విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
విశాఖ : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నక్కపల్లిలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రాజేష్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఎస్ రాయవరం మండలం నివాసి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.