామర్శించారు. కిడ్నీ వ్యాధులపై జిల్లాకు ప్రత్యేక బృందం అరసవల్లి: జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధులపై త్వరలో ప్రత్యేక బృందం రానుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కా మినేని శ్రీనివాసరావు అన్నారు. బీజేపీ నాయకులతో స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కమిటీలోనూ పార్టీ సభ్యుడు ఒక్కరైనా ఉండేలా కృషి చేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి వేణుగోపాలం, పూడి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో జూనియర్ అసిస్టెంట్
కాండక్ట్ సర్టిఫికేట్ కోసం 2 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం అనకాపల్లి టౌన్: పేదవాడినని కనికరం చూపాలని వేడుకున్నా లంచానికే అలవాటుపడిన ఉద్యోగి ఎప్పటిలాగే తన చేతివాటాన్ని చూపాడు. అయితే బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఓ జూనియర్ అసిస్టెంట్ను లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎం. నర్సింహరావు తెలిపిన వివరాలివి. రాంబిల్లి మండలం కొత్తపట్నానికి చెందిన చోడపల్లి రమణ డిగ్రీ వరకు చదువుకున్నారు. 2012లో సీఆర్పీఎఫ్ ఉద్యోగానికి దరఖాస్తు చేయగా ఎంపికైనట్టు 15 రోజుల క్రితం కాల్లెటర్ వచ్చింది. ఈ నెల 14వ తేదీ లోపు విధుల్లో చేరాల్సి ఉండగా సంబంధిత ధ్రువపత్రాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాండక్ట్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్, పోలీసు అధికారుల ధ్రువీకరణ పొందగా ఆర్డీఓ ధ్రువీకరణ పొందాల్సి ఉంది. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ బి. హరిలక్ష్మికుమార్ను ఆశ్రయించారు. ఈనెల 14 తేదీలోపు చెన్నైలో జాబ్లో చేరాల్సి ఉందని, ఈ మేరకు 11వ తేదీ లోపు ధ్రువీకరణ పత్రాన్ని అందించాలని జూనియర్ అసిస్టెంట్ హరి లక్ష్మికుమార్ను రమణ కోరారు. అయితే అతని అవసరాన్ని ఆసరాగా తీసుకొని, నిబంధనల ప్రకారం కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే 15 రోజులు పడుతుందని, 11వ తేదీ లోపు ఇవ్వాలంటే 3 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వాడినని అంత డబ్బు ఇచ్చుకోలేనని రమణ వేడుకున్నప్పటికీ జూనియర్ అసిస్టెంట్ వినకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చివరకు 2 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఆయన ప్రవర్తన పట్ల విసుగు చెందిన రమణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు ఆర్డీఓ కార్యాలయంలో పథకం ప్రకారం మాటు వేశారు. రమణ నుంచి జూనియర్ అసిస్టెంట్ 2 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ ఎం. నర్సింహరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. రమణ చెన్నై వెళ్లేందుకు సైతం రవాణా ఛార్జీలకు సొమ్ము లేకపోవడంతో తన తల్లి చెవిదిద్దులను తాకట్టు పెట్టి 5 వేల రూపాయలను తీసుకున్నారు. వీటిలో రూ.2 వేలు జూనియర్ అసిస్టెంట్కు ఇచ్చేందుకు తీసుకున్నట్టు రమణ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడ్ని రిమాండ్కు పంపిస్తున్నట్టు ఎసీబీ డీఎస్పీ నర్సింహరావు తెలిపారు. ఈయన వెంట ఏసీబీ సీఐ రామకృష్ణ, రమణమూర్తి, గణేష్ ఉన్నారు. -
కంప్యూటర్ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలపై ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ల వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ తదితర ఉద్యోగాలకు ‘ప్రొఫిషియెన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్’ పరీక్షలో అర్హత సాధించడాన్ని తప్పనిసరి చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీపీఎస్సీ/డీఎస్సీ రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారినే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పరీక్ష సిలబస్ను ఏపీపీఎస్సీ ప్రకటిస్తుంది. -
విద్యుత్ శాఖలో కొలువుల జాతర
జిల్లాలో 356 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వీటిలో 45 జేఏ, 310 జేఎల్ఎం, 1 వాచ్మేన్ పోస్టులు కాంట్రాక్టు సిబ్బందికి గరిష్టంగా 20 గ్రేస్ మార్కులు సాక్షి, ఏలూరు : తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలో 45 జూనియర్ అసిస్టెంట్ (జేఏ), 310 జూనియర్ లైన్మేన్ (జేఎల్ఎం), 1 వాచ్మేన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఈపీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలి. సబ్స్టేషన్లు, కార్యాలయాల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 600 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో కొందరికికొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రాధాన్యత లభించనుంది. వారి పనితీరు ఆధారంగా గరిష్టంగా 20 గ్రేస్ మార్కులు ఇవ్వనున్నారు. 500 కనెక్షన్లకు ఒక్క ఉద్యోగి మాత్రమే జిల్లాలో సుమారు 11 లక్షల విద్యు త్ కనెక్షన్ల ఉండగా, 2వేల మంది సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారు. సుమారు వెయ్యి కనెక్షన్లకు ఇద్దరు ఉద్యోగులు ఉన్నట్టు. అయితే ఈ సంఖ్య నాలుగు ఉండాలి. 1999లో రాష్ట్ర విద్యుత్ మండలి పునర్ వ్యవస్థీకరణ తరువాత సబ్స్టేషన్లు రెండున్నర రెట్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఐదున్నర రెట్లు, ఆదాయం నాలుగున్నర రెట్లు పెరిగాయి. వినియోగదారులు 127 శాతం పెరిగారు. ఉద్యోగుల సంఖ్యలో 59 శాతం తరుగుదల కనిపిస్తోంది. సిబ్బంది కొరతను ఆసరాగా తీసుకుని నిత్యం చేయాల్సిన పనులను కూడా యాజమాన్యం కాంట్రాక్టుకు ఇచ్చేస్తోంది. దీనికి అవుట్ సోర్సింగ్ పద్ధతిని జోడించారు. కాంట్రాక్టు సిబ్బంది శ్రమను కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. చట్టప్రకారం సిబ్బందికి ప్రయోజనాలేవీ అందడం లేదు. సిబ్బంది కొరతతో పని భారం పెరిగి అటు రెగ్యులర్, ఇటు కాంట్రాక్టు ఉద్యోగులు సతమతమవుతున్నారు. సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, విద్యుత్ కనెక్షన్లకు అనుగుణంగా అదనపు పోస్టులు మంజూరు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలనే ప్రధాన డిమాండ్లతో విద్యుత్ ఉద్యోగుల యూనియన్లు సంస్థపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈపీడీసీఎల్ నిర్ణయించింది. -
ఏసిబికి చిక్కిన ఏఇ, జూనియర్ అసిస్టెంట్
హైదరాబాద్: ఏసిబి అధికారులు ఈ రోజు విశాఖలో ఓ జూనియర్ అసిస్టెంట్ను, కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పంచాయతీరాజ్ ఏఇని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. విశాఖపట్నం జివిఎంసిలో జూనియర్ అసిస్టెంట్ నాగేశ్వర్ రావు ఓ వ్యక్తి నుంచి 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తసుకున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పంచాయతీరాజ్లో ఏఇ శ్రీహరి 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. -
‘వీఆర్వోలకు జూనియర్ అసిస్టెంట్ హోదా’
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులకు (వీఆర్వో) త్వరలో జూని యర్ అసిస్టెంట్ హోదా ఇవ్వనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం-2014 డైరీ ఆవి ష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్య, డిప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్కతోపాటు రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు పెండ్యాల విజయరామారావు, గరికె ఉపేంద్రరావు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన సాంఘిక సంక్షేమశాఖ ఉద్యోగి
గుంటూరు, న్యూస్లైన్ :కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ప్రభుత్వం పంపిన చెక్కును ఇచ్చేందుకు లంచం తీసుకొంటూ సాంఘిక సంక్షేమశాఖ జూనియర్ అసిస్టెంట్ నామతోటి విజయబాబు బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆ వివరాలను విజయవాడ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆర్.విజయ్పాల్ విలేకరులకు వివరించారు. పిడుగురాళ్ళ మండలం పిలుట్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజబాబు దాచేపల్లి మండలం కొత్తూరుకు చెందిన సునీతాబాయ్ 2011లో కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి వీరు దరఖాస్తు చేయడంతో మూడు నెలల కిందట రూ.50 వేల చెక్కును ప్రభుత్వం పంపింది. ఈ చెక్కును ఇచ్చేందుకు విజయబాబు రూ.5000 లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వకపోవడంతో మూడు నెలలైనా లబ్ధిదారులకు చెక్కు అందలేదు. చెక్కు గడువు ఈనెల 13వ తేదీకి పూర్తి అవుతుందని, కనీసం రూ.4000 ఇచ్చి చెక్కు తీసుకోవాలని విజయబాబు చెప్పడంతో రాజబాబు విజయవాడ రేంజ్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు రంగు పూసిన ఐదువందల రూపాయల నోట్లు ఆరు బుధవారం విజయబాబుకు అందజేశాడు. నగదు తీసుకుని ప్యాంట్లో జేబులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విజయబాబు ఇంటి వద్ద కూడా సోదాలు నిర్వహించి అవినీతి వ్యవహారంలో నగదు సంపాదిస్తే మరో కేసు నమోదు చేసి విచారిస్తామని డీఎస్పీ విజయ్పాల్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే 9440446164 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు. దాడిలో ఏసీబీ సీఐలు ఎస్ఎస్వి నాగారాజు, బి.శ్రీనివాస్, టి.ఎస్.కె.రవి, సీతారామయ్య పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో మరో అవినీతి చేప
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్లైన్: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఖమ్మం కార్పొరేషన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పి.శామ్యూల్ ఆస్తియాజమాన్యంపై పేరుమార్పిడి చేసేందుకు ఎనిమిదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు... ఖమ్మం నగరంలోని యూపీహెచ్ కాలనీకి చెందిన చింతల సుగుణ అనే మహిళ ఎడవల్లి ద్రౌపది వద్ద ఐదు నెలల క్రితం ఇంటిని కొనుగోలు చేసింది. రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పేరు మార్పిడి కోసం సుగుణ తన తమ్ముడు హనుమంతరావుతో కలిసి కార్పొరేషన్ ఖానాపురం డివిజన్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ జూనియర్ అసిస్టెంట్ శామ్యూల్కు ఇంటిని తమ పేర మార్చాలని దరఖాస్తు సమర్పించింది. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా పని మాత్రం జరగడం లేదు. దీంతో విసిగి వేసారిన సుగుణ తమ పని ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించింది. పేరు మార్చాలంటే ఖర్చు అవుతుందంటూ శామ్యూల్ అసలు విషయం బయట పెట్టాడు. ఎంత కావాలని అడగగా కార్పొరేషన్ చలానాకు రూ.3వేలు, అదనంగా రూ.10వేలు ఇస్తే పని పూర్తి చేసి పెడతానని హామీ ఇచ్చాడు. తాము అంత డబ్బు ఇవ్వలేమని చెప్పగా డబ్బులు ఉంటేనే రావాలని, లేదంటే బయటకు వెళ్లండంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో చేసేది లేక ఇల్లు కొనుగోలులో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ద్వారా బేరం కుదిర్చారు. రూ.8వేలు లంచం ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం తెలిపారు. వీరి సలహా మేరకు పౌడర్ చల్లిన ఎనిమిది వెయ్యి రూపాయల నోట్లను సుగుణ తమ్ముడు హనుమంతరావుతో శుక్రవారం డివిజన్ కార్యాలయానికి పంపించారు. డబ్బులు తీసుకున్న శామ్యూల్ వాటిని లెక్కపెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. శామ్యూల్ను కార్యాలయంలో దాదాపు రెండు గంటలపాటు విచారించారు. రూ.8వేలతోపాటు ఆయన వద్ద ఉన్న మరో రూ.38వేలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి లంచం పూర్వకంగా వచ్చినవా... కార్యాలయానికి సంబంధించినవా అనేది విచారణ చేస్తున్నారు. శామ్యూల్ను ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాయిబాబా వెల్లడించారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు వెంకటేశ్వరరావు, బాబురెడ్డి, సాంబయ్య పాల్గొన్నారు. నాలుగు నెలలుగా తిప్పుతున్నారు.. కె. హన్మంతు, బాధితుడు.. పేరు మార్చడానికి రేపు..మాపు అంటూ 4 నెలలుగా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. చివరికి పని పూర్తి కావాలంటే ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల జిరాక్స్ పత్రాలతో పాటు చలానాకు రూ.3 వేలు, మామూళ్లు కింద రూ.10 వేలు ఖర్చు అవుతుందని జూనియర్ అసిస్టెంట్ తెలిపాడు. అంతా ఇచ్చుకోలేమని ప్రాధేయ పడినా వినలేదు. విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాం.