‘‘టిట్లీ’’ బాధితులకు ఐఏఎస్‌ల బాసట | AP IAS Officers Donation To Titli Victims | Sakshi
Sakshi News home page

‘‘టిట్లీ’’ బాధితులకు ఐఏఎస్‌ల బాసట

Oct 17 2018 6:44 PM | Updated on Oct 17 2018 6:46 PM

AP IAS Officers Donation To Titli Victims - Sakshi

టిట్లీ తుఫాను కారణంగా చెల్లాచెదురైన జనజీవితాలు

సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాన్‌ బాధితులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐఏఎస్‌ అధికారులు బాసటగా నిలిచారు. తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు. బాధితులకు బాసటగా నిలవటానికి ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని ఐఏఎస్‌ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఐఏఎస్‌ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే సహాయక చర్యల్లో ఐఏఎస్‌ అధికారులు పెద్ద సంఖ్యలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని, త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితులు వస్తాయని ఐఏఎస్‌ల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement