
పౌరో‘షి’త్యం
స్టీమర్రోడ్డు (నరసాపురం) : పౌరోహిత్యం పురుషులకే సొంతం అనే మాట ఇక చెల్లదు. మహిళలు కూడా వేదమంత్రాలతో భగవదారాధనలో ముందుంటున్నారు. భక్తులకు భగవంతునికి అనుసంధానంగా ఉంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని స్టీమర్రోడ్డుకి చెందిన మహిళామణి చిలకమర్తి అనంతలక్ష్మి ఈ రెండో కోవకే చెందుతారు. లలితాంబఘాట్లోని లలితాంబదేవిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులకు సమంత్రికంగా శఠగోపం పెడుతుంటారు. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ కూడా పురోహితులుగా వ్యవహరించేవారు.