Donations
-
Adani's Wedding: విలాసాలను విడిచి.. విరాళాలను పంచి..
గత నెలలో మహా కుంభమేళాకు వచ్చిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) తన కుమారుడి వివాహం "సింపుల్గా సాంప్రదాయ పద్ధతిలో" జరుగుతుందని తెలిపారు. విలాసవంతమైన, ఆడంబరమైన వ్యవహారంగా ఉంటుందన్న ఊహాగానాలకు ముగింపు పలుకుతూ చెప్పిన మాటకు కట్టుబడి తన చిన్న కొడుకు జీత్ అదానీ (Jeet Adani) వివాహాన్ని సింపుల్గా జరిపించారు. అంతే కాకుండా రూ. 10,000 కోట్లు విరాళంగా ఇచ్చారు."సేవే సాధన, సేవే ప్రార్థన, సేవే పరమాత్మ" అన్న తన తత్త్వానికి అనుగుణంగా గౌతమ్ అదానీ ఈ విరాళాలు అందిస్తున్నారని ఆయనకు సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ఆయన విరాళంలో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.కుమార్తె దివా..తన చిన్న కొడుకు వివాహం సందర్భంగా గౌతమ్ అదానీ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లో ఆయన తన కోడలిని "కుమార్తె దివా" అంటూ సంబోధించడం విశేషం. అహ్మదాబాద్లోని అదానీ శాంతిగ్రామ్ టౌన్షిప్లోని బెల్వెడెరే క్లబ్లో జీత్ అదానీ, వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా వివాహం జరిగింది. గుజరాతీ సాంప్రదాయం ప్రకారం సింపుల్గా జరిగిన ఈ వేడుకకు దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు, దౌత్యవేత్తలు, అధికారులు, సినీ తారలు వంటి వారెవరూ కనిపించలేదు.‘దివ్య’మైన సంకల్పంపెళ్లికి రెండు రోజుల ముందు గౌతమ్ అదానీ 'మంగళ సేవ' అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇది కొత్తగా వివాహం చేసుకున్న దివ్యాంగ యువతులకు సాయం అందించే కార్యక్రమం. దీని ద్వారా ప్రతి సంవత్సరం 500 మంది దివ్యాంగ వధువులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని జీత్ అదానీ, దివా దంపతులు సంకల్పించారు. లాంఛనంగా 21 మంది దివ్యాంగుల వధూవరులను కలిసి జీత్ అదానీ ఈ చొరవను ప్రారంభించారు.మహా కుంభ మేళాలో చెప్పిన మాటగత జనవరిలో కొడుకుతో కలిసి మహా కుంభ మేళాకు వెళ్లిన సందర్భంగా ప్రయాగ్రాజ్లో మీ కుమారుడి వివాహం "సెలబ్రిటీల మహా కుంభ్" అవుతుందా అని విలేకరులు ప్రశ్నించగా గౌతమ్ అదానీ స్పందించారు. "ఖచ్చితంగా కాదు. మేము కూడా సామాన్యుల మాదిరిగానే. జీత్ గంగమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. అతని వివాహం సింపుల్గా, సాంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది" అన్నారు. -
ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్
అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగరంలో నవంబర్ 3న జరిగిన శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ విజయవంతమైంది. ఈ ప్రాంతంలో మొదటి తెలుగు కాన్సర్ట్గా నిలిచిన ఈ ఈవెంట్ సుమారు 120,000 డాలర్ల విరాళాలను సమీకరించింది, ఇందులో ఆరు MESU దాతల విరాళాలు కూడా ఉన్నాయి.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.ఎస్. బద్రినాథ్, రతన్ టాటా గారిని స్మరించుకొని, వారి సేవలను కొనియాడారు. శంకర నేత్రాలయ USA పయనాన్ని, సంస్థ స్థాపన నుండి నేటి ప్రస్తుత కార్యక్రమాలను వివరించారు. అలాగే వ్యవస్థాపక అధ్యక్షులు ఎమిరేటస్ ఎస్.వి. ఆచార్య , ప్రస్తుత అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వంలో సంస్థ తన సేవలను విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర దృష్టి సంరక్షణను అందించే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) కార్యక్రమం ద్వారా. చెన్నై, హైదరాబాద్, జార్ఖండ్ కేంద్రాలతో పాటు, పుట్టపర్తి , విశాఖపట్నం కేంద్రాల కోసం ప్రణాళికలను తెలియజేసింది.ఈ కార్యక్రమంలోమణి శర్మ సంగీత ప్రదర్శన, ఆడియెన్స్ను ఆకట్టుకుంది. కొంతమంది దాతలను సత్కరించారు. అలాగే మరో ఆరు MESU యూనిట్ల కోసం, తమిళనాడుకు నాలుగు , ఆంధ్రప్రదేశ్కు రెండు దాతలు ముందుకు వచ్చారు.కాన్సర్ట్ తర్వాత, చాండ్లర్లోని ఫిరంగీ రెస్టారెంట్లో ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ ఏర్పాటుచేశారు, అక్కడ మణి శర్మ గారి సంతకంతో ఉన్న ఫోటోలను వేలం వేశారు. అలాగే, గురువారం రాత్రి పియోరియాలో మణి శర్మ గారి మరియు వారి బృందానికి ప్రత్యేక సాయంకాలపు కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు వేలంపాటల ద్వారా మొత్తం $4,875 సేకరించాము, ఇది శంకర నేత్రాలయ MESU కార్యక్రమం ద్వారా 75 కాటరాక్ట్ శస్త్రచికిత్సలకు నిధులను అందించింది.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మూర్తి రేఖపల్లి, శ్యాం అప్పలికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వంశీ కృష్ణ ఇరువారం (జాయింట్ సెక్రటరీ),ఆది మొర్రెడ్డి,, రేఖ వెమాల , ధీరజ్ పోలా , శరవణన్, శ్రీధర్ చెమిడ్తి, సాకేత్, సీత గంట, గార్లు టెర్రీ కింగ్, సరిత గరుడ, రాజ్ బండి, శోభ వడ్డిరెడ్డి, లక్ష్మి బొగ్గరపు , రూప మిధే, మణు నాయర్, చెన్నా రెడ్డి మద్దూరి, కాశీ, మూర్తి వెంకటేశన్, మంజునాథ్, దేవా, జయప్రకాశ్, మహిత్ కృషిని అభినందించారు. శంకర నేత్రాలయ మిషన్కు అండగా ఉన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది శంకర నేత్రాలయ.ఈ కార్యక్రమం పట్ల హాజరైన వారందరూ ప్రశంసలు వ్యక్తం చేయగా, ఫీనిక్స్ శాఖలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. షైనింగ్ స్ప్రౌట్స్ మరియు లవింగ్ కైండ్నెస్ బృందాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సంస్థ, శంకర నేత్రాలయ మిషన్ను ప్రోత్సహించడంపై ఉన్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడింది. -
డెమొక్రాట్లను ఆదుకోండి
వాషింగ్టన్: ఎన్నికల తర్వాత అప్పుల్లో కూరుకుపోయిన డెమొక్రాట్లను ఆదుకోవాలని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ఈ మేరకు సొంతమీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని రిపబ్లికన్లను కోరారు. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నిధులు సమీకరించిన డెమొకట్రిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార బృందం... ఎన్నికల అనంతరం 2 కోట్ల∙డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలొచ్చాయి. సంపన్న దాతలు, హాలీవుడ్ నుంచి డెమొక్రాట్లు మద్దతు కూడగట్టినప్పటికీ, కీలక ఓటరు గ్రూపుల మద్దతును కోల్పోయారని హారిస్ క్యాంపెయిన్ ప్రధాన ఫండ్రైజర్ అజయ్ జైన్ భూటోరియా చెప్పారు. BREAKING: DONALD TRUMP TAKES JAB AT DEMOCRATS’ FINANCES, OFFERS TO BAIL THEM OUT.“Whatever we can do to help them during this difficult period, I would strongly recommend we, as a Party and for the sake of desperately needed UNITY, do. We have a lot of money left over in that… pic.twitter.com/vWQdZp0Mnz— Jacob King (@JacobKinge) November 9, 2024ట్రంప్కు బైడెన్ ఆతిథ్యం ట్రంప్తో దేశాధ్యక్షుడు బైడెన్ సమావేశమవుతారని వైట్హౌస్ ప్రకటించింది. బైడెన్ ఆహా్వనం మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ఓవల్ కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమవుతారని తెలిపింది. సమావేశానికి సంబంధించిన అదనపు వివరాలను వెల్లడిస్తామని వైట్హౌస్ ప్రెస్సెక్రటరీ కరీన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో తెలిపారు. కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా వైట్హౌస్కు ఆహా్వనించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ కొత్త స్టాఫ్ చీఫ్ సూజీ వైల్స్తో బైడెన్ స్టాఫ్ చీఫ్ జెఫ్ జియెంట్స్ బుధవారం నాటి సమావేశాన్ని సమన్వయం చేశారని ఇరువర్గాలు వెల్లడించాయి. శాంతియుత అధికార బదిలీలో భాగంగా ఎన్నికల తర్వాత కాబోయే అధ్యక్షుడికి, మాజీ అధ్యక్షుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. అయితే 2020లో బైడెన్కు ట్రంప్ ఆతిథ్యం ఇవ్వలేదు. అంతేకాదు 2021లో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కూడా ట్రంప్ హాజరు కాలేదు. ప్రథమ మహిళకు ఆతిథ్యం ఇవ్వడం కూడా వైట్హౌస్ ఆనవాయితీగా వస్తోంది. చదవండి: ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్ -
‘ఎంఈఐఎల్’ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్/ఖమ్మంవన్టౌన్: ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఈఐఎల్ సంస్థ రూ.5 కోట్ల విరాళంఅందజేసింది. సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి, బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి, సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్టీ రావు పాల్గొన్నారు. ఏపీకి కూడా రూ.5 కోట్ల విరాళాన్ని అందించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రేస్ క్లబ్ తరఫున రూ.2 కోట్లు హైదరాబాద్లోని రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి.. మరో డైరెక్టర్ నరసింహరెడ్డితో కలిసి వరద బాధితుల సహాయార్థం రూ.2 కోట్ల చెక్కును మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. రూ.కోటి చొప్పున.. సీఎం సహాయ నిధికి సైయెంట్ కంపెనీ యాజమాన్యం రూ.కోటి విరాళాన్ని అందజేసింది. అలాగే లలితా జ్యువెల్లర్స్ అధినేత కిరణ్ రూ.కోటి, మైత్రా ఎనర్జీ గ్రూప్ అండ్ అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్, రవికైలాస్ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డిని సచివాలయంలో కలిసి చెక్కులను అందజేశారు. సినీ నిర్మాత దిల్ రాజు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు. -
కమలా హారిస్కు ఒక్క నెలలో రూ.3,030 కోట్ల విరాళాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు ప్రజల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఆగస్టు నెలలో ఆమెకు 30 లక్షల మంది దాతల నుంచి 361 మిలియన్ డాలర్ల(రూ.3,030 కోట్లు) విరాళాలు లభించాయి. ఈ విషయం కమలా హారిస్ ప్రచార బృందం శుక్రవారం వెల్లడించింది. తన ప్రత్యరి్థ, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే రెండు రెట్లకుపైగా ఎక్కువ విరాళాలు కమలా హారిస్ అందుకోవడం విశేషం. ట్రంప్కు గత నెలలో కేవలం 130 మిలియన్ డాలర్లు (రూ.1,091 కోట్లు) విరాళంగా లభించాయి. ఆగస్టు నెలాఖరు నాటికి కమలా హారిస్ చేతిలో 404 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. ట్రంప్ వద్ద కేవలం 295 మిలియన్ డాలర్లు ఉన్నాయి. -
వరదల పేరుతో సర్కారు చందాల వేట
‘‘అందరికీ నమస్తే.. అమ్మా పక్కన పెట్టిన తీర్మానాన్ని ప్రతి గ్రూపులోని వారి పొదుపు ఖాతాల నుంచి సమాఖ్యలకు రూ.500 తగ్గకుండా ట్రాన్స్ఫర్ చేయించాలి. ఈ మొత్తం అమౌంట్ను టీఎల్ఎఫ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించాలి’’. .. ఇది డ్వాక్రా సంఘాలకు వీఓఏలు, ఆర్పీల నుంచి వస్తున్న మెసేజ్లు. ఈ తంతు అంతా ఏదో వారికి మేలు చేసేందుకో లేక ఆదుకునేందుకో కాదు. చంద్రబాబు ప్రభుత్వంలో వరద బాధితులకు సాయమందించేందుకు చేస్తున్న నయా దందా ఇది. – సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, బాపట్ల/తాడికొండనిజానికి.. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలు నష్టపోతే ఎక్కడైనా ప్రభుత్వాలు తక్షణం స్పందిస్తాయి. బాధితులను అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తాయి. పెద్దస్థాయిలో నష్టం జరిగితే ఆరి్థకంగా లేదా ఇతరత్రా పూర్తిస్థాయిలో సహాయం అందించి ఆదుకోలేకపోయినా.. తక్షణ సాయంతో ఉపశమనం కలిగించి తామున్నామన్న భరోసా ఇవ్వాలి.. చేయగలిగినంత చేయాలి. ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ, సీఎం చంద్రబాబు ప్రభుత్వం బాధితులను ఆదుకోవడం సంగతి పక్కనబెట్టి దాని పేరున చందాలు వసూలుకు తెరలేపింది. దీనికి విరాళాలు అని ముద్దుపేరు పెట్టి చంద్రబాబు అండ్ కో వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారు. గతంలో అమరావతి నిర్మాణానికి చందాలు, ఇటుకలు అంటూ చేస్తే ఇటీవల అన్న క్యాంటీన్లను ప్రారంభించి వాటికీ విరాళాలు వసూలుచేస్తున్నారు. ఇప్పుడు వరదల నేపథ్యంలో.. చందాలు వసూలు చేసే బాధ్యతను ప్రభుత్వం ఏకంగా కలెక్టర్ల నెత్తిన పెట్టడంతోపాటు డ్వాక్రా సంఘాలనూ వసూలుచేసి ఇమ్మంటూ బెదిరింపులకు దిగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే.. బాపట్ల జిల్లాలోని వేమూరు, రేపల్లెతోపాటు పలు ప్రాంతాల్లో వరదలొచ్చి వారం గడిచినా ప్రభుత్వ అధికారులు వచ్చి చూసిన పాపాన పోలేదు. పరిహారం కింద దేనికి ఎంతిస్తారో చంద్రబాబు నోరు విప్పడంలేదు. అసలిస్తారో లేదో తెలీడంలేదు. ఒక్కో ‘సంఘం’ రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు.. మరోవైపు.. రాష్ట్రంలో దాదాపు 9 లక్షలకు పైగా పొదుపు సంఘాలు ఉండగా.. పది మంది సభ్యులుండే ఒక్కో సంఘం రూ.500 నుంచి రూ.1,000 వరకు వెంటనే ఫోన్పే ద్వారా లేదంటే నగదు రూపంలో గ్రామ సమాఖ్యలకు లేదా పొదుపు ఖాతాల్లో నుంచి ఎస్ఎఫ్ఎల్ ఖాతాల్లోకి తప్పనిసరిగా అందజేయాలని అధికారులు ఫోన్లలో స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పొదుపు సంఘాల మహిళలు గ్రూపుల వారీగా వాళ్ల గ్రామ సమాఖ్యకు.. గ్రామ సమాఖ్యల నుంచి జిల్లాల వారీగా జిల్లా సమాఖ్యలు, వారి నుంచి రాష్ట్ర సమాఖ్య ఒకే మొత్తంగా నిధులు పోగుచేసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా సీఎం సహాయ నిధికి చెక్ రూపంలో సీఎంకు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి నుంచి అందిన సూచనల ప్రకారం.. సీఎం సహాయక నిధికి ఏయే పొదుపు సంఘాల్లో ఎవరెవరు ఇవ్వలేదో, వారి పేర్లను నమోదు చేసుకుంటామని, ఇవ్వనివారికి రిమార్కు రాస్తామంటూ అధికారులు ఫోన్లలోనే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. రిమార్కులు రాస్తే భవిష్యత్లో పొదుపు సంఘాల మహిళలు ఇబ్బందిపడతారని కూడా హెచ్చరిస్తున్నట్లు మంగళగిరి మండలం నూతక్కి పొదుపు మహిళలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని 1,259 డ్వాక్రా గ్రూపుల నుంచి మొత్తం రూ.6,29,600 వసూలుచేసి ఇచ్చినట్లు ఏపీఎం నాగేశ్వరరావు తెలిపారు. ఇక గత జులైలోనూ రాజధాని అమరావతి నిర్మాణం కోసమంటూ పొదుపు సంఘాల మహిళల నుంచి బలవంతపు వసూళ్ల కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.కలెక్టర్లకు చందాల బాధ్యతలు.. వరద పేరుచెప్పి ప్రజల నుంచి చందాలు వసూలుచేయమని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లను పురమాయించింది. దీంతో.. బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ‘జిల్లా కలెక్టర్ రిలీఫ్ ఫండ్, బాపట్ల’ పేరుతో ఒక యూనియన్ బ్యాంకు ఖాతా (నంబర్ 003712010002548) తెరిచారు. ఈ నెంబర్కు లేదా క్యూఆర్ కోడ్ ద్వారా చందాలు పంపాలని కోరారు. వ్యక్తిగతంగా లేదా స్వచ్ఛంద సంస్థలు చందాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిధులిస్తే ప్రజలకు సాయమందించాల్సిన కలెక్టర్కు జనం నుంచి చందాలు వసూళ్లు చేసే కార్యక్రమం కట్టబెట్టడంపై అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదేం ఖర్మరా బాబూ.. అంటూ తలలు పట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహారం చూస్తే జిల్లాలో వచ్చే చందా వసూళ్లను బట్టి వరద బాధిత ప్రజలకు పరిహారం ఉంటుందేమోనన్న అనుమానాలు బాధితులు వ్యక్తంచేస్తున్నారు.గతంలో ఎప్పుడూ ఇలాలేదు..గతంలో రాష్ట్రంలో పలుమార్లు వరదలు వచ్చినా ఏనాడూ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను చందాలు అడిగిన దాఖలాల్లేవని.. ప్రభుత్వమే అన్ని రకాలుగా ఆదుకునేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త రకం దందాకు తెరలేపడంపట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కూలీ నాలీ చేసుకుని కాలం వెళ్లదీస్తున్న పేద మహిళల దగ్గర బలవంతంగా వసూళ్లు చేయడమేమిటని మండిపడుతున్నారు. అయినా, ఫోన్పే నంబర్లకు నగదు వేయాలంటూ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని మహిళలు ప్రశి్నస్తున్నారు. -
వరద బాధితులకు చిన్నారి అభయ్ రామ్ విరాళం
సాక్షి, తాడేపల్లి: ఏపీలో వర్షాలకు వరదల కారణంగా విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జన జీవనం స్తంభించి పోయింది. ఈ నేపథ్యంలో బాధితులకు పలువురు అండగా నిలుస్తున్నారు. తమ వంతు సాయంగా ఎంతో డబ్బును విరాళంగా ఇస్తున్నారు.తాజాగా విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం సాయం చేసేందుకు ఓ చిన్నారి ముందుకు వచ్చాడు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉయ్యూరుకు చెందిన రాజులపాటి అభయ్ రామ్ కలిశాడు. ఈ సందర్భంగా విరాళం అందజేశాడు. తన వంతు సాయంగా కిడ్డీ బ్యాంక్లో ఉన్న నగదు రూ. 10వేలను వైఎస్ జగన్కు అందించాడు. వరద బాధితులకు సాయం చేయాలనే లక్ష్యంతోనే తాను ఈ డబ్బు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.ఈ సందర్భంగా పెద్ద మనసుతో ముందుకు వచ్చిన అభయ్ రామ్ను వైఎస్ జగన్ అభినందించారు. భవిష్యత్లో ఉన్నత చదువులు చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. కాగా, అభయ్ ఉయ్యూరులో ఒకటో తరగతి చదువుతున్నాడు. విరాళం అందజేసిన సందర్భంగా బాలుడితో అభయ్ రామ్ కుటుంబ సభ్యులు, పెనమలూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి వైఎస్ జగన్ను కలిశారు.మరోవైపు.. రాష్ట్రంలో వరదల నేపథ్యంలో వైఎస్సార్సీపీ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా పలువురు వైఎస్సార్సీపీ నేతలు కూడా తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడికి చెందిన వైఎస్సార్సీపీ నేత కట్టా మహేష్ తన వంతు సాయంగా వరద సహాయక చర్యల నిమిత్తం రూ. 50వేలు ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్ను వైఎస్ జగన్కు అందజేశారు. -
Tollywood: మేము సైతం
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల కేరళలో సంభవించిన వరదల సమయంలో తెలుగు నటులు కొందరు భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం తెలుగు హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు ‘మేము సైతం’ అంటూ విరాళాలు ప్రకటించారు.‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు కలచివేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో ΄ాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూ΄ాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి 50 లక్షలు చొప్పున) విరాళంగా ప్రకటిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు చిరంజీవి.→ ‘‘అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుండేవారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి యాభై లక్షల రూ΄ాయల చొప్పున విరాళంగా అందిస్తున్నాం. ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి’’ అని అక్కినేని కుటుంబం పేర్కొంది. విశాఖపట్నంలోని అలు ఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందజేస్తున్నాయి.→ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రూ. 6 కోట్ల విరాళం ప్రకటించారు నటుడు, జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఏపీ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడిన 400 పంచాయితీలకు రూ. 1 లక్ష చొప్పున రూ. 4 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఇలా మొత్తంగా రూ. ఆరు కోట్లను పవన్ కల్యాణ్ విరాళంగా అందించనున్నారు. → తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళాన్ని అందజేయనున్నట్లుగా ఆయన సిబ్బంది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూ΄ా యల చొప్పున విరాళం అందించనున్నట్లుగా ప్రభాస్ టీమ్ పేర్కొంది.→ ‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూ΄ాయలు విరాళంగా ప్రకటిస్తున్నా’’ అంటూ రామ్చరణ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.→ ‘‘తెలగు రాష్ట్రాల్లోని వరద పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉంది. నా వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూ΄ాయల విరాళం అందిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు అల్లు అర్జున్.→ తెలుగు రాష్ట్రాల్లోని వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రుల సహాయ నిధులకు రూ. 10 లక్షల చొప్పున 20 లక్షలు... అలాగే విజయవాడలోని అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ .5 లక్షలు.. ఇలా మొత్తంగా రూ. 25లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు సాయిదుర్గా తేజ్.→ తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని, తన సిబ్బంది వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తూ, సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా ΄ాల్గొంటున్నారని సోనూసూద్ తెలి΄ారు. బుధవారం పైన పేర్కొన్న నటులు విరాళం ప్రకటించగా, అంతకుముందు విరాళం ప్రకటించినవారి వివరాల్లోకి వెళితే... ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి రూ. 50 లక్షలు చొప్పున కోటి రూ΄ాయలు బాలకృష్ణ, మహేశ్బాబు, ఎన్టీఆర్ విరాళంగా ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్– ఎస్. రాధాకృష్ణ–ఎస్. నాగవంశీ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లుగా తెలి΄ారు. తెలుగు రాష్ట్రాలకు 15 లక్షల రూ΄ాయల చొప్పున మొత్తంగా రూ. 30 లక్షలు విరాళంగా ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. విశ్వక్ సేన్, దర్శకుడు వెంకీ అట్లూరి మొత్తంగా పది లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల 5 లక్షలు (ఏపీ 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షలు) విరాళం ప్రకటించారు. దర్శకుడు–నటుడు తల్లాడ సాయికృష్ణ రూ. లక్షా యాభై వేలుని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు విరాళంగా ప్రకటించారు. -
సినీ తారల వరదసాయం...
-
హీరోయిన్గా పొందిన ప్రేమను హ్యూమన్గా తిరిగి ఇస్తున్నా
పాలక్కాడ్ టు హైదరాబాద్... చెన్నై... ముంబై... సినిమా అనేది సంయుక్తను అన్ని రాష్ట్రాల్లోనూ పాపులర్ చేసింది. రీల్పై హీరోయిన్... రియల్గానూ అంతే... ఆపన్న హస్తం అందించడానికి వెనకాడరామె. 2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంయుక్త. తాజాగా వయనాడ్ బాధితులకు విరాళం ఇచ్చారు. ‘ఆది శక్తి’ పేరుతో సేవా సంస్థను ఆరంభించారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ మలయాళ బ్యూటీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...→ కేరళలో పుట్టి పెరిగిన మీకు ఇప్పుడు వయనాడ్ని చూస్తుంటే బాధ అనిపించడం సహజం. వయనాడ్ ఎన్నిసార్లు వెళ్లారు? సంయుక్త: ఇప్పటివరకూ నేను ఒకే ఒక్కసారి వెళ్లాను. చాలా అందమైన ప్రదేశం. మంచి హిల్ స్టేషన్. హాయిగా గడపడానికి అక్కడికి వెళుతుంటారు. అలాంటి వయనాడ్ రూపు రేఖలు వర్షాల వల్ల మారి΄ోవడంతో బాధ అనిపించింది. ఇప్పుడు వయనాడ్ వెళదామనుకున్నాను కానీ సందర్శనలకు అనుమతి లేదు.→ వయనాడ్లో షూటింగ్స్ ఏమైనా చేశారా?ఆ అవకాశం ఇప్పటివరకూ రాలేదు. యాక్చువల్లీ అక్కడ వర్షాలప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. ప్రతి గంటకూ మా అమ్మగారు ఫోన్ చేసి, పరిస్థితులు చెప్పేవారు. ఆ బీభత్సం చూసి, ఆవిడైతే నాలుగైదు రోజులు నిద్ర΄ోలేదు. నిజానికి వయనాడ్కి ఏమైనా చేయమని అమ్మే చెప్పింది. నేనూ అదే అనుకున్నాను కాబట్టి వెంటనే విరాళం ఇచ్చాను. → ఆర్థిక సహాయమేనా? 2018 కేరళ వరదలప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాలు చేసినట్లు చేయాలనుకుంటున్నారా? ఇంకా చేయాలని ఉంది. కేరళలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థతో మాట్లాడాను. ఏం చేస్తే బాగుంటుందో వాళ్లు గ్రౌండ్ లెవల్లో స్టడీ చేస్తున్నారు. దాన్నిబట్టి సహాయ కార్యక్రమాలను ΄్లాన్ చేస్తాను.→ 2018లో చేసిన సేవా కార్యక్రమాల గురించి...2018లో కేరళ వరదలప్పుడు నేను చెన్నైలో ఇరుక్కు΄ోయాను. బాధితుల కోసం చాలా చిన్న స్థాయిలో ఓ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేశాను. నేను ఊహించినదానికన్నా ఎక్కువ నిత్యావసర వస్తువులు రావడంతో పెద్ద గోడౌన్ తీసుకోవాల్సి వచ్చింది. వచ్చినవి వచ్చినట్లు సరఫరా చేశాం. ఇక కేరళ వెళ్లాక పాడై΄ోయిన ఇళ్లను బాగు చేసే కార్యక్రమంలో పాల్గొన్నాను. చెప్పలేనంత మట్టి పేరుకు΄ోవడంతో క్లీన్ చేయడానికి ఇబ్బందిపడ్డాం.→ సంయుక్తా మీనన్లోంచి ‘మీనన్’ ఎందుకు తీసేశారు? మా అమ్మానాన్న విడి΄ోయారు. అమ్మంటే నాకు చాలా ప్రేమ, గౌరవం. తన ఫీలింగ్స్ని గౌరవించి పేరులోంచి సర్ నేమ్ తీసేశాను. ఇంకో విషయం ఏంటంటే... నేను ఆడ.. మగ సమానం అని నమ్ముతాను. సర్ నేమ్ వద్దనుకోవడానికి అదో కారణం. → సింగిల్ పేరెంట్గా మీ అమ్మగారు మిమ్మల్ని పెంచారు కాబట్టి తండ్రి ప్రేమను మిస్సయిన ఫీలింగ్... యాక్చువల్లీ నాకు అమ్మానాన్న ఇద్దరి ప్రేమనీ పంచారు మా తాతగారు (సంయుక్త అమ్మ తండ్రి). నేను ఏం అడిగినా కాదని చెప్పలేనంత ప్రేమ మా తాతగారిది. అలాగని గుడ్డిగా ఓకే చెప్పలేదు. ఆయన బాధపడే పనులు చేయనని, అసలు తప్పు చేయనని నమ్మకం. అంత ప్రేమ పంచి, నమ్మకాన్ని పెంచుకున్న మా తాత నా ఫస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ని చూడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లి΄ోయారు. కానీ, ఎక్కడున్నా తన మనవరాలి విజయాన్ని చూస్తున్నారన్నది నా నమ్మకం.→ ‘స్వయంభూ’, హిందీ ‘మహారాజ్ఞి’ కోసం ఫైట్స్ కూడా నేర్చుకున్నారు... ఇప్పటివరకూ దాదాపు సున్నితమైన పాత్రల్లో కనిపించిన మీరు ఇప్పుడు పవర్ఫుల్గా కనిపించనున్నారన్న మాట... ‘స్వయంభూ’ కోసం గుర్రపు స్వారీ, ఫైట్స్లో శిక్షణ తీసుకున్నాను. అటు హిందీ ‘మహారాజ్ఞి’ కోసం కూడా యాక్షన్ నేర్చుకున్నాను. ఒకప్పుడు సినిమాలకు దూరంగా పారి΄ోవాలనుకున్న నేను ఇప్పుడు సినిమా కోసం ఏం నేర్చుకోవడానికైనా రెడీ అయి΄ోయాను. చేసే ప్రతి పాత్ర ఒకదానికి ఒకటి భిన్నంగా ఉండాలనుకుంటున్నాను. స్క్రీన్ మీద చూసి నాపై ప్రేమ పెంచుకున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంతైనా కష్టపడొచ్చు. → ప్రేక్షకుల మీద ప్రేమతోనేనా ఈ సేవా కార్యక్రమాలు...అవును. పాలక్కాడ్లో మొదలై ఇతర రాష్ట్రాల్లో ఆదరణ పొందడం అంటే చిన్న విషయం కాదు. నటిగా నేను సక్సెస్ అయ్యానంటే అది నా విజయం కాదు. నన్ను ప్రేక్షకులే సక్సెస్ చేశారు. హీరోయిన్గా నేను పొందిన ప్రేమను హ్యూమన్గా తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఏదైనా అర్థవంతంగా, ఉపయోగపడేది చేయాలన్నది నా సంకల్పం. అందుకే ‘ఆది శక్తి’ సేవా సంస్థ ఆరంభించాను. → కేరళ నుంచి నిత్యామీనన్, నయనతార, సమంత (సమంత అమ్మ మలయాళీ) వంటివారిని హైదరాబాద్ తీసుకొచ్చి స్టార్స్ని చేసింది టాలీవుడ్. ఇప్పుడు మీరు... మాలీవుడ్ అమ్మాయిలకు టాలీవుడ్ లక్కీ అనొచ్చా? ఒక్క మాలీవుడ్ ఏంటి? ఎవరికైనా ఆహ్వానం పలుకుతుంది టాలీవుడ్. సో.. మాకే కాదు అందరికీ లక్కీయే. ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడటం మొదలుపెట్టారంటే ఇక ఆ స్టార్ని ఎప్పటికీ ఇష్టపడతారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ సినిమాని సెలబ్రేట్ చేస్తుంది. ఇంతగా ప్రేమించే తెలుగు పరిశ్రమలో భాగం కావడం హ్యాపీగా ఉంది. అందుకే కేరళ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. → మీ ‘ఆది శక్తి’ ఫౌండేషన్ గురించి క్లుప్తంగా... ఎవరికైనా సహాయం చేయాలంటే జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే సరి΄ోదు. వాళ్లు జీవించినంత కాలం పనికొచ్చే సహాయం చేయాలి. నేను స్త్రీ సంక్షేమంపై దృష్టి పెట్టాను. చదువు, ఆరోగ్యం, ఉద్యోగం... వీటికి సంబంధించి సహాయం చేయాలన్నది నా ఆశయం. ముఖ్యంగా నేటి స్త్రీల మానసిక ఆరోగ్యం చాలా దెబ్బ తింటోంది. ఆ విషయం మీద వారిని ఎడ్యుకేట్ చేయాలి. నేను ‘ఆది శక్తి’ ఆరంభించే ముందు పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడాను. కొంత రిసెర్చ్ చేసి, అవగాహన తెచ్చుకుని ‘ఆది శక్తి’ ఆరంభించాను. – డి.జి. భవాని -
అభివృద్ధి, సంక్షేమం, అన్న క్యాంటీన్లు.. అన్నీ విరాళాలతోనే..
సాక్షి, అమరావతి: దాతలు, ప్రజల విరాళాలతో జన్మభూమి–2 ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అన్న క్యాంటీన్లు నిర్వహిస్తామని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే సీఎం హోదాలో చేసిన ఐదు సంతకాల అమలును ప్రారంభించామని చెప్పారు. పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధిలో పార్టీ అండగా ఉంటుందన్నారు. సిఫార్సులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తించి దశలవారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్రెడ్డిని ఇంటికి పంపించడానికి ఉపాధి కోల్పోయి వలస వెళ్లిన కారి్మకులు కూడా వచ్చి ఎన్నికల్లో ఓటేశారని, ఎన్నారైలు విదేశాల నుంచి వచ్చి ఏడాది పాటు పని చేశారని చంద్రబాబు అన్నారు.వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయతి్నంచిన విధంగానే మదనపల్లెలో భూ కుంభకోణాల సాక్ష్యాలను తారుమారుకు కూడా కుట్ర చేశారన్నారు. వివేకాది గుండెపోటని చెప్పినట్లుగానే.. మదనపల్లెలో ఫైళ్ల దగ్ధాన్ని షార్ట్ సర్క్యూట్గా ప్రచారం చేశారన్నారు. పెద్దిరెడ్డి అక్రమాలపై ఒక్క రోజులోనే వేలాది బాధితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ అంటేనే నేరస్థులు, అరాచకవాదులని అన్నారు. 13 లక్షలకు పైగా అసైన్డ్ భూములను కాజేశారని, 40 వేల ఎకరాలు రిజస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని చెప్పారు. 22ఏను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు, దందాలు చేశారని అన్నారు. అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటుఅనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, 8 వెనకబడ్డ జిల్లాలకు కేంద్ర సహకారం, నరేగా, నీరు–చెట్టు బిల్లుల విడుదల, ప్రజావేదిక, ప్రజాదర్బార్లో వచి్చన అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు తదితర అంశాలపై చర్చించినట్టు వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, దోపిడీపై విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ జిల్లా యూనిట్గా అమలు చేయాలని భావిస్తున్నట్టు చంద్రబాబు పొలిట్బ్యూరోలో వివరించినట్టు సమాచారం. -
కమలా హారిస్ జోరు.. వారంలోనే భారీగా విరాళాలు
వాషింగ్టన్: డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన కమలా హారిస్ విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు. బైడెన్ స్థానంలో పోటీలోకి వచ్చిన ఆమె కేవలం వారం వ్యవధిలోనే దాదాపు 20 కోట్ల డాలర్లను సేకరించారు.ఓ వైపు డెమొక్రాట్లలో ఆమెకు రోజురోజుకు మద్దతు పెరుగుతుండటంతో పాటు ట్రంప్ తో పోటీ విషయంలోనూ దూసుకెళ్తున్నారు. ఎన్నికల రేసులో కమల దూసుకెళ్తున్నప్పటికీ అధ్యక్ష కుర్చీ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని ఆమె ప్రచార టీమ్ తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లోని అతి తక్కువ ఓటర్లే విజేతను నిర్ణయించే విషయంలో కీలకంగా మారనున్నారని వారు చెబుతున్నారు. -
కమలా హారిస్కు మద్దతుగా ట్రంప్ విరాళం!.. జోరుగా సెటైర్లు
అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడం, డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ఆయన ప్రతిపాదించడం, మద్దతు కూడగట్టుకునేందుకు ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేయడం.. అదే టైంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈలోపు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ తెర మీదకు వచ్చింది.బైడెన్ వైదొలగిన తర్వాత హారిస్ ప్రచారం బృందం 24 గంటల్లో 81 మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించింది. దీంట్లో 60 శాతం తొలిసారి దాతల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. మరి కమలా హారిస్కు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ‘కానుక’ సంగతి ఏంటి? అని కొందరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుస్తున్నారు. అయితే ఇది ఇప్పట్లో జరిగింది కాదు.2011 సెప్టెంబర్లో కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా ఉన్నారు. ఆమె మళ్లీ పోటీ చేయడం కోసం ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ జరిగింది. ఆ సమయంలో ట్రంప్ తరఫున 6,000 డాలర్ల డొనేషన్ కమలా హారిస్కు వెళ్లింది. ఇందులో 5,000 డాలర్లను ట్రంప్ సంతకంతో కూడిన చెక్ డొనేషన్ రూపంలో ఆమెకు వెళ్లింది. మరో వెయ్యి డాలర్లు 2013 ఫిబ్రవరిలో ట్రంప్ పేరిట హారిస్ ఖాతాలోకి వెళ్లింది. ఇక.. 2014 జూన్లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రీ-ఎలక్షన్ కమిటీ సభ్యురాలైన ట్రంప్ కూతురు ఇవాంకా.. మరో 2,000 డాలర్లను విరాళంగా ఇచ్చారు. అంటే.. మొత్తంగా ట్రంప్ కుటుంబం 8,000 డాలర్లను డొనేషన్ రూపంలో కమలా హారిస్కు మద్దతుగా ఇచ్చిందన్నమాట. అయితే ఇది ఆ కుటుంబం కావాలని చేసిన పనేం కాదు. అప్పటి న్యూయార్క్ ప్రాసిక్యూటర్ ఎరిక్ ష్నీడెర్మాన్ కమలా హారిస్ తరఫున ఫండ్ రైజర్గా ఉండగా.. ఆయన విజ్ఞప్తి మేరకు ట్రంప్ కుటుంబం అలా డొనేషన్లు ఇచ్చింది.ఇక ఇప్పుడు ఆ డొనేషన్ ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫ్లోరిడా డెమోక్రటిక్ సభ్యుడు జరెడ్ మోస్కోవిట్జ్ ఎక్స్ వేదికగా ‘‘తెలివైన పెట్టుబడి’’ అని చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశమైంది. ఆమె ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థి కాబట్టి ఆ డబ్బును ఉపయోగించుకోలేరని మరో నెటిజన్ సెటైర్ వేశారు. ట్రంప్ దీనికి ఏం సమాధానం చెప్తారో అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు.కొసమెరుపు ఏంటంటే.. శాక్రమెంటో బీ పత్రికా కథనం ప్రకారం.. 2020లో యూఎస్ సెనేట్కు కమలా హారిస్ పోటీ చేశారు. ఆ టైంలో ఆ 6 వేల డాలర్ల మొత్తాన్ని ఆమె సెంట్రల్ అమెరికాలోని ఓ పౌర హక్కుల సంస్థకు విరాళంగా ఇచ్చారట. -
Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి (ఎఫ్సీఆర్ఏ) విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 7.08 కోట్లను విదేశాల నుంచి సేకరించిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర హోం శాఖకు తెలిపింది. పంజాబ్ మాజీ ఆప్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాపై డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో సోదాలు చేపట్టినపుడు ఆప్ విదేశీ విరాళాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ఈ–మెయిల్స్ లభించాయని ఈడీ పేర్కొంది. 2014– 2022 మధ్య ఆప్ రూ. 7.08 కోట్లను అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్ల నుంచి సేకరించిందని.. ఇది ఎఫ్సీఆర్ఏ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లను ఉల్లఘించడమేనని తెలిపింది. ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్, కుమార్ విశ్వాస్, అనికిత్ సక్సేనా, కపిల్ భరద్వాజ్ మధ్య జరిగిన ఈ–మెయిల్ సంప్రదింపుల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలున్నట్లు పేర్కొంది. అమెరికా, కెనడాల్లో నిధుల సేకరణ కార్యక్రమాల్లో విరాళాలిచి్చన వ్యక్తుల వివరాలను ఆప్ తమ ఖాతా పుస్తకాల్లో చూపలేదంది. -
బాండ్లను డ్రాప్ బాక్స్లో పడేశారు..
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా వందల కోట్ల విరాళాలను అందుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ దాతలు ఎవరో తెలీయదని చెప్పొకొచి్చంది. ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టులను సంపాదించిన కంపెనీలే ఆయా అధికార పారీ్టలకు వందల కోట్ల ముడుపులను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ముట్టజెప్పాయన్న ఆరోపణల నడుమ తృణమూల్ కాంగ్రెస్ స్పందించడం విశేషం. టీఎంసీకొచి్చన బాండ్లపై పశ్చిమబెంగాల్లో సోమవారం ఒక పత్రికా సమావేశంలో ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ మాట్లాడారు. ‘‘ మా పారీ్టకి ఎవరు విరాళంగా ఇచ్చారో మాకు తెలీదు. ఎంత పెద్ద మొత్తాలను ఇచ్చిందీ తెలీదు. అసలు ఈ బాండ్ల పథకాన్ని తెచి్చందే బీజేపీ. రాజకీయ పారీ్టలకు నిర్వహణ వ్యయాలను ప్రభుత్వాలే భరించాలని 1990దశకం నుంచీ మమతా బెనర్జీ మొత్తుకుంటూనే ఉన్నారు. వేలకోట్ల నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట పడాలని ఆమె కాంక్షించారు. అయినా సరే ఎవరిమాటా వినకుండా బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తెచి్చంది. వేరే దారి లేక మేమూ ఆ పథకం నిబంధనలను పాటించాం. మాకు ఎన్ని బాండ్లు ఇచ్చారో, ఎవరిచ్చారో తెలీదు. సాధారణంగా పార్టీ ఆఫీస్ బయట ఒక డ్రాప్బాక్స్ ఉంటుంది. అందులోనే ఈ బాండ్లు ఎవరో పెట్టి వెళ్లారు. ఆ బాండ్లపై దాతల పేర్లు ఉండవు. కేవలం ఆల్ఫా–న్యూమరిక్ నంబర్ ఉంటుంది. దాత పేరు, వివరాలు బీజేపీకైతే తెలుస్తాయి. ఎందుకంటే వాళ్లే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సీబీఐ, ఈడీని తమ చెప్పుచేతల్లో ఉంచుకుని వాటి ద్వారా బెదిరించి మరీ విరాళాల వసూళ్ల పర్వాన్ని బీజేపీ యథేచ్ఛగా కొనసాగింది. బాండ్ల ద్వారా మేం అందుకున్న మొత్తాలను టీఎంసీ అధికారిక బ్యాంక్ ఖాతాల్లోనే జమచేశాం’’ అని కునాల్ ఘోష్ చెప్పారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎలక్టోరల్ బాండ్ల గణాంకాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్కు 10 మంది అతిపెద్ద విరాళాల దాతల నుంచే ఏకంగా రూ.1,198 కోట్లు వచ్చాయి. ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ సంస్థ ఒక్కటే టీఎంసీకి రూ.542 కోట్లు విరాళంగా ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచించిన కాలపరిమితిలో ఎస్బీఐ నుంచి దాదాపు 1,300 సంస్థలు/వ్యక్తులు రూ.12,000 కోట్లకుపైగా విలువైన బాండ్లను కొనుగోలుచేసి 23 రాజకీయపారీ్టలకు తమకు నచి్చన మొత్తాలను విడివిడిగా విరాళంగా ఇవ్వడం తెల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ బాండ్ల వివరాలన్నింటినీ ఎన్నికల సంఘానికి అందజేసింది. -
ఇన్ని రోజులు ఏం చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టిలు పొందిన విరాళాల వివరాలను మంగళవారం సాయంత్రంకల్లా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సమరి్పంచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. దీంతో మరింత గడువు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)కి న్యాయస్థానంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ‘‘రాజకీయ పార్టిలు పొందిన విరాళాల సమగ్ర వివరాలను 12వ తేదీ పనిగంటలు ముగిసేలోగా ఈసీకి వెల్లడించాలి. తర్వాత అందరికీ బహిర్గతం చేయాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల రాజ్యాంగ ధర్మాసనం ఎస్బీఐను ఆదేశించింది. మరోవైపు, మార్చి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలలకల్లా తమ అధికారిక వెబ్సైట్లో సమగ్ర వివరాలను పొందుపరచాలని ఈసీకి కోర్టు సూచించింది. బ్యాంక్కు ఆదేశాలు, గడువుకు సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఇచి్చన ఉత్తర్వుల ఉల్లంఘనకు బ్యాంక్ పాల్పడితే బ్యాంక్పై చర్చలు తీసుకునేందుకు వెనకాడబోమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ ఆ పద్దతిని రద్దుచేస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగధర్మాసనం ఫిబ్రవరిలో చరిత్రాత్మక తీర్పునివ్వడం తెల్సిందే. 2019 ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఎస్బీఐ ద్వారా జరిగిన ఎలక్టోరల్ బాండ్ల అధికారిక కొనుగోలు, డిపాజిట్ లావాదేవీల వివరాలను మార్చి ఆరో తేదీలోపు ఈసీకి ఇవ్వాలని కోర్టు గతంలోనే ఆదేశించడం తెల్సిందే. దీంతోజూన్ 30వ తేదీకా గడువు పొడిగించాలని ఎస్బీఐ కోర్టును కోరడం, అలా గడవు కోరడాన్ని కోర్టు ధిక్కారణగా పరిగణించాలంటూ కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలవడం తెల్సిందే. ఎస్బీఐ తరఫున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే వాదించారు. ‘‘ బాండ్లను కొనుగోలు చేసిన వారు, డిపాజిట్ చేసుకున్న వారి వివరాలు వేర్వేరుగా ఉన్నాయి. వాటిని సరిపోల్చి నివేదించాల్సిఉంది. వేర్వేరు చోట ఉన్న బ్రాంచీల్లో నిక్షిప్తమైన డేటాను సరిపోల్చేందుకు చాలా సమయంపడుతుంది. అందుకే గడువు పెంచండి’ అని కోరారు. ‘‘ విరాళాల దాతలు, గ్రహీతల వివరాలను సరిపోల్చి మ్యాచింగ్ వివరాలని ఇవ్వాలని మేం అడగలేదు. మీ దగ్గర ఉన్నది ఉన్నట్లుగా సీల్డ్ కవర్ లోంచి తీసి ఈసీకిస్తే చాలు’’ అని ఆదేశించింది. ‘‘ ఫిబ్రవరి 15న తీర్పు ఇచ్చాం. అంటే ఈ 26 రోజుల నుంచి ఏం చేసినట్లు? ఇంతకాలం మౌనంవహించి ఇప్పుడొచ్చి గడువు పెంచమంటారా? కోర్టు ఉత్తర్వులపై ఇంత నిర్లక్ష్యమా?’’ అని దుయ్యబట్టింది. స్వాగతించిన కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. భారీ కాంట్రాక్టులను సంపాదించేందుకు బీజేపీకి భారీగా విరాళాల విరాళాలిచ్చిన వారి వివరాలూ బయటికొచ్చేలా ఉత్తర్వులిస్తే బాగుండేదని పేర్కొంది. ‘‘స్విస్ ఖాతాల నుంచి కోట్ల నల్లధనం తెస్తామన్న వాళ్లే తమ సొంత ఖాతాల వివరాలు సుప్రీం కంటబడకుండా దాచేస్తున్నారు’’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. -
Busireddy Shankar Reddy: మాది సమష్టి సేవ
ప్రభుత్వం అన్నీ చేస్తుంది... కానీ! చేయాల్సినవి ఇంకా ఎన్నో ఉంటాయి. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడుతుంది ప్రభుత్వం. చెప్పుల్లేకపోతే వచ్చే వ్యాధులను అరికట్టేదెవరు? స్కూలు భవనం కడుతుంది ప్రభుత్వం. ప్రహరీలు... టాయిలెట్లను మరచిపోతుంటుంది. హాస్పిటళ్లను కట్టిస్తుంది ప్రభుత్వం. వైద్యపరికరాల్లో వెనుకబడుతుంటుంది. ‘ప్రభుత్వం చేయలేని పనులు చేయడమే మా సేవ’ అంటున్నారు రోటరీ క్లబ్ గవర్నర్ డా.శంకర్రెడ్డి. ‘మనది పేద ప్రజలున్న దేశం. ప్రభుత్వాలు ఎంత చేసినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చే వాళ్లందరం సంఘటితమై చేస్తున్న సేవలే మా రోటరీ క్లబ్ సేవలు’ అన్నారు బుసిరెడ్డి శంకర్రెడ్డి. ఒక రైతు తన పొలానికి నీటిని పెట్టుకున్న తర్వాత కాలువను పక్కపొలానికి మళ్లిస్తాడు. అంతే తప్ప నీటిని వృథాగా పోనివ్వడు. అలాగే జీవితంలో స్థిరపడిన తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలి. అప్పుడే జీవితానికి సార్థకత అన్నారు. సమాజానికి తమ సంస్థ అందిస్తున్న సేవల గురించి సాక్షితో పంచుకున్నారాయన. ‘కష్టపడడమే విజయానికి దారి’... ఇందులో సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చిన వారిలో సేవాగుణం కూడా ఉంటుంది. నేను 1994లో మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పటి నుంచి మా సీనియర్ల సర్వీస్ను చూస్తూ మేము ఇంకా వినూత్నంగా ఏమి చేయవచ్చనే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సర్వీస్లో ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. చదువుకునే పిల్లవాడికి పెన్ను ఇవ్వడం కూడా చాలా సంతృప్తినిస్తుంది. ఆ పెన్ను అందుకునేటప్పుడు పిల్లల కళ్లలో చిన్న మెరుపు, ముఖంలో సంతోషం... ఇవి చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది. నేను స్కూళ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కారణం కూడా అదే. మంచినీటి సౌకర్యం లేని స్కూళ్లలో ఆర్వో ప్లాంట్, కొన్ని స్కూళ్లకు టాయిలెట్లు, హ్యాండ్ వాష్ స్టేషన్లు, తరగతి గదుల నిర్మాణం, క్లాస్రూమ్లో బెంచీలతో మొదలైన మా సర్వీస్లో ఇప్పుడు పిల్లల ఆరోగ్యం ప్రధానంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు ప్రభుత్వం కొంతవరకు సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ అప్పటికప్పుడు తీర్చాల్సిన అవసరాలకు నిధులుండవు. వాటిల్లో ప్రధానమైనది ఆరోగ్యం. వాతావరణం మారిన ప్రతిసారీ పిల్లల మీద దాడి చేయడానికి సీజనల్ అనారోగ్యాలు పొంచి ఉంటాయి. మీరు ఊహించగలరా పాదాలకు సరైన పాదరక్షలు లేకపోవడం వల్ల చలికాలంలో పిల్లలు అనారోగ్యం బారిన పడతారు. నులిపురుగుల కారణంగా అనారోగ్యాల పాలవుతారు. హాస్టల్ ఆవరణలో కూడా చెప్పులతో తిరగాలని చెప్పడంతోపాటు మంచి బూట్లు ఇవ్వడం వరకు రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నాం. బూట్లు కూడా మంచి బ్రాండ్వే. లోటో కంపెనీ షూస్ మార్కెట్లో కొనాలంటే రెండు వేలవుతాయి. ఆ కంపెనీతో మాట్లాడి వారి సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ) ప్రోగ్రామ్ కింద మూడు వందల లోపు ధరకే తీసుకున్నాం. మేము సర్వీస్ కోసం చేసే ప్రతి రూపాయి కూడా నేరుగా ఆపన్నులకే అందాలి. కమర్షియల్గా వ్యాపారాన్ని పెంపొందించే విధంగా ఉండదు. పిల్లలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించడం వల్ల చాలామంది పిల్లల్లో కంటిచూపు సమస్యలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కంటి సమస్యల కోసం పెద్ద ఎత్తున వైద్యశిబిరాలు నిర్వహించినప్పటికీ పిల్లల మీద దృష్టి పెట్టలేదు. రవి గాంచని చోటును కవి గాంచును అన్నట్లు... ప్రభుత్వం చూపు పడని సమస్యల మీద మేము దృష్టి పెడుతున్నాం. శంకర్ నేత్రాలయ, మ్యాక్సివిజన్, ఆస్టర్ గ్రూప్ వైద్యసంస్థలతో కలిసి పని చేస్తున్నాం. తక్షణ సాయం! ఆరోగ్యం, చదువుతోపాటు ప్రకృతి విలయాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సాయం కోసం స్థానిక కలెక్టర్ల నుంచి పిలుపు వస్తుంది. అలా ఇల్లు కాలిపోయిన వాళ్లకు పాత్రలు, నిత్యావసర దినుసులు, దుస్తులు, దుప్పట్లు... వంటివి ఇస్తుంటాం. మా సేవలకు స్థిరమైన నిధి అంటూ ఏదీ ఉండదు. సాధారణంగా ఇందులో సభ్యులుగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి సమాజానికి తమ వంతుగా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చే వాళ్లే ఉంటారు. తక్షణ సాయానికి ఆ స్థానిక క్లబ్ సభ్యులు సొంత డబ్బునే ఖర్చుచేస్తారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చేపట్టే కార్యక్రమాలకు మాత్రం కచ్చితంగా ప్రాజెక్టు రిపోర్ట్, కొటేసన్ సిద్ధం చేసుకుని నిధుల సమీకరణ మొదలు పెడతాం. ఇందులో మూడింట ఒక వంతు క్లబ్, ఒక వంతు దాత, ఒక వంతు ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ సహకరిస్తుంది. ఇది సమష్టి సేవ! రోటరీ క్లబ్ ద్వారా అందించే సేవలన్నీ సమష్ఠి సేవలే. ఏ ఒక్కరమూ తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకోకూడదు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కలిపి మా పరిధిలో 113 క్లబ్లున్నాయి. ఎక్కడి అవసరాన్ని బట్టి అక్కడి సభ్యులు స్పందిస్తారు. సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఇక నా వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే... మాది భద్రాచలం దగ్గర రెడ్డిపాలెం. పూర్వికులు ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా నర్సరావు పేట నుంచి భద్రాచలానికి వచ్చారు. సివిల్ కాంట్రాక్టర్గా ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్కు çసర్వీస్ ఇస్తున్నాను. మా ఊరికి నేను తిరిగి ఇస్తున్నది నీటి వసతి. పేపర్ మిల్లు నుంచి వెలువడే వాడిన నీటిని మా ఊరి పంట పొలాలకు అందించే ఏర్పాటు కొంత వరకు పూర్తయింది. పైప్లైన్ పని ఇంకా ఉంది. మేము గోదావరి తీరాన ఉన్నప్పటికీ నది నుంచి మాకు నీళ్లు రావు. గ్రామాల్లో విస్తృతంగా బోర్వెల్స్ వేయించాం. బూర్గుంపాడులో నేను చదువుకున్న స్కూల్కి ఆర్వో ప్లాంట్ నా డబ్బుతో పెట్టించాను. ‘ఇవ్వడం’లో ఉండే సంతృప్తి మాత్రమే మా చేత ఇన్ని పనులు చేయిస్తోంది. నాకు అరవైదాటాయి. కుటుంబ బాధ్యతలు పూర్తయ్యాయి. మా అమ్మాయి యూఎస్లో ఉంది, అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక నేను సర్వీస్ కోసం చేస్తున్న ఖర్చు గురించి నా భార్య అన్నపూర్ణ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కొన్ని కార్యక్రమాలకు నాతోపాటు తను కూడా వస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్న అవసరతను అర్థం చేసుకుంది, నన్ను కూడా అర్థం చేసుకుంది. కాబట్టే చేయగలుగుతున్నాను’’ అని వివరించారు రొటేరియన్ డాక్టర్ బుసిరెడ్డి శంకర్రెడ్డి. శ్రీమంతులకు స్వాగతం! జీవితంలో సుసంపన్నత సాధించిన వారిలో చాలా మందికి సొంత ఊరికి ఏదైనా చేయాలని ఉంటుంది. తాము చదువుకున్న స్కూల్ను అభివృద్ధి చేయాలని ఉంటుంది. అలాంటి శ్రీమంతులకు నేనిచ్చే సలహా ఒక్కటే. మా సర్వీస్ విధానంలో ‘హ్యాపీ స్కూల్’ కాన్సెప్ట్ ఉంది. ఒక పాఠశాలను హ్యాపీ స్కూల్గా గుర్తించాలంటే... కాంపౌండ్ వాల్, పాఠశాల భవనం, డిజిటల్ క్లాస్ రూములు, నీటి వసతి, టాయిలెట్లు ఉండాలి. అలా తీర్చిదిద్దడానికి 90 లక్షలు ఖర్చవుతుందనుకుంటే ముప్ఫై లక్షలతో ఒక దాత వస్తే, మా రోటరీ క్లట్, అంతర్జాతీయ రోటరీ ఫౌండేషన్ నిధులతో పూర్తి చేయవచ్చు. గతంలో ఏపీలో కూడా మేము చాలా పాఠశాలలను దత్తత తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తోంది. అక్కడ మా అవసరం లేదు, మాకు సర్వీస్ చేసే అవకాశమూ లేదు. తెలంగాణలో గడచిన ప్రభుత్వం పాఠశాలల మీద దృష్టి పెట్టకపోవడంతో మేము చేయగలిగినంత చేస్తూ వస్తున్నాం. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హైదరాబాద్ నగరం, మెట్రో రైల్వే స్టేషన్లలో 65 వాటర్ కూలర్లనిచ్చాం. నీలోఫర్, ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వైద్యపరికరాలు, స్పర్శ్ పేరుతో క్యాన్సర్ బాధితులకు పాలియేటివ్ కేర్, కొన్ని హాస్పిటళ్లకు అంబులెన్స్లు ఇచ్చింది రోటరీ క్లబ్. ఇక ఆలయాల్లో పూజలకు అన్ని ఏర్పాట్లూ ఉంటాయి, కానీ భక్తులకు సౌకర్యాలు పెద్దగా ఉండవు. మా భద్రాచలం, పర్ణశాలలో టాయిలెట్లు, భక్తులు దుస్తులు మార్చుకోవడానికి గదుల నిర్మాణం... ఇలా మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాం. – వాకా మంజులా రెడ్డి ఫొటో: గడిగె బాలస్వామి -
ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు..!
ఎన్నికల బాండ్లు. పార్టిలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టికి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.10 వేలు, రూ.లక్ష, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ మొత్తం ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్కు వెళ్తుంది. బాండ్ల కొనుగోలుపై సంఖ్య పరిమితేమీ లేదు. ఒక్కరు ఎన్ని బాండ్లైనా కొనవచ్చు. పైగా తమ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచవచ్చు. బాండ్లపై వారి పేరు తదితర వివరాలేవీ ఉండవు. బ్యాంకు వాటిని ఎవరికీ వెల్లడించదు. పార్టీలు రూ.20 వేలకు మించిన నగదు విరాళాల వివరాలను విధిగా బయట పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ బాండ్ల విషయంలో అలాంటి నిబంధనేదీ లేదు. ఎంత పెద్ద మొత్తం విరాళంగా అందినా వివరాలను ఈసీతో పాటు ఎవరికీ వెల్లడించాల్సిన పని లేదు. ఇది పారదర్శకతకు పాతరేయడమేనన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రధాన అభ్యంతరం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టిలన్నింటికీ బాండ్లు సేకరించే అవకాశమున్నా ఇది ప్రధానంగా అధికార పార్టిలకే బాగా ఉపయోగపడుతుందన్న వాదనలున్నాయి. ఎన్నికల బాండ్ల పథకం నిబంధనలు పౌరుల సమాచార హక్కు చట్టానికే విరుద్ధమని సుప్రీంకోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇవీ అభ్యంతరాలు ► బాండ్ల కొనుగోలుదారులతో సహా అన్ని వివరాలూ గోప్యంగా ఉంటాయి. ఇది పారదర్శకతకు గొడ్డలిపెట్టు. ► భారీగా విరాళాలిచ్చే కార్పొరేట్ సంస్థలు సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక దాని నుంచి భారీగా అనుచిత లబ్ధి పొందే ఆస్కారం చాలావరకు ఉంటుంది. ఇది క్విడ్ ప్రొ కోకు దారి తీస్తుంది. ► పైగా ఈ బాండ్లతో అధికార పార్టిలకే అధిక ప్రయోజనం. దేశవ్యాప్తంగా అత్యధిక బాండ్లు వాటికే అందుతుండటమే ఇందుకు నిదర్శనం. ► మొత్తం ప్రక్రియలో ఎవరి పేరూ బయటికి రాదు గనుక వ్యక్తులకు, సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అధికార పార్టిలు ఇలా బాండ్ల ముసుగులో లంచాలు స్వీకరించే ఆస్కారం కూడా పుష్కలంగా ఉంది. ► పైగా ఈ నిధులను ఎన్నికల కోసమే వాడాలన్న నిబంధనేమీ లేదు. దాంతో వాటిని పార్టిలు తమ ఇష్టానికి ఖర్చు చేసుకోవచ్చు. ► దేనిపై వెచి్చంచాయన్న వివరాలు కూడా ఎవరికీ చెప్పాల్సిన అవకాశం లేదు. ► ఈ పథకం నల్లధనాన్ని మార్చుకునే పరికరంగా కూడా మారింది. ► దీనికి తోడు బాండ్ల కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం అధికార పార్టిలకు ఉంటుంది. ► తద్వారా సదరు వ్యక్తులను, కంపెనీలను వేధించే ప్రమాదమూ ఉంది. అత్యధిక వాటా బీజేపీదే ఎన్నికల బాండ్ల పథకం ద్వారా 2018 మార్చి నుంచి 2024 జనవరి దాకా రూ.16,518.11 కోట్ల విలువైన 28,030 బాండ్లు జారీ అయ్యాయి. వీటిలో పార్టిలన్నింటికీ కలిపి రూ.12,000 కోట్లకు పైగా విరాళాలందాయి. ఎన్నికల సంఘం, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) గణాంకాల ప్రకారం ఇందులో ఏకంగా సగానికి పైగా, అంటే 55 శాతం బీజేపీ వాటాయే కావడం విశేషం. బాండ్ల ద్వారా ఆ పార్టికి రూ.6,566 కోట్లు సమకూరాయి. బీజేపీ మొత్తం ఆదాయంలో సగానికి పైగా బాండ్ల రూపేణా సమకూరినదే. బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టికి రూ.1,123 కోట్లు రాగా ఇతర పార్టిలన్నింటికీ కలిపి రూ.5,289 కోట్లు అందాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Pooranam: చదువుల తల్లీ నీకు వందనం
కొందరు సంపాదించింది దాచుకుంటారు. కొందరు కొద్దిగా పంచుతారు. మరికొందరు ప్రతిదీ సమాజహితం కోసం ధారబోస్తారు. పేద పిల్లల స్కూల్ కోసం 7 కోట్ల విలువైన భూమిని దానం చేసింది తమిళనాడుకు చెందిన పూరణం. గత నెలలో మొదటిసారి ఆ పని చేస్తే ఇప్పుడు మరో 3 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం చేసింది. సామాన్య క్లర్క్గా పని చేసే పూరణం ఎందరికో స్ఫూర్తి కావాలి. ప్రభుత్వం అన్నీ చేయాలని కోరుకోవడం సరికాదు. సమాజం తన వంతు బాధ్యత వహించాలి. ప్రజాప్రయోజన కార్యక్రమాలలో తన వంతు చేయూతనివ్వాలి. విమర్శించే వేయినోళ్ల కంటే సాయం చేసే రెండు చేతులు మిన్న అని నిరూపించింది తమిళనాడు మధురైకు చెందిన 52 సంవత్సరాల పూరణం అలియాస్ ఆయి అమ్మాళ్. ఆమె ఒక నెల వ్యవధిలో దాదాపు పది కోట్ల రూపాయల విలువైన భూమిని పేద పిల్లల చదువు కోసం దానం చేసింది. కెనెరా బ్యాంక్ క్లర్క్ మదురైలో కెనెరా బ్యాంక్లో క్లర్క్గా పని చేసే పూరణంలో పెళ్లయిన కొద్దిరోజులకే భర్తను కోల్పోయింది. మానవతా దృక్పథంతో అతని ఉద్యోగం ఆమెకు ఇచ్చారు. నెలల బిడ్డగా ఉన్న కుమార్తెను చూసుకుంటూ, కొత్తగా వచ్చిన ఉద్యోగం చేస్తూ జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె కొని పెట్టిన స్థలాలు ఖరీదైనవిగా మారాయి. హటాత్ సంఘటన పూరణం కుమార్తె జనని రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మరణించింది. జననికి సమాజ సేవ చాలా ఇష్టం. అంతేకాదు పేదపిల్లల చదువుకు కృషి చేసేది. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో కూతురు ఆశించిన విద్యావ్యాప్తికి తాను నడుం బిగించింది పూరణం. తన సొంతవూరు కొడిక్కులంలోని 1.52 ఎకరాల స్థలాన్ని ఆ ఊరి స్కూలును హైస్కూల్గా అప్గ్రేడ్ చేసి భవంతి కట్టేందుకు మొన్నటి జనవరి 5న దానం చేసింది. మదురై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు పట్టా అప్పజెప్పింది. దాంతో ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రశంసలు దక్కాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ మొన్నటి రిపబ్లిక్ డే రోజున ఆమెను సన్మానించాడు. అయితే రెండు రోజుల క్రితం పూరణం తనకున్న మరో 91 సెంట్ల భూమిని కూడా మరో స్కూల్ భవంతి నిర్మించేందుకు అప్పజెప్పింది. ఈ రెండు స్థలాల విలువ నేడు మార్కెట్లో పది కోట్లు ఉంటాయి. ‘బదులుగా నాకేమి వద్దు. ఆ స్కూల్ భవంతులకు నా కుమార్తె పేరు పెట్టండి చాలు’ అని కోరిందామె. ‘పల్లెటూరి పిల్లల చదువుల్లో వెలుగు రావాలంటే వారు బాగా చదువుకోవడమే మార్గం. పల్లెల్లో హైస్కూళ్లు చాలా అవసరం’ అందామె. -
10 రోజుల్లో రూ. 12 కోట్లు.. బాలరాముని ఆదాయం!
అయోధ్యలోని రామాలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రామభక్తులు బాలరామునికి విరాళాలు, కానుకలు విరివిగా అందజేస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ మాధ్యమాలలో భక్తులు నూతన రామాలయానికి విరాళాలు అందజేస్తున్నారు. జనవరి 23 నుంచి సామాన్య భక్తులను రామాలయ సందర్శనకు అనుమతించినది మొదలు భక్తులు బారులు తీరుతున్నారు. గడచిన పది రోజుల్లో బాలరామునికి దాదాపు రూ.12 కోట్ల మేరకు విరాళాలు అందాయి. జనవరి 22న రామ్లల్లాకు పట్టాభిషేకం జరిగిన రోజున వేడుకకు హాజరైన ఎనిమిది వేల మంది అతిథులు భారీగా విరాళాలు సమర్పించారు. జనవరి 22న ఒక్కరోజునే రామ్లల్లా రూ.3.17 కోట్ల విరాళాన్ని అందుకున్నాడు. ముఖ్యమంత్రి యోగితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఫిబ్రవరి 11న రామ్లల్లాను దర్శించుకోనున్నారు. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆరోజున శ్రీరాముని దర్శించుకోనున్నారు. మరోవైపు రామాలయంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాల జాబితాను సిద్ధం చేశారు. ఫిబ్రవరి 14న జరిగే వసంత పంచమి నూతన రామాలయంలో నిర్వహించే మొదటి ఉత్సవం కానుంది. ఆరోజు ఆలయంలో సరస్వతీ మాతను పూజించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. రామాలయంలో ఏడాది పొడవునా 12 ప్రధాన పండుగలు, ఉత్సవాలు జరగనున్నాయి. -
తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు!.. మూడో రోజు సజావుగా దర్శనాలు!
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన రెండవరోజున(బుధవారం) దాదాపు 2.5 లక్షల మంది భక్తులు దర్శనానికి తరలివచ్చారు. మంగళవారం(తొలిరోజు) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన ఆకస్మిక పర్యటన, సూచనల ప్రభావం బుధవారం కనిపించింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా యాత్రికుల సౌకర్య కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. బాలక్ రాముని దర్శనాలు ప్రారంభమై నేటికి (గురువారం) మూడో రోజు. మొదటి రెండు రోజులు భక్తుల రద్దీతో అనేక ఇబ్బుందులు తలెత్తాయి. ఈ నేపద్యంలో ట్రస్ట్ పలు చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం ఆలయంలో భక్తుల దర్శనాలు క్రమపద్ధతిలో సాగుతున్నాయి. రామభక్తుల దర్శనాలు నిరంతరం కొనసాగుతున్నాయి. బాలరాములోరికి భక్తులు కానుకలు, విరాళాలు విరివిగా సమర్పిస్తున్నారు. ఇది కూడా చదవండి: కొనసాగుతున్న భక్తుల వరద ప్రాణప్రతిష్ఠ జరిగినంతనే ఐదేళ్ల బాలరాముడు కోటీశ్వరునిగా మారిపోయాడు. తొలిరోజు శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు రూ.3.17 కోట్ల విరాళాలను సమర్పించారని ట్రస్ట్ తెలిపింది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం మంగళవారం ఆలయంలోకి సామాన్య భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. రామాలయానికి వచ్చిన సందర్శకుల సంఖ్యకు సంబంధించి గతంలో ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం వారు నానా అవస్థలు పడ్డారు. రాములోరి దర్శనం కోసం వచ్చిన భక్తులు విరాళాలు సమర్పించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ మంగళవారం ఆలయానికి అత్యధిక విరాళాలు అందాయి. ఆన్లైన్లో విరాళాలు అందించడానికి రామభక్తులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. విరాళాల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, పలువురు భక్తులు విరాళాలు అందించారన్నారు. కాగా అయోధ్యకు తరలివచ్చే భక్తులు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా విరాళాలు అందించవచ్చు. ఆలయంలోని హుండీలలో కూడా విరాళాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. -
‘అయోధ్య’ విరాళాల మొత్తం ఇప్పటివరకూ ఎంత? అధిక మొత్తం ఇచ్చిందెవరు?
అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణానికి విరాళాల రూపంలో ఇంతవరకూ ఎంత మొత్తం వచ్చిందనే ప్రశ్న చాలామంది మదిలో మెదిలే ఉంటుంది. అలాగే ఎవరు అత్యధిక మొత్తంలో విరాళం సమర్పించారనే దానిపై కూడా చాలామంది ఆలోచించే ఉంటారు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు మీడియా దగ్గరున్న సమాధానం తెలుసుకుందాం. అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణానికి దేశంలోని 11 కోట్ల మంది ప్రజల నుంచి రూ.900 కోట్లు సేకరించాలని రామమందిర్ ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 డిసెంబర్ ఆఖరువరకూ రామాలయ నిర్మాణానికి ఐదువేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం విరాళాల రూపంలో అందింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటివరకు 18 కోట్ల మంది రామభక్తులు నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలలో సుమారు 3,200 కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేశారు. ఈ బ్యాంకు ఖాతాలలో విరాళంగా వచ్చిన మొత్తాన్ని ట్రస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. దానిపై వచ్చిన వడ్డీతో ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెబ్సైట్లోని సమాచారం ప్రకారం ఆధ్యాత్మిక గురువు, కథకులు మొరారీ బాపు అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయానికి అత్యధిక విరాళం అందించారు. మొరారీ బాపు నూతన రామాలయ నిర్మాణానికి 11.3 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. దీనికితోడు యూఎస్ఏ, కెనడా,యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న అతని అనుచరులు సమిష్టిగా, విడివిడిగా ఎనిమిది కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్భాయ్ ధోలాకియా రామ మందిర నిర్మాణానికి 11 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అయోధ్యలోని రామాలయానికి తొలి విదేశీ విరాళం అమెరికా నుంచి వచ్చింది. అమెరికాలో ఉన్న రామభక్తుడు (పేరు వెల్లడించలేదు) ఆలయ ట్రస్టుకు విరాళంగా రూ.11,000 పంపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించే ప్రచారాన్నిఅప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2021, జనవరి 14న ప్రారంభించారు. రామ మందిరానికి విరాళం ఇచ్చిన మొదటి వ్యక్తి రామ్నాథ్ కోవింద్. ఆయన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు చెక్కు రూపంలో రూ. 5 లక్షలు విరాళంగా అందించారు. ఇది కూడా చదవండి: నేటి నుంచి రామోత్సవాలు.. 35 వేల కళాకారుల ప్రదర్శనలు! -
దానం ధర్మం
దానధర్మాలు ద్వంద్వ సమాసం. జంటగా కనపడతాయి. రెండూ ఒకటే అనుకుంటారు. ధర్మంలో దానం కూడా భాగం. దానం అంటే తన కున్నదానిని ఇతరులకు ఇవ్వటం. ‘ద’ అంటే ఇవ్వటం. ఆ ప్రక్రియ దానం. దానం, ధర్మం అనే రెండింటిని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అడుక్కునేవాడు ‘‘అయ్యా! ధర్మం చేయండి.’’ అంటాడు. తనకున్న దానిని లేనివాడికి పంచటం ధర్మాచరణలో భాగం అని అర్థం చేసుకోవాలి. ‘‘నీ కిదేమైనా ధర్మంగా ఉందా?’’ అని అడిగి నప్పుడు ధర్మం అంటే న్యాయం అని అర్థం చేసుకోవాలి. రసాయన శాస్త్రంలో ఉదజని ధర్మాలు అని అంటే దాని సహజగుణాలు అని అర్థం. ‘‘సూర్యుడు తూర్పున ఉదయించును’’ అన్నది ఏ కాలం అని వ్యాకరణంలో అడిగినప్పుడు తద్ధర్మ కాలం అని సమాధానం వస్తుంది. ఇక్కడ కర్తవ్యం, విధి, తప్పక చేయవలసినది అనే అర్థం. తన దగ్గర ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం ధర్మంలో భాగం కనుక దానానికి పర్యాయ పదంగా ధర్మం అని అనటం జరుగుతోంది. దానం ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలో పెద్దలు మనకి చెప్పారు. ‘‘శ్రియా దేయం హ్రియా దేయం, సంవిదా దేయం’’ అని. తనదగ్గర ఉన్న సంపదకి తగినట్టుగా ఇవ్వాలట. ఒక కోటీశ్వరుడు ఒక రూపాయి దానం చేస్తే ఎంత సిగ్గుచేటు? వంద సంపాదించే రోజుకూలీ రూపాయి ఇస్తే పరవాలేదు కాని యాభై ఇస్తే తన తాహతుకి మించింది. తరవాత కష్టపడతాడు. సిగ్గుపడుతూ ఇవ్వాలట. ఇంతకన్న ఇవ్వలేక పోతున్నాను అని. తానే సిగ్గు పడుతూ ఉంటే తీసుకున్నవారు ఇంకెంత సిగ్గుపడాలో! తెలిసి ఇవ్వాలట. ‘‘గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం’’ అన్నట్టు కాకుండా మన చేతిలో నుండి జారిపోయింది దానం అనుకో కూడదు. ఇస్తున్నాను అని ఎరిగి ఇవ్వాలట. ఎవరికి ఇచ్చేది కూడా తెలిసి ఉండాలి. అంతా అయినాక వీళ్ళకా నేను ఇచ్చింది అని, ఇంత ఎందుకు ఇచ్చాను అని బాధపడకూడదు. దానాలు చాలా కారణాలుగా, చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. గ్రహదోషాలు ఉన్నాయి అంటే జపాలు తాము చేయలేరు కనుక ఎవరి చేతనైనా చేయిస్తారు. ఆ గ్రహానికి సంబంధించి కొన్ని వస్తువులు, ధనం దానం చేస్తారు. ఇది ప్రతిఫలాపేక్షతో చేసేది. ఒక రకమైన వ్యాపారం అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కొంతమంది ఆడంబరం కోసం దానాలు చేస్తూ ఉంటారు. తాము చేసిన దానిని ప్రకటించటం, ప్రచారం చేసుకోవటం, ఫోటోలు తీయించుకుని వార్తాపత్రికలలో వేయించుకుంటూ ఉండటం చూస్తాం. తీసుకున్న వారిని చులకనగా చూస్తూ తమకు కృతజ్ఞులై ఉండాలని ఆశించటం కనపడుతుంది. కొద్దిమంది ఎదుటి వారి అవసరం ఎరిగి అడగకుండానే దానం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. పైగా ఎవరికీ చెప్పనీయరు. కుడిచేత్తో చేసినది ఎడమ చేతికి తెలియ కూడదట. ఎందుకు దానం చేశావు అంటే నా దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర లేదు... అంటారు. తీసుకున్నవారు సంతోషించినప్పుడు ఆ భావతరంగాలు ఇచ్చిన వారిని స్పృశిస్తాయి. వీరిని ఆవరించి ఉన్న ప్రతికూల తరంగాలు తప్పుకుంటాయి. ఇవ్వటానికి మా దగ్గర ఏముంది? అని సన్నాయి నొక్కులు నొక్కుతారు కొందరు. తథాస్తు దేవతలుంటారు. తస్మాత్ జాగ్రత్త! ఏమీ లేక పోవుట ఏమి? ధనం మాత్రమేనా ఇవ్వదగినది? జ్ఞానం, శరీరం, ఆలోచన, మాట .. ఇట్లా ఎన్నో! తన జ్ఞానాన్ని పంచవచ్చు. జ్ఞానం లేకపోతే శరీరంతో సేవ చేసి సహాయ పడవచ్చు. అదీ చేత కాకపోతే మాట సహాయం చేసి సేద తీర్చవచ్చు. ఇది ధర్మమే కదా! ఈ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. భారతీయ సంస్కృతిలో ధర్మానికి పెద్ద పీట వేశారు. ధర్మమే మనలను ఎల్లప్పుడు కాపాడుతుంది. మనం చాలా శతాబ్దాలు విదేశీయుల పాలనలో మగ్గిపోయాము. కాని ముష్కరులు మన ధర్మం మీద దెబ్బతీయలేక పోయారు. ధర్మగ్లాని దశలో మనం ఉన్నప్పుడు సాధుసంతులు, మహాత్ములు ఉక్కుగోడలా నిల్చొని ధర్మాన్ని కాపాడారు. అదే సమయంలో కొన్ని దేశాలు, సంస్కృతులు విదేశీయుల ఆక్రమణల కారణంగా నామరూపాలు లేకుండా పోయాయి. మనకు ఇతరులు ఏమి చేయకూడదనుకుంటామో అది ఇతరులకు మనం చేయకపోవడం సర్వోత్తమ ధర్మం. మన ప్రాచీన ద్రష్టలైన మునులు లోక కళ్యాణం కొరకు నిర్వచించిన ధర్మం, దాని ఆచరణ మనకు వారసత్వంగా ఒక తరం నుంచి ముందు తరానికి వస్తూ మన తరం వరకు వచ్చింది. అంటే ధర్మచక్రం ఏ తరంలోనూ ఆగిపోలేదు. ఈ తరంలో ఆగిపోతే తరువాత తరం వారు ధర్మ భ్రష్టులవుతారు. ధర్మచక్రం ఆగిపోతే ఈ జాతి మనుగడ ఉండదు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
రూ.7250 కోట్లు విరాళం ప్రకటించిన వారెన్ బఫెట్ - ఎవరికో తెలుసా?
ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరైన 'వారెన్ బఫెట్' (Warren Buffett) గతంలోనే తన సంపదలో 99 శాతాన్ని ఛారిటీకి అందిస్తానని వెల్లడించారు. అన్నమాట ప్రకారమే చేస్తున్న బఫెట్ తాజాగా స్వచ్ఛంద సంస్థలకు 876 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్షైర్ హాత్వే షేర్లను అందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వారెన్ బఫెట్ బిలియనీర్ అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతూ తమ పిల్లలు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలకు వేలకోట్లు విరాళాలు అందిస్తుంటాడు. ఇందులో భాగంగానే గత మంగళవారం 876 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7250 కోట్లు) షేర్లను గిఫ్ట్గా ప్రకటించారు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. వారెన్ బఫెట్ భార్య పేరు మీద ఉన్న 'సుసాన్ థాంప్సన్ బఫ్ఫెట్ ఫౌండేషన్'కు 1.5 మిలియన్ క్లాస్ B షేర్లను ప్రకటించారు. తమ పిల్లలు నిర్వహిస్తున్న మూడు ఫౌండేషన్లకు (షేర్వుడ్ ఫౌండేషన్, హోవార్డ్ జి. బఫ్ఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్) ఒక్కొక్క దానికి 3,00,000 బెర్క్షైర్ హాత్వే షేర్లను విరాళంగా ఇచ్చేసారు. గత ఏడాది కూడా భారీ షేర్లను విరాళంగా అందించారు. -
విరాళాల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విరాళాలు అందుకునేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం చట్టబద్ధతను సవాల్చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై వాదనలు గురువారం ముగిశాయి. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్లో ఉంచింది. ‘ ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాల సమగ్ర డేటాను సీల్డ్ కవర్లో మాకు రెండు వారాల్లోగా అందజేయండి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ధర్మాసనం ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. బాండ్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సీపీఐ(ఎం) నేత, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)లు విడివిడిగా పిటిషన్ల వేయడం తెల్సిందే. బాండ్లను విక్రయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విరాళాల దాతల వివరాలు అడగబోము. కానీ ఎన్ని బాండ్లు విక్రయించారు, ఎంత మొత్తం పార్టీల ఖాతాల్లో జమ అయిందనే వివరాలు ఇవ్వండి’ అని ఈసీకి కోర్టు సూచించింది. ‘పరస్పర సహకార’ ధోరణికి ఈ బాండ్ పనిముట్టుగా మారొద్దు: అధికార పార్టీ నుంచి ప్రయోజనం పొందే వారు.. అధికార పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారీగా విరాళాల ద్వారా లబ్ది చేకూర్చడం, ఆతర్వాత అధికార పార్టీ నుంచి వారు అదే స్థాయిలో లబ్ధిపొందటం వంటి ధోరణి ఉండొద్దు. లబ్దిదారులు, అధికారి పార్టీ మధ్య నీకిది నాకది(క్విడ్ ప్రో కో) తరహా విధానానికి ఎలక్టోరల్ బాండ్ అనేది పనిముట్టుగా మారకూడదు’ అని వాదోపవాదనల సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ దాత వివరాలు గ్రహీత పార్టీకి తెలుసు. తాను ఎవరికి విరాళమిచ్చేది ఇంకో పార్టీకి తెలియకూడదని దాత కోరుకుంటున్నాడు. విరాళాల బదిలీ వ్యవహారం దాతకు, ఆ రాజకీయ పార్టీకి ముందే తెలిసినప్పుడు ఈ వివరాలు సాధారణ పౌరుడికి మాత్రం తెలియాల్సిన పని లేదని కేంద్రం వాదించడంలో ఆంతర్యమేంటి?’ అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. -
దాతృత్వంలో శివ్ నాడార్ టాప్
ముంబై: విరాళాలివ్వడంలో ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ్ నాడార్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. 2023లో ఏకంగా రూ. 2,042 కోట్లు విరాళమిచ్చి ఎడెల్గివ్ హురున్ ఇండియా 2023 జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. గతేడాది ఇచి్చన రూ. 1,161 కోట్లతో పోలిస్తే ఇది 76 శాతం అధికం. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ రూ. 1,774 కోట్లతో (గతేడాదితో పోలిస్తే 267 శాతం అధికం) రెండో స్థానంలోనూ, రూ. 376 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ మూడో స్థానంలో ఉన్నారు. అంబానీ విరాళాలు గతేడాదితో పోలిస్తే 8 శాతం తగ్గాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార మంగళం బిర్లా రూ. 287 కోట్లతో నాలుగో స్థానంలో, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ. 285 కోట్లతో (50 శాతం అధికం) ఈ జాబితాలో అయిదో స్థానంలో ఉన్నారు. ఇటీవలి హురున్ కుబేరుల జాబితా ప్రకారం అంబానీ సంపద రూ. 8.08 లక్షల కోట్లుగాను, అదానీది రూ. 4.74 లక్షల కోట్లు, నాడార్ సంపద రూ. 2.28 లక్షల కోట్లుగాను ఉంది. సంపద పెరిగే కొద్దీ సంపన్న కుటుంబాలు .. అట్టడుగు వర్గాల వారి కోసం ఆహారం, దుస్తులు, ఉపకార వేతనాలు మొదలైన దాతృత్వ కార్యకలాపాలకు విరాళాలిచ్చే ధోరణి పెరుగుతోందని హురున్ ఇండియా చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. లిస్టులో మొత్తం 119 మంది వ్యక్తులు, కుటుంబాలు ఉన్నాయి. మరిన్ని వివరాలు.. ► బజాజ్ కుటుంబంతో పాటు సైరస్ ఎస్ పూనావాలా, అదార్ పూనావాలా, రోహిణి నీలెకని వంటి వారు టాప్ 10లో నిల్చారు. మహిళల్లో నీలెకనితో పాటు అను ఆగా (థర్మాక్స్), లీనా గాంధీ తివారీ (యూఎస్వీ) కూడా ఉన్నారు. ► డిస్కౌంటు బ్రోకరేజీ జిరోధా సహ–వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ జాబితాలో అత్యంత పిన్న వయసు్కడు. కామత్ సోదరులు రూ. 110 కోట్లు విరాళమిచ్చారు. ► రూ. 150 కోట్ల విరాళంతో ఎల్అండ్టీ గౌరవ చైర్మన్ ఏఎం నాయక్ .. ప్రొఫెషనల్స్ జాబితాలో అగ్రస్థానంలో, ఓవరాల్ లిస్టులో 11వ స్థానంలో ఉన్నారు. -
ఆపదలో చేయూత.. క్రౌడ్ ఫండింగ్
శాంతి, ఏకాంబరం దంపతులు (పేరు మార్చాం) తొలి కాన్పులో పుత్రుడు అని తెలియగానే పొంగిపోయారు. బాబును చూస్తూ భవిష్యత్తుపై ఎన్నో కలలుగన్నారు. చిన్నారి మూడేళ్ల వయసుకొచ్చేసరికి కదల్లేని స్థితి ఏర్పడింది. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ చిన్నారుల ఆస్పత్రిలో చూపించారు. స్పైనల్ మసు్క్యలర్ అట్రోఫీ(ఎస్ఎంఏ)తో బాధపడుతున్నట్టు తేలింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే విదేశాల నుంచి ‘జోల్జెన్స్మా’ అనే ఇంజెక్షన్ను తీసుకొచ్చి ఇవ్వాలి. ఇందుకు సుమారు రూ.16 కోట్లు అవుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ సమయంలో బాబు తల్లిదండ్రులకు ‘ఇంపాక్ట్ గురూ’ ప్లాట్ఫామ్ సంజీవనిగా కనిపించింది. చిన్నారి ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ విరాళాలకు (ఫండ్ రైజింగ్) పిలుపునిచ్చారు. మూడున్నర నెలల్లో 65,000 మంది దాతల ఉదారంతో ఊహించనిది సాధ్యమైంది. విదేశాల నుంచి సదరు ఇంజెక్షన్ను తీసుకొచ్చి ఇవ్వడంతో బాబు కోలుకున్నాడు. వేణు నెట్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో ఓ బాలిక లివర్ సమస్యతో బాధపడుతుందన్న ‘కెట్టో’ ప్రకటన కనిపించింది. అది క్లిక్ చేయగా, ఆ సమస్య నుంచి బయటపడేందుకు రూ.30 లక్షలు అవుతుందని, దాతలు దయతలిస్తేనే తన కుమార్తె బయటపడుతుందంటూ చిన్నారి తల్లి ఆవేదనతో చెబుతున్న మాటలకు వేణు చలించిపోయాడు. కానీ, కాలేయ చికిత్సకు భారీ మొత్తాన్ని పేర్కొనడంపై అతడిలో అనుమానం కలిగింది. సదరు ప్రకటన నిజమేనా..? అంత ఖర్చు అవుతుందా..? ప్రభుత్వాలు ఎందుకు సాయం చేయవు? ఆస్పత్రులు అయినా బాధితుల విషయంలో కొంత లాభాపేక్ష తగ్గించుకుని చికిత్సలకు ముందుకు రావచ్చుగా..? ఇలాంటి ప్రశ్నలు మెదిలాయి. చివరికి తన సందేహాలన్నీ పక్కన పెట్టేసి రూ.500 అప్పటికప్పుడు డొనేట్ చేశాడు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచి్చనా, తమ వల్ల ఏమవుతుంది? అంటూ కుదేలు అయిపోవాల్సిన పని లేదని శాంతి దంపతుల కథనం ధైర్యాన్నిస్తోంది. ఆరోగ్య పరంగా ఎంత కష్టం వచి్చనా, దాతల నుంచి విరాళాలు తెచ్చి పెట్టేందుకు నేడు ఎన్నో వేదికలు పనిచేస్తున్నాయి. వేలాది మంది బాధితుల కుటుంబాల్లో సంతోషానికి దారి చూపిస్తున్నాయి. అదే సమయంలో ఇలాంటి బాధితులకు సాయం చేశామనే సంతృప్తి దాతలకు లభిస్తోంది. కాకపోతే విరాళం ఇచ్చే ముందు కాస్తంత విచారించి, కథనం నిజమైనదేనని నిర్ధారించుకోవడం ద్వారా తమ దానం నిష్ఫలం కాకుండా చూసుకోవచ్చు. మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. వీటి సాయం పొందడమే కాకుండా, వీటి ద్వారా నలుగురికీ తోచినంత సాయం చేయడానికి అవకాశం లభిస్తుంది. మనోళ్లకు దాన గుణం ఎక్కువే.. 2021 వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ప్రకారం దానంలో భారత్ 14వ స్థానంలో ఉంది. అపరిచితులకు మన దేశంలో 61 శాతం మంది సాయం చేస్తున్నారు. కాకపోతే విశ్వసనీయత విషయంలో ఉండే సందేహాలు ఈ దాతృత్వాన్ని మరింత విస్తరించకుండా అడ్డుకుంటున్నాయని చెప్పుకో వచ్చు. బాధితులకు, దాతలకు మధ్య వేదికగా నిలిచే విశ్వసనీయ సంస్థలు వస్తున్న కొద్దీ, క్రౌడ్ ఫండింగ్ మరింత పరిడవిల్లుతూనే ఉంటుంది. మరింత మంది బాధితులకు చేయూత లభిస్తుంది. నిధుల సమీకరణ ఇలా..? ► చికిత్సలకు దాతల సాయం అవసరమైన వారు క్రౌండ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లను (ఇంపాక్ట్గురూ, మిలాప్, కెట్టో మొదలైనవి) సంప్రదించాలి. ► పాన్, ఆధార్, మెడికల్ డాక్యుమెంట్లు సమర్పించాలి. ► వీటిని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ధ్రువీకరించుకుంటుంది. తగిన విచారణ అనంతరం బాధితుల కథనం నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత వారి తరఫున నిధుల సమీకరణ పేజీని అవి సిద్ధం చేస్తాయి. ► ఇక ఇక్కడి నుంచి నిధుల సమీకరణ మొదలవుతుంది. సాయం అవసరమైన వారు ఈ పేజీ లింక్ను తమ నెట్వర్క్లో షేర్ చేసుకోవాలి. తమ వంతు ప్రచారం కలి్పంచుకోవాలి. అలాగే, ప్లాట్ఫామ్లు సైతం ప్రచారానికి తమ వంతు సాయం అందిస్తాయి. ► సమీకరించే విరాళంలో ఎక్కువ మొత్తాన్ని కమీషన్ రూపంలో మినహాయించుకునేందుకు సమ్మతి తెలియజేస్తే, వారి తరఫున క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు సైతం విస్తృత ప్రచారాన్ని చేపడతాయి. ► బాధితులు ఎదుర్కొంటున్న సమస్య, వైద్యులు చెబుతున్న వెర్షన్, చికిత్సకు ఎంత ఖర్చవుతుంది? తదితర వివరాలన్నీ ఈ పేజీలో ఉంటాయి. దాతలు విరాళం చెల్లించేందుకు పేమెంట్ లింక్లు కూడా అక్కడ కనిపిస్తాయి. ► కనీసం 300–350 అంతకంటే ఎక్కువ విరాళాలనే అనుమతిస్తున్నాయి. ► దాతలు చేసే చెల్లింపులన్నీ కూడా ప్రత్యేక ఖాతాలో జమ అవుతాయి. ► కావాల్సిన మొత్తం వచి్చనా.. లేదంటే గడువు ముగిసినా లేదంటే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి అకాలంగా మరణించినా నిధుల సమీకరణ ముగిసిపోతుంది. ► అనంతరం ఈ మొత్తం నుంచి కమీషన్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని హాస్పిటల్/బాధితులకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు చెల్లిస్తాయి. ఇలా చేసే ముందు హాస్పిటల్ బిల్లులను చెక్ చేస్తాయి. ► విరాళం ఇచి్చన వారికి ఎప్పటికప్పుడు మెయిల్ ద్వారా బాధితుల తాజా ఆరోగ్య పరిస్థితిపై వివరాలను ఇవి అప్డేట్ చేస్తుంటాయి. విశ్వసించడం ఎలా..? సాయం అవసరమైన వారికి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు మార్గాన్ని చూపిస్తున్నాయి. మరి విరాళం ఇచ్చే వారు ఈ కథనాలను విశ్వసించేది ఎలా..? ఈ సందేహం చాలా మందికి వస్తుంది. మన దేశంలో విరాళాలకు సంబంధించి భౌతిక వేదికలే ఎక్కువ. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల సేవలు ఇటీవలి కాలంలోనే వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ విస్తరణ ఇందుకు వీలు కలి్పంచిందని చెప్పుకోవాలి. ఆన్లైన్ ప్రపంచంలో అన్నింటినీ నమ్మలేం. సైబర్ మోసాలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో, అన్నీ విచారించుకున్న తర్వాతే విరాళం ఇవ్వడం సురక్షితంగా ఉంటుంది. కోటక్ ఆల్టర్నేటివ్ అస్సెట్ మేనేజర్స్ సీఈవో (ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ) లక్ష్మీ అయ్యర్ దీనిపై తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నాకు రిఫరల్ ద్వారా వచ్చే వాటికే నేను దానం చేస్తాను. ఈ విషయంలో నా మార్గం చాలా స్పష్టం. సులభంగా డబ్బులు సంపాదించే మోసగాళ్లకు కొదవ లేదు’’అన్నది లక్ష్మీ అయ్యర్ అభిప్రాయంగా ఉంది. సన్సేరా ఇంజనీరింగ్ జాయింట్ ఎండీ ఎఫ్ఆర్ సింఘ్వి ఈ విషయంలో సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘చాలా వరకు విరాళాలు కోరుతున్న ఆన్లైన్ కేసులు వైద్య పరమైనవే ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి పేర్కొనే చికిత్సల వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. నాకు ఒక ఆస్పత్రితో అనుబంధం ఉంది. కనుక చికిత్సల వ్యయాల గురించి తెలుసుకోగలను’’అని పేర్కొన్నారు. ఇలాంటిదే ఒక విరాళం కేసులో చికిత్సకు రూ.18–24 లక్షలు ఖర్చువుతుందన్న కొటేషన్ కనిపించగా, దీనిపై విచారించగా, తెలిసిన హాస్పిటల్లో రూ.5–6 లక్షలకే చేస్తున్నట్టు విని ఆశ్చర్యపోయినట్టు సింఘ్వి తెలిపారు. నిజానికి కొన్ని కేసుల్లో భారీ అంచనాలు పేర్కొంటున్న ఉదంతాలు లేకపోలేదు. హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న బాధితుల తరఫున నిధుల సమీకరణ కార్యక్రమాలు నడిపించే కొందరు మోసగాళ్ల ఉదంతాలు సైతం లోగడ వెలుగు చూశాయి. అలా అని కష్టాల్లో ఉన్న బాధితులకు విరాళాలు ఆగకూడదు కదా..? ముందస్తు పరిశీలన క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు చికిత్సల వ్యయాలను ముందుగానే నిర్ధారించుకుంటామని చెబుతున్నాయి. హాస్పిటల్ వ్యయ అంచనాలను, చారిత్రక గణాంకాలు, బీమా థర్డ్ పార్టీ అగ్రిగేటర్ సంస్థల డేటా ఆధారంగా పోల్చి చూస్తామని ఇంపాక్ట్గురూ సీఈవో జైన్ తెలిపారు. తమ ప్యానల్ డాక్టర్లతోనూ దీనిపై నిర్ధారించుకుంటామని చెప్పారు. నిధుల సమీకరణ నిజమైన కారణాలతో చేసినప్పటికీ, తర్వాత ఆ నిధులు దురి్వనియోగం కాకుండా ఉండేందుకు కూడా ఇవి చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘ఇంపాక్ట్ గురూ వేదికగా సమీకరించే నిధుల్లో 80 శాతానికి పైగా నేరుగా హాస్పిటల్స్కు బదిలీ చేస్తున్నాం. ఈ హాస్పిటల్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ జాబితాలోనివే’’అని జైన్ తెలిపారు. తమ ప్లాట్ఫామ్పై లిస్ట్ చేసే వైద్య పరమైన కేసుల్లో విరాళాలను హాస్పిటల్ బ్యాంక్ ఖాతా ద్వారానే తీసుకోగలరని కెట్టో అంటోంది. ► బాధితుల కేవైసీ పత్రాలను ముందుగా ఇవి నిర్ధారించుకుంటాయి. ► వైద్య పరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకుని వాటిని తనిఖీ చేస్తాయి. ► తమ ప్యానెల్ వైద్యులతో మాట్లాడి నిర్ధారణకు వస్తాయి. ► అవసరమైతే క్షేత్రస్థాయిలో హాస్పిటల్కు తమ ఉద్యోగిని పంపించి వాస్తవమా, కాదా అన్నది నిర్ధారించుకుంటాయి. ప్రచార మార్గం.. ఇంపాక్ట్ గురూ, కెట్టో, మిలాప్ ఇవన్నీ ప్రముఖ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు. ఆన్లైన్ ప్రకటనలు, సామాజిక మాధ్యమాల ద్వారా బాధితుల తరఫున విరాళాల సమీకరణకు ఇవి ప్రచారం కలి్పస్తుంటాయి ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే సమయంలో వైద్య చికిత్సల కోసం సాయం కోరుతూ ఈ సంస్థలకు సంబంధించి ప్రకటనలు కనిపిస్తుంటాయి. వీటిని క్లిక్ చేసి చూశారంటే, తర్వాత కూడా అలాంటి ప్రకటనలే మళ్లీ మళ్లీ కనిపిస్తుంటాయి. ప్రకటనల్లో బాధితుల కథనానికి ఆధారంగా వైద్యులు జారీ చేసిన లెటర్, టెస్ట్ రిపోర్ట్లను ఉంచుతున్నాయి. సామాజిక మాధ్యమాలతోపాటు, బాధితులు సైతం తమకు తెలిసిన వారికి ఈ లింక్లు పంపి సాయం కోరవచ్చు. ఒక్కసారి కావాల్సిన నిధులు లభించగానే, ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంస్థలు విరాళం ఇచి్చన వ్యక్తులను నెలవారీ స్కీమ్లతో ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి నెలా తోచినంత దానం ఇచ్చే విధంగా స్కీమ్లు తీసుకొచ్చాయి. విరాళాలకు సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు కల్పిస్తున్నాయి. బాధితుల అనుభవాలు.. లాహిరి సోదరికి బ్రెయిన్ టీబీ నిర్ధారణ కావడంతో 2019 డిసెంబర్లో నిధుల సమీకరణ కోసం మిలాప్ సంస్థను సంప్రదించారు. మిలాప్ ఆమె అభ్యర్థనకు చక్కగా స్పందించింది. ఫొటోగ్రాఫ్లు, డాక్యుమెంట్లు అడిగారు. అవన్నీ ఇవ్వడంతో, వాటి ఆధారంగా ఒక ప్రచార ప్రకటనను మిలాప్ రూపొందించింది. తెలిసిన వారి సాయంతో దీనికి మంచి ప్రచారం కలి్పంచుకోవాలని మిలాప్ సూచించింది. తాము ఆ ప్రచారాన్ని చేపట్టబోమని, బాధితులే సొంతంగా నిర్వహించడం వల్ల మరింత విశ్వసనీయత ఉంటుందనే సూచన వచ్చింది. దీంతో లాహిరి తనకు తెలిసిన వారికి షేర్ చేశారు. అలా రూ.45,000 విరాళాలు వచ్చాయి. ఇందులో మిలాప్ తన కమీషన్గా రూ.5,000 మినహాయించుకుని, రూ.40,000ను లాహిరి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చెల్లించింది. కానీ, మిలాప్ ద్వారా చేసిన ప్రచారం లాహిరి బంధు మిత్రులకు తెలిసిపోవడంతో, వారి నుంచి ఆమెకు మరో రూ.12 లక్షలు విరాళాల రూపంలో నేరుగా వచ్చాయి. మిలాప్ రూపొందించిన ప్రచారమే లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని లాహిరి అనుభవం చెబుతోంది. దురదృష్టవశాత్తూ లాహిరి సోదరి బ్రెయిన్ టీబీతో 2020 ఫిబ్రవరిలో మరణించారు. విజయం ఎంత? మీరా అనే వ్యక్తి సైతం, తన భర్త సర్జరీ కోసం కెట్టో ద్వారా నిధుల సమీకరణ చేయగా, మంచి ఆదరణే లభించింది. కెట్టో రిప్రజెంటేటివ్ ఎప్పటికప్పుడు ఆమెతో సంపద్రింపులు చేస్తూ సహకారం అందించడంతో, సర్జరీకి కావాల్సిన మొత్తం 48 గంటల్లోనే సమకూరింది. దేశ, విదేశాల్లోని స్నేహితులు, కుటుంబ సభ్యులు విరాళం ఇచ్చేందుకు సముఖంగా ఉన్నారని తెలిసినా, అందుకు వీలుగా కెట్టో ప్లాట్ఫామ్ సాయాన్ని ఆమె తీసుకున్నారు. ఎక్కడ ఉన్నా కెట్టో ద్వారా విరాళం పంపడం సులభమని భావించి అలా చేసినట్టు చెప్పారు. అయితే, అందరికీ ఇదే తరహా అనుభవం లభిస్తుందా..? ప్రతి ఫండ్ రైజింగ్ విజయవంతం అవుతుందా? అంటే నూరు శాతం అవును అని చెప్పలేం. ఇదంతా తమకున్న పరిచయాలు, ఎంపిక చేసుకున్న ప్లాట్ఫామ్, రూపొందించిన ప్రకటన, ప్లాట్ఫామ్ నుంచి ప్రచారం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ‘‘కొన్నేళ్ల క్రితం మేము సాయం కోసం ఇంపాక్ట్ గురూ ప్లాట్ఫామ్ను సంప్రదించాం. ఇంపాక్ట్ గురూ దాతల నెట్వర్క్ సాయంతో నిధులు సమకూర్చుతారని అనుకున్నాం. కానీ, ఇంపాక్ట్ గురూ అలా చేయలేదు. ప్రచార కార్యక్రమం పేజీని రూపొందించి, ఆ లింక్ను తమ పరిచయస్తులతో పంచుకోవాలని సూచించింది’’అని ఓ వ్యక్తి అనుభవం చెబుతోంది. తమ ప్లాట్ఫామ్పై వేలాది ప్రచార కార్యక్రమాలు నమోదవుతున్నందున.. ప్రతీ ఒక్క ప్రచారాన్ని తామే సొంతంగా చేపట్టడం సాధ్యం కాదని ఇంపాక్ట్ గురూ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీయూష్ జైన్ స్పష్టం చేశారు. దాతల కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వస్తుందనుకుంటే, తాము తప్పకుండా ప్రమోట్ చేస్తుంటామని చెప్పారు. కొంచెం కమీషన్.. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ లు మొత్తం విరాళం నుంచి నిరీ్ణత మొత్తాన్ని కమీషన్/చార్జీ కింద మినహాయించుకుంటున్నాయి. ఇది ఒక్కో సంస్థలో ఒక్కో విధంగా ఉంటుంది. ‘‘అంతర్జాతీయంగా చూస్తే ప్రతీ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ఎంతో కొంత స్వల్ప ఫీజును వసూలు చేస్తున్నాయి. తమ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగేందుకే ఇలా చేస్తున్నాయి. టెక్నాలజీ సదుపాయాలు, సిబ్బంది, నిధుల సమీకరణ, ముందస్తు విచారణలకు సంబంధించి వ్యయాలు అవుతాయి. మేము నిలదొక్కుకున్నప్పుడే మా లక్ష్యాన్ని (ఫండ్ రైజింగ్) సాధించగలం’’ అని పీయూష్ జైన్ తెలిపారు. ఈ ప్లాట్ఫామ్లలో కొన్ని ప్రీమియం సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంపాక్ట్ గురూ అయితే 0 శాతం, 5 శాతం, 8 శాతం ఇలా మూడ్ స్కీమ్ల కింద ఈ సేవలను ఆఫర్ చేస్తోంది. మోసాలుంటాయ్.. జాగ్రత్త అవగాహన, జాగ్రత్తలు లేకపోతే ఆన్లైన్ మోసాల బారిన పడే రిస్క్ ఉంటుంది. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా విరాళాలు కోరినా లేక విరాళం ఇచ్చినా సరే.. ఆ తర్వాత ఫోన్ కాల్ లేదా వాట్సాప్ మెస్సేజ్ లేదా మెయిల్ రావచ్చు. కష్టంలో ఉన్న బాధితులకు సంబంధించి అందులో సాయం కోరొచ్చు. లేదంటే అప్పటికే విరాళం ఇచ్చిన కేసుకు సంబంధించి అప్డేట్ అంటూ మోసగాళ్లు మెయిల్ పంపించొచ్చు. ఒక్కసారి విరాళం ఇస్తే, ఆ తర్వాత నుంచి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు ఇతర బాధితులకు సంబంధించిన వివరాలను మెయిల్స్, వాట్సాప్ మెస్సేజ్లు, కాల్స్ రూపంలో మార్కెటింగ్ చేస్తుంటాయి. ఇదంతా ఇబ్బందికరంగా అనిపించొచ్చు. చాలా మంది సాయం చేయాలని భావిస్తుంటారని, బాధితుల వివరాలను వారు మెయిల్ లేదా వాట్సాప్ సందేశాలు, కాల్స్ రూపంలో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని జైన్ తెలిపారు. ఇవి వద్దనుకునే వారు అన్సబ్స్క్రయిబ్ చేసుకోవాలని సూచించారు. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు అన్నీ కూడా సురక్షిత చెల్లింపుల సాధనాలనే వినియోగిస్తున్నాయి. కానీ, వీటి పేరుతో సైబర్ నేరస్థులు ఆకర్షించే కథనాలు, మోసపూరిత పేమెంట్ లింక్లు పంపించి, బ్యాంక్ ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని ఊడ్చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే విరాళం ఇచ్చే ముందు సంబంధిత సంస్థల యూఆర్ఎల్ను జాగ్రత్తగా గమనించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
అందుకే నా ట్రస్ట్కి విరాళాలు వద్దని చెప్పా: లారెన్స్
సామాజిక సేవ కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటాడు రాఘవా లారెన్స్. ‘రాఘవా లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు, దివ్యాంగులకు సేవలు అందిస్తున్నారు. డ్యాన్సర్గా ఉన్నప్పుడు దివ్యాంగులకు డ్యాన్స్ నేర్పించాడు. కొంతమంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించడ, కరోనా సమయంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయటం.. ఇలా క్రమంగా ఆయన తన సేవా కార్యక్రమాలను పెంచుకుంటూ వెళుతున్నారు. అయితే లారెన్స్ చేసే మంచి పనులు చూసి కొంతమంది అతని ట్రస్ట్కు డబ్బులు పంపిస్తున్నారు. కానీ ఇది లారెన్స్కి నచ్చడం లేదు. తన ట్రస్ట్కు ఎవరూ డబ్బులు పంపొద్దని, తానే చూసుకుంటానని ట్వీట్ చేశాడు. లారెన్స్ నిర్ణయాన్ని పలువురు నెటిజన్స్ తప్పుబట్టారు. అతన్ని ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో లారెన్స్ తాజాగా ఓ వీడియోని విడుదల చేశాడు. తాను విరాళాలు స్వీకరించకపోవడానికి గల కారణాలు తెలియజేశాడు. (చదవండి: అల్లు అర్జున్కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) "నా ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపొద్దు..నా పిల్లల్ని నేనే చూసుకుంటాను.. అని కొన్ని రోజుల ముందు రిక్వెస్ట్ చేస్తూ నేను ఒక ట్వీట్ వేశాను. అందుకు కారణమేంటంటే నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్ ను స్టార్ట్ చేశాను. అందులో 60 మంది పిల్లల్ని పెంచటం, వికలాంగులకు డాన్స్ నేర్పించటం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించటం వంటి కార్యక్రమాలను నిర్వహించాను. ఈ పనులన్నింటినీ నేను ఒకడ్నినే చేయలేకపోయాను. అందుకనే ఇతరుల నుంచి సాయం కావాలని కోరాను. అప్పుడు రెండేళ్లకు ఓసినిమానే చేసేవాడిని. కానీ ఇప్పుడు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాను. బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, నాకు నేనే చేయొచ్చు కదా, ఇతరులను ఎందుకు అడిగి చేయాలని నాకే అనిపించింది. నేను పొగరుతో ఇతరులు సేవ కోసం ఇచ్చే డబ్బులను వద్దనటం లేదు. నాకు ఇచ్చే డబ్బులను మీకు దగ్గరలో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి సాయం చేయండి. వారికెంతో ఉపయోగపడుతుంది. వారికి చాలా మంది సాయం చేయరు. నేను ఎంత చెప్పినా కొందరైతే నాతో కలిసే సాయం చేస్తామని అంటున్నారు. చాలా సంతోషం. ఆర్థిక ఇబ్బందులో బాధపడేవారెవరో నేనే చెబుతాను. మీచేత్తో మీరే సాయం చేయండి. అది మీకు ఎంతో సాయాన్ని కలిగిస్తుంది. థాంక్యూ సో మచ్ ’అన్నారు. This is for my Telugu Fans..! pic.twitter.com/csJPLn5nqH — Raghava Lawrence (@offl_Lawrence) August 30, 2023 -
సర్వం ధారపోసిన ఈ బిజినెస్ టైకూన్ గురించి తెలుసా?
సంపన్న కుటుంబంలో పుట్టి ఆ వారసత్వ సంపదను నిలుపుకోవడంలో, రెట్టింపు చేయడంలో చాలామంది సక్సెస్ అవుతారు. మిలియనీర్లు, బిలియనీర్లుగా ఎదుగుతారు. కానీ కోట్లకు పడగలెత్తినా ఎలాంటి ఆడంబరాలు, విలాసాలకు తావు లేకుండా అతి సాధారణ జీవితాన్ని గడిపేవారు చాలా అరుదు. దాతృత్వంలో సర్వ ధార పోసి తమకు తామే సాటి అని చాటుకుంటారు. అలాంటి వారిలో ఘనుడు 85 ఏళ్ల శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్. తమిళనాడులోని సంపన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టిన త్యాగరాజన్ 37 సంవత్సరాల వయస్సులో బంధువులు, స్నేహితులతో శ్రీరామ్ చిట్స్ను స్థాపించడం ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1974లో చెన్నైలో శ్రీరామ్ గ్రూప్ను స్థాపించారు. అంతకు ముందు 1961లో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో చేరి, వివిధ ఫైనాన్స్ కంపెనీలలో ఉద్యోగిగా పని చేస్తూ ఇరవై సంవత్సరాల అనుభవాన్ని గడించారు. ఆర్థికంగా అన్ని అడ్డంకులను ఎదుర్కొని వ్యాపార దిగ్గజంగా ఎదగడం మాత్రమే కాదు, సామాజిక బాధ్యత, మానవత్వం పట్ల కూడా అంతే నిబద్ధతతో ఉన్న మహా మనీషి ఆయన.పేరుకు తగ్గట్టే త్యాగంలో రారాజు. నా దృష్టి అంతా వారిమీదే ఈ అనుభవంతోనే సాంప్రదాయ బ్యాంకులు పట్టించుకోని తక్కువ-ఆదాయ రుణగ్రహీతలకు రుణాలు ఇవ్వడంపై దృష్టి సారించారు. ట్రక్కులు, ట్రాక్టర్లు , ఇతర వాహనాల కోసం సమాజంలోని పేదవర్గాలకు రుణాన్ని అందించడంలో కంపెనీ అగ్రగామిగా ఉంది. వెనుకబడిన వారికి సహాయం చేయడంలోని అతని నమ్మకం కంపెనీ వృద్ధికి దారితీసింది. ఫలితంగా కంపెనీ రూ. 6210 కోట్లు కంటే ఎక్కువ విలువైన సంస్థగా అవతరించింది. 23 మిలియన్లకు పైగా వినియోగదారులతో 30 కంపెనీలతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. శ్రీరామ్ గ్రూపు షేర్లు ఈ సంవత్సరం 35శాతం పెరిగి జూలైలో రికార్డ్ నమోదు చేశాయి. ఇది భారతదేశపు బెంచ్మార్క్ స్టాక్ ఇండెక్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. అంతేకాదు వ్యాపారంలో ఘన విజయం సాధించిన త్యాగరాజన్ దృష్టి కేవలంకంపెనీని విజయంబాటపట్టించడే కాదు.. స్వయంగా కమ్యూనిస్టు భావాలను రంగరించు కున్న ఆయన తన విజయంలో కంపెనీ ఉద్యోగులపాత్రను ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. వారి కష్టాలు,సవాళ్లను స్వయంగా అర్థం చేసుకున్నారు కనుకనే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారి జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం ఐదు వేల డాలర్లు తన వద్ద ఉంచుకుని దాదాపు రూ. 6210 కోట్ల ( 750 మిలియన్ల డాలర్ల) మొత్తం సంపదను తన ఉద్యోగులకు విరాళంగా ఇవ్వాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సామ్రాజ్యం విజయానికి, కోట్ల సంపదకు ఆర్జనకు సహకరించిన వారి పట్ల నిబద్ధతను చాటుకున్నారు. సందపను పంచి ఇవ్వాలనే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని తు.చ తప్పకుండా పాటించారు. కమ్యూనిస్ట్ భావజాల ప్రభావం,అతి సాధారణ జీవితం బ్లూమ్బెర్గ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో,క్రెడిట్ చరిత్ర లేని వారికి డబ్బు ఇవ్వడం ప్రమాదకరం కాదని నిరూపించడానికి కంపెనీని ప్రారంభించినట్లు త్యాగరాజన్ చెప్పారు. అంతేకాదు వ్యాపారవేత్తగా అతి సాధారణ జీవితంలో గడపడంలో ఆయనే తరువాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు.దుబారా అంటే అస్సలు నచ్చదు. ఐఫోన్, ఖరీదైన కారు, లగ్జరీ ఇల్లు, సదుపాయాలకు దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం శ్రీరామ్ గ్రూప్ నుండి విశ్రాంతి తీసుకున్న త్యాగరాజన్ చిన్న ఇల్లు, రూ. 6 లక్షల విలువైన హ్యుందాయ్ హ్యాచ్బ్యాక్ కారుతో చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పటికీ ప్రతీ 15 రోజులకు ఒకసారి కంపెనీ సీనియర్ మేనేజర్లతో సమావేశమవుతూ, సలహాలు, సూచనలతో శ్రీరామ్ కంపెనీని మరింత అభివృద్దికి బాటలు వేస్తున్నారు. త్యాగరాజన్ ఎక్కడ పుట్టారు? త్యాగరాజన్ 1937 ఆగస్టు 25వ తేదీన తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చెన్నైలో గ్రాడ్యుయేషన్, మాథ్య్స్లో మాస్టర్స్ చేశారు. తరువాత కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో మూడు సంవత్సరాలు చదివారు. 1961లో దేశీయ అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటైన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలోనూ, దాదాపు రెండు దశాబ్దాల పాటు వైశ్యా బ్యాంక్, రీఇన్స్యూరెన్స్ బ్రోకర్ సంస్థ JB బోడా అండ్ కోలో పనిచేశారు. శ్రీరామ్స్ సంస్థల కారణంగా వడ్డీ రేట్లు దిగి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ సుమారు 8.5 బిలియన్ డాలర్లు. జూన్తో ముగిసిన త్రైమాసికంలో సుమారు 200 మిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జించింది. శ్రీరామ్ కంపెనీలలో తన వాటాలన్నింటినీ ఉద్యోగుల గ్రూపునకు కేటాయించి, 2006లో ఏర్పాటు చేసిన శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్కు బదిలీ చేసిన గొప్ప వ్యక్తి త్యాగరాజన్. ఈ శాశ్వత ట్రస్ట్లో 44 గ్రూప్ ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు. ట్రస్ట్ హోల్డింగ్ మొత్తం విలువ 750 మిలియన్లడాలర్లకు పైమాటే. ఇటీవల శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కో. శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్లను షేర్-స్వాప్ డీల్లో విలీనం చేసుకుంది. -
మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటర్ల దాతృత్వం
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమోటర్లు సమాజ సేవ కోసం 10 శాతం వాటాలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటింగ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్, ప్రమోటర్ రామ్దేవ్ అగర్వాల్ చెరో ఐదు శాతం (చెరో 73,97,556 షేర్లు) చొప్పున కంపెనీ ఈక్విటీలో వాటాలను విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.12,161 కోట్లు కాగా, ఈ ప్రకారం 10 శాతం వాటాల విలువ రూ.1,216 కోట్లుగా ఉండనుంది. ఈ మొత్తాన్ని వచ్చే పదేళ్లలోపు లేదా అంతకంటే ముందుగానే ఖర్చు చేయనున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్లకు సమాచారం ఇచి్చంది. ఇప్పటికే మన దేశం నుంచి విప్రోప్రేమ్జీ, గౌతమ్ అదానీ, శివ్నాడార్, నందన్ నీలేకని తదితరులు సమాజం కోసం పెద్ద మొత్తంలో విరాళలను ప్రకటించగా, వారి సరసన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ప్రమోటర్లు కూడా చేరినట్టయింది. మరోవైపు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తన నిర్వహణలోని బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని గ్లైడ్ టెక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీకి విక్రయించేందుకు నిర్ణయించడం గమనార్హం. గ్లైడ్ టెక్ అనేది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్కు పూర్తి అనుబంధ సంస్థగా ఉంది. అలాగే అనుబంధ సంస్థ కింద ఉన్న సంపద నిర్వహణ వ్యాపారాన్ని మాతృసంస్థ మోతీలాల్ ఓస్వా ల్ ఫైనాన్షియల్కు మార్చేందుకు నిర్ణయించింది. -
పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపు: ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామని, ట్రస్ట్కు ఇప్పటివరకు రూ.880 కోట్ల విరాళాలు వచ్చినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,500 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఈ ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇచ్చిన భక్తులు ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదని స్పష్టం చేశారు. సమ్మర్ రద్దీ నేపథ్యంలో రూ.300 రూపాయల దర్శన టికెట్ల కోటా తగ్గించామని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తిరిగి రూ.300 దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తల మధ్య ఎక్కువ తోపులాట లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తామని, మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్ లైన్లో భక్తులను అనుమతిస్తున్నామని ఈవో పేర్కొన్నారు. చదవండి: సాహసోపేత నిర్ణయాలు.. వారికి వైఎస్ జగన్ సర్కార్ ఐదు వరాలు -
మనకూ రావాలంటే.. మనమూ అధికారంలోకి రావాల్సిందే!
మనకూ రావాలంటే.. మనమూ అధికారంలోకి రావాల్సిందే! -
విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్ల విరాళాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విరాళాల సేకరణలో అన్ని రాజకీయ పార్టీల కంటే చాలా ముందంజలో ఉంది. భారత రాజకీయాల్లో సంస్కరణల కోసం పోరాడుతున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 2016–17 నుంచి 2021–22 మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్లు, ప్రత్యక్ష కార్పొరేట్ విరాళాలు సహా ఇతర విరాళాల ద్వారా మొత్తంగా ఆరేళ్లలో రూ.10,122 కోట్లు బీజేపీకి వచ్చాయి. బీజేపీ ప్రకటించిన మొత్తం విరాళాలు ఇతర జాతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. బీజేపీ తర్వాత స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విరాళాల రూపంలో రూ.1547.439 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రూ.823.301 కోట్లు, సీపీఐ(ఎం) రూ.367.167 కోట్లు, ఎన్సీపీ రూ.231.614 కోట్లు సేకరించాయి. ప్రాంతీయ పార్టీల్లో బీజేడీ తీయ పార్టీల జాబితాలో బిజు జనతాదళ్ (బీజేడీ) అత్యధికంగా రూ.692.60 కోట్లు విరాళాలు సేకరించింది. ఇక తెలంగాణరాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ రూ.476.89 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత డీఎంకే పార్టీ రూ.475.73 కోట్లు, వైఎస్ఆర్సీపీ రూ.456.20 కోట్లు, శివసేన రూ.267.90 కోట్లు, ఆప్ రూ.169.70 కోట్లు, టీడీపీ రూ.168.67 కోట్ల విరాళాలు సేకరించాయి. చదవండి: ఆ తేనేలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
Asifabad: మూడు రోజుల్లో సీఎం పర్యటన.. భోజన ఖర్చులివ్వండి!
సాక్షి, ఆసిఫాబాద్: ఎంకి పెళ్లి సుబ్బిగాడి చావుకొచ్చిందన్న చందంగా మారింది జిల్లా పోలీసుల తీరు.. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. సీఎం బందో బస్తుకు వస్తున్న దాదాపు 2,500 మంది పోలీసులకు వసతి, భోజన ఏర్పాట్లు చేయడం జిల్లా పోలీసుశాఖకు కత్తిమీద సాములా మారినట్లు సమాచారం. ఇప్పటికే వీరి వసతి కోసం జిల్లా కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలు, ఫంక్షన్హాళ్లను తమ ఆధీనంలోకి తీసుకోనున్న పోలీసులకు, వీరందరికి భోజన ఏర్పాట్లు చేయడం తలకు మించిన భారంగా మారింది. వ్యాపారుల నుంచి పోలీసుల భోజన ఖర్చులకు విరాళాలు అడగడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. 2,500 మందితో బందోబస్తు.. సీఎం పర్యటనకు బారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నేతృత్వంలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ స్థాయి అధికారులతోపాటు అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఆర్ఎ స్సైలు, పీసీలు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ, మ హిళా పోలీసులతో మొత్తం 2,500 మందితో బందోబస్తు ఉండనున్నట్లు తెలిసింది. కాగా వీరంతా ఈ నెల 28న జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. వీరందరికీ వసతి, భోజన ఏర్పాట్లు జిల్లా పోలీ సుశాఖ చేపట్టింది. ఇందులో వసతి ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో ఊపిరిపీల్చుకున్న పోలీసు అధికారులకు భోజన ఏర్పాట్ల అంటేనే ఖర్చుతో కూడుకున్న అంశం కావడంతో వ్యాపారుల సాయం కోరినట్లు తెలుస్తోంది. అయితే ఒక్కో వర్తక సంఘానికి రూ.లక్ష చొప్పున టార్గెట్ విధించడంపైనే వ్యాపారుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదనే నిర్ణయానికి వచ్చే వ్యాపారులపై ఒత్తిడి తెచ్చారనే ప్రచారం సాగుతోంది. వ్యాపారుల్లో తర్జన భర్జన.. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమాలతోపాటు కుమురంభీం, కొట్నాక భీంరావు విగ్రహాల ఆవిష్కరణ తదితరాలు కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది జిల్లాకు తరలిరానున్నారు. కార్యక్రమానికి మూడు రోజుల ముందుగానే వీరంతా జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. కాబట్టి వీరందరికి వసతి, భోజన ఏర్పాట్ల బాధ్యతలు స్థానిక పోలీసు ఉన్నతాధికారులపై పడింది. దీంతో పోలీసు అధికారులు వ్యాపారులతో మాట్లాడి.. పోలీసుల భోజన ఖర్చులకు డబ్బులు సమకూర్చాలని కోరినట్లు సమాచారం. ఒక్కో వర్తక సంఘం తరఫున రూ.లక్ష ఇవ్వాలని పోలీసు సిబ్బంది కోరడంతో వ్యాపారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయినా ప్రభుత్వ కార్యక్రమానికి విరాళాలు అడగడం ఏంటి? అన్న చర్చ వ్యాపారుల్లో జరుగుతుండటం గమనార్హం. -
ఒడిశా విషాదం:పేటీఎం కీలక నిర్ణయం..నెటిజన్ల ప్రశంసలు
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఒడిశా రైలు ప్రమాదంలో బాధితుల సహాయార్థం కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం ద్వారా యూజర్లు అందించిన విరాళాలకు సమాన మొత్తంలో తాను కూడా చెల్లించ నుంది. ప్రమాదంలో బాధితులకు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు ఈ సొమ్మును వినియోగించనున్నారు. (జెరోధా ఫౌండర్, బిలియనీర్ నిఖిల్ కామత్ సంచలన నిర్ణయం) ఈ మేరకు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రతిజ్ఞ చేశారు. వినియోగదారులు చెల్లించిన ప్రతీ రూపాయిక మరో రూపాయి జోడించి.. ఇలా సేకరించిన నిధులను ఒడిశా ముఖ్యమంత్రి సహాయనిధి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని ప్రకటించారు. "విరాళం ఇచ్చిన మొత్తంపై 80జీ పన్ను మినహాయింపు పొందవచ్చు. Paytm యాప్లోని 'ఆర్డర్ & బుకింగ్స్' విభాగం నుండి రసీదులను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. దీంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే తమ డొనేష్లనకుసంబంధించిన స్క్రీన్షాట్లను ట్విటర్లో పోస్ట్ చేశారు. (రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ఇదీ చదవండి: నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం Help the victims of the Odisha train tragedy 🙏 Paytm Foundation will match your contribution ₹ to ₹. A small donation can make a big difference❤️ Donate now on Paytm App: https://t.co/av9bdffnwS — Paytm (@Paytm) June 6, 2023 కాగా జూన్ 2న జరిగిన ప్రమాదంలో దాదాపు 288 మంది చనిపోయారని ఒడిశా ప్రభుత్వం తాజాగా ధృవీకరించింది. ఇంకా కొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. దాదాపు 1,100 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కోసం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Contribute to Odisha Train tragedy victims through Paytm. We will match all your contributions ₹ to ₹. Thanks for your contributions 🙏🏼 https://t.co/QTQM1LhS4H — Vijay Shekhar Sharma (@vijayshekhar) June 5, 2023 -
బీఆర్ఎస్ దేశంలోనే నంబర్-1.. సెకండ్ ప్లేస్లో ఆప్..!
న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచింది. ఆ పార్టీకి మొత్తం రూ.40.9కోట్లు విరాళాలు అందాయి. ఆ తర్వాత రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆప్కు రూ.38.2 కోట్ల విరాళాలు అందాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) ఈ గణాంకాలను వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్, ఆప్ తర్వాత జేడీఎస్కు అత్యధిక విరాళాలు అందాయి. ఆ పార్టీకి రూ.33.2 కోట్లు డోనేషన్ల రూపంలో వచ్చాయి. అలాగే సమాజ్వాదీ పార్టీకి రూ.29.7కోట్లు, వైఎస్సార్సీపీకి రూ.20 కోట్లు విరాళాలు అందినట్లు ఏడీఆర్ నివేదక తెలిపింది. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించింది. దేశంలోని మొత్తం 26 ప్రాంతీయ పార్టీలకు రూ.189.8 కోట్లు అందినట్లు నివేదిక పేర్కొంది. వీటిలో రూ.162.21 కోట్ల విరాళాలు ఐదు పార్టీలే అందుకున్నట్లు తెలిపింది. అయితే ఏఐఏడీఎంకే, బీజేడీ, ఎన్డీపీపీ, ఎస్డీఎఫ్, ఏఐఎఫ్బీ, పీఎంకే, జేకేఎన్సీ పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను వెల్లడించలేదు. కాగా.. ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆప్కు ఎన్నికల సంఘం ఈ నెలలోనే జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: కర్ణాటక ఎన్నికలు: 517 నామినేషన్ల ఉపసంహరణ.. 209 స్థానాల్లో ఆప్ పోటీ -
‘ఆక్స్ఫాం’పై దర్యాప్తుకు కేంద్రం సిఫార్సు
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్సీఆర్ఏ) చట్ట ఉల్లంఘన ఆరోపణలపై ఆక్స్ఫాం ఇండియా సంస్థపై సీబీఐ దర్యాప్తుకు కేంద్ర హోం శాఖ సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ఎదుర్కోనున్న రెండో స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫాం. అమన్ బిరదారీ అనే సంస్థపైనా సీబీఐ దర్యాప్తుకు హోం శాఖ గత నెల సిఫార్సు చేయడం తెలిసిందే. పలు సంస్థలు, ఇతర ఎన్జీవోలకు విదేశీ ‘సాయాన్ని’ ఆక్స్ఫాం బదిలీ చేసినట్టు హోం శాఖ గుర్తించింది. అమన్ బిరదారీకీ కొంత మొత్తం పంపిందని సమాచారం.ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థలకు నిధుల బదిలీ, కన్సల్టెన్సీ మార్గంలో తరలింపుకు పాల్పడిందని ఐటీ సర్వేలో తేలింది. -
రోహిణి నీలేకని గురించి ఈ విషయాలు తెలుసా? ఇన్పీలో ఆమె తొలి పెట్టుబడి ఎంతంటే?
సాక్షి, ముంబై: భారీ విరాళాలతో దేశంలోనే అత్యంత ఉదాత్తమైన మహిళగా ఘనత కెక్కారు రోహిణి నీలేకని. సంవత్సరానికి రూ. 120 కోట్ల విరాళంతో అత్యంత ప్రసిద్ధ పరోపకారుల్లో ఒకరు. ఎడెల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ ఉమెన్స్ లిస్ట్-2022లో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు రోహిణి. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నీలేకని భార్య రోహిణి పాపులర్ రైటర్..జర్నలిస్ట్, కాలమిస్ట్. విరాళాల్లో ఎక్కువ భాగం పర్యావరణం, నీరు, విద్యా రంగాలకే. ఎవరీ రోహిణి నీలేకని? ముంబైలో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1960లో జన్మించారు రోహిణి. తండ్రి ఇంజనీర్, ఆమె తల్లి గృహిణి. ఆమె ఎల్ఫిన్స్టోన్ కళాశాల నుండి ఫ్రెంచ్ సాహిత్యంలో పట్టా పొందిన రోహిణి 1980లో ఒక జర్నలిస్టుగా తన కరియర్ను మొదలు పెట్టారు. 1998లో తన మొదటి నవల స్టిల్బోర్న్ని రిలీజ్ చేశారు. అలాగే పిల్లలకోసం శృంగేరి సిరీస్ని తీసుకొచ్చారు. 'నోని' అనే కలం పేరుతో పిల్లలకోసం అనేక రచనలు చేశారు రోహిణి. ఇద్దరు పిల్లల బాధ్యత, దాతృత్వ సేవలు నందన్, రోహిని దంపతులకు నిహార్ , జాన్హవి అనే ఇద్దరు పిల్లలు. నందన్ నీలేకని బిజీగా ఉన్న సమయంలో తల్లిగా పిల్లల పెంపక బాధ్యతలను పూర్తి తీసుకున్నారు. ఇది చాలా కష్టమే కానీ ఇంట్లో ఉండే ఫ్రీలాన్స్ ప్రాతిపదికన డాక్యుమెంటరీ స్క్రిప్ట్లు రాయడం ద్వారా సమయాన్ని సద్విని యోగం చేసుకున్నారట. 2014లో పిల్లలకోసం ప్రథమ్ బుక్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు పాతికేళ్ల క్రితం ఇద్దరు యువతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా దాతృత్వంలోకి ప్రవేశించారు రోహిణి. ఇక ఆ తరువాత విరాళాల విషయంలో ఏమాత్రం సంకోచించకుండా ముందుకు సాగారు. దీంతోపాటు లాభాపేక్షలేని పిల్లల ఎన్జీవో EkStepని కూడా స్థాపించారు. 2001లో నీరు, పారిశుధ్యం కోసం అర్ఘ్యం ఫౌండేషన్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రాథమిక విద్యపై దృష్టి సారించే అక్షర ఫౌండేషన్కు చైర్పర్సన్గా పలు సేవలందించారు అయితే 2021సెప్టెంబరు లో అర్ఘ్యం ఫౌండేషన్ చైర్పర్సన్ పదవినుంచి తప్పుకున్నారు. మనుమడు తనుష్కి జంతువులంటే చాలా ఇష్టం. అతని స్పూర్తితోనే హంగ్రీ లిటిల్ స్కై మాన్స్టర్ (2020,) ది గ్రేట్ రిఫాసా బుక్స్ రాశానని స్వయంగా రోహిణి ఒక సందర్బంలో చెప్పారు. రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్మెంట్ (ATREE) అశోక ట్రస్ట్ ట్రస్టీల బోర్డులో ఉన్నారు. 2012 నుండి కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఎమినెంట్ పర్సన్స్ అడ్వైజరీ గ్రూప్లో పని చేస్తున్నారు. 2011జూలైలో, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆడిట్ అడ్వైజరీ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు.ఆమె 2017లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో విదేశీ గౌరవ సభ్యురాలి గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇన్ఫోసిస్ ఆవిర్భావంలో రోహిణి పాత్ర నందన్ నీలేకని 1981లో మరో ఆరుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో కలిసి ఇన్ఫోసిస్ను స్థాపించేనాటికి రోహిణి , నందన్ల అప్పుడే పెళ్లయింది. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న మొత్తం 10వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టారట. ఆతరువాత ఇన్ఫీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ధనవంతురాలిగామారారు. అయితే విరాళాలు ఇవ్వడంలో ఎపుడూ ముందుండే రోహిణి, ముఖ్యంగా ఆగస్ట్ 2013లో ఇన్ఫోసిస్లో 5.77 లక్షల షేర్లను విక్రయించి సుమారు రూ. 164 కోట్లు దానం చేశారు. 2010, 2014లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆసియాలో టాప్ దాతల్లో ఒకరిగా ఎంపికయ్యారు. దీంతోపాటు 2022లో ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్లో ఉత్తమ గ్రాస్రూట్ పరోపకారి అవార్డును, అసోంచాం ఫిలాంత్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2020-21 అవార్డును అందుకోవడం విశేషం. అంతేకాదు వాతావరణ మార్పు, లింగ సమానత్వం, స్వతంత్ర మీడియా, జంతు సంక్షేమ రంగంలో పనిచేస్తున్న సుమారు 80 పౌర సమాజ సంస్థలకు ఆమె మద్దతిస్తారు. "గివింగ్ ప్లెడ్జ్" 2010లో బిల్, మెలిండా గేట్స్ వారెన్ బఫెట్ దాన్ని ఏర్పాటు చేసిన తమ సంపదలో సగం దానం చేసే బిలియనీర్ల ఎలైట్ నెట్వర్క "గివింగ్ ప్లెడ్జ్" లో నందన్, రోహిణి నీలేకని చేరారు. 2017నాటికి విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ, బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్-షా, శోభా డెవలపర్స్ ఛైర్మన్ ఎమెరిటస్ పిఎన్సి మీనన్, నందన్ నీలేకని దంపతులతో కలిపి 21 దేశాల నుంచి 171 మంది ప్రతిజ్ఞ చేశారు. -
అన్ని పార్టీల కన్నా బీజేపీకి మూడు రెట్లు అధిక విరాళాలు
అన్ని పార్టీల కన్నా బీజేపీకి మూడు రెట్లు అధిక విరాళాలు -
బీజేపీకి రూ.614 కోట్లు..కాంగ్రెస్కు రూ.94 కోట్లు
న్యూఢిల్లీ: 2021–22లో బీజేపీకి రూ.614 కోట్లు, కాంగ్రెస్కు రూ.95 కోట్లు విరాళాల రూపంలో అందాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 2020–21తో పోలిస్తే పార్టీలు అందుకున్న విరాళాల మొత్తం 31.50% మేర పెరిగిందని వివరించింది. ఇదే సమయంలో బీజేపీ విరాళాల్లో రూ.28.71%, కాంగ్రెస్ విరాళాల్లో 28.09% పెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది. గతేడాది దేశంలోని అన్ని జాతీయ పార్టీలకు మొత్తం రూ.780కోట్లు విరాళాల రూపంలో అందినట్లు చెప్పింది. బీజేపీకి అందిన మొత్తం మిగతా అన్ని పార్టీలకంటే దాదాపు మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. చదవండి: బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు.. సిబ్బంది సెల్ఫోన్లు సీజ్! -
నాడు-నేడుకు లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్ల విరాళం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యామౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు కార్యక్రమానికి లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్లను విరాళంగా అందించింది. దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతం అయిన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వార్డు (కాలిన గాయాలకు సంబంధించిన) నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ డా. సత్యనారాయణచావా.. సీఎం జగన్తో తెలిపారు. నాడు- నేడు పథకం కింద లారస్ ల్యాబ్స్ విరాళాన్ని అందించడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా సీఎంని కలిసిన వారిలో సీఈఓ డా.సత్యనారాయణ చావా, కార్పొరేట్ డెవలప్మెంట్, సింథసిస్ మరియు ఇంగ్రిడియంట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణచైతన్య చావా, మానవ వనరుల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు చావా, సీఎస్ఆర్ హెడ్ సౌమ్య చావా ఉన్నారు. చదవండి: (సీఎం జగన్ చేతుల మీదుగా పాడి రైతులకు బోనస్ పంపిణీ) -
ఎలక్టరోల్ ట్రస్టుల విరాళాల్లో బీజేపీ టాప్.. రెండోస్థానంలో టీఆర్ఎస్!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థల నుంచి బీజేపీకి విరాళాల వరద పారింది. ఎలక్టరోల్ ట్రస్టులకు(ఈటీ) వచ్చిన కార్పొరేట్, వ్యక్తిగత విరాళాల్లో 72 శాతానికిపైగా కాషాయ పార్టీ ఖాతాలోకే వెళ్లాయి. పోల్ రైట్స్ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) 2021-22 ఆర్థిక ఏడాదికి గల ఎలక్టరోల్ ట్రస్టుల విరాళాల వివరాలను వెల్లడించింది. 2021-22 ఏడాదిలో బీజేపీకి అత్యధికంగా రూ.351.50 కోట్ల విరాళాలు ఈటీల ద్వారా అందాయి. మొత్తం పార్టీలు అందుకున్న విరాళాలతో పోలిస్తే బీజేపీకే 72.17 శాతం అందినట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ద ఫ్రుడెండ్ ఎలక్టరోల్ ట్రస్ట్ అత్యధికంగా రూ.336.50 కోట్లు బీజేపీకి విరాళంగా అందించింది. అంతకు ముందు ఏడాది 2020-21లో రూ.209 కోట్లు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది. అలాగే.. 2021-22 ఏడాదిలో ఏపీ జనరల్ ఈటీ, సమాజ్ ఈటీ వరుసగా రూ.10కోట్లు, రూ.5 కోట్లు బీజేపీకి అందించాయి. రెండోస్థానంలో టీఆర్ఎస్.. బీజేపీ తర్వాత రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిలిచింది. ఫ్రుడెంట్ ఎలక్టరోల్ ట్రస్టు ఒక్కదాని నుంచే రూ.40 కోట్లు అందాయి. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి రూ.18.43 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.21.12 కోట్లు ట్రస్టుల ద్వారా అందాయి. ఇండిపెండెంట్ ఈటీ నుంచి ఆప్ పార్టీకి రూ.4.81 కోట్లు అందిన నేపథ్యంలో కాంగ్రెస్ను వెనక్కి నెట్టింది చీపురు పార్టీ. అలాగే.. స్మాల్ డొనేషన్స్ ఈటీ నుంచి కాంగ్రెస్కు 1.9351 కోట్లు అందాయి. ఫ్రుడెంట్ ఎలక్టరోల్ ట్రస్టు 9 రాజకీయ పార్టీలకు విరాళాలు అందించింది. అందులో టీఆర్ఎస్, సమాజ్వాదీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీలు ఉన్నాయి. మరో ఆరు ఎలక్టరోల్ ట్రస్టులు 2021-22 ఏడాదికి గానూ రూ.487.0856 కోట్లు విరాళాలుగా అందాయని తెలిపాయి. అందులో రూ.487.0551 కోట్లు(99.994శాతం) వివిధ రాజకీయ పార్టీలకు అందించినట్లు పేర్కొన్నాయి. అయితే, ఏ పార్టీకి ఎంత ఇచ్చామనే వివరాలు వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం విరాళాల్లో 95 శాతాన్ని అర్హతగల రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ ట్రస్టు పంపిణీ చేయాలి. రిజిస్టర్ అయిన 23 ఎలక్టోరల్ ట్రస్టుల్లో 16 ట్రస్టులు తమ విరాళాల కాపీలను ఎలక్షన కమిషన్కు ఎప్పటికప్పుడు సమర్పిస్తున్నాయి. మిగిలిన 7 ట్రస్టులు తమ విరాళాల నివేదికలను వెల్లడించలేదు. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
వచ్చేదే విరాళాలు గుర్తు తెలియని వ్యక్తుల నుండి.. తెలిసే వ్యక్తులు ఎవరిస్తారు!!
వచ్చేదే విరాళాలు గుర్తు తెలియని వ్యక్తుల నుండి.. తెలిసే వ్యక్తులు ఎవరిస్తారు!! -
‘చేయిచాచి రూ. 500 సాయం అడిగితే రూ. 51 లక్షలు వచ్చాయి’
ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఓ మహిళకు కుంటుంబ పోషణ భారమైంది.. పూట గడవడమే కష్టంగా మారింది.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. తప్పని పరిస్థితుల్లో కొడుకుకు చదువు చెబుతున్న టీచర్ను సాయం కోసం అర్థించింది. పిల్లల కడుపు నింపడం కోసం రూ. 500 ఉంటే ఇవ్వాలని కోరింది.. ఊహించని విధంగా ఆమె ఆకౌంట్లోకి రూ. 51లక్షలు వచ్చి చేరాయి. దీంతో ఆశ్చర్యపోయిన మహిళ ఆనందంతో కంటతపడి పెట్టుకుంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పాలక్కాడ్కు చెందిన సుభద్ర అనే 46 ఏళ్ల మహిళకు ముగ్గురు కొడుకులు. ఆమె భర్త గత ఆగష్టులో మరణించాడు.. కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి మరణంతో వారిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మహిళ ఒక్కతే కాయాకష్టం చేసుకొని పిల్లలను సాకుతోంది. చిన్న కొడుకు రిబ్రల్ పాల్సి వ్యాధితో కదల్లేని స్థితిలో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబం గడవడానికి మరో దారి కనిపించకపోవడంతో రెండు కొడుకు అభిషేక్ చదువుతున్న పాఠశాలలోని హిందీ టీచర్ర్ రిగిజా హరికుమార్ను కొంత డబ్బు సాయం చేయాలని అడిగింది. తన ముగ్గురు పిల్లల ఆకలి తీర్చేందుకు ఓ 500 రూపాయలు ఉంటే ఇవ్వాలని దీనంగా వేడుకుంది. ఆ కుటుంబం పరిస్థితిని చూసి చలించిన ఉపాధ్యాయురాలు తన వంతు సాయంగా వెయ్యి రూపాయలు అందించింది. చదవండి: సిస్టర్హుడ్.. అత్యంత అవసరమైన బంధం అంతటితో ఆగకుండా సుభద్ర ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబాన్ని దగ్గరుండి పరిశీలించింది. ఈ క్రమంలో ఆ కుటుంబం పుట్టేడు పేదరికంలో మగ్గుతుండటం చూసింది. ఇల్లు సరిగా లేకపోవడం, పిల్లలు తినడానికి కూడా ఏం లేని స్థితిని చూసి వారికోసం ఇంకేమైనా చేయాలని ఆలోచించింది. దీంతో తన పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆదుకోవాలని కోరుతూ.. క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. దాతలు సాయంగా అందించే డబ్బు నేరుగా ఆమె అకౌంట్కు బదిలీ అయ్యేలా సుభద్ర బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేసింది. టీచర్ పోస్టు నెట్టింట్లో వైరల్గా మారడంతో రెండు రోజుల్లోనే వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి విరాళంగా రూ. 51 లక్షలు మహిళ బ్యాంక్ ఖాతాలోకి వచ్చాయి. దీంతో టీచర్ గొప్ప మనసును పలువురు అభినందిస్తున్నారు. ఈ విషయంపై ఉపాద్యాయురాలు గిరిజా మాట్లాడుతూ.. ‘వారి గురించి పోస్ట్ చేస్తున్నప్పుడు నా మనస్సులో రెండే ఆలోచనలు ఉన్నాయి. 1. అసంపూర్తిగా ఉన్న వారి ఇంటిని పూర్తిగా నిర్మించి మంచిగా జీవించాలి. 2. ఆ తల్లి తన పిల్లలకు ఆహారం చదువు కోసం ఎవరి ముందు చేయిచాచకూడదు. ఈ రెండింటి గురించే ఆలోచించి ఇలా చేశారు. వచ్చిన డబ్బుని ఇంటికోసం ఉపయోగించి, మిలిన దానిని వారి ఖర్చుల కోసం బ్యాంకులో జమ చేస్తాం. సాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో తెలియడం లేదు’ అంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. చదవండి: Covid Alert: కరోనా ముప్పు ముగియలేదు.. మళ్లీ మాస్కులేద్దాం -
స్కూళ్లల్లో దోపిడీ షురూ..! జోరుగా ముందస్తు అడ్మిషన్లు
సాక్షి, సిటీబ్యూరో: అప్పుడే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియక ముందే స్కూళ్ల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. ముందస్తు› ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నిలువు దోపిడీ ప్రారంభమైంది. టెక్నో, ఈ టెక్నో, ఈ స్మార్ట్ అంటూ రకరకాల పేర్లతో అడ్మిషన్ల దందాకు దిగాయి.కొన్ని పాఠశాలలు ముందస్తు సీట్ బుక్ చేసుకుంటే ఫీజులో రా యితీ అని తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నా విద్యాశాఖాధికారులు నిద్రమత్తులో జోగుతుండడం విమర్శలకు తావిస్తోంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో తీవ్ర పోటీ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఎల్కేజీ, యూకేజీ సీట్లకు అధిక డిమాండ్ ఉండగా, అతర్వాత తరగతుల్లో సీట్ల ఖాళీలును బట్టి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫీజులు, అడ్మిషన్ ఫీజు విషయం పక్కకు పెడితే ..అసలు సీటు దక్కడం అనే ప్రశ్నార్ధకంగా తయారైంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ఆయా స్కూల్లో పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుకు రూ. 1000 నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆయా స్కూల్స్లో సీట్లకు రెండింతలు దరఖాస్తులు రావడంతో ప్రతి సీట్కు తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యమే... కార్పొరేటు, ప్రైవేటు స్కూల్స్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇష్టారాజ్యంగా తయారైంది. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ..అదుపూ లేకుండా పోతోంది. నర్సరీ నుంచి పదవ తరగతి వరకూ ముందస్తు అడ్మిషన్లకు తెరలేపి.. అందిన కాడికి దండుకుంటున్నాయి. కేవలం నర్సరీకే రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. స్కూల్ యూనిఫాం, పుస్తకాలు ముడిపెట్టి ముందుగానే అడ్మిషన్ ఫీజు చేలిస్తేనే సీటు గ్యారంటì హామీ ఇవ్వడం పరిపాటిగా తయారైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థ కూడా డొనేషన్లు వసూలు చేయకూడదు. కనిపించని నోటీసు బోర్డు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీని ఆసరాగా తీసుకున్న కార్పొరేట్, ప్రై వేటు స్కూల్స్ యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదిలేశాయి. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో తాము వసూలు చేసే ఫీజు వివరాలను తరగతుల వారీగా నోటీసు బోర్డులో ఉం చాలి. కానీ, ఈ నిబంధన ఏ ఒక్క పాఠశాలలో కూడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రైవేటు టీచర్లకు టార్గెట్ కార్పొరేట్, ప్రై వేటు స్కూళ్లలో అడ్మిషన్లకు యజమాన్యాలు ఆయా సూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు సైతం టార్గెట్ పెడుతున్నాయి. ఒక్కొక్కరికి 10 నుంచి 15 అడ్మిషన్లు చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టార్గెట్ పూర్తి చేయకుంటే వచ్చే విద్యాసంవత్సరంలో ఉద్యోగానికి ఎసరు తప్పని పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి: Andhra Pradesh: బోధనలో నవశకం -
Malla Reddy: రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు?
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ఇంటిపై జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు మంగళవారం రెండోరోజు కూడా విచారణ కొనసాగించారు. మల్లారెడ్డి ఆడిటర్తోపాటు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునే సమయంలో ఫీజులు, డొనేషన్లను ఏ రూపంలో తీసుకుంటున్నారు? ఎంత తీసుకుంటున్నారు? ఎన్నిరకాల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన కీలక పత్రాలు, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాల ఆధారంగా ఆడిటర్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కళాశాలలకు మొత్తం ఎన్ని ఖాతాలున్నాయని, ఏ కళాశాలకు ఏయే బ్యాంకుల్లో ఖాతా లున్నాయని కూడా ప్రశ్నించారు. డొనేషన్ల రూపంలో వసూలు చేసిన వందకోట్ల నిధులను ఎక్కడ డిపాజిట్ చేశారన్న దానిపైనా ప్రశ్నించినట్లు తెలిసింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు కట్టించుకుని తక్కువ ఫీజుకు రశీదులు ఇస్తున్నట్లు అధికారుల దృష్టికి వచి్చన నేపథ్యంలో దానిపైనా ఆరా తీశారు. చదవండి: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు: సుప్రీం వ్యాఖ్య -
‘ఐటీ’ టెన్షన్.. రహస్య ప్రాంతాలకు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు ‘ఐటీ’ టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ కాలేజీపై ఇన్కం ట్యాక్స్ ఆఫీసర్లు దాడి చేయనున్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగుతుండటం, శివారు జిల్లాల్లోని మెజార్టీ కాలేజీలు రాజకీయ నేతలు, వారి బినామీలు, బంధువులకు సంబంధించినవే కావడం ఇందుకు కారణం. శివారులోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి సమీప బంధువుకు సంబంధించిన పెట్టుబడులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధి సహా బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తుండటం, వారు పెట్టుబడులు పెట్టిన కాలేజీలు, ఆస్పత్రులు, ఇతర సంస్థలపై దాడులు నిర్వహిస్తుండటంతో యాజమాన్యాలు సహా పరిపాలనా విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులు ఐటీ పేరు చెబితేనే హడలెత్తిపోతుండటం గమనార్హం. మెజార్టీ కాలేజీలు వారివే.. రాష్ట్ర వ్యాప్తంగా 179 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 80కిపైగా ఉన్నట్లు అంచనా. మెజార్టీ కాలేజీలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వారి బంధువులకు సంబంధించినవే. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, ఆస్పత్రులు, ఇతర విద్యా సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు బంధువులు వాటాదారులుగా ఉన్న ఇతర కాలేజీల్లోని లావాదేవీలపై కూడా ఐటీ దృష్టి సారించింది. ఐటీ దాడులతో ఆయా యాజమాన్యాలు అప్రమత్తమవుతున్నాయి. ఇన్కం ట్యాక్స్ అధికారులు కాలేజీలో అడుగు పెట్టక ముందే కీలక డాక్యుమెంట్లు, రికార్డులు, హార్డ్ డిస్కులను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత రెండు రోజుల నుంచి ఆయా కాలేజీలు గుర్తింపు కార్డు ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు మినహా ఇతర వ్యక్తులను వీటి ప్రాంగణంలోకి అడుగుపెట్టనివ్వకపోవడం గమనార్హం. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు.. ఇంజినీరింగ్ విద్యకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తమ పిల్లలను క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎక్కువగా ఉండే కాలేజీల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లోని ఈ బలహీనతను యాజమాన్యాలు ఆసరాగా చేసుకుంటున్నాయి. ఎంసెట్, జేఈఈలలో ఉత్తమ ర్యాంకులు సాధించి కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థుల నుంచి కూడా ల్యాబ్, ప్రాక్టికల్స్, లైబ్రరీ, ఇతర ఫీజుల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి. విద్యార్థులు చెల్లించిన ఫీజులకు సంబంధించిన రసీదులు కూడా ఇవ్వడం లేదు. ఇక మేనేజ్మెంట్ కోటాలో ఉన్న సీట్లను ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు పది రెట్లకు అదనంగా అమ్ముతున్నారు. వీరు ఫీజు చెల్లింపు సమయంలో బ్యాంకు చెక్కులు, ఏటీఎం, పేటీఎం సేవలను నిరాకరిస్తున్నారు. నగదు రూపంలోనే ఈ ఫీజులు వసూలు చేస్తున్నారు. తాజాగా శివారులోని ఓ ప్రముఖ కాలేజీ యాజమాన్యం సహా మేడ్చల్ జిల్లాలోని కాలేజీల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వస్తున్నాయి. ఐటీ అధికారులు ఫోన్ చేసి ఆరా తీస్తే.. అడ్మిషన్ సమయంలో ఎలాంటి డొనేషన్లు చెల్లించలేదని చెప్పాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తుండటం గమనార్హం. ‘వర్ధమాన్’లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం శంషాబాద్ రూరల్: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడుల్లో భాగంగా శంషాబాద్ మండలంలోని కాచారం సమీపంలో ఉన్న వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి వర్ధమాన్ కళాశాలకు వైస్ చైర్మన్గా ఉన్నారు. దీంతో ఈ కళాశాలలో గురువారం మధ్యాహ్నం వరకు ఐటీ అధికారులు సోదాలు జరిపారు. విద్యార్థులు, కళాశాల సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించి ప్రత్యేక పహారాతో ఐటీ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. -
మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’
సాక్షి, హైదరాబాద్: ఐటీ సోదాల్లో రూ.100 కోట్ల వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో కోట్లు డొనేషన్లు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 100 కోట్ల డొనేషన్ల పంచనామాపై ఐటీ అధికారులు సంతకం తీసుకున్నారు. సోమవారం ఐటీ విచారణకు హాజరుకావాలని మంత్రి మల్లారెడ్డి సహా, ఆయన కుమారులు, అల్లుడికి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఇంజనీరింగ్ కాలేజీలో మూడు సంవత్సరాల్లో 100 కోట్లు డొనేషన్ల పేరుతో వసూలు చేయించారని మహేందర్ రెడ్డితో ఐటీ సంతకం తీసుకుంది. తన కొడుకుతో బలవంతంగా సంతకం పెట్టించారని ఐటీ అధికారులతో మల్లారెడ్డి వాదనకు దిగారు. ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయల డొనేషన్లు పేరు చెప్పి సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ కాలేజీలో జరిగే ప్రతి లావాదేవీలకు లెక్కలు ఉంటాయని మంత్రి చెబుతున్నారు. కాగా, మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేశారు. చదవండి: అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్టాప్పై హైడ్రామా.. అసలేం జరిగింది? -
ఆస్తిలో సింహభాగం సేవకే.. తేల్చి చెప్పిన అమెజాన్ అధినేత
న్యూయార్క్: తాను ఆర్జించిన సంపదలో అధిక భాగం సొమ్మును సమాజ సేవ కోసమే ఖర్చు చేస్తానని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తేల్చిచెప్పారు. ఫోర్బ్స్ మేగజైన్ తాజా అంచనా ప్రకారం.. బెజోస్ ఆస్తి విలువ 124.1 బిలియన్ డాలర్లు (రూ.10,04,934 కోట్లు). ఆయన తన మిత్రురాలు లారెన్ సాంచెజ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. తన సంపదలో సింహభాగం వాటాను సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఎంత సొమ్ము ఇస్తారు? ఎవరికి ఇస్తారు? అనే విషయాలు మాత్రం బహిర్గతం చేయలేదు. అమెజాన్ సంస్థను నిర్మించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని, అలాగే సమాజ సేవ కూడా అనుకున్నంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫెట్ తదితరులు సమాజ సేవకు అంకితం అవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. జెఫ్ బెజోస్ ఇలాంటి ప్రతిజ్ఞ చేయలేదంటూ గతంలో విమర్శలు వచ్చాయి. -
విరాళాల సేకరణలో తానా సరికొత్త రికార్డు
తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 23వ మహాసభల సన్నాహక కార్యక్రమ విందులో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొని చారిత్రాత్మక స్థాయిలో విరాళాలు ప్రకటించారు. తానా 45 సంవత్సరాల చరిత్రలో మహాసభల విరాళాల సేకరణలో సరికొత్త రికార్డు సృష్టించింది. కోవిడ్ మహమ్మారి తీవ్రతతో 2021లో నిర్వహించాల్సిన మహాసభలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఫిలడెల్ఫియా నగరంలో 2023 జులై 7 నుండి 9 వరకు జరగబోతున్న తానా మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా శనివారం నవంబర్ 5నాడు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వార్మిన్స్టర్ నగరంలోని ఫ్యూజ్ బ్యాంక్వెట్ హాల్లో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమానికి అంచనాలకి మించిన స్పందన లభించింది. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విరాళాల సేకరణ విందులో ఎనిమిది వందల మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. గతంలో జరిగిన అన్ని విరాళాల సేకరణని మించిపోయేలా దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయల (ఆరు మిలియన్ల డాలర్లు) విరాళాలు ప్రకటించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి హాజరైన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, EC, BOD, ఫౌండేషన్ సభ్యులను, మాజీ అధ్యక్షులను, ఇతర కమిటీ సభ్యులను పరిచయం చేసి సమాజానికి వారు చేసిన సేవలను కొనియాడారు. తానా సభ్యులు, వాలంటీర్లు, దాతలు సంఘం అభివృద్ధికి వారు చేసిన కృషిని సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగా అభినందించారు. 23వ తానా మహాసభల ప్రాముఖ్యతను చాలా వివరంగా వివరించారు. ప్రతిష్టాత్మక తానా మహాసభలు దాదాపు నాలుగేళ్ళ తర్వాత నిర్వహిస్తుండటంతో పాటు అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు నేతృత్వంలోని తానా కార్యవర్గం గత పదహారు నెలలుగా చేసిన సేవలు, చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలు ప్రవాస భారతీయుల్లో 23వ తానా మహాసభల పట్ల ఆసక్తిని పెంచి విరాళాల సేకరణ కార్యక్రమానికి ఊహించని స్పందన లభించినట్లు మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు. విరాళాల కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, డెక్కన్ స్పైస్ గోవర్ధన్ బోబ్బా, జగదీశ్ యలమంచిలి, వాలంటీర్లకు కృతఙ్ఞతలు తెలియజేశారు. -
దాతలు భయపడుతున్నారు.. అందుకే 95% విరాళాలు బీజేపీకే
సూరత్: ఇతర పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు భయపడుతున్నందునే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చే మొత్తం విరాళాల్లో 95% బీజేపీకి అందుతున్నాయని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన సూరత్లో మాట్లాడారు. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే కార్పొరేట్ సంస్థలను బీజేపీ బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇతర పార్టీలకు విరాళాలిచ్చే వారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఆదాయ పన్ను శాఖల అధికారులు సోదాలు జరుపుతున్నారని తెలిపారు. ‘మన ప్రజాస్వామ్యంలో విరాళాలు కూడా కేవలం ఒక్క పార్టీకే వెళ్తున్నాయి. బీజేపీ భారీగా డబ్బు పోగేసుకుంటూ దేశవ్యాప్తంగా ఫైవ్ స్టార్ తరహా పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటోంది. ఆ డబ్బుతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రప్రభుత్వాలను అస్థిరపరుస్తోంది. ఫాసిస్ట్ శక్తిగా మారింది. ఒక విధానం, పథకం, సిద్ధాంతం అనేది లేకుండా కేవలం మతం ప్రాతిపదికగానే బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోంది’ అని గెహ్లాట్ ఆరోపించారు. ఆప్పైనా గెహ్లాట్ ఆరోపణలు గుప్పించారు. ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ డబ్బుతో మీడియాను నియంత్రిస్తున్నారని, వ్యతిరేక వార్తలు రాకుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ప్రజాస్వామ్యానికి హాని చేస్తున్నారని అన్నారు. చదవండి: గుజరాత్లో పంజాబ్ ఫార్ములాను ఫాలో అవుతున్న కేజ్రీవాల్.. -
యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి భారీగా విరాళం
యశవంతపుర(కర్ణాటక): కట్టుకున్న భర్త, కన్న కొడుకులు కాలం చేశారు. కడుపు నింపుకోవడానికి భిక్షాటనపై ఆధారపడింది. గుడులు, కూడళ్లలో భిక్షగా వచ్చిన నగదు కూడబెట్టింది. మంగళూరులోని ముల్కి దుర్గా పరమేశ్వరి ఆలయంలో అన్నదానానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చింది. తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆమె మరెవరో కాదు కర్ణాటక రాష్ట్రం ఉడుపికి చెందిన వృద్ధురాలు అశ్వర్థమ్మ (80). ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాచన ద్వారా రోజు వచ్చే డబ్బులను పిగ్మీ పొదుపు ఖాతాలో కడతానని, లక్ష రూపాయలు కాగానే ఏదో ఒక ఆలయానికి ఇస్తానని చెప్పింది. కరోనా సమయంలో అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి రూ.1.5 లక్షలు అందజేశానని తెలిపింది. ( లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ..) -
పోలియోపై పోరుకు రూ.9.8 వేల కోట్ల విరాళం
బెర్లిన్: ప్రపంచ వ్యాప్తంగా పోలియో మహమ్మారిపై సాగే పోరాటానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.8 వేల కోట్ల)సాయం ప్రకటించింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తదితర దేశాలను పోలియో రహితంగా మార్చేందుకు, వైరస్ కొత్త వేరియంట్ల వ్యాప్తిని నివారణకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తామని తెలిపింది. పోలీయో నిర్మూలన కోసం ఇప్పటి వరకు 5 బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు వెల్లడించింది. పోలీయోపై పరిశోధనలు, కొత్త వేరియంట్ల గుర్తింపు సహా ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొంది. ఇటీవలే పాకిస్తాన్లో 20, అఫ్గానిస్తాన్లో 2 పోలీయో కేసులు నమోదైన క్రమంలో ఆయా దేశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది. ప్రపంచం ఈ మహమ్మారిని అంతం చేస్తానని మాటిచ్చిందని, ఏ ఒక్కరు ఈ వ్యాధిపై భయంతో జీవించకూడదంటూ ట్వీట్ చేసింది బిల్ అండ్ మెలిండా గేట్స్. The world made a promise to #EndPolio for good. No one should live in fear of this preventable disease. The Gates Foundation is proud to commit $1.2B toward helping health workers stop all forms of this virus and protect children forever. https://t.co/oA7RNzcOIy — Gates Foundation (@gatesfoundation) October 16, 2022 ఇదీ చదవండి: Bill Gates: ఫౌండేషన్కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్ గేట్స్! -
పేదోడిదే పెద్దమనసు!
అది కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ దేశం విలవిల్లాడుతున్న కాలం.. అటు కరోనా దాడి, ఇటు దాని కట్టడికి విధించిన లాక్డౌన్లు, కర్ఫ్యూలతో ఉపాధికి దెబ్బపడింది.. ఉద్యోగాలు, వ్యాపారాలు దెబ్బతిని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. రాష్ట్రాల ఆర్థిక నిర్వహణే గాడితప్పిన దుస్థితి.. ఆపన్నహస్తం కోసం ఎందరో అభాగ్యులు ఎదురుచూస్తున్న వేళ భారతీయులలోని మానవత్వం పరిమళించింది. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడాలన్న గురజాడ సూక్తిని ఆచరించి చూపింది. 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య ఏకంగా రూ. 23,700 కోట్లను సమాజంలోని వివిధ వర్గాలకు విరాళంగా అందించినట్టు తాజా అధ్యయనంలో తేలింది. దానగుణంలో దిగువ, మధ్యతరగతి జనం ముందు వరుసలో నిలిస్తే.. ధనిక వర్గం అంతంతే విదిలించినట్టు తేలింది. కరోనా సమయంలో మన దేశంలో, విదేశాల్లో దానధర్మాల తీరు ఎలా ఉంది? భూమ్మీద చేతికి ఎముక లేనట్టుగా దానాలు చేసే దేశాలు, వ్యక్తులు ఎవరు? లోభి పుంగవుల మాటేమిటి? వంటి వివరాలతో ప్రత్యేక కథనం. దానం చేసే చేతికి మనసుండాలి.. మమతకు మానవత్వం తోడవ్వాలి.. మానవ సేవే మాధవ సేవ అన్నదీ బోధపడాలి. కరోనా కాలంలో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలు దీన్ని అర్థం చేసుకుని.. తోటివారికి చేతనైనంత సాయం చేసి ఆదుకున్నారని అశోకా యూనివర్సిటీకి చెందిన ‘సెంటర్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఫిలాంత్రపీ’ నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. ‘హౌ ఇండియా గివ్స్ 2020–2021’ పేరుతో చేపట్టిన అధ్యయనంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. దాని ప్రకారం.. భారతీయులు 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య మొత్తంగా రూ.23,700కోట్లను విరాళాల రూపంలో అందించారు. ఇందులో అత్యధికంగా రూ.15,168 కోట్లను మత సంస్థలకు దానం చేశారు. మత సంస్థలను మినహాయిస్తే.. అత్యధికంగా డబ్బు లేదా ఇతర సాయం చేసింది అభాగ్యులకు, యాచకులకేనని అధ్యయనం వెల్లడించింది. వారికి రూ.2, 900 కోట్లను అందించినట్టు తెలిపింది. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులను ఆదుకొనేందుకు మరో రూ.2 వేల కోట్లను అందించారని, ఇళ్లలో పనిచేసేవారికి రూ.1,000 కోట్లు అందించి పెద్దమనసు చాటుకున్నారని వివరించింది. కోవిడ్ రెండోసారి విజృంభించినప్పుడు ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్లకు ఇబ్బంది, వలస కూలీల కాలినడక వంటి సమయంలో మతేతర సంస్థలు అంటే పీఎం–కేర్స్, ఎన్జీవోలు, ట్రస్ట్లు లేదా ఆరోగ్య సిబ్బందికి చేసిన సాయం మొత్తం రూ.1,100 కోట్లు మాత్రమేనని పేర్కొంది. మత సంస్థలకే అత్యధిక విరాళాలు ఇక మొత్తంగా చూస్తే.. 70% కుటుంబాలు మత సంస్థలకు సాయం చేయగా, 12% కుటుంబాలు అభాగ్యులను ఆదుకున్నాయి. మరో 9% తమ దగ్గరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు సా యం చేసినట్టు నివేదిక పేర్కొంది. ఇంట్లో పనిచేసేవారికి సాయం చేశామని చెప్పిన కుటుంబాలు 4%. మతాలకతీతంగా నిరాశ్రయులకు ఆశ్రయం, విద్య, వైద్యం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించే రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్, మిషనరీస్ ఆఫ్ చారిటీస్కు ఎందరో భారతీయులు దానం చేయడం చెప్పుకోవాల్సిన విషయం. పేదోడి పెద్ద మనసు దానమిచ్చిన వారిలో అత్యధికం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల వారేనని అధ్యయనం తెలిపింది. ఏకంగా 52 శాతం మంది స్వల్పాదాయ వర్గాల కుటుంబాలు చేసిన దానమే మొత్తం సొమ్ములో 34 శాతం వరకు ఉండటం విశేషం. ఆదాయం ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో 22శాతం మంది మాత్రమే ఏదో ఒక రూపంలో సాయం చేసినట్టు అధ్యయనం తేల్చింది. వయసు రీత్యా చూస్తే 46 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు దాతల్లో ఎక్కువగా ఉన్నారు. దానం చేయాలా, వద్దా? ఒకవేళ చేస్తే ఏ రూపంలో అన్న కీలకమైన అంశాలపై నిర్ణయాలు పురుషులే తీసుకున్నట్టు వెల్లడైంది. వారు ఎక్కువగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మత సంస్థలకు దానమిచ్చేందుకు ఆసక్తి చూపారు. మహిళలు నిర్ణయాలు తీసుకున్న కుటుంబాల్లో సాయం ఎక్కువగా అభాగ్యులు/ యాచకులు, తమ ఇళ్లలో పనిచేసేవారికి అందింది. పట్టణ, నగర ప్రాంతాలతో (83 శాతం) పోలిస్తే పల్లె ప్రాంతాల్లో ఇతరులకు సాయం చేసినవారు స్వల్పంగా (88 శాతం) ఎక్కువ. ప్రాంతాల వారీగా చూస్తే.. ఉత్తర భారతంలో ఎక్కువ మంది (96 శాతం) ఆర్థిక సాయం చేశారు. తర్వాతి స్థానంలో ఈశాన్య భారతం (93 శాతం)నిలిచింది. అధ్యయనం జరిగిందిలా.. అశోకా వర్సిటీ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా దాదాç³# 81 వేల కుటుంబాలను ప్రశ్నించారు. మొత్తం 18 రాష్ట్రాల్లో రెండు దశల్లో సర్వే చేశారు. ఆరు నెలల్లో (అక్టోబర్ 2020–మార్చి 2021) మీరు ఎవరికైనా దానం చేశారా? ఒకవేళ చేసి ఉంటే ఎవరికి? ఎందుకు? వంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. రెండో దశ సర్వే 2021 అక్టోబర్లో జరిగింది. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రజలు, కుటుంబాలు ఏ రకంగా దా నాలు చేస్తున్నాయో తెలుసుకొనేందుకు ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందని.. సామాజిక, ఆర్థికస్థాయిలు, వయసు, స్త్రీ, పురుషుల్లో ఇతరులకు సాయం చేసే లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయని వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఎందరో ఆపన్నులు ప్రపంచవ్యాప్తంగా జరిగే దానాలపై చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ (సీఏఎఫ్) ఏటా ఒక అధ్యయనం నిర్వహిస్తుంది. 2021 లో ఈ సంస్థ సుమారు 115 దేశాల్లో సర్వే చేసి ఒక నివేదికను సిద్ధం చేసింది. అపరిచితులకు సాయం చేయడం, డబ్బు విరాళంగా ఇవ్వడం, ఇతరుల పనికోసం సమయం వెచి్చంచడం అనే మూడింటిని దానం లేదా సాయంగా నిర్ణయించి ఈ అధ్యయనం చేపట్టింది. అన్ని దేశాల్లోనూ అపరిచితులకు సాయం చేయడం ఎక్కువైందని నివేదిక తెలిపింది. దాదాపు 300 కోట్ల మంది డబ్బు దానం చేయగా, ప్రతి ఐదుగురిలో ఒకరు తమ సమయాన్ని వెచి్చంచినట్టు పేర్కొంది. డబ్బు రూపంలో విరాళమివ్వడం వంటి విషయాల్లో ఇండొనేíÙయా తొలిస్థానంలో నిలవగా.. అపరిచితులకు సాయం విషయంలో నైజీరియా అగ్రస్థానంలో నిలిచింది. 25 శాతం సంపద ఇచ్చేస్తామంటున్న స్టార్టప్ కింగ్లు! తమ సంపదలో 25 శాతాన్ని దానధర్మాలకు కేటాయిస్తామని స్టార్టప్ కంపెనీలతో కోట్లు గడించిన నిఖిల్ కామత్, సుజిత్ కుమార్, అంకిత్ నాగోరిలు ఇటీవలే ప్రకటించారు. దీనికి అదనంగా విద్యా సంబంధ కార్యక్రమాల కోసం వారు భారీగా విరాళాలు సేకరించారు. ‘యంగ్ ఇండియన్ ఫిలాంథ్రొపిక్ ప్లెడ్జ్’ సంస్థ సభ్యులుగా వారు ఈ ప్రకటన చేశారు. ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ స్టార్టప్ జెరోదా, ట్రూబీకన్ కంపెనీల వ్యవస్థాపకుడిగా నిఖిల్ కామత్, ఉడాన్ వ్యవస్థాపకుడు సుజిత్ కుమార్, క్యూర్ ఫుడ్స్ను స్థాపించిన అంకిత్ నాగోరిలు ‘బిల్ అండ్ మెలిండా గేట్స్’ ఫౌండేషన్తో కలసి కర్ణాటకలోని హావేరి, తుముకూరు, యాద్గిర్, దావణగెరె జిల్లాల్లో సుమారు 105 పాఠశాలలు, వాటి పరిసరాల్లోని అంగన్వాడీల రూపురేఖలను మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేపట్టారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
వరుసగా 16వ ఏట దాతృత్వం చాటుకున్న ‘పై ఇంటర్నేషనల్’
బెంగళూరు: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్, వినియోగ ఉపకరణాల రిటైలర్, పై ఇంటర్నేషనల్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది.సీఎస్ఆర్ చొరవలో భాగంగా వరుసగా 16వ సంవత్సరం విద్యార్థులకు అండగా నిలిచింది. 1.1 లక్షల నోట్బుక్లను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసింది. విద్య-కేంద్రీకృత CSR కార్యకలాపాలను పురస్కరించుకుని తుమకూరులో 12,226 మంది విద్యార్థులకు 1.1 లక్షల నోట్బుక్లను ఉచితంగా పంపిణీ చేసింది. జూలై 4 తుమకూరులో జరిగిన ఈ పుస్తక పంపిణీ కార్యక్రమంలో పై ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఎండీ రాజ్కుమార్ విద్యార్థులకు పుస్తకాలను అందించారు. ఇంకా ఎఫ్డీ మీనా ఆర్ పాయ్, గురుప్రసాద్పై (డైరెక్టర్), పుష్పాపై (డైరెక్టర్), జయశ్రీ (డైరెక్టర్) ఇతర కీలక మేనేజ్మెంట్ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. సుమారు 15 పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఆర్థిక సంక్షోభం అనేక వ్యాపారాలను ప్రభావితం చేసిన ఈ అనిశ్చిత కాలంలో విద్యార్థులు, పాఠశాలలకు సమయానుకూలంగా అండగా నిలబడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ ప్రకటించింది. 2005లో పై ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఎండీ రాజ్కుమార్ ఆధ్వర్యంలో సిద్దగంగ మఠంలో ఈ పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంపెనీ, బ్రాండ్, రిటైల్ నెట్వర్క్ చాలా వేగంగా విస్తరించిందనీ, ఈ నేపథ్యంలో రాజ్కుమార్ నేతృత్వంలో లక్ష మంది విద్యార్థులకు సాధికారత కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇప్పటివరకు 22,500 మంది విద్యార్థులకు లబ్ది చేకూరిందని వెల్లడించింది. గత 15 ఏళ్లుగా తుమకూరు,మైసూర్, ఉడిపి, మంగళూరు, కేరళ అంతటా పుస్తకాలను పంపిణీ చేస్తూ, విద్యార్థుల భవిష్యత్ విద్యావకాశాలను అందించడానికి కట్టుబడి ఉన్నామని రాజ్కుమార్ తెలిపారు. ముఖ్యంగా ఆన్లైన్ తరగతుల సమయాల్లో సాధనాలు, వనరులకు ప్రాప్యత అవసరమయ్యే అనేక మంది ఔత్సాహిక విద్యార్థుల విద్యా ప్రయాణంలో భాగమైనందుకు సంతాషాన్ని ప్రకటించారు. సమీప భవిష్యత్తులో ఆధునిక టెక్నాలజీ రాబోతున్న తరుణంగా వాటిని అందించేందుకు వీలుగా రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్యావకాశాలను అందించడంలోనే కాదు, పర్యావరణం, సీనియర్ సిటిజన్ సంక్షేమ కార్యకలాపాలకు కూడా సాయాన్ని అందిస్తున్నారు రాజ్కుమార్. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు 311 చెట్లను విజయవంతంగా నాటారు. అంతేకాదు వాటి సంరక్షించడంలో ఆయన ముందున్నారు. అలాగే నిరుపేద పిల్లలను దత్తత తీసుకొని విద్యను అందిస్తున్నారు. వీరిలో 33 మంది ఇప్పటివరకు లబ్ధిదారులుగా ఉండటం విశేషం. దీంతోపాటు 1000 మంది సీనియర్ సిటిజన్లకు అధిక నాణ్యత గల జీవన సౌకర్యాన్ని అందించడానికి రోడ్మ్యాప్ను వేయడంతో పాటు, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, దాని అవుట్లెట్ల దగ్గర మెరుగైన సౌకర్యాలను అందించడం కూడా బాధ్యత వహిస్తోంది. కాగా రాజ్కుమార్ నేతృత్వంలో 2000లో సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ మరియు కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిటైలింగ్ రంగంలో పై ఇంటర్నేషనల్ ఎంటరై విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా 200పైగా అద్భుతమైన షోరూమ్లను నిర్వహిస్తోంది.మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఐటీ, ఫర్నిచర్ ఉత్పత్తులను అందించే పై ఇంటర్నేషనల్ బెంగళూరు, హైదరాబాద్, హాసన్, చిక్కమగళూరు, షిమోగా, మంగళూరు, ఉడిపి, కుందాపూర్, భత్కల్, హుబ్లీ, బెల్గాం, చిత్రదుర్గ, మైసూర్, మాండ్యలలో ఔట్లెట్లను నిర్వహిస్తోంది. (అడ్వర్టోరియల్) గమనిక : sakshi.com నందు వచ్చే ప్రకటనలు అనేక దేశాలు, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుంచి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్తతో ఉత్పత్తులు లేదా సేవల గురించి విచారించి కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు/సేవల నాణ్యత, లోపాల విషయంలో సాక్షి యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈవిషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. -
శభాష్ పూల్పాండి.. భిక్షాటన చేస్తూ రూ.50 లక్షలు దానం!
వేలూరు(చెన్నై): భిక్షాటన చేయగా.. వచ్చిన సొమ్మును సీఎం సహాయనిధికి అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యాచకుడు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులక కల్పనకు ఇప్పటి వరకూ ఏకంగా రూ.55.60 లక్షలను వివిధ సందర్భాల్లో పలు జిల్లాల కలెక్టర్లకు అందజేశాడు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఆలంగెనరు ప్రాంతానికి చెందిన పూల్పాండి(72) భిక్షగాడిగా జీవిస్తున్నాడు. సోమవారం వేలూరు కలెక్టరేట్లో జరుగుతున్న గ్రీవెన్సెల్కు వచ్చా డు. తన వద్ద ఉన్న రూ. 10 వేలు నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వాలంటూ, శ్రీలంక తమిళులకు ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేయాలని కోరుతూ కలెక్టర్ కుమరవేల్ పాండియన్కు అందజేశారు. అనంతరం పూల్ పాండి మాట్లాడుతూ.. తాను పష్కరకాలంగా భిక్షాటన చేస్తున్నానని, వచ్చే డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇలా రూ.50.60 లక్షలు విలువ చేసే వస్తువులు, సొమ్మును విరాళంగా పలు సందర్భాల్లో అందజేసినట్లు చెప్పాడు. చదవండి: Viral Video: ఆ పసికందు ప్రేమకు అంతా ఫిదా.. ఇంటర్నెట్ను కదిలిస్తున్న వీడియో చూశారా? -
‘గివింగ్పీఐ’: దానకర్ణులు ఒక్కటయ్యారు..లక్ష కోట్లు విరాళం ఖాయం!
ముంబై: దాతల కుటుంబాలు చేతులు కలిపాయి. విప్రో ప్రేమ్జీ, జిరోదా నిఖిల్ కామత్, రోహిణి నీలేకని, నిసా గోద్రెజ్ సంయుక్తంగా ‘గివింగ్పీఐ’ పేరుతో నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 2030 నాటికి ఏటా బిలియన్ డాలర్లను సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన (ఎస్డీజీ) కోసం సమీకరించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ ప్లాట్ఫామ్లో భాగమయ్యే ప్రతీ సభ్యుడు/సభ్యురాలు ఏటా కనీసం రూ.50 లక్షలను విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 2030 నాటికి 5,000 మంది సభ్యుల స్థాయికి నెట్వర్క్ను విస్తరించాలని వీరు నిర్ణయించారు. అదితి, రిషబ్ ప్రేమ్జీ, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, మనీషా, ఆశిష్ ధావన్, నిఖిల్ కామత్, నిసా గోద్రెజ్, రాజన్ నవాని, రోహిణి నీలేకని, స్కోల్ ఫౌండేషన్, టెరా సింగ్, వచాని, వాసవి భారత్ రామ్, వివేక్జైన్ ఈ నెట్వర్క్ ఏర్పాటుకు చేతులు కలిపిన వారిలో ఉన్నారు. భారత్లో 113 మంది బిలియనీర్లు, 6,884 అధిక ధనవంతులు ఉన్నారు. వీరి సంఖ్య వచ్చే ఐదేళ్లలో 12,000కు చేరుకుంటుందని బెయిన్ అండ్ కంపెనీ నివేదిక చెబుతోంది. అంతర్జాతీయంగా ఉన్న తోటివారిని వీరు స్ఫూర్తిగా తీసుకుని కుటుంబ దాతృత్వానికి ముందుకు వస్తే భారత్లో అదనంగా రూ.60,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు సమకూరతాయని అంచనా. -
ఫౌండేషన్కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్ గేట్స్!
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్కు తన ఆస్తిలో సుమారు 20 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను. అందుకే నాకు, నాకుటుంబానికి కావాల్సినంత ఖర్చు చేసి మిగిలిన మొత్తం ఫౌండేషన్కు ఇవ్వాలని భావిస్తున్నా. ఇందులో భాగంగా బిల్ గేట్స్ ఫౌండేషన్కు లక్షన్నకోట్లు విరాళం ఇస్తున్నట్లు బిల్ గేట్స్ తన బ్లాగ్లో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత కుబేరుల స్థానంలో ఉన్న బిల్గేట్స్కు సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. పెరిగిపోతున్న సంపదను ప్రపంచ జనాభా ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు ఖర్చు చేస్తుంటారు. అందుకే మైక్రోసాఫ్ట్ ఫౌండర్ గేట్స్ - మిలిండా ఫౌండేషన్ను ఏర్పాటు చేసి తన సంపాదనలో సింహభాగం అటు తరలించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆ ఫౌండేషన్కు బిల్గేట్స్ పెద్దమొత్తంలో విరాళం ఇవ్వడంపై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
రాజకీయ పార్టీలకు కోవిడ్ దెబ్బ.. 41 శాతం తగ్గిన విరాళాలు
రాజకీయ పార్టీలకు కోవిడ్ దెబ్బ.. 41 శాతం తగ్గిన విరాళాలు -
కోవిడ్ ఎఫెక్ట్.. బీజేపీకి భారీగా తగ్గిన విరాళాలు.. కాంగ్రెస్కు ఎంతంటే?
ఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసమంటూ విధించిన లాక్డౌన్తో దేశంలోని అనేక రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ ప్రభావం రాజకీయ పార్టీలపైనా పడింది. కోవిడ్ సమయంలో జాతీయ పార్టీలకు అందిన విరాళాలు దాదాపుగా సగం మేర తగ్గిపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని గుర్తింపు పొందిన జాతీయ పార్టీల విరాళాలు రూ.420 కోట్ల మేర తగ్గిపోయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఆ విలువ 41.49 శాతం తక్కువగా పేర్కొంది. బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785.77 కోట్లు విరాళాలు రాగా.. 2020-21లో 39.23 శాతం తగ్గి రూ.477.54కోట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 2019-20లో రూ.139.01 కోట్లు విరాళాలు రాగా.. 2020-21లో 46.39శాతం తగ్గి రూ.74.52 కోట్లు మాత్రమే అందాయి. అత్యధికంగా ఢిల్లీ నుంచి జాతీయ పార్టీలకు రూ.246 కోట్లు విరాళంగా వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి రూ.71.68 కోట్లు, గుజరాత్ నుంచి రూ.47 కోట్లు అందాయి. బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు.. విరాళాల్లో 80 శాతాన్ని ఆక్రమించగా.. మిగిలిన 20 శాతం చిన్న పార్టీలకు అందాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం రూ.480 కోట్లు కార్పొరేట్, బిజినెస్ రంగాల నుంచి వచ్చాయి. మరోవైపు.. రూ.111 కోట్లు విరాళాలు 2,258 మంది వ్యక్తులు అందించారు. సుమారు రూ.37 కోట్ల విరాళాలకు సరైన ఆధారాలు లేకపోవటం వల్ల ఏ రాష్ట్రం నుంచి వచ్చాయనే వివరాలు వెల్లడికాలేదు. బీజేపీకి మొత్తం 1,100 విరాళాలు కార్పొరేట్, బిజినెస్ సెక్టార్ల నుంచి వచ్చాయి. కాంగ్రెస్కు 146 విరాళాలు వచ్చాయి. ఇదీ చూడండి: ఓపీఎస్కు మరో షాకిచ్చిన ఈపీఎస్.. 18 మంది బహిష్కరణ -
‘ఆల్ట్ న్యూస్’కు విదేశీ విరాళాలు
న్యూఢిల్లీ: ఆల్ట్ న్యూస్ ఆధ్వర్యంలోని ప్రావ్దా మీడియాకు విదేశాల నుంచి రూ.2 లక్షల మేర విరాళాలు అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ డబ్బు జమ చేసిన మొబైల్ ఫోన్ నంబర్, ఐపీ అడ్రస్లు అన్నీ థాయ్ల్యాండ్, ఆస్ట్రేలియా, మనామా, హాలండ్, సింగపూర్, అమెరికా,, ఇంగ్లాండ్, సౌదీఅరేబియా, స్వీడన్, యూఏఈ, కెనడా, స్విట్జర్లాండ్, పాకిస్తాన్, సిరియా దేశాలకు చెందినవని దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. మొత్తం రూ.2,31,933 ప్రావ్దా మీడియాకు చేరిందని తెలిపారు. జుబైర్ అరెస్ట్ అనంతరం అతడికి మద్దతుగా వచ్చిన ట్వీట్లను విశ్లేషించగా ఎక్కువ భాగం యూఏఈ, బహ్రెయిన్, కువాయిట్, పాకిస్తాన్ వంటి దేశాలవేనని గుర్తించామన్నారు. ఈ మేరకు మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడైన జుబైర్ 2018లో హిందూ దేవతపై చేసిన అభ్యంతరకర ట్వీట్పై జూన్ 27వ తేదీన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జుబైర్ పోలీస్ కస్టడీ శనివారంతో ముగియడంతో పోలీసులు ఢిల్లీ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్వారియా ఎదుట హాజరుపరిచారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కొట్టేసిన మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. అయితే, కోర్టు తీర్పు ప్రతి అందకముందే జుబైర్ బెయిల్ పిటిషన్ తిరస్కరించినట్లు, కస్టడీకి అనుమతించినట్లు పోలీసులు మీడియాకు లీకులివ్వడం అవమానకరమని ఆయన తరఫు లాయర్ వ్యాఖ్యానించారు. -
తిరుమల శ్రీవారికి భారీగా అందుతున్న విరాళాలు
-
ప్రగతి చారిటీస్కు వేమిరెడ్డి రూ.3 లక్షల విరాళం
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరులోని ప్రగతి చారిటీస్కు రాజ్యసభసభ్యుడు, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు రూ.3 లక్షల విరాళాన్ని అందజేశారు. మంగళవారం నెల్లూరులోని తన స్వగృహంలో వేమిరెడ్డి చెక్కు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా మానసిక వికలాంగులైన చిన్నారులకు చేయూతనివ్వడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. విద్యార్థినికి అభినందన పదో తరగతి ఫలితాల్లో 581 మార్కులు సాధించిన నెల్లూరు రూరల్ పరిధిలోని వీపీఆర్ విద్య విద్యార్థిని వైష్ణవిని రాజ్యసభసభ్యుడు, వీపీఆర్ ఫౌండేషన్ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఫౌండేషన్ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ ప్రతిభ చూపిన అమ్మా యిని ఫౌండేషన్ ద్వారా చదివిస్తామన్నారు. తమ విద్యాసంస్థలో చదివి ప్రథమ స్థానంలో వచ్చిన వారి ఉన్నత చదువులకు ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామన్నారు. వైష్ణవి వారికి ధన్యవాదాలు తెలిపింది. -
జొమాటో డెలివరీ పార్ట్నర్స్కి గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తన ఉదారత చాటుకున్నారు. సంస్థ డెలివరీ పార్ట్నర్స్ పిల్లల చదువుకు ఆర్థికంగా తోడ్పాటు అందించే దిశగా జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ (జెడ్ఎఫ్ఎఫ్)కు 90 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 700 కోట్లు) విలువ చేసే ఎసాప్స్ను (స్టాక్ ఆప్షన్స్) విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సంస్థ అంతర్గతంగా ఉద్యోగులకు ఆయన లేఖ రాశారు. జొమాటో పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి ముందు .. ఇన్వెస్టర్లు, బోర్డు ఆయన పనితీరు ప్రాతిపదికన కొన్ని ఎసాప్స్ను కేటాయించింది. వీటన్నింటినీ ఫౌండేషన్కు అందిస్తున్నట్లు గోయల్ తెలిపారు. ఇద్దరు పిల్లలకు గత నెలలో షేరు సగటు ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ. 700 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. అయిదేళ్లకు పైగా తమ డెలివరీ పార్ట్నర్స్గా పనిచేస్తున్న వారి పిల్లల (గరిష్టంగా ఇద్దరికి) చదువు ఖర్చుల కోసం ఏటా ఒక్కొక్కరికి రూ. 50,000 వరకూ ఈ ఫండ్ నిధులు అందిస్తుంది. అదే పదేళ్ల పైగా పని చేస్తున్న వారి పిల్లలకు ఏటా రూ. 1 లక్ష వరకూ లభిస్తుంది. మహిళా డెలివరీ పార్ట్నర్లకు ఈ పని కాలానికి సంబంధించి కొంత వెసులుబాటు ఉంటుంది. ఫండ్కు నిధులు సమకూర్చేందుకు తొలి ఏడాది తన ఎసాప్స్లో 10 శాతాన్ని విక్రయించనున్నట్లు గోయల్ పేర్కొన్నారు. చదవండి: శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది! -
ప్రస్తుత సర్కారుపై పోరుకు చందాలివ్వండి
ఇస్తే మొన్నటి గిఫ్్టలను కొట్టేసినట్లు కొట్టేస్తారని ఎవరూ ముందుకు రావడం లేద్సార్! -
చదివిన కాలేజీకి చేయూత.. రూ.100 కోట్ల విరాళం ఇచ్చిన వ్యాపారవేత్త
చదివిన కాలేజీకి అండగా నిలిచేందుకు ఓ వ్యాపారవేత్త ముందుకు వచ్చారు. కాలేజీలో కొత్త కోర్సు ప్రారంభించేందుకు భారీ విరాళం ఇచ్చారు. ఏకంగా వంద కోట్ల రూపాయలను అందించేందుకు ముందుకు వచ్చారు. ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వాల్ తోటి వ్యాపారవేత్తలకు ఆదర్శనంగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు. తాను చదివిన ఐఐటీ కాన్పూరు కాలేజీకి రూ. 100 కోట్ల భూరి విరాళం ప్రకటించారు. ఈ డబ్బుతో ఐఐటీ కాన్పూరులో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రారంభించనున్నారు. ఐఐటీ కాన్పూరుకి ఆ కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థులు ఎప్పుడూ అండగా ఉంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన వసతులు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే భవిష్యత్తు అవసరాల రీత్యా మెడికల్ ఇంజనీరింగ్పై ఈ కాలేజీ దృష్టి సారించింది. అయితే ప్రభుత్వం నుంచి నిధులు అందడానికంటే ముందే ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. వీరిలో రికార్డు స్థాయిలో రాకేశ్ గంగ్వాల్ ఏకంగా వంద కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. రాకేశ్ గంగ్వాల్ అందించిన నిధులతో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నారు. దీనికి గంగ్వాల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీగా పేరు పెట్టనున్నారు. మూడేళ్లలో భవన నిర్మాణ పనులు పూర్తవుతాయని అంచనా We are grateful to Mr Rakesh Gangwal, Mrs Shobha Gangwal and his daughter Ms Parul Gangwal who could take time and be present in person for the agreement signing in Mumbai today. @DoRA_IITK @IITKanpur @paniitindia pic.twitter.com/b0Umzdvv7E — Abhay Karandikar (@karandi65) April 4, 2022 -
బ్లడ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలి
సాక్షి,సిటీబ్యూరో: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ సెంటర్ ఏర్పాటుకు అందరు విరాళాలిచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. బుధవారం రెడ్ క్రాస్ ప్రతినిధులు కలెక్టర్ ను కలిసి బ్లడ్ సెంటర్ ఏర్పాటు, పనుల పురోగతిపై వివరించారు. ఈ సందర్భంగా దాతలు లారెన్స్ మాయో ఆప్టికల్స్ ఆఫీస్ కంప్యూటర్లను విశాల్ పెరిఫెరెల్స్, కలర్ ప్రింటర్ ను, డా. శ్యాంకాంత్ బసాకే రూ. 7500 చెక్కులను రెడ్ క్రాస్ సొసైటీకి విరాళంగా కలెక్టర్ కు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ సూర్యలత, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీం రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, రాధా కృష్ణ,, డా. సిసా తదితరులు పాల్గొన్నారు. -
ఐఐటీ ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్
న్యూఢిల్లీ: లైసెన్స్ రెన్యువల్ కాని కారణంగా దేశంలోని 5,789 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద లైసెన్స్ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ, తదితర కారణాలతో ఈ సంస్థల లైసెన్స్ రెన్యువల్ కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల గత లైసెన్స్ శనివారం(జనవరి ఒకటిన) ముగిసింది. ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్ఫామ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల లైసెన్స్ గడువు ముగిసింది. భారత్లోని ఎన్జీవోలు విదేశీ విరాళాలను సమీకరించాలంటే ఎఫ్సీఆర్ఏ కింద దరఖాస్తు చేసుకుని లైసెన్స్ను కలిగి ఉండటం తప్పనిసరి. శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22,762కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16,829కి తగ్గింది. -
మైక్రో డొనేషన్స్: ప్రధాని మోదీ విరాళం ఎంతో తెలుసా!!
Help Make BJP And India Strong: భారతీయ జనతా పార్టీకి "మైక్రో డొనేషన్స్" ద్వారా సహాయం చేయాలని బీజేపీ మద్దతుదారులను కోరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్లో ..." నేను భారతీయ జనతా పార్టీ ఫండ్కి రూ. 1,000 విరాళం ఇచ్చాను. ఎల్లప్పుడూ దేశానికి మొదటి స్థానం ఇవ్వాలనేది నా కోరిక. మా క్యాడర్ ద్వారా జీవితాంతం నిస్వార్థ సేవ చేసే సంస్కృతి మీ సూక్ష్మ విరాళం ద్వారా మరింత బలోపేతం అవుతుంది. బీజేపీని బలోపేతం చేయడంలో సహాయపడండి. (చదవండి: ప్రపంచపు తొలి డ్యూయల్ మోడ్ వాహనం అలాగే భారతదేశాన్ని బలంగా తయారు చేయడంలో సహాకరించండి ' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అంతేకాదు బీజేపీ నిధికి మోదీ విరాళంగా ఇచ్చిన రసీదు కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ జెపి నడ్డా కూడా పార్టీ ఫండ్కు రూ. 1,000 విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు నడ్డా ట్విట్టర్లో... నేను నమో యాప్ అనే 'డొనేషన్' మాడ్యూల్ని ఉపయోగించి బీజెపీని బలోపేతం చేయడంలో నా వంతు సహకారం అందించాను. అంతేకాదు రిఫరల్ కోడ్ని ఉపయోగించి ఈ ప్రజా ఉద్యమంలో స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా కనెక్ట్ చేయవచ్చు" అని ట్విట్ చేశారు. అయితే ఈ విరాళాలు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ ఈ భారీ డ్రైవ్ని ప్రారంభించింది. పైగా సూక్ష్మ విరాళాలు రూ. 5 నుండి రూ. 1,000 వరకు ఉండవచ్చు అని నడ్డా ట్విట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!) -
సీతమ్మ పెద్ద మనసమ్మ.. రూ.3 కోట్ల విలువైన..
సాక్షి, ఉండ్రాజవరం: సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు బాసటగా ఓ మహిళ భూరి విరాళం అందించింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్నులో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ పీహెచ్సీ నిర్మాణానికి దివంగత బూరుగుపల్లి సుబ్బారావు భార్య సీతమ్మ తన వంతుగా రూ.3 కోట్లకుపైగా విలువైన ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు. చదవండి: (వైఎస్సార్ జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుంది) ఈ నెల 21న సీఎం జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు నాడు ఆమె తన భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయమై గురువారం ఆమె మాట్లాడుతూ తన భర్త సుబ్బారావు జ్ఞాపకార్థం ఆస్పత్రి నిర్మాణానికి సహకారం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు జెడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కరరామయ్య, సొసైటీ అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణబ్రహ్మానందం, వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు శిరిగిన శివరాధాకృష్ణ, కరుటూరి శివరామకృష్ణ, గూడపాటి చెంచయ్య, శిరిగిన నర్సింహమూర్తి, ముళ్ళపూడి కేశవరావు, ఎం.కృష్ణారావు, ఎం.సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. -
కబురు చేస్తే చాలు.. పేదింటి పెళ్లికి పెద్దకొడుకు
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): జిల్లా కేంద్రంలోని పద్మనగర్కు చెందిన నాయుడు రమ (భర్త శ్రీధర్ చనిపోయారు) కూతురు వసంతకు శుక్రవారం వివాహం నిశ్చయమయ్యింది. అలాగే తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో ఉండే గాజుల లలిత కూతురు కీర్తి పెళ్లి కూడా ఇదే రోజున ఖాయమైంది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న వీరు పేదరికం కారణంగా తెలిసిన వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకుడు లగిశెట్టి శ్రీనివాస్ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన పెళ్లికి అవసరమైన పుస్తె మెట్టెలు, పెండ్లి చీర, గాజులను అందజేసి పేదింటి పెళ్లికి పెద్ద కొడుకు అవుతున్నాడు. ..ఇలా ప్రయోజనం పొందింది కేవలం వసంత, లలిత మాత్రమే కాదు. జిల్లా వ్యాప్తంగా నిరుపేద కార్మిక, కర్షక కుటుంబాలకు చెందిన ఎంతోమంది ఆడపిల్లలు కల్యాణ సాయం కింద పుస్తె, మెట్టెలను అందుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా నిరుపేద కుటుంబాలు ప్రయోజనం పొందాయి. ఆర్థికంగా చితికిపోయిన ఆడపిల్లల పెళ్లిళ్లకు తక్షణ సాయంగా పుస్తెమెట్టెలను అందిస్తూ సిరిసిల్లకు చెందిన లగిశెట్టి శ్రీనివాస్ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. నేపథ్యం.. ప్రస్తుతం పట్టణంలో వస్త్ర వ్యాపారం చేసే లగిశెట్టి విశ్వనాథం, దేవేంద్రమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్. 1971 మార్చి 5న జన్మించిన శ్రీనివాస్ తన తండ్రి నుంచి వారసత్వంగా అందివచ్చిన వ్యాపారాన్ని నిర్వహిస్తూ కాలానుగుణ మార్పులతో పారిశ్రామిక రంగంలో స్థిరపడ్డారు. ముతక రకం నూలు వస్త్రం తయారయ్యే కాలంలో ఆధునికంగా ఆలోచించి క్లాత్ ప్రాసెసింగ్ రంగాన్ని పరిచయం చేశారు. రాజకీయ రంగంలోనూ తన ఉనికి చాటుకున్నారు. అధికార పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే సహకార విద్యుత్ సరఫరా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్టు ద్వారా.. తన ఉన్నతికి కారణమైన పట్టణంలోని ప్రజానీకానికి తన వంతుగా సేవలు అందించాలని సంకల్పించి 2011లో తన పేరిట చారిటబుల్ ట్రస్టును స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రస్టు ద్వారా సమాజ సేవలను అందిస్తున్నాడు. విద్యార్థులకు నోట్ బుక్కులు, పుస్తకాలు, వృద్ధాప్యంలో ఉన్నవారికి దుప్పట్లు ఏటా వితరణ చేసే ఆయన తంగళ్లపల్లి మండలం పద్మనగర్లోని తన సొంత స్థలంలో సంతోషిమాత దేవాలయాన్ని నిర్మించారు. ఆలయానికి పరిసరాల్లో వృద్ధాశ్రమాన్ని కూడా స్థాపించారు. అవసాన దశలో అయినవాళ్ల నిరాదరణకు గురైన పేద వృద్ధులకు ఆశ్రయం కల్పించాడు. సుమారు 20మందికి పైగా వృద్ధులు ప్రస్తుతం వృద్ధాశ్రమంలో తల దాచుకుంటున్నారు. జన్మభూమి కోసం.. పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేయడం ప్రతి మనిషి కనీస కర్తవ్యం. ఇక్కడి ప్రజల ఆశీస్సులతో ఎదిగిన నేను నా వంతుగా సమాజానికి సేవలు అందించాలనుకున్నాను. ఆపన్నులకు అండగా ఉండేందుకు చారిటబుల్ ట్రస్టును స్థాపించా. వృద్ధాశ్రమ నిర్వహణతో పాటు పేదల పెళ్లిళ్లకు సహాయపడటం సంతృప్తి నిస్తోంది. పేదరికం పెద్ద చదువులకు ఆటంకం కావద్దని ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకరిస్తున్నా. ఇదంతా సంతోషిమాతా దేవితో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదంగా భావిస్తున్నా. – లగిశెట్టి శ్రీనివాస్, ట్రస్టు నిర్వాహకుడు చదవండి: అమ్మకానికి పెట్టి బుక్కయ్యాడు.. వాడి ప్రతిభకు పోలీసులే అవాక్కు! -
రూ.25వేల కోట్లు దానం చేసిన జుకర్బర్గ్ దంపతులు
వాషింగ్టన్: మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, అతని భార్య ప్రిసిల్లా ఛాన్ మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వివిధ వ్యాధులకు సంబంధించి లోతైన శాస్త్రీయ పరిశోధనలకోసం తమ స్వచ్ఛంద సంస్థ చాన్ జుకర్బర్గ్ ఇనిషియేటివ్ (సీజెడ్ఐ)ద్వారా రెండున్నర లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తొలుత రూ.25 వేల కోట్ల విరా ళాలు ఇస్తామని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో వైద్యరంగంలో నూతన పరిశోధనలు, కృత్రిమ మేథ మీద పనిచేసేందుకు హార్వర్డ్ యూనివర్సిటీలో నెలకొల్పుతున్న విద్యాసంస్థ కోసం మొదట రూ.3 వేల770 కోట్లు (500 మిలియన్ డాలర్లు) అందజేస్తామని, మరో పదిహేనేళ్లపాటు సంస్థకు నిధులు అందుతాయని సీజెడ్ఐ ప్రతినిధి జెఫ్ మెక్గ్రెగర్ తెలిపారు. ఆ సంస్థకు జుకర్బర్గ్ తల్లి కరేన్ కెంప్నెర్ జుకర్బర్గ్ పేరు పెట్టనున్నారు. ఇక రూ.4,500కోట్ల నుంచి రూ.6.7వేల కోట్ల వరకు సీజెడ్ఐలోని బయోమెడికల్ ఇమేజింగ్ ఇనిస్టిట్యూట్కు అందజేయనున్నట్లు తెలిపారు. ఇక మరో వంద కోట్ల రూపాయలను చాన్ జుకర్బర్గ్ బయోహబ్ నెట్వర్క్కు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. -
మూడు చక్రాలు తిరిగితేనే మూడుపూటలా తినేది.. అంతలోనే మాయదారి రోగం
సాక్షి,కాజీపేట అర్బన్: మూడు చక్రాలు తిరిగితేనే ఆ కుటుంబం మూడుపూటలా కడుపునిండా తినేది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ.. ఆనందంగా గడుపుతున్న చిన్న కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఆటో నడుపుతూ జీవనం సాగించే వ్యక్తికి రెండు కిడ్నీలు పాడై మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం దిక్కుతోచిన స్థితిలో పడింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం దర్గా కాజీపేటలోని రామాలయం వీధికి చెందిన మునిగాల జాకోబ్ యాదయ్య, నాగమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా, తండ్రి యాదయ్య 2010లో కాలం చేయగా.. చిన్న కుమారుడు మునిగాల సందీప్ తన తండ్రి నుంచి వారసత్వంగా ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాడు. 2014లో ఖమ్మం జిల్లాకు చెందిన సునీతను సందీప్ వివాహం చేసుకున్నాడు. (చదవండి: అడిగే దిక్కెవరు.. ఎక్కడ పడితే అక్కడే కోతలు.. మటన్.. మంచిదేనా? ) 2016లో కుటుంబంలో కిడ్నీ భారం.. ఆనందంగా సాగుతున్న సందీప్ జీవితానికి కిడ్నీ సమస్య శాపంగా మారింది. 2016 మార్చి నెలలో శరీరంలో పలు మార్పులు వస్తుండడంతో సందీప్ హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లగా, కిడ్నీలు 70 శాతం మేర శక్తిని కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో నాటి నుంచి రెండు కిడ్నీలకు డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఒక రోజు ఆటో.. మరో రోజు డయాలసిస్.. సందీప్ ఆటో నడిపితేనే గాని కుటుంబం గడవని స్థితి. దీనికితోటు డయాలసిస్ తప్పనిసరి. దీంతో ఒక రోజు ఆటోనడపగా వచ్చిన డబ్బులకు తోడు అప్పలు చేసి కుటుంబాన్ని పోషించడంతోపాటు డయాలసిస్ చేయించుకునేవాడు. ఆస్పత్రికి వెళ్లిన ప్రతీసారి డయాలసిస్, మందులకు కలిపి సుమారు రూ.10 నుంచి రూ.15వేల ఖర్చు అవుతుంది. తల్లి నాగమణెమ్మ తెలిసివారి దగ్గర అప్పులు చేస్తూ కొడుకు ఆరోగ్యం బాగుపడాలని ఖర్చు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఒంట్లో సత్తువను కోల్పోయిన సందీప్ ఏడాది నుంచి మంచానికే పరిమితమైపోయాడు. దీంతో భార్య సునీత, తల్లి నాగమణమ్మ సందీప్కు మంచంపైనే సపర్యలు చేస్తున్నారు. (చదవండి: Vikarabad: ఇక్కడ డీజిల్ లీటర్ రూ.95, కర్ణాటకలో రూ. 85 ) డిసెంబర్లో కిడ్నీ మార్పిడి సందీప్కు రెండు కిడ్నీలు పాడైపోవడంతో తల్లి నాగమణెమ్మ కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే కిడ్నీ మార్పిడి ఆపరేషన్కు రూ.7 నుంచి రూ.10లక్షల ఖర్చు అవుతుందని, డిసెంబర్లో చేయించుకుంటేనే ఫలితం ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆటో నడిపే పరిస్థితి లేదు.. మరో వైపు అప్పుల భారం.. దిక్కుతోచని స్థితిలో దాతల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. దాతలారా.. స్పందించండి అకౌంట్ నంబర్ 261313898 కొటక్ మహీంద్రబ్యాంక్ కేకేబీకే0000572 వరంగల్ ఫోన్ పే నంబర్ : 70322 22148 చదవండి: Comments On Virat Kohli Daughter: కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు: వైరల్ కావడంతో ఆత్మహత్యకు ప్లాన్! -
విరాళాల సేకరణలో శివసేన టాప్
సాక్షి, న్యూఢిల్లీ: 2019–20 ఆర్థిక సంవత్సరంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు వచ్చిన విరాళాలు 37,794 శాతం, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)కి విరాళాలు 410 శాతం, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి 317 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి 156 శాతం పెరిగాయి. 2018–19లో జేఎంఎంకు 0.017 కోట్లు, ఎల్జేపీకి 0.515 కోట్లు, ఎస్పీకి రూ.1.054 కోట్లు రాగా, 2019–20లో ఆయా పార్టీలకు వరుసగా రూ.6.442 కోట్లు, రూ.2.629 కోట్లు, రూ.4.392 కోట్లు వచ్చాయి. పలు ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రూపొందించిన నివేదిక శుక్రవారం విడుదలయ్యింది. 2019–20లో అత్యధిక విరాళాలు ప్రకటించిన టాప్–5 పార్టీల్లో శివసేన, ఏఐఏడీఎంకే, ఆప్, బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. 2018–19లో కంటే 2019–20లో తమకు విరాళాలు తగ్గాయని శివసేన, బీజేడీ, వైఎస్సార్సీపీ ప్రకటించగా, తాము స్వీకరించిన విరాళాలు పెరిగాయని ఏఐఏడీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించాయి. టాప్–5 పార్టీలకు రూ.189.523 కోట్లు తమకు అందినట్లుగా 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాల మొత్తం రూ.233.686 కోట్లుగా ఉందని ఏడీఆర్ గుర్తించింది. ఇందులో రూ.62.859 కోట్లతో శివసేన ముందంజలో ఉంది. ఆ తర్వాత ఏఐఏడీఎంకే రూ.52.17 కోట్లను స్వీకరించినట్లు ప్రకటించింది. మూడో స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ రూ.37.37 కోట్లు అందుకుంటున్నట్లు తెలిపింది. ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో 81.10 శాతం.. అంటే రూ.189.523 కోట్లు కేవలం టాప్–5 ప్రాంతీయ పార్టీలకే అందాయి. తగ్గిన విరాళాలు 2018–19 నాటి విరాళాలతో పోలిస్తే 2019–20లో జేఎంఎం, ఎల్జేపీ, ఎస్పీ, ఆప్లకు విరాళాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో వైఎస్సార్సీపీకి రూ.71.651 కోట్లు, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి రూ.40.876 కోట్లు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి రూ.23.573 కోట్లు, శివసేనకు రూ.7.371 కోట్లు, జేడీయూకు రూ.7.098 కోట్ల మేర విరాళాలు తగ్గాయి. ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం రూ.233.686 కోట్ల విరాళాలలో, 2019–20 ఆర్థిక సంవత్సరంలో 421 విరాళాల నుండి రూ.4.884 కోట్లు నగదు రూపంలో స్వీకరించాయి. ఇది పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలలో 2.09% అని నివేదికలో పేర్కొన్నారు. అత్యధికంగా మహారాష్ట్ర నుంచే విరాళాల కింద అత్యధికంగా మహారాష్ట్ర నుంచి రూ.110.475 కోట్లు, ఢిల్లీ నుంచి రూ.46.24 కోట్లు, కర్ణాటక నుంచి రూ.9 కోట్లు అందుకున్నట్లు ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలకు కార్పొరేట్/వ్యాపార రంగాల నుంచి విరాళాల ద్వారా రూ.181.522 కోట్లు రాగా, 5,916 మంది వ్యక్తిగత దాతలు రూ.42.48 కోట్లు ఇచ్చారు. అదే సమయంలో మరో రూ.30.766 కోట్ల విరాళాల సమాచారాన్ని పార్టీలు బయటపెట్టలేదు. విరాళాలు స్వీకరించినట్లు ప్రకటించిన 27 ప్రాంతీయ పార్టీలలో 16 పార్టీలు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) వివరాలు లేకుండా రూ.24.779 కోట్ల విరాళాలు స్వీకరించినట్లు వెల్లడించాయి. కాగా, 14 ప్రాంతీయ పార్టీలు.. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేడీ, డీఎంకే, శివసేన, ఆప్, జేడీయూ, ఎస్పీ, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్, ఏఐఏడీఎంకే, ఆర్జేడీ, జేఎంఎంలు రూ.447.498 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్డీపీపీ, డీఎండీకే, జేకేఎన్సీ పార్టీలు తాము అందుకున్న విరాళాల వివరాలను ప్రకటించలేదు. -
ఫేస్బుక్ను బద్నామ్ చేసింది అతడేనా..!
Facebook Whistleblower Frances Haugen Funded By Founder Of Ebay: గత కొద్ది రోజుల నుంచి ఫేస్బుక్పై అనేక ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. కొంతమంది వ్యక్తుల కోసమే ఫేస్బుక్ పనిచేస్తుదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కంపెనీపై దుమ్మెతి పోసింది. కొంత మంది వీఐపీల ప్రైవసీ విషయంలో ఫేస్బుక్ వారిని అందలాలను ఎక్కిస్తోందని వాల్స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేయగా... జర్నల్తో పాటుగా ఫేస్బుక్ విజిల్బ్లోయర్ ఫ్రాన్సెస్ హాగెన్ అనే మాజీ ఉద్యోగిని కూడా కంపెనీపై తీవ్ర ఆరోపణలను చేసింది. చదవండి: Facebook: నువ్వేం తోపు కాదు..! చట్టం ముందు అందరు సమానులే..! ఫేస్బుక్ విజిల్ బ్లోయర్ వెనుక..! ఫేస్బుక్ దృష్టిలో యూజర్ల‘భద్రత కంటే లాభాలే ముఖ్యం’ అంటూ యూఎస్ కాంగ్రెస్ వేదికగా పలు సంచలన రహస్య పత్రాలను ఫేస్బుక్ విజిల్బ్లోయర్ తెలిపింది. సంచలన విషయాలను బయటపెట్టిన ప్రాన్సెస్ హాగెన్ వెనుక ఎదో అదృశ్య శక్తి ఉండే ఉంటుందని పలువురు నిపుణులు భావించారు. ఇప్పుడు అదే నిజమైంది. యూఎస్ కాంగ్రెస్ ఎదుట ఫేస్బుక్ పరువు తీసిన ఫేస్బుక్ మాజీ ఉద్యోగి హాగెన్ వెనుక ఈబే వ్యవస్థాపకుడు పియరీ ఒమిడ్యార్ ఉన్నట్లు ప్రముఖ యూఎస్ మీడియా సంస్థ పొలిటికో వెల్లడించింది. గత ఏడాది ఈబే సంస్థ సుమారు 150000 లక్షల (సుమారు రూ. 1.12 కోట్లు)డాలర్లను ఫ్రాన్సెస్ హాగెన్ విరాళంగా ఇచ్చినట్లు పొలిటికో పేర్కొంది. పియరీ ఒమిడ్యార్కు చెందిన సంస్థ లూమినేట్ ఫ్రాన్సెస్ హాగెన్కు యూరప్లో కూడా పీఆర్ సేవలను అందించింది. కాగా పొలిటికో వెల్లడించిన పలు అంశాలపై హాగెన్, ఒమిడ్యార్ ఎలాంటి వ్యాఖ్యలను చేయలేదు. పియరీ టెక్ క్రిటిక్..! పియరీ ఓమిడ్యార్ సుప్రసిద్థ టెక్ క్రిటిక్. పలు దిగ్గజ టెక్ కంపెనీలను విమర్శించడంలో పియరీ ఎప్పుడు ముందుంటారు. గతంలో హవాయిలో స్వతంత్ర జర్నలిజం కోసం తన వంతుగా న్యాయవాద ప్రయత్నాలను, కంపెనీల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా అనేక ప్రచారాలు, పలు కంపెనీల్లోని ఉద్యోగులకు క్రియాశీల మద్దతును పియరీ అందించారు. చదవండి: ఫేస్బుక్ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...! -
Andhra Pradesh: కోవిడ్ బాధితులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన మహీంద్రా గ్రూప్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ రూ.4 కోట్ల సాయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించాలని మహీంద్రా కంపెనీ నిర్ణయం తీసుకుంది. విశాఖలో 500 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్, కర్నూలులో 1000 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణాలను చేపట్టనుంది. ప.గో.జిల్లాకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించనుంది. చిత్తూరు, తూ.గో.జిల్లాలకు రెండు అంబులెన్స్లను మహీంద్రా కంపెనీ అందించింది. -
బీజేపీకి అత్యధికంగా రూ. 276 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు 2019–20లో వచ్చిన విరాళాల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. మొత్తం ఏడు ఎలక్టోరల్ ట్రస్ట్ల నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి అత్యధికంగా రూ. 276.45 కోట్లు విరాళంగా వచ్చాయి. ఇది మొత్తం విరాళాల్లో 76.17%. ఆ తరువాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్కు 15.98% (రూ. 58 కోట్లు) విరాళాలు మాత్రమే వచ్చాయని బుధవారం ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అత్యధికంగా విరాళాల ఇచ్చిన సంస్థల్లో జేఎస్డబ్ల్యూ, అపోలో టైర్స్, ఇండియాబుల్స్, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డీఎల్ఎఫ్ గ్రూప్ తొలి ఐదుస్థానాల్లో ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ అత్యధికంగా రూ. 39.10 కోట్లను ఇవ్వగా, అపోలో టైర్స్ రూ. 30 కోట్లను, ఇండియాబుల్స్ రూ. 25 కోట్లను విరాళంగా ఇచ్చాయి. 18 మంది వ్యక్తులు కూడా వ్యక్తిగత విరాళాలను ఈ ట్రస్ట్లకు అందించారు. వారిలో 10 మంది ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్కు మొత్తం రూ. 2.87 కోట్లను అందించారు. స్మాల్ డొనేషన్స్ ఎలక్టోరల్ ట్రస్ట్కు ఐదుగురు వ్యక్తులు రూ. 5.5 లక్షలు ఇచ్చారు. మరో నలుగురు స్వదేశీ ఎలక్టోరల్ ట్రస్ట్కు రూ. 1 లక్ష ఇచ్చారు. ఇతర పార్టీల్లో ఆప్, శివసేన, సమాజ్వాదీ పార్టీ, యువ జనజాగృతి పార్టీ, జననాయక పార్టీ, జేడీయూ, జేఎంఎం, ఎల్జేపీ, శిరోమణి అకాలీదళ్, జేకేఎన్సీ, ఐఎన్ఎల్డీ, ఆర్ఎల్డీ పార్టీలు కలిసి రూ. 25.46 కోట్లు అందుకున్నాయి. విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతీ సంవత్సరం నివేదిక రూపంలో తమకు అందించాలని ఎన్నికల సంఘం ఎలక్టోరల్ ట్రస్ట్లను ఆదేశించిన విషయం తెలిసిందే. -
అత్యధికంగా విరాళాలు ఎవరు ఇచ్చారో తెలుసా..? బిల్గేట్స్ మాత్రం కాదు..
భారత పారిశ్రామిక పితామహుడుగా పేరొందిన జంషెడ్జీ టాటాకు అరుదైన గౌరవం దక్కింది. గత శతాబ్దకాలంలో దాతృత్వాన్ని చాటడంలో హురున్ రిపోర్ట్, ఎడెల్గైవ్ ఫౌండేషన్ రూపొందించిన రిపోర్ట్లో జేఆర్ టాటా నంబర్.1 స్థానంలో నిలిచారు. సుమారు జేఆర్ టాటా 102 బిలియన్ల డాలర్ల(7.5 లక్షల కోట్ల)ను వివిధ సామాజిక కార్యాక్రమాలకోసం విరాళాలుగా ఇచ్చారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత విరాళాలను ఇచ్చిన వ్యక్తిగా జేఆర్ టాటా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం టాటా కంపెనీ ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ పనుల వరకు చేస్తోంది. జేఆర్ టాటా తరువాత , బిల్గేట్స్ అతని భార్య మిలిందా గేట్స్ సుమారు 74.6 బిలియన్ల డాలర్లతో రెండో స్థానంలో , వారెన్ బఫెట్ 37.4 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో , జార్జ్ సోరోస్ 34.8 బిలియన్ డాలర్లతో నాలుగో స్ధానంలో నిలిచారు. గత శతాబ్ద కాలంలో అమెరికన్, యూరోపియన్కు చెందిన బిలియనీర్లు సామాజిక కార్యక్రమాలను చేయడంలో ముందున్నా..టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాను అధిగమించడంలో వెనుకబడ్డారని హురున్ చైర్మన్, పరిశోధకుడు రూపెర్ట్ హూగ్వెర్ఫ్ విలేకరులతో అన్నారు. కంపెనీ లాభాల్లో మూడింట రెండు వంతులు విద్య, ఆరోగ్య సంరక్షణతో సహా వివిధ రంగాలకు విరాళాలను కేటాయించడంతో జంషెట్జీ టాటా ముందంజలో నిలిచారు. విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్జీ, తన మొత్తం సంపాదనలో 22 బిలియన్ డాలర్లను సామాజిక కార్యక్రమాలను చేపట్టడానికి విరాళంగా ఇచ్చారు. హురున్ రిపోర్ట్, ఎడెల్గైవ్ ఫౌండేషన్ రూపొందించిన రిపోర్ట్లో టాప్ 50 మందిలో యూఎస్ నుంచి 38 మంది, యూకే నుంచి ఐదుగురు, చైనా నుంచి ముగ్గురు నిలిచారు. చదవండి: చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్..! -
విరాళం ఇచ్చిన యువతికి ఉద్యోగం
సేలం: కరోనా నివారణ నిధి కోసం తన మెడలో ఉన్న రెండు సవర్ల చైన్ను తాకట్టు పెట్టి విరాళంగా ఇచ్చిన యువతికి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం లభించింది. సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాలతో ఆమెకు ఉద్యోగం వచ్చినట్లు వెలుగు చూసింది. నామక్కల్కు చెందిన సౌమ్య కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ఈనెల 12న మేట్టూరుకు సీఎం స్టాలిన్ రావడంతో ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. తన మెడలోని రెండు సవర్ల చైన్ను తాకట్టు పెట్టి సీఎం కరోనా నివారణ నిధికి అందజేశారు. తనకు ఓ ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. ఆమెలోని మానవత్వాన్ని మెచ్చిన సీఎం ఆ చైన్ను విడిపించడమే కాకుండా, ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేయాలని ఆదేశించారు. ఆ మేరకు ఓ ప్రైవేటు సంస్థలో రూ. 17 వేల జీతంతో సౌమ్యకు కంప్యూర్ ఇంజినీర్ ఉద్యోగం దక్కింది. నియామక పత్రాన్ని విద్యుత్శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ మంగళవారం ఆమెకు అందజేశారు. అలాగే ఫోన్లో సీఎంతో మాట్లాడించారు. దీంతో ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోయింది. చదవండి: బాలుడి దయార్థ హృదయానికి తమిళ సీఎం ఫిదా! -
Aari Arujunan: బిగ్బాస్ ఫేమ్ ఆరి దాతృత్వం
తమిళసినిమా: కరోనా మహమ్మారి పేద కుటుంబాలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోంది. అభాగ్యుల పరిస్థితి వర్ణనాతీతం. అలాంటి వారి ఆకలి దప్పికలు తీర్చడానికి పలువురు మానవతావాదులు ముందుకొస్తున్నారు. అదే విధంగా నటుడు ఆరి కూడా పేదవారి కడుపులు నింపడానికి సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన బిగ్బాస్ రియాల్టీ షోలో విన్నర్గా నిలిచిన ఈయన ఇప్పటికే మారువోమ్ మాట్రువోమ్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తిరువణ్ణామలైలోని గిరివలం ప్రాంతంలో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఆ ప్రాంతంలోని 100 మంది పేదలకు అన్నం పొట్లాలు అందించారు. చదవండి: ‘రియల్ హీరో’ మరో కీలక నిర్ణయం.. ‘సంభవం’ పేరుతో.. -
కరోనా నివారణ నిధికి రూ.కోటి విరాళం
చెన్నై: కరోనా నివారణకు విరాళాలు ఇవ్వాలన్న సీఎం విజ్ఞప్తికి బాగా స్పందన వస్తోంది. ప్రముఖ సినీ నిర్మాత, శ్రీ గోకులం చిట్ఫండ్ అండ్ ఫైనాన్స్ అధినేత గోపాలన్ రూ.కోటి విరాళంగా అందించారు. ఆయన గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి చెక్కు అందజేశారు. ఆయన వెంట చిట్ఫండ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైజూ గోకుల్, డైరెక్టర్ ఆపరేషన్స్ ప్రవీణ్ ఉన్నారు. -
కన్నడ స్టార్ యశ్ భారీ విరాళం
లాక్డౌన్ వల్ల ఎంతోమంది జీవితాలు రోడ్డున పడ్డాయి. బయటకు రంగులమయంగా కనిపించే ఇండస్ట్రీ మీద కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. షూటింగ్లు జరిగేతే కానీ పట్టెడన్నం దొరకని చిన్నాచితకా సినీకార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు రంగం సిద్ధం చేశాడు కన్నడ స్టార్ యశ్. కన్నడ చిత్రపరిశ్రమలోని సినీకార్మికుల కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. మూడు వేల మంది కార్మికులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు 1.5 కోట్లు విరాళంగా ఇస్తూ మంచి మనసు చాటుకున్నాడు. "కరోనా వైపరీత్యం వల్ల కన్నడ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. చిత్రరంగంలోని 21 విభాగాలకు చెందిన మూడు వేలమందికి తలా 3,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను ఆర్జించిన సంపాదనలో నుంచి ఇస్తున్నాను. ఈ చిన్నపాటి ఆర్థిక సాయం వారికి శాశ్వత పరిష్కారం చూపించకపోవచ్చు. కానీ మళ్లీ మంచి రోజులు వస్తాయని నమ్మకంతో ఉందాం" అంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు. యశ్ తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నావ్ అంటూ కీర్తిస్తున్నారు. #togetherwestand #humanity pic.twitter.com/46FYT9pThz — Yash (@TheNameIsYash) June 1, 2021 చదవండి: KGF Chapter 2 : అరుదైన రికార్డు సాధించిన ‘రాఖీ భాయ్’ -
పీఎం కేర్స్కి విరాళం.. అయినా తల్లికి బెడ్డు దొరకలేదు..
న్యూఢిల్లీ : మీరు అడిగినంత విరాళం పీఎం కేర్స్కి పంపిస్తాను... దయచేసి థర్డ్ వేవ్ సమయానికి ఆస్పత్రిలో ఓ బెడ్ నా కుటుంబానికి రిజర్వ్ చేసి పెడతారా ? అంటూ ప్రధాన మంత్రి కార్యాలయానికి రిక్వెస్ట్ పంపాడో వ్యక్తి. కరోనా సెకండ్ వేవ్లో తన తల్లికి కరోనా సోకిందని.. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఒక్క బెడ్ సంపాదించలేకపోయానంటూ ఆ వ్యక్తి పేర్కొన్నాడు. తన కుటుంబంలో ఇంకో వ్యక్తిని కోల్పోయేందుకు సిద్ధంగా లేనని... అందుకే థర్డ్ వేవ్ నాటికి తనకు ఓ బెడ్ కావాలంటూ రిక్వెస్ట్ పంపాడు. విజయ్పారిఖ్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా పీఎంవోను రిక్వెస్ట్ చేశాడు రూ.2.51 లక్షల విరాళం గతంలో పీఎంకేర్ ఫండ్కి రూ.2.51 లక్షల రూపాయలను విజయ్ పారిఖ్ విరాళంగా అందించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభనంలో ఆయనకు వైద్య రంగం నుంచి భరోసా లభించలేదు. కనీసం బెడ్ కూడా దొరక్క తల్లిని కోల్పోయాడు. దీంతో పీఎంకేర్స్కి తన ఆవేదన ఇలా వ్యక్తం చేశాడు -
సేవా ‘మార్గం’.. ‘డాక్టర్స్’ ఔదార్యం
కరోనా మానవ సంబంధాలను దూరం చేస్తోంది. అయిన వారిని సైతం కాకుండా చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్ బాధితులకు మేమున్నామంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. వారికి అవసరమైన మందులు, ఆహారాన్ని ఉచితంగా అందించడమే కాకుండా.. నేరుగా వారి ఇంటికే వెళ్లి వారిలోని ఆందోళనను తొలగించేలా మనో స్థైర్యాన్ని నింపుతున్నాయి. విజయవాడలోని మార్గం ఫౌండేషన్ కూడా ఇదే విధంగా హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్న రోగులకు రోజూ రెండు వందల మందికి భోజనాన్ని పంపిణీ చేస్తోంది. ఆహారం ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న ‘మార్గం’ సభ్యులను చిత్రంలో చూడొచ్చు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ ‘డాక్టర్స్ ఫర్ యూ’ ఔదార్యం విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రికి డాక్టర్స్ ఫర్ యూ ఆర్గనేషన్ సంస్థ 8 లక్షల రూపాయల విలువచేసే మూడు జంబో ఆక్సిజన్ సిలెండర్లను వితరణ చేసింది. వీటిని కొత్త ప్రభుత్వాసుపత్రి ఆవరణలోడాక్టర్స్ ఫర్ యూ ఆర్గనేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్కు అందజేశారు. క్రయోజనిక్ లిక్విడ్ ఆక్సిజన్ జంబో సిలెండర్ల ద్వారా ఎక్కువ మందికి ప్రాణవాయువు సరఫరా చేసే వీలు కలుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. డాక్టర్స్ ఫర్ యూ ఆర్గనేషన్ సంస్థ ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. గతంలోనూ ఈ సంస్థ బెడ్లు, మాస్క్లు, కిట్స్ అందించిన విషయాన్ని గుర్తు చేశారు. పెద్దయ్యాక సీఎం అవుతా.. ఓ చిన్నారి ఆకాంక్ష -
ఏపీలో కరోనా కట్టడికి కియా మోటార్స్ విరాళం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 నియంత్రణలో భాగంగా సహాయ చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్ధకి (ఏపీఎస్డిఎంఏ) కియా మోటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది. విరాళానికి సంబంధించిన నిధులను ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, క్రయోజనిక్ ట్యాంకర్లు తదితర వైద్య పరికరాల కొనుగోలుకు వినియోగించాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. నెఫ్ట్ ద్వారా బదిలీ చేసిన విరాళానికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆ సంస్థ ఎండీ, సీఈవో కుక్ హ్యున్ షిమ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, కియా మోటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లీగల్, కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ జ్యూడ్ లి, కియా ఇండియా ప్రిన్సిపల్ అడ్వైజర్ టి.సోమశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
ఆ ఫౌండేషన్ నాది కాదు: సోనూసూద్
ముంబై: లాక్డౌన్ కాలంలో పేదల అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన అనుచరులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేశారు. తన పేరు మీద విరాళాలు వసూలు చేస్తున్న ఓ ఫౌండేషన్ గురించి ఆయన హెచ్చరించారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో, తన ఫొటోను పెట్టుకున్న ఓ నకిలీ సంస్థకు చెందిన వ్యక్తులు విరాళాలు వసూలు చేస్తున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ సంస్థ గురించి తెలిస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. -
కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: ముఖ్యమంత్రి పిలుపు
సాక్షి ప్రతినిధి, చెన్నై : కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు దాతలు ముందుకు వచ్చి చేయూత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు, సామాజిక సంస్థలు, భారీ పరిశ్రమల యాజమాన్యాలను ఉద్దేశించి సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రజల జీవనా«ధారం దెబ్బతినిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కుంటువండిందని పేర్కొన్నారు. సహాయ చర్యల కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వెల్లడించారు. ఆర్థికంగా పునరుత్తేజం పొందడానికి ప్రభుత్వం అనేక అవకాశాలను అన్వేషిస్తోందని తెలిపారు. ప్రజా బాహుళ్యంలోని సంఘాలు, సంస్థలు తోచిన రీతిలో సహాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. విరాళాలు, ఖర్చు వివరాలను వెబ్సెట్లో పొందుపరుస్తామని తెలిపారు. దాతల విరాళాలపై 80 (జీ) కింద వంద శాతం పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐల నుంచి పొందే విరాళాలపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చని వివరించారు. ఆన్లైన్, బ్యాంకు అకౌంట్ ద్వారా విరాళమిచ్చి రసీదు పొందవచ్చని తెలిపారు. దాత లు తమ విరాళాలను నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మాత్రమే సమరి్పంచాలని పేర్కొన్నారు. రూ.10 లక్షలకు పైగా విరాళం ఇచ్చే దాతలు, సంస్థల పేర్లను వార్తాపత్రికల్లో ప్రచురిస్తామని వెల్లడించారు. ఇచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కరోనా నివారణ చర్యల కోసం మాత్రమే వినియోగిస్తామని హామీ ఇస్తున్నట్టు తెలిపారు. చదవండి: అన్నాడీఎంకేకు మరో షాక్: చేజారనున్న ‘పెద్దరికం’ చదవండి: కలుపుగోలు సీఎం: స్టాలిన్ కొత్త సంప్రదాయం -
TNR కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన డైరెక్టర్ మారుతి
ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్ఆర్ ఇటీవలె కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనే షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీఎన్ఆర్కు ఇటీవలె కరోనా సోకింది. మొదట హోం ఐసోలేషన్లో ఉన్న టీఎన్ఆర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. టీఎన్ఆర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు కొందరు టీఎన్ఆర్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను టీఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సైతం లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసింది. తాజాగా డైరెక్టర్ మారుతి టీఎన్ఆర్ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. తన వంతు సాయంగా 50 వేల రూపాయలను అందించారు. ఈ మేరకు టీఎన్ఆర్ భార్య జ్యోతి బ్యాంక్ అకౌంట్కు నగదును పంపించారు. అదే విధంగా ప్రతి ఒక్కరు తమకు తోచినంత సహాయం చేయాల్సిందిగా మారుతి సూచించారు. It's time to show our solidarity for our friend in media TNR we miss you, but we are with your family. Let's support #TNR's family pic.twitter.com/rLUfavz9EX — Director Maruthi (@DirectorMaruthi) May 13, 2021 చదవండి : TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్ఆర్ చివరి పాట TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్ఆర్ -
TNR కుటుంబానికి అండగా ప్రముఖ నిర్మాణ సంస్థ
ప్రముఖ యాంకర్, నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి) కరోనా కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కోవిడ్ బారిన పడిన ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. టీఎన్ఆర్ మృతి పట్ల సనీ ప్రముఖులు దిగ్భ్రాంతి తెలపడంతో పాటు ఆర్థిక సాయం చేసి ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. మంగళవారం మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను టీఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబానికి ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసింది. ‘ప్రముఖ సినీ జర్నలిస్ట్,యాంకర్, సినీ నటుడు టీఎన్ఆర్ ఆకస్మిక మరణవార్త విని మేము దిగ్భ్రాంతికి గురయ్యాం. తక్షణ ఖర్చుల నిమిత్తం టీఎన్ఆర్ కుటుంబానికి రూ.1 లక్షను ఆర్థిక సాయంగా అందించాలని నిర్ణయించుకున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఓం శాంతి’అని నిర్మాణ సంస్థ పేర్కొంది. చదవండి: TNR కుటుంబానికి చిరంజీవి, సంపూర్ణేష్ బాబు ఆర్థిక సహాయం TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్ఆర్ చివరి పాట -
బాలుడి దయార్థ హృదయానికి తమిళ సీఎం ఫిదా!
సాక్షి, చెన్నై: భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఆక్సిజన్ కొరతతో రోజూ వందల మంది ప్రాణాలు విడిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రముఖులు, సెలబ్రెటీలు, మల్టీనేషనల్ కంపెనీలు భారీ మొత్తంలో విరాళాలను ఇచ్చాయి. రియల్ హీరో సోనూసూద్ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన హరిశ్వర్మాన్ అనే బాలుడు తన కోసం సైకిల్ కొనడానికి డబ్బులు దాచుకున్నాడు. అయితే ఆ డబ్చును కోవిడ్-19 నివారణ రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చాడు. దీంతో బాలుడి దాన గుణానికి మెచ్చిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హరిశ్వర్మాన్కు బహుమతిగా కొత్త సైకిల్ను ప్రదానం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తమిళనాడు సీఎం బహుమతిగా ఇచ్చిన కొత్త సైకిల్ను నడుపుతున్న వీడియోని మే 9న సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు రెండు లక్షల మంది వీక్షించారు. హరిశ్వర్మాన్ దాన గుణానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘‘హరిశ్వర్మాన్ అనే బాలుడు తన కోసం సైకిల్ కొనడానికి దాచుకున్న డబ్బును కోవిడ్-19 నివారణ రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చాడు. అది నన్ను కదిలించింది. నేను ఆ బాలుడికి బహుమతిగా కొత్త సైకిల్ ఇస్తున్నాను. ఇదే తమిళనాడు ప్రజల బలం.’’ అని సీఎం అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా తమిళనాడులో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10న లాక్డౌన్ విధించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14.1 లక్షల కేసులు నమోదు కాగా..12.6 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా15,880 మంది మరణించారు. (చదవండి: నెటిజన్లను మెప్పిస్తున్న పెంగ్విన్లు: వైరల్ వీడియో) ஹரீஸ்வர்மன் என்ற சிறுவன் தனக்கு மிதிவண்டி வாங்குவதற்காக வைத்திருந்த உண்டியல் தொகையை #COVID19 தடுப்பிற்காக முதலமைச்சர் நிவாரண நிதிக்கு அனுப்பிய செய்தி கேட்டு நெகிழ்ந்தேன். இத்தகைய உணர்வே தமிழகத்தின் வலிமை! சிறுவனுக்கு மிதிவண்டி வாங்கிக் கொடுத்து தொலைபேசியில் அழைத்து வாழ்த்தினேன் pic.twitter.com/vNtWpj5SCe — M.K.Stalin (@mkstalin) May 9, 2021 -
కోవిడ్ సంక్షోభం: భారత్కు మద్దతుగా ట్విటర్ భారీ విరాళం
వాషింగ్టన్: భారత్లో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో రోజు వందల మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు, నటీనటులు, మల్టీనేషనల్ కంపెనీలు భారత్కు అండగా నిలుస్తున్నారు. కరోనాపై భారత్ చేస్తోన్న యుద్ధంలో ప్రపంచంలోని ఇతర దేశాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి.అంతేకాకుండా ప్రపంచంలోని టెక్ దిగ్గజ కంపెనీలు గూగల్, మైక్రోసాఫ్ట్ భారీ మొత్తంలో భారత్కు విరాళాలను ఇచ్చాయి. తాజాగా కరోనాపై భారత్ చేస్తోన్న పోరులో ట్విటర్ భారీ విరాళాన్ని కేటాయించింది. ట్విటర్ అధినేత జాక్ పాట్రిక్ డోర్సే సుమారు 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ.110 కోట్ల) విరాళాన్ని భారత్కు అందిస్తున్నట్లు ట్విటర్లో తెలిపారు. భారత్లో కోవిడ్-19 ఎదుర్కొనేందుకుగాను పాటుపడుతున్న మూడు ఎన్జీవో సంస్థలకు విరాళాన్ని అందించాడు. ఈ విరాళాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విటర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే సోమవారం ట్వీట్ చేశారు. కేర్ స్వచ్చంద సంస్థకు 10 మిలియన్ డాలర్లు, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషన్ యూఎస్ఏలకు 2.5 మిలియన్ డాలర్ల చొప్పున విరాళాన్ని కేటాయించాడు. ఈ విరాళాలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రెటర్లు, వెంటిలేటర్లు, ఇతర మెడికల్ సౌకర్యాలను భారత్కు అందించనున్నారు.కాగా గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో 3.66 లక్షలకు పైగా కొత్త కోవిడ్-19 కేసులు, 3754 మరణాలు నమోదైనాయి.దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్, నిత్యావసర మందుల సరఫరా కొరత నేపథ్యంలో బ్రిటన్, అమెరికా, సౌదీ అరేబియా, సింగపూర్ లాంటి దేశాలు ఇప్పటికే తమ సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. $15 million split between @CARE, @AIDINDIA, and @sewausa to help address the COVID-19 crisis in India. All tracked here: https://t.co/Db2YJiwcqc 🇮🇳 — jack (@jack) May 10, 2021 చదవండి: కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం -
నేను సాయం చేస్తున్నా.. మీరు ముందుకు రండి: పంత్
ఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇక దేశంలో ఆక్సిజన్ కొరతతో రోజు వందల మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు తమకు తోచిన సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆసీస్ క్రికెటర్ పాట్ కమిన్స్ మొదలుకొని.. సచిన్, రహానే, పాండ్యా బ్రదర్స్, బ్రెట్ లీ, ఇంకా ఎందరో క్రికెటర్లు విరాళాలు.. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందించి తమ ఉదారతను చాటుకున్నారు. తాజాగా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ హేమకుంత ఫౌండేషన్ ద్వారా కోవిడ్ రోగులకు సాయం అందించనున్నట్లు తెలిపాడు. కరోనా రోగుల కోసం అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, అవసరమైన మందులు అందించనున్నట్లు పేర్కొన్నాడు. అంతేగాక గ్రామీణ ప్రాంతాలతో పాటు నాన్ మెట్రో నగరాల్లో మెడికల్ సపోర్ట్ అందించనున్న ఆర్గనైజేషన్లకు తనకు తోచిన సాయం అందించనున్నట్లు పంత్ వివరించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్లో షేర్ చేస్తూ ఒక సుధీర్ఘ లేఖను రాసుకొచ్చాడు. ''హాయ్ ఫ్రెండ్స్.. ఇప్పుడు మనదేశం కరోనా సెకండ్వేవ్తో అల్లాడిపోతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు అండగా నిలబడాల్సి ఉంది. దేశంలో కరోనాతో వేలమంది చనిపోతున్నారు. వారు మనకేం కాకపోవచ్చు.. మనం బంధువులు.. స్నేహితులు అయితే వెంటనే స్పందించేవాళ్లం. కానీ ఒక భారతీయుడిగా మన సహచరులను కోల్పోతున్నవారి కుటుంబాలకు అండగా నిలబడాల్సిన సమయం ఇది. అందుకే నా వంతుగా హేమకుంత ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్స్, మందులు అందించడానికి ప్రయత్నిస్తున్నా. వాటితో కనీసం కొంతమంది ప్రాణాలైనా కాపాడొచ్చు. మీరు కూడా నాతో కలిసి వస్తే ఇంకా ఎందరి ప్రాణాలనో కాపాడొచ్చు. రండి అందరు ముందుకు రండి.. తోచినంత సాయం చేయండి. ఇక చివరిగా కోవిడ్ రూల్స్ను పాటిస్తూ అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.. వీలైతే తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రయత్నించండి.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక జూన్లో న్యూజిలాండ్తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు టీమిండియా జట్టులో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. ఆసీస్తో సిరీస్ నుంచి భీకరమైన ఫామ్లో ఉన్న పంత్ ఇంగ్లండ్తో సిరీస్లోనూ అదే కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్ 14వ సీజన్కు ఢిల్లీ క్యాపిటల్స్కు శ్రేయాస్ అయ్యర్ స్థానంలో నాయకత్వం వహించిన పంత్ జట్టును అద్భుతంగా నడిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో నిలిచింది. చదవండి: పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం! 🙏 pic.twitter.com/x1mm9cunah — Rishabh Pant (@RishabhPant17) May 8, 2021 -
Group of Seven: జి ఫర్ గ్రేట్
జి సెవన్ అంటే ‘గ్రేట్’ సెవన్ అనుకుంటాం. కాదు! ‘గ్రూప్’ సెవన్. అయితే లండన్ జి7 ఆర్థిక మంత్రుల సమావేశంలో జరిగిన తాజా నిర్ణయం గురించి వింటే ఈ దేశాలను గ్రూప్ సెవన్ కాదు, గ్రేట్ సెవన్ అనడమే కరెక్ట్ అనిపిస్తుంది. బాలికలు, మహిళల మీదే కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని ఏడాదిన్నరగా సర్వేలు చెబుతూ వస్తున్నాయి. సర్వేల వరకు వెళ్లక్కర్లేదు. మన చుట్టూ చూస్తేనే తెలిసిపోతుంది. ఇళ్లలో మహిళలకు పని భారం ఎక్కువైంది. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కంపెనీలకు భారమయ్యారు! బాలికల పరిస్థితి కూడా ఇంతే. బడి గంటలు పోయి, ఇంట్లో పని గంటలు వచ్చేశాయి. ఇక గృహహింస, మహిళల అనారోగ్యాలపై కుటుంబ సభ్యుల అలక్ష్యం, నిరాదరణ ఎప్పుడూ ఉన్నవే. ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. మొదట ఈ పరిస్థితులను చక్కబరిస్తే గానీ కరోనా పర్యవసానాలను నివారించలేమని జి7 దేశాల గుర్తించాయి. బాలికలు, మహిళల చదువు, సంక్షేమాల కోసం నిధులను, విధులను భుజానికెత్తుకున్నాయి. ఏటా జి7 దేశాధ్యక్షుల సదస్సు జరగడానికి ముందు జి7 ఆర్థిక మంత్రుల సమావేశం జరుగుతుంది. కష్టకాలంలో కలిసికట్టుగా ఉండటానికి, అభివృద్ధి చెందే దశలో ఉన్న దేశాలను గట్టెక్కించడానికి ఒక జట్టుగా ఏర్పడిన ఏడు పారిశ్రామిక, ధనిక దేశాల బృందమే జి సెవన్. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యు.కె., జపాన్. వీటితో పాటు ఐరోపా సమాఖ్య ఉంటుంది. జి సెవన్ అంటే ‘గ్రేట్’ సెవన్ అనుకుంటాం. కాదు! ‘గ్రూప్’ సెవన్. అయితే లండన్లో జి7 ఆర్థిక మంత్రుల సమావేశంలో తాజాగా జరిగిన నిర్ణయం గురించి వింటే ఈ దేశాలను గ్రూప్ సెవన్ కాదు, గ్రేట్ సెవన్ అనడమే కరెక్ట్ అనిపిస్తుంది. వచ్చే రెండేళ్లలో బాలికల చదువు, మహిళల ఉద్యోగాల కోసం.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సుమారు లక్షా పది వేల కోట్ల రూపాయలను సహాయంగా అందివ్వాలని ఏడు దేశాల ఆర్థిక మంత్రులు తీర్మానించారు. వారి సహాయం పొందే దేశాలలో భారత్ కూడా ఉంది. ∙∙ నలభై ఐదేళ్లుగా ఏటా జి7 సదస్సులు జరుగుతున్నాయి. ఏ సదస్సులోనూ ఇంత భారీ ఎత్తున బాలికలు, మహిళల కోసం నిధుల కేటాయింపు లేదు! పైగా ఇది విరాళం వంటి సహాయం. ఈ ఏడు సభ్యదేశాలే తమ కోశాగారం లోంచి తీసి ఇవ్వవలసి ఉంటుంది. అందుకు జి7లోని ఏ దేశమూ కాదనడం ఉండదు కానీ, ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం మీద, వాక్సిన్లు ఆక్సిజన్ల మీద కదా ధార్మిక దృష్టి ఉండవలసింది! ఆ మాట వాస్తవమే కానీ, ఈ ఆపత్సమయంలో మిగతా కూటములలోని భాగస్వాములుగా జి సెవన్ దేశాలు తాము అందిస్తున్న సహాయ సహకారాలతో పాటు.. జి7 గ్రూపుగా ప్రస్తుత పరిస్థితుల్లో బాలికల చదువును, మహిళల ఉద్యోగాలను ప్రాధాన్యతా అంశాలుగా గుర్తించాయి! జూన్లో జరిగే జి 7 దేశాధ్యక్షుల సదస్సులో ఇప్పుడీ జీ7 ఆర్థిక మంత్రుల నిర్ణయానికి ఆమోదముద్ర పడిన అనంతరం నిధులు పంపిణీకి ప్రణాళిక సిద్ధం అవుతుంది. విషయం ఏంటంటే.. ఇది ఒకరు అడిగితే చేస్తున్న సహాయం కాదు. సహాయం చేయవలసిన అవసరాన్ని గుర్తించి అందిస్తున్న స్నేహ హస్తం. ఆడపిల్లలకు ఆరేళ్ల వయసు నుంచి పన్నెండేళ్ల పాటు నాణ్యమైన విద్యను అందించడం, మహిళలకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సహాయం ముఖ్యోద్దేశం. జి7 దేశాల్లోని డి.ఎఫ్.ఐ.లు (డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్) ఈ నిధుల్ని సమీకరించి, ఆర్థికమంత్రిత్వ శాఖలకు సమకూరుస్తాయి. జి7 తాజా సమావేశం మరొక లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. 2026 నాటికి అల్ప, దిగువ మధ్య తరగతి ఆదాయాలున్న దేశాలలో 4 కోట్ల మంది బాలికలను పాఠశాలల్లో చేర్పించాలి. అలాగే 2 కోట్ల మంది బాలికల్ని వారి పదో ఏట కల్లా చదవడం వచ్చిన వారిలా తీర్చిదిద్దాలి. ఈ రెండు లక్ష్యాలపై కూడా జి సెవన్ మంత్రులు సంతకాలు చేశారు. ∙∙ లండన్లో ‘ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్’ (ఎఫ్.సి.డి.వో.) అని విదేశీ ఆర్థిక వ్యవహారాల కార్యాలయం ఒకటి ఉంది. జి7 దేశాల ఆర్థిక మంత్రుల సమన్వయంతో అది పని చేస్తుంది. డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేసే విషయాన్ని ఎఫ్.సి.డి.వో.నే అడగాలి ఏ దేశమైనా! బాలికల చదువు మీద పెట్టుబడి పెట్టడం వివేకవంతమైన పని అంటుంది ఎఫ్.సి.డి.వో.! ‘‘దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు, దేశ ఆర్థికాభివృద్ధికి వివిధ మార్గాలలో పెట్టుబడులు పెడుతుంటాం. అవి ఎంతవరకు ఫలిస్తాయో, ఎప్పటికి ఫలవంతం అవుతాయో కచ్చితంగా చెప్పలేం. కానీ బాలికల చదువు కోసం ఒక దేశం పెట్టే పెట్టుబడి మాత్రం నమ్మకంగా ఆ దేశంలోని పేదరికాన్ని రూపుమాపుతుంది. ఆ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది’’ అని ఎఫ్.సి.డి.వో. జి7 మంత్రుల తీర్మానానికి మద్దతు పలికింది. ‘నువ్వొక బాలుడిని చదివిస్తే అది అతడికే ఉపయోగం. ఒక బాలికను చదివిస్తే మొత్తం దేశానికే ప్రయోజనం’ అని జేమ్స్ ఎమ్మెన్ అన్న మాటను గుర్తుకు తెచ్చేలా ఈసారి జి7 మంత్రుల నిర్ణయాలు ఉన్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలు ‘గర్ల్స్ ఎడ్యుకేషన్ పొలిటికల్ డిక్లరేషన్’పై ఏడు దేశాలూ సంతకాలు చేయడంతో బుధవారం ముగిశాయి. కరోనా చీకట్లలో కాంతి కిరణం: బాలికల చదువుకు, మహిళల ఉపాధికి జి7 దేశాల లక్షా పది వేల కోట్ల రూపాయల తీర్మానం -
రాజస్తాన్ రాయల్స్ ఔదార్యం.. కరోనా బాధితుల కోసం పెద్ద మొత్తం
ఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ పెద్ద మనసును చాటుకుంది. దేశంలో కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రూ 7.5 కోట్లు విరాళంగా ఇచ్చి తన ఔదార్యాన్ని గొప్పగా చాటుకుంది. ఇప్పటికే ఐపీఎల్లో ఆడుతున్న పలువురు ఆటగాళ్లు కరోనా బాధితుల కోసం తమకు తోచిన సాయం అందిస్తున్నారు. పాట్ కమిన్స్, శ్రీవాత్సవ గోస్వామి, బ్రెట్ లీ, షెల్డన్ జాక్సన్లు పెద్ద మొత్తంలో సాయం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా బాధితులకు అండగా ఉండేందుకు జట్టులోని ఆటగాళ్లతో పాటు మేనేజ్మెంట్ సహాయంతో మొత్తం రూ. 7.5 కోట్లను అందజేస్తున్నట్లు రాజస్తాన్ రాయల్స్ తన ట్విటర్లో పేర్కొంది. కాగా రాజస్తాన్ రాయల్స్ సహాయానికి సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన నమోదు చేయడం లేదు. కెప్టెన్ మారినా విజయాలు మాత్రం సాధించలేకపోయింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలు.. మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. కాగా నేడు ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్తో ఆడనుంది. చదవండి: బ్రెట్ లీ ఔదార్యం.. 1 బిట్కాయిన్ విరాళం Rajasthan Royals announce a contribution of over $1 milion from their owners, players and management to help with immediate support to those impacted by COVID-19. This will be implemented through @RoyalRajasthanF and @britishasiantst. Complete details 👇#RoyalsFamily — Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2021 -
కూతురి పెళ్లికి దాచిన సొమ్మును కలెక్టర్కు..
భోపాల్: కరోనా దేశవ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. మరోవైపు ఎంతో మంది ఉపాధిని సైతం కోల్పోతున్నారు. ఈ దారుణమైన పరిస్థితుల్లో చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బును జాగ్రత్తగా వాడుకుంటున్నారు. అయితే, ఒక రైతు మాత్రం తన కూతురు వివాహం కోసం దాచిన 2 లక్షల రూపాయల సొమ్మును ఆక్సిజన్ కొనుగొలు చేయడానికి జిల్లా కలెక్టర్కు విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని గ్వాల్ దేవియన్ గ్రామానికి చెందిన చంపలాల్ గుర్జార్ అనే రైతు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన రూ.2 లక్షలను కూతురు పెళ్లి కోసం దాచాడు. కానీ కరోనా పేషెంట్లకు సరిపడా ఆక్సిజన్ లేదని తెలిసి ఆలోచనలో పడ్డాడు. కన్నబిడ్డ పెళ్లి కోసం దాచిన డబ్బును జిల్లా కలెక్టర్ అగార్వాల్ గుల్జార్కు విరాళంగా ఇచ్చాడు. దీంతో కలెక్టర్ అతడిని అభినందించాడు. తండ్రి చేసిన పనికి కూతురు అనిత సైతం అతడిని పొగడ్తలతో ముంచెత్తింది. ఇక ఈ విరాళంతో రెండు ఆక్సిజన్ సిలెండర్లను కొనుగొలు చేశారు. కాగా, ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఆదివారం నాటికి 4,99,304 యాక్టివ్ కేసులున్నాయి. -
Kerala: బీడీ కార్మికుని ఉదారత.. సీఎం రిలీఫ్ ఫండ్కు..
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా కరోనా సునామీని సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ దీని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది ఉపాధిని సైతం కోల్పోయారు. మరికొందరు పొట్టకూటి కోసం చిన్నాచితకా పనులు చేస్తూ బతుకు బండిని లాగిస్తున్నారు. అయితే, ఇక్కడో వ్యక్తి.. తాను చేసేది చిన్న పనే అయినా.. సీఎం సహయ నిధికి పెద్ద మొత్తంలో విరాళం పంపి గొప్ప మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కన్నూర్కు చెందిన ఓ బీడీ కార్మికుడు కేరళ సీఎం సహాయ నిధికి రూ.2 లక్షలు పంపించాడు. తన సొమ్మును వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించాలని కోరాడు. ఇలా డబ్బులు పంపిన తర్వాత అతని అకౌంట్లో కేవలం రూ.850 మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం. అయితే, బీడీకార్మికుడు బ్యాంక్ అధికారుల దగ్గరకు వెళ్లి తన అకౌంట్లోని రూ.2 లక్షలను సీఎం సహయ నిధికి బదిలీ చేయాలని కోరగానే బ్యాంకు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. నీ అకౌంట్లో తక్కువ మొత్తంలో డబ్బు ఉందని తెలిపారు. దాన్ని కూడా విరాళంగా ఇచ్చేస్తే ఎలా జీవనం సాగిస్తావని ప్రశ్నించారు. దీనికి అతను.. ఇక మీదటకూడా బీడీలు చుట్టి బతుకుతానని తెలిపాడు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ బీడీవర్కర్ ఉదార స్వభావాన్నిసోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడిది వైరల్గా మారింది. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ ట్విటర్ వేదికగా స్పందించారు. బీడి కార్మికుడి ఉదార స్వభావాన్ని మెచ్చకున్నారు. నెటిజన్లు సైతం ‘మీ మానవత్వానికి హ్యట్సాఫ్... మీరు చాలా మందికి ఆదర్శం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
పాత బట్టలు దానం చేయాలనుకుంటున్నారా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్లో సొంతిల్లు. పెద్ద కంపెనీలో నెలకు లక్షన్నర జీతం. హ్యాపీగా లైఫ్ గడిచిపోతుంటే ఎవరికైనా అంతకుమించి ఏం కావాలనిపిస్తుంది. కానీ సుజీత్, కార్తీక్లకు ఇవేవీ సంతృప్తిని ఇవ్వలేదు. పేదవారికి ఏదైనా సాయం చేయాలన్న బలమైన కోరిక వారిని నిలవనివ్వలేదు.. అంతే చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్ బై చేప్పేసి పాత బట్టలు సేకరించి, పేదలకు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘డొనేట్ వస్త్ర’ పేరుతో సోషల్ స్టార్టప్ను పెట్టేశారు.వివరాలు వారి మాటల్లోనే ఎలా ప్రారంభమైందో .. లాక్డౌన్ సమయంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పేదలకు ఆహార పొట్లాలు అందిస్తున్నాం. ఒక వృద్ద దంపతులు దగ్గరి వచ్చి ‘మేము ఊరి నుంచి వచ్చాం. పాత బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వండి’ అని అడిగారు. ఇంటికెళ్లి బీరువాలోని పాత బట్టలను తీసుకొచ్చి వాళ్లకు ఇచ్చాం. అప్పుడనిపించింది మన దగ్గరే కాకుండా మన స్నేహితులు, బంధువుల దగ్గర ఉన్న పాత బట్టలు కూడా సేకరించి దానం చేస్తే ఎలా ఉంటుందని? ఈ ఆలోచన నుంచి పుట్టిందే ‘డొనేట్ వస్త్ర’. సోషల్ స్టార్టప్ ‘డొనేట్ వస్త్ర’ సామాజిక కార్యక్రమం ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు? గతేడాది డిసెంబర్లో చార్టెర్డ్ అకౌంటెంట్స్ సుజీత్ చల్లా, కార్తీక్ ఎస్పీలు కలిసి డొనేట్ వస్త్ర ప్రారంభించారు. సుజీత్ కేపీఎంజీలో పరోక్ష పన్నుల విభాగంలో నాలుగేళ్లు పనిచేశాడు. ఆ తర్వాత పీఅండ్జీ కంపెనీ ఇండియా ఫైనాన్స్ మేనేజ్ర్గా ఏడాది పాటు పనిచేశాడు. నెలకు లక్షన్నర జీతం. కేపీఎంజీలో జీఎస్టీ విభాగంలో ఐదేళ్లు పనిచేశాడు కార్తీక్. జీతం నెలకు లక్ష. ఆ తర్వాత ప్రియాంక, కావ్య, రవి, యశ్వంత్, స్వపంతి, సాహితీ, షణ్ముఖ్, నితేష్ రెడ్డి, శ్రావణి, శ్వేత, యష్రాజ్, హిమ వీళ్లతో జత కలిశారు. వీరితో పాటు 150 మంది వాలంటీర్లు కూడా ఉన్నారు. బట్టలు ఎలా సేకరిస్తారు? నగరం నలువైపులా 50 ప్రాంతాల్లో డ్రాప్ఔట్ పాయింట్స్ ఉన్నాయి. పాత బట్టలు ఇవ్వదలిచిన వాళ్లు డొనేట్ వస్త్రకు ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి బట్టలు తీసుకొని వెళ్లిపోతారు. జయేష్ రంజన్, గద్వాల విజయలక్ష్మి, కిదంబి శ్రీకాంత్, రేణుదేశాయ్ వంటి చాలా మంది ప్రముఖులు డొనేట్ వస్త్రకు పబ్లిసిటీ చేస్తున్నారు. దీంతో పాటు ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో కూడా కంపెనీ ప్రచారం నిర్వహిస్తుంది. సేకరించి ఏం చేస్తారు? సేకరించిన బట్టలను శానిటైజ్ చేస్తారు. చిరిగిపోయిన, గుండీలు ఊడిపోయిన వాటిని వాటిని టైలర్లతో కుట్టిస్తారు. ఆ తర్వాత ఉతికి ఆరేస్తారు. తిరిగి వాటిని ఇస్త్రీ చేసి.. మడతపెట్టి ప్యాకింగ్ చేస్తారు. వీటిని పేదలకు దానం చేస్తారు. ప్రాసెస్కు అయ్యే ఖర్చు ఎలా? సేకరించిన బట్టలను శానిటైజ్, వాషింగ్, ప్యాకింగ్, రవాణా వంటి ప్రాసెస్ ఖర్చులంతా సొంతంగానే పెట్టుకుంటున్నాం. ఒక్క జత బట్టలను ప్రాసెస్ చేయడానికి రూ.100 ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు లక్ష రూపాయలు అయ్యాయి. టంబుల్ డ్రై అనే లాండ్రీ కంపెనీ మినిమం చార్జీలతో ప్రాసెస్ చేసిస్తుంది. కొంతమంది ఎక్స్ట్రీమ్ ఫ్యాషన్ బట్టలు, లేకపోతే బాగా చినిగిపోయిన దుస్తులు ఇస్తుంటారు. వాటిని ఫైబర్గా మార్చి మాస్క్లు, బుక్ కవర్స్, బ్యాగ్స్, పిల్లో కవర్స్, ఫర్నీచర్ కవర్స్ వంటి సస్టైనబుల్ ఫ్యాషన్గా మారుస్తున్నాం. ఇందుకోసం జూబ్లిహిల్స్ మార్పు స్టూడియో, సికింద్రాబాద్లోని ఏఆర్ఏఎల్ స్టూడియోలతో ఒప్పందం చేసుకున్నాం. (డొనేట్ వస్త్ర కో–ఫౌండర్లు సుజీత్, కార్తీక్ (కుడి నుంచి ఎడమ వైపు) జీహెచ్ఎంసీ అవకాశం ఇస్తే.. ఇటీవలే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిశాం. మా సోషల్ స్టార్టప్ గురించి తెలుసుకొని సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో డొనేట్ వస్త్ర చాలెంజ్ చేసి.. తనకి ట్యాగ్ చేయమని సలహా ఇచ్చారు. అలాగే నగరంలోని అన్నపూర్ణ క్యాంటీన్ పక్కన డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు చేసుకోమని సలహా ఇచ్చారు. -సుజీత్ చల్లా, కో-ఫౌండర్, డొనేట్ వస్త్ర. -
చిట్టితల్లికి కష్టమొచ్చింది
గుణదల(విజయవాడ తూర్పు): చిట్టితల్లి అల్లరి ముద్దుగా పెరుగుతోంది.. చదువుల ఒడిలో సేదతీరుతోంది.. తల్లిదండ్రుల చెంత అల్లరిముద్దగా పెరుగుతోంది.. ఆనందంగా ఉన్న కుటుంబాన్ని క్యాన్సర్ మహమ్మారి వెంటాడింది.. చిట్టితల్లి అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షలు చేయించడంతో వ్యాధి నిర్ధారణ అయింది. చిన్నారిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు కష్టపడుతున్నారు.. వివరాలు.. ప్రసాదంపాడుకు చెందిన జుజ్జవరపు సురేష్ కుమార్ (45), దుర్గాభవాని దంపతులు విజయవాడ సీతారామపురం ప్రాంతంలో స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నారు. వీరికి కుమార్తె భాగ్యశ్రీజిత ఉంది. ప్రస్తుతం శ్రీజిత గుణదల సెయింట్ జాన్స్ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఇటీవల కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆస్పత్రిలో చూపించారు. పరీక్షలు చేసిన వైద్యులు మైలో మోనో సైటిస్(బ్లడ్ క్యాన్సర్) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి చికిత్సకు సుమారు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం శ్రీజిత తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆర్థిక స్తోమత లేనందున తమ బిడ్డను బతికించుకునేందుకు ఆ తలిదండ్రులు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. పొరుగు రాష్ట్రం కావడంతో ఆరోగ్యశ్రీ వర్తించే అవకాశం లేదని చెబుతున్నారు. ఇప్పటికే గుణదల సెయింట్ జాన్స్ పాఠశాల విద్యార్థులు తోటి విద్యార్థిని కోసం విరాళాలు సేకరిస్తున్నారు. దాతల సహకారంతో చిన్నారి శ్రీజిత ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతున్నారు. దాతలు 9948811911 నంబర్లో సంప్రదించాలి. -
మూడింతలు పెరిగిన సంపన్నుల విరాళాలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అత్యంత సంపన్న కుటుంబ(హెచ్ఎన్ఐ) విరాళాలు 2020 ఆర్థిక సంవత్సరంలో మూడింతలు పెరిగి.. రూ.12,000 కోట్లకు చేరాయి. 2019 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ప్రైవేట్ రంగం ఇచ్చిన విరాళాల్లో మూడింట రెండొంతుల వాటాకు చేరాయి. బెయిన్ అండ్ కంపెనీ, దస్రా సంస్థలు కలిపి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ (విదేశీ, కార్పొరేట్, రిటైల్, అత్యంత సంపన్న వర్గాల(హెచ్ఎన్ఐ) కుటుంబాల) విరాళాలు మొత్తం రూ. 64,000 కోట్లుగా ఉండగా.. ఇందులో కుటుంబాల వాటా దాదాపు 20 శాతంగా ఉంది. మొత్తం నిధుల్లో విదేశీ వనరుల నుంచి వచ్చినది 25 శాతంగా ఉండగా, దేశీ కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద కేటాయించినది 28 శాతంగాను, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా మరో 28 శాతంగాను ఉంది. అయితే, దాతృత్వ కార్యక్రమాలకు ఇబ్బడి ముబ్బడిగా విరాళాలు వస్తున్నప్పటికీ సామాజిక సంక్షేమం మాత్రం కుంటినడకనే నడుస్తుండటం గమనార్హమని నివేదిక పేర్కొంది. ‘కుటుంబ దాతృత్వ కార్య కలాపాలు.. భారత అభివృద్ధి అజెండాను తీర్చిదిద్దేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. వీటికి మరింత ప్రోత్సాహం లభిస్తే దేశ శ్రేయస్సుకు తోడ్పడగలవు‘ అని తెలిపింది. విరాళాల్లో అత్యధిక భాగం వాటా విద్య, ఆరోగ్య రంగాలదే ఉంటోందని నివేదిక పేర్కొంది. విద్యా రంగానికి 47 శాతం, ఆరోగ్య రంగానికి 27 శాతం వాటా ఉందని వివరించింది. చదవండి: పిల్లల కోసం తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే మంచిదే -
1000 కోట్లు దాటిన అయోధ్య విరాళాలు
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశ వ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. హిందువులే కాకుండా వివిధ వర్గాలకు చెందిన రామభక్తులు సైతం దీనిలో పాలుపంచుకుంటున్నారు. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం మందిర నిర్మాణం జరుగుతుండటంతో ఆలయ కమిటీ సైతం పెద్ద ఎత్తున నిధులను సేకరిస్తోంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాల్లో 11 కోట్లు కుంటుంబాలను ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే దేశ వ్యాప్తంగా నిధులను సమీకరిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతులు మంజూరు చేసినప్పటి నుంచి ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు (ఫిబ్రవరి 12) వచ్చిన విరాళాల వివరాలను తీర్థక్షేత్ర నిర్వహకులు వెల్లడించారు. శుక్రవారం నాటికి 1511 కోట్ల రూపాయాలు అందాయని తెలిపారు. ఫిబ్రవరి 27 వరకు విరాళాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జనవరి 15 నుంచి పిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా విరాళాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. కాగా అయోధ్యలోని 2.7 ఎకరాల స్థలంలో రామమందిర నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. హిందువులు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ దేవాలయల పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 1500 కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని ప్రణాళికలు తయారు చేశారు. భూకంపాలు, తుపాన్ బీభత్సాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా ఆలయ నిర్మాణం సాగుతుంది. అందుకే ఈ నిర్మాణంలో ఇనుము వాడడం లేదు. వేల ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడానికి రాతితో నిర్మించే మందిరంలో ప్రతీ రాయికి మధ్య రాగి పలకల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 18 అంగుళాల పొడవు, 30 మి.మీ. వెడల్పు, 3 మి.మీ. లోతు కలిగిన 10 వేల రాగి పలకలు అవసరమవుతాయి. ఈ రాగి పలకల్ని విరాళంగా అందివ్వాలని మందిరం ట్రస్ట్ రామ భక్తులకు పిలుపునిచ్చింది. దాతలు వాటిపై తమ కుటుంబ సభ్యుల పేర్లు, వంశం పేరు రాయవచ్చునని పేర్కొంది. -
రూ.6 కోట్లు: ఈ ఆలయం ముందు తిరుమల చిన్నదే
జైపూర్: రోజురోజుకు ప్రజల్లో భక్తి భావన పెరుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఎన్నో రంగాలు బతుకుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెంచేవి కావడంతో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా రెట్టింపవుతోంది. పరిస్థితి ఇలా ఉండడంతో ఎక్కడ ఉత్సవాలు జరిగినా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తాజాగా రాజస్థాన్లోని ఓ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో ఆదాయం ఊహించని రీతిలో వచ్చింది. ఆ ఆదాయం చూస్తే దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న ఆలయాలు షిర్డీ, తిరుమల చిన్నబోయేట్టు ఉన్నాయి. రాజస్థాన్లోని చిత్తోర్గడ్లో సన్వాలియా సేథ్ ఆలయం ఉంది. ఆ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన దేవాలయం. ఇటీవల చతుర్ధశి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలు ముగియడంతో హుండీని తెరిచారు. హుండీలు బరువుగా ఉన్నాయి. తెరచి చూడగా అధికారులు ఊహించని స్థాయిలో కానుకలు వచ్చాయి. నగదుతో పాటు బంగారం, వెండి కానుకలు భారీగా ఉన్నాయి. మొత్తం లెక్కించగా హుండీ ఆదాయం అక్షరాల 6 కోట్ల 17 లక్షల 12 వేల 200 రూపాయలు వచ్చింది. ఇక బంగారం 91 గ్రాములు, వెండి 4 కిలోల 200 గ్రాములు కానుకగా వచ్చింది. నేడు కూడా హుండీ లెక్కింపు కొనసాగుతోంది. ఆలయ అధికారులు, కలెక్టర్ ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. మొత్తం కలిపితే ఆదాయం ఎంత వస్తుందోనని ఆసక్తికరంగా మారింది. -
రామమందిరానికి క్రైస్తవుల భారీ విరాళం
శివాజీనగర: అయోధ్యలో నిర్మించే రామ మందిర నిర్మాణానికి కర్ణాటకలో క్రైస్తవ వర్గానికి చెందిన వ్యాపారులు, విద్యానిపుణులు పెద్దమొత్తంలో విరాళాలను అందజేశారు. బెంగళూరులో ఆదివారం ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీ.ఎన్.అశ్వత్థనారాయణ ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైస్తవ వర్గ వ్యాపారవేత్తలు, విద్యానిపుణులు, ఎన్ఆర్ఐలు, సీఇఓలు, సమాజ సేవకులు పాల్గొన్నారు. మందిర నిర్మాణానికి తమవంతు సహాయం చేస్తామని భరోసానిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా అందరితో కలసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లటమే బీజేపీ లక్ష్యమని అశ్వత్ధ నారాయణ తెలిపారు. సుమారు రూ.కోటి వరకూ విరాళాలను అందజేసినట్లు ఆయన చెప్పారు. -
‘రాముడి పేరిట విరాళాలు..తాగి తందనాలు’
భోపాల్: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇటీవల తెలంగాణలో ఓ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేయగా.. తాజాగా ఇప్పుడు మధ్యప్రదేశ్లో మరో సీనియర్ నాయకుడు సంచలన ఆరోపణలు చేశారు. రామమందిరం పేరిట సేకరిస్తున్న విరాళాలతో బీజేపీ నాయకులు మద్యం కొనుగోలు చేసి తాగి ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. ఆయనెవరో కాదు మధ్యప్రదేశ్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతిలాల్ భూరియా. తాజాగా పెట్లవాడ్ పట్టణంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాలతో కొందరు బీజేపీ నేతలు మద్యం సేవిస్తున్నారు. రామాలయం పేరుతో కొందరు కాషాయ నేతలు విరాళాలు సేకరిస్తూ వాటితో మద్యం కొనుగోలు చేస్తున్నారు. పగలు రాముడి గుడి పేరు చెప్పి విరాళాలు సేకరించి రాత్రి కాగానే ఆ మొత్తంలో కొంత మద్యం సేవించేందుకు వాడుతున్నారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రాంతిలాల్ భూరియా ఎవరో కాదు రెండు సార్లు కేంద్ర మంత్రిగా పని చేయగా.. ఐదుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జాబువా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో మధ్యప్రదేశ్లో బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాలు కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. దేశవ్యాప్తంగా రామమందిర నిర్మాణం కోసం స్వచ్ఛందంగా విరాళాలను సేకరించే బాధ్యతను ఆరెస్సెస్, వీహెచ్పీలతో పాటు సమాజంలో విశ్వసనీయ సంస్థలకి శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అప్పగించిన విషయం తెలిసిందే. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా విరాళాల సేకరణపై స్పందించారు. విరాళాలను సేకరించే ర్యాలీల సందర్భంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఉజ్జయిని, మందసోర్, ఇండోర్ల్లో జరిగిన ర్యాలీల అనంతరం చెలరేగిన హింసపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ఆన్లైన్ సోల్
వస్తువులు, పుస్తకాలు, దుస్తులు, నగదు రూపేణా ఎవరికైనా సాయం చేయాలనుకున్న దాతలు వారి కోసం సదరు స్వచ్ఛంద సంస్థలను వెతుకుతుంటారు. ఆ వెతుకులాటలో తమ సాయం సరైన వారికి చేరుతుందా లేదా అనే సందేహమూ ఉంటుంది. బెంగళూరు వాసి సోనికా గహ్లోట్ నాయక్ ఈ పరిస్థితిని గమనించి దేశంలోని అన్ని ఎన్జీవోలను అనుసంధానిస్తూ ‘హ్యాపీ సోల్’ పేరుతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాట్ఫాం ఎవరికైనా సరే అవసరమైన ఎన్జీఓలకు దానం చేయడానికి సహాయపడుతుంది. దీని రూపకర్త సోనికా గహ్లోట్ నాయక్. 2017 సంవత్సరంలో వారాంతాల్లో ఓ రోజు బట్టలు, పుస్తకాలను దానం చేయడానికి స్వచ్ఛంద సంస్థల గురించి ఆన్ లైన్ జాబితా వెతకడం మొదలుపెట్టింది. భారతదేశం అంతటా ధృవీకరించిన స్వచ్ఛంద సంస్థల జాబితా గల ప్లాట్ఫారమ్ ఏదీ లేవని తెలిసి ఆశ్చర్యపోయింది. ఎన్జీఓల అనుసంధానం ఈ అంతరాన్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్జీఓలను అనుసంధానించే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది సోనికా. వ్యక్తులు, కార్పొరేట్లు, ఎన్జీఓలను కలిపే ఒక వేదిక అయిన హ్యాపీ సోల్ను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన ఈ పోర్టల్ ద్వారా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, జంతువుల ఆశ్రయాలు, నిరుపేద పాఠశాలల జాబితా చేసింది. ఆమె మొదట దీనిని ప్రారంభించినప్పుడు సమాచార సేకరణకు వ్యక్తిగతంగా బెంగళూరులోని ప్రతి ఎన్జీఓలను కలిసింది. కొన్ని చిన్న సంస్థలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను కూడా గుర్తించింది. ధృవీకరించిన చట్టపరమైన పత్రాలతో పారదర్శకత, జియోట్యాగ్ చేయబడిన ఎన్జీఓలను నమోదు చేసే వెబ్సైట్ ప్రారంచింది. ఈ ప్లాట్ఫాంపై తమ ప్రొఫైల్స్ను రూపొందించడానికి ఎన్జీఓల నుంచి ఎలాంటి రుసుమూ వసూలు చేయదు. ఇది ఎన్జీఓల కార్యకలాపాలు, ఫోకస్, ప్రాంతాలు, లక్ష్యం, ప్రేక్షకుల వివరాలతో మినీ వెబ్సైట్గా పనిచేస్తుంది. వనరుల సద్వినియోగం ఈ పోర్టల్ ద్వారా కోవిడ్–19 మహమ్మారి సమయంలో ప్రజలు తమ ఇంటి నుండి సరుకులను నేరుగా స్వచ్ఛంద సంస్థలకు పంపించటానికి వీలుగా సేవలను పొందారు. ఈ ప్లాట్ఫామ్ వినియోగదారులు ఎంపిక చేసిన ఎన్జీఓలకు పికప్–డ్రాపింగ్ సేవలను కూడా అందించింది. కస్టమర్ల రియల్ టైమ్ అప్డేట్స్, వారి వస్తువులు సరైన ఆశ్రమాలకు చేరడం నిర్ధారణతోపాటు, పర్యావరణానికి వారు ఎలా వైవిధ్యం చూపించారనే వివరాలను కూడా ఇందులో జత చేశారు. హ్యాపీ సోల్ నమూనా ఒక సరళమైన రెండుదశల ప్రక్రియ. కస్టమర్ మొదట ఒక ఎన్జీఓ పోస్ట్ చేసిన వాంటెడ్ ఐటమ్స్ జాబితాను తీసుకొని, దానిద్వారా వెళతారు, తరువాత వారు దానం చేయదలిచిన వస్తువుల పరిమాణాన్ని జోడించి, బ్యాగులు లేదా డబ్బాల్లో వాటిని సిద్ధం చేస్తారు. వస్తువుల డెలివరీ కోసం రూ. 200 నుండి రూ .5000 వరకు సౌలభ్య రుసుము వసూలు ఉంటుంది. ఎన్ని వస్తువులు పంపబడుతున్నాయి, డెలివరీ మోడ్ ద్విచక్ర వాహనమా, త్రీవీలరా లేదా మినీ ట్రక్కా... వంటి ఎంపికలు కూడా ఉంటాయి. ఈ ప్రక్రియ ద్వారా వనరులను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే, దేశమంతటా మిగులు, వస్తువుల కొరత మధ్య అంతరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. -
జెఫ్ బెజోస్ టాప్ : మరో రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు వాతావరణ మార్పులపై పోరాటానికి మద్దతుగా భూరి విరాళాన్ని అందించిన బెజోస్ 2020లో అతిపెద్ద విరాళం ఇచ్చిన వ్యక్తిగా నిలిచారు. ఏకంగా 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.73 వేల కోట్లు)భారీ మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వితరణ చేశారు. తద్వారా సంపాదన ఆర్జనలోనే కాదు విరాళాలివ్వడంలో కూడా తానే మేటి అని నిరూపించుకున్నారు. ‘ది క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ’ ప్రకటించిన వార్షిక జాబితాలో అమెజాన్ సీఈఓ ముందు వరసలో నిలిచారు. వాతావరణ మార్పులపై పోరాటానికి ఉద్దేశించి ఆయన ఈ విరాళాలను అందజేశారు. ఈ విరాళంతో బెజోస్ ఎర్త్ ఫండ్ను ప్రారంభించినట్లు క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ ప్రకటించింది. 2020లో బెజోస్ విరాళం కాకుండా మిగిలిన టాప్ 10 విరాళాల మొత్తం కేవలం 260 కోట్ల డాలర్లు మాత్రమే. 2011 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో విరాళాలు రావడం ఇదే తొలిసారి. 2020లో బెజోస్ సంపద కూడా 2020, మార్చి 18 నుంచి డిసెంబర్ 7 మధ్య ఏకంగా 60 శాతం పెరిగింది. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం 18800 కోట్ల డాలర్ ల(సుమారు రూ.13.75 లక్షల కోట్లు) సంపద బెజోస్ సొంతం. బెజోస్ తర్వాత గత సంవత్సరం భారీ మొత్తంలో విరాళాలిచ్చిన వారి జాబితాలో నైక్ వ్యవస్థాపకుడు ఫిల్నైట్ అతని భార్య పెన్నీ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. లాక్డౌన్ సమయంలో ( మార్చి-డిసెంబర్ ) వీరి సంపద 77 శాతం పుంజుకుంది. వీరిద్దరూ నైట్ ఫౌండేషన్కు 900 మిలియన్లు డార్లు, ఒరెగాన్ విశ్వవిద్యాలయానికి 300 మిలియన్ల డాలర్లు డొనేట్ చేశారు. ఇక ఈ జాబితాలో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, భార్య ప్రిస్కల్లా చాన్ నాల్గవ స్థానంలో ఉన్నారు. వీరు 250 మిలియన్ డాలర్లను సేవ కార్యక్రమాల కోసం అందించారు.మరోవైపు గత సంవత్సరం స్వచ్ఛంద సంస్థకు భారీగా విరాళం ఇచ్చిన ఇద్దరు బిలియనీర్లు బెజోస్ మాజీ భార్య మాకెంజీ స్కాట్, ట్విటర్ కో ఫౌండర్జాక్ డోర్సే క్రానికల్ ఈ సారి జాబితాలో చోటు దక్కించుకోలేదు. ఫిబ్రవరిలో, క్రానికల్ 50 అతిపెద్ద దాతల జాబితాను ప్రచురించనుంది. -
టాప్లో అజీం ప్రేమ్జీ : రోజుకు ఎన్ని కోట్లంటే
సాక్షి,ముంబై: పారిశ్రామిక వేత్త, ప్రముఖ దాత, దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ విప్రో అధినేత అజీం ప్రేమ్జీ దాతృత్వంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2020వ సంవత్సరంలో విరివిగా దానాలు చేసి, ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. హురున్ రిపోర్ట్ ఇండియా తాజా లెక్కల ప్రకారం రోజుకు 20 కోట్లు ఏడాదికి 7,904 కోట్లు చొప్పున, విరాళంగా ఇచ్చారు. గత ఏడాది హురున్ రిపోర్ట్ ఇండియా రూపొందించిన జాబితా ప్రకారం హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ టాప్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా శివ నాడార్ను అధిగమించిన అజీం ప్రేమ్జి టాప్లో నిలిచారు. నాడార్ ఈ ఆర్థిక సంవత్సరంలో 795 కోట్లు రూపాయల విరాళమివ్వగా అంతకుముందు ఏడాది కాలంలో 826 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్జీ 426 కోట్లు విరాళంగా ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్కు అధినేత, బిలియనీర్ ముకేశ అంబానీ 458 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా మూడో స్థానంలో నిలిచారు. ఏడాది క్రితం అంబానీ 402 కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. అలాగే కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా కార్పొరేట్ రంగం భారీగా విరాళాలిచ్చింది. ప్రధానంగా టాటా సన్స్ 1500 కోట్ల నిబద్ధతతో, ప్రేమ్జీ 1125 కోట్లు, అంబానీ 510 కోట్లు రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దీంతో పాటు పీఎం కేర్స్ ఫండ్కు రిలయన్స్ 500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ 400 కోట్లు, టాటా గ్రూపు 500 కోట్ల విరాళంగా ఇచ్చాయి. దీంతో కలిపి ఈ ఏడాది ప్రేమ్జీ మొత్తం విరాళాలను 175శాతం పెరిగి 12,050 కోట్లకు చేరుకుంది.10 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన వ్యక్తుల సంఖ్య అంతకుముందు కాలం 72 నుండి 78 కు స్వల్పంగా పెరిగిందని నివేదిక తెలిపింది. 27 కోట్ల విరాళంతో, ఏటీఈ చంద్ర ఫౌండేషన్కు చెందిన అమిత్ చంద్ర, అర్చన చంద్ర ఈ జాబితాలో ప్రవేశించిన తొలి, ఏకైక ప్రొఫెషనల్ మేనేజర్లు. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ముగ్గురు చోటు సంపాదించుకున్నారు. నందన్ నీలేకని 159 కోట్లు, ఎస్ గోపాల కృష్ణన్ 50 కోట్లు, షిబులాల్ 32 కోట్లు డొనేట్ చేశారు. మరోవైపు 5 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన 109 మంది వ్యక్తుల జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిలో రోహిణి నీలేకని 47 కోట్ల రూపాయలతో టాప్లో ఉన్నారు. ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ (37) 5.3 కోట్లతో అతి పిన్నవయస్కుడిగా ఉండటం విశేషం. -
విరాళాలు ప్రకటిస్తున్న ప్రముఖులు
-
భారీ వరదలు: టాలీవుడ్ స్టార్స్ విరాళాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, సినీ, వర్తక, వాణిజ్య ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వరద బాధితులకు సహాయార్థంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు చెరో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. వీరితో పాటు అక్కినేని నాగార్జున రూ.50 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ.50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, దర్శకుడు హరీష్ శంకర్ ఐదు లక్షలు, అనిల్ రావిపుడి 5 లక్షల విరాళం ఇచ్చారు. ఆపత్కాలం సమయంలో ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 15 కోట్ల రూపాయల సాయం ప్రకటించి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచారు. క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలిచి దాతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. విరాళాలు అందచేయండి.. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య ప్రముఖులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఉదారత చాటాలని కోరారు. ముఖ్యమంత్రి సహాయ (సీఎంఆర్ఎఫ్) నిధికి విరివిగా విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తమిళనాడు తరఫున ఆ రాష్ట్ర సీఎం కె.పళనిస్వామి రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చెక్కును పంపించారు. బాధిత కుటుంబాల కోసం బ్లాంకెట్లు, దుప్పట్లు పంపిస్తున్నామన్నారు. వరదల కారణంగా ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వం చేసే సహాయక చర్యలకు తోడ్పడేందుకు ఈ విరాళం ప్రకటించినట్లు మేఘా యాజమాన్యం తెలిపింది. Many thanks Chiranjeevi Garu https://t.co/26ZUuoMAtK — KTR (@KTRTRS) October 20, 2020 -
ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్సైట్కి అనుసంధానంగా ఉన్న ట్విట్టర్ ఖాతా గురువారం హ్యాకయింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు పంపించాలంటూ మోదీ అకౌంట్ నుంచి ఆయన ఫాలోవర్లకు మెసేజ్లు వెళ్లాయి. ‘‘కరోనా కట్టడికి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. భారత్లో డిజిటల్ కరెన్సీ చెలామణిలోకి వచ్చింది’’అంటూ ప్రధాని ఖాతా నుంచి హ్యాకర్లు ట్వీట్ చేశారు. ఆ తర్వాత ప్రధాని ఖాతా నుంచి ‘‘ఈ అకౌంట్ని జాన్ విక్ హ్యాక్ చేసింది. అయితే పేటీఎం మాల్ని మాత్రం మేము హ్యాక్ చెయ్యలేదు’’అని సైబర్ నేరగాళ్లు మరో మెసేజ్ పంపారు. గత నెల 30న పేటీఎం డేటా తస్కరణ జాన్ విక్ పనేనంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాము ఆ పని చెయ్యలేదని నిరూపించడానికి ప్రధాని ఖాతాను హ్యాక్ చేసినట్టుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ట్విట్టర్ సంస్థ రంగంలోకి దిగి ఆ మెసేజ్లు తొలగించింది. ప్రధాని ఖాతాను పునరుద్ధరించి అన్ని రకాలుగా భద్రతను కల్పించింది. దర్యాప్తు ముమ్మరం చేసింది. మిగిలిన అకౌంట్లు భద్రం ప్రధాని ట్విటర్ ఖాతా హ్యాకయిందని తెలిసిన వెంటనే అన్ని చర్యలు చేపట్టామని, ఆయన మిగిలిన ఖాతాలకు వచ్చిన ముప్పేమీ లేదని ట్విట్టర్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. @narendramodi_in అని ఉండే ఈ అకౌంట్కి 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు 37 వేల ట్వీట్లు చేశారు. ఆగస్టు 31న మన్కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన ట్వీట్ ఆఖరిగా ట్వీట్ చేశారు. మోదీ ప్రసంగాలకు సంబంధించిన సమాచారం అంతా ఈ ఖాతా నుంచే ట్వీట్లు చేస్తారు. అయితే 6.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆయన మరో ఖాతాకి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. గత జూలైలో బరాక్ ఒబామా, జో బైడెన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల ఖాతాలు కూడా హ్యాక్ అవడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
పీఎం కేర్స్కు తొలి విరాళం మోదీనే
న్యూఢిల్లీ: కరోనాపై పోరు కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు ఐదు రోజుల వ్యవధిలోనే రూ.3,076 కోట్లు వచ్చినట్లు పీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రూ.2.25 లక్షలతో ఈ నిధి ప్రారంభమైందని, అయితే మొట్టమొదటగా ఈ విరాళమిచ్చింది ప్రధాని నరేంద్ర మోదీనేనని అధికారులు వెల్లడించారు. తొలి కార్పస్ ఫండ్గా రూ.2.25 లక్షలు ఆయన తన స్వంత జేబులో నుంచి సమకూర్చినట్లు తెలిపారు. కాగా ఇప్పటికే ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) ఉండగా మళ్లీ కొత్తగా పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. పైగా పీఎం కేర్స్ పద్దులను కాగ్ కాకుండా ప్రైవేట్ ఆడిటర్లు పర్యవేక్షించడంపైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. దీనిపై కేంద్రం బదులిస్తూ ఇది కేవలం 'స్వచ్ఛంద నిధి' అని స్పష్టం చేసింది. (చదవండి: పీఎం కేర్స్ నిధుల మళ్లింపు అనవసరం ) మోదీ ఇచ్చిన విరాళాలివే... ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరిగే కుంభమేళాలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి నరేంద్ర మోదీ గతేడాది రూ.21 లక్షల విరాళం అందించారు. 2018లో సియోల్ శాంతి పురస్కారం అందుకున్న మోదీ.. దాని ద్వారా వచ్చిన రూ.1.3 కోట్ల నగదును తనవంతుగా గంగా ప్రక్షాళన కోసం అందజేశారు. దీనితోపాటు ఆయన తను పొదుపు చేసుకున్న దాంట్లో నుంచి రూ.3.40 కోట్లను, గిఫ్టుల ద్వారా వచ్చిన రూ.8.5 కోట్లను కూడా నమామి గంగా మిషన్కు అందజేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవీకాలం ముగిసిన తర్వాత ఆ రాష్ట్ర సిబ్బంది కుమార్తెల విద్య కోసం రూ.21 లక్షలు విరాళమిచ్చారు. సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ.89.96కోట్లను కన్యా కేలవాణి ఫండ్(ఆడపిల్లల విద్యను ప్రోత్సహించే నిధి) విరాళంగా ఇచ్చారు. (చదవండి: రాష్ట్రపతి వేతనంలో 30 శాతం స్వచ్ఛందంగా) -
నేను అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి
సాక్షి, హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న వారు వీలైనంత త్వరగా ప్లాస్మా దానం చేసి ప్రాణాలను కాపాడాలని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విటర్ ద్వారా కోరారు. మన శరీరంలో ఏర్పడిన కరోనా ప్రతి బంధకాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఈలోపే ప్లాస్మా దానం చేస్తే వేరే వారి ప్రాణాన్ని కాపాడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తన శరీరంలో యాంటీ బాడీస్ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్ 8.62 ఉన్నాయని, ప్లాస్మా దానం చేయాలంటే 15కన్నా ఎక్కువ ఉండాలని తెలిపారు. పెద్దన్న కీరవాణి, భైరవ మంగళవారం ఉదయం ప్లాస్మా దానం చేశారని జక్కన్న పేర్కొన్నారు. రాజమౌళి ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్లాస్మా దానం చేసిన ఎంఎం కీరవాణి The antibodies that develop stay in our system for a limited period of time only.. I request Everyone who are cured from #Covid19 to come forward and donate. And become a life saver..🙏🏼🙏🏼 — rajamouli ss (@ssrajamouli) September 1, 2020 -
ప్లాస్మా దానం చేసిన ఎంఎం కీరవాణి
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం. కీరవాణి మంగళవారం ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన కుమారుడు భైరవతో కలిసి కిమ్స్ ఆసుపత్రిలోని ప్లాస్మా డొనేషన్ వింగ్లో ప్లాస్మా దానం చేసినట్లు తెలిపారు. ప్లాస్మా దానం చేయడం రక్తం దానం చేసినట్లే ఉందని, అందులో భయపడవలసిన అవసరం లేదని కీరవాణి పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మాదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న ప్రముఖులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావడాన్ని నెటిజనులు అభినందిస్తున్నారు. చదవండి: ప్లాస్మాదాతలకు రాజమౌళి ప్రోత్సాహకాలు Just done with voluntary donation of plasma at KIMS along with my son Bhairava. Feeling good. It felt very normal like in a routine blood donation session. No need to fear at all for participating. pic.twitter.com/2WVGNUtCIR — mmkeeravaani (@mmkeeravaani) September 1, 2020 -
కోవిడ్ రోగుల కోసం డియాగో విరాళం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారిన పడి అధిక మోతాదులో ఆక్సిజన్ అవసరమయ్యే రోగుల కోసం బెంగళూరుకు చెందిన డియాగో సంస్థ వంద యూనిట్ల హై ఫ్లో నాసల్ కాన్యులా (హెచ్ఎఫ్ ఎన్సీ) యంత్రాలను అందజేసింది. ఈ మేరకు సంస్థ సీఈవో ప్రథమేష్ మిశ్రా గురువారం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు యంత్రాలను అప్పగించారు. కోవిడ్ రోగులకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఈ యూనిట్లను గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి, ఛాతీ ఆసుపత్రి, టిమ్స్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తామని సోమేశ్ కుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
ట్రంప్కు మద్దతుగా విరాళాల వర్షం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం నిధుల సేకరణ జోరుగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం సంయుక్తంగా 16.5 కోట్ల డాలర్లను అత్యధికంగా ఒక్క జూలై నెలలోనే విరాళంగా పొందారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ రంగంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తంగా 1.1 బిలియన్ డాలర్లు వారికి విరాళంగా వచ్చాయి. అందులో 30 కోట్ల డాలర్ల వరకు నగదు రూపంలో సిద్ధంగా ఉన్నాయని రిపబ్లికన్ నేషనల్ కమిటీ(ఆర్ఎన్సీ) ప్రకటించింది. ట్రంప్ ప్రచారం కోసం ఆర్ఎన్సీ 300 మంది క్షేత్రస్థాయి కార్యకర్తలను తాజాగా రిక్రూట్ చేసుకుంది. దాంతో ట్రంప్ క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తున్నవారి సంఖ్య 1,500కు చేరింది. ఫేస్బుక్ నుంచి ట్రంప్ వ్యాఖ్యలు తొలగింపు ‘చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు’ అని ట్రంప్ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ని ఫేస్బుక్ తొలగించింది. కరోనా వైరస్కి సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేదిగా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇది తమ విధానానికి విరుద్ధమని, అందుకే దీన్ని తొలగిస్తున్నట్టు ఫేస్బుక్ యాజమాన్యం ప్రకటించింది. -
మందిరానికి విరాళాలు ఎవరిచ్చినా స్వీకరిస్తాం
న్యూఢిల్లీ/బెంగళూరు: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేవలం హిందువుల నుంచే కాదు, ఏ మతం వారు విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు, కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ప్రముఖ పెజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి తెలిపారు. రామునిపై విశ్వాసం ఉన్న ఏ మతం వారైనా ఎంతైనా విరాళంగా ఇవ్వవచ్చునన్నారు. ఆగస్టు 5న జరిగే భూమిపూజకు.. అత్యంత సీనియర్ బీజేపీ నేతలు ఎల్కే అడ్వాణీ, ఎం.ఎం.జోషి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర 200 మందిని ఆహ్వానిస్తామని ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా, కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో చేపట్టే రామాలయ భూమిపూజ కార్యక్రమం దూరదర్శన్తోపాటు ఇతర చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని వారన్నారు. దేశంలోని ప్రముఖ యాత్రాస్థలాల మట్టితోపాటు ప్రముఖ సిక్కు, బౌద్ధ, జైన మతాలయాల వద్ద మట్టిని కూడా సేకరించి, అయోధ్యకు పంపుతామన్నారు. -
చైనా విరాళాలు మన పార్టీలకు ఎందుకు?!
సాక్షి, న్యూఢిల్లీ : చైనా ఇప్పుడు ప్రపంచానికే పెద్ద ఫాక్టరీగా మారింది. దాంతో చైనా, తనకు ఏ దేశం ఎదురు తిరిగినా దానిపై ఆర్థిక ప్రతిష్టంబన దాడిని కొనసాగిస్తోంది. కరోనా వైరస్ ఆవిర్భవించిన చైనాపై ఆస్ట్రేలియా కన్నెర్ర చేయడంతో కోపం వచ్చిన చైనా, వెంటనే ఆస్ట్రేలియాలోని నాలుగు ప్రధాన కబేళాల నుంచి గోమాంసం దిగుమతిని నిలిపివేసింది. బార్లీ గింజల దిగుమతులపై భారీ సుంకాలను విధించింది. ఇదే తరహాలో ఇప్పుడు భారత్పై ఆర్థిక దాడి చేసేందుకు చైనా సిద్ధం అవుతోంది. (‘యాప్ల బ్యాన్ అభినందనీయం’) భారత్ సరిహద్దు సైన్యంతో చైనా సైన్యం సంఘర్షణకు దిగడంతో ఆగ్రహించిన భారత్ చైనాకు చెందిన 59 యాప్స్ను నిషేధించింది. ‘చైనా, భారత్ సరిహద్దులో ఎటు వైపు నుంచి ఎవరి సైన్యం దురాక్రమణకు పాల్పడలేదు’ అంటూ ప్రధాని మోదీ ప్రకటించినప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శల దాడి తీవ్రమై సరికొత్త విషయాలు వెలుగులోకి రావడం మొదలయ్యాయి. చైనాతో మోదీ మెతక వైఖరి అవలంబిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించడంతో సోనియా నాయకత్వంలోని ‘రాజీవ్ గాంధీ ఫౌండేషన్’ చైనా నుంచి భారీ ఎత్తున విరాళాలు స్వీకరించిందని, అందుకు ప్రతిఫలంగా 2005–06 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుందని బీజేపీ విమర్శించింది. (పాక్తో చేతులు కలిపిన చైనా?) ‘పీఎం కేర్స్’నిధి చైనాకు చెందిన ‘హ్వావీ, టిక్టాక్’ కంపెనీల నుంచి విరాళాలు తీసుకుందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యారోపణలు చేసింది. కోవిడ్–19 అత్యవసర నిధి కోసం గత మార్చి నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, తాను చైర్మన్గా ‘పీఎం కేర్స్’ను ఏర్పాటు చేశారు. ఆయన నిషేధించిన యాప్స్లో టిక్టాక్ కూడా ఉన్న విషయం తెల్సిందే. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మొదటి నుంచి చైనా సహా పలు దేశాల నుంచి విరాళాలు తీసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు విదేశీ విరాళాల నియంత్రణా చట్టాన్ని ఉల్లంఘించి విరాళాలు తీసుకున్నాయంటూ 2014లో ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా మందలించింది. (మరో రెండు చైనా కంపెనీలు బ్యాన్..) దాంతో 2016లో విదేశీ విరాళాల నియంత్రణా చట్టంలో మోదీ ప్రభుత్వం, రాజకీయ పార్టీల విరాళాలకు అనుకూలంగా సవరణ తీసుకొచ్చింది. ’భారతీయ చట్టాల పరిధిలో పరిమితికి లోబడి విదేశీ పెట్టుబడులున్న కంపెనీలను ఇక నుంచి దేశీయ కంపెనీలుగానే పరిగణించాలి’ అంటూ సవరణ తీసుకొచ్చారు. పార్టీల విరాళాల కోసం బాండుల విధానాన్ని మోదీ ప్రవేశపెట్టిన నాటి నుంచి బీజేపీకీ చైనా పెట్టుబడులుగల భారతీయ కంపెనీల నుంచి ఎక్కువ మొత్తాల్లో విరాళాలు వస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. చైనా కంపెనీలు భారత ఆర్థిక వ్యవహారాల్లో తమ ప్రాబల్యం కోసమే విరాళాల రూపంలో లంచాలిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. చైనాపై ఇతర చర్యలకు ఉపక్రమించడానికి ముందు ఏ రూపంలోనైనా చైనా కంపెనీల నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలు రాకుండా నిషేధం విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
కాంగ్రెస్, చైనా మధ్య ఎందుకీ బంధం!
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు చైనా రాయబార కార్యాలయం నుంచి దాదాపురూ.90 లక్షలు విరాళంగా అందాయని ఆ నిధుల్ని ఎందుకు తీసుకుందో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని∙న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. 2005–06లో ఈ నిధులు ఫౌండేషన్కు అం దినట్టుగా ఆ సంస్థ వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఉందన్నారు. రాజీవ్గాంధీ ఫౌండేషన్కు కాం గ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చైర్పర్సన్గా వ్యవ హరిస్తూ ఉంటే రాహుల్ గాంధీ, కుమార్తె ప్రి యాంకా, మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బోర్డు సభ్యులుగా ఉన్నారు. భూములిచ్చారు, విరాళాలు తీసుకున్నారు 2005–06లో రాజీవ్గాంధీ ఫౌండేషన్కి నిధులు అందిన తర్వాతే, ఆ ఫౌండేషన్ చైనాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ) కుదుర్చుకోమని సిఫారసు చేసిన విషయం నిజం కాదా? అని రవిశంకర్ ప్రశ్నించారు. ఎఫ్టీఏతో భారత్ ఆర్థికంగా నష్టపోతే, చైనాకు అపారమైన లబ్ధి చేకూరందన్నారు. కాంగ్రెస్, చైనా మధ్య రహస్య సంబంధాలు మధ్యప్రదేశ్లో జన సంవాద్ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్, చైనా మధ్య రహస్య సంబంధాలున్నాయని ఆరోపించారు. 2008లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందాన్ని కుదర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.ఒప్పందంపై విచారణ చేయాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. డోక్లాం వివాదం సమయంలో రాహుల్ చైనా వెళ్లి మన సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తప్పుదోవ పట్టిస్తున్నారా? : కాంగ్రెస్ లద్దాఖ్లోని భారత్ భూభాగంలోకి చైనా బలగాలు ప్రవేశించలేదంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానిస్తూ జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. గల్వాన్ లోయలోకి చైనా ఆర్మీ ప్రవేశించినట్టు నిపుణులు చెబుతున్నారని, దీనికి సంబంధించి శాటిలైట్ చిత్రాలు వస్తున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా అన్నారు. -
కరోనా వేళ కొత్త జంట ఔదార్యం
సాక్షి, ముంబై : కరోనా సంక్షోభ సమయంలో నూతన వధూవరులు తీసుకున్న నిర్ణయం పలువురి ప్రశంసలందుకుంటోంది. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా తమ వివాహ తంతు పూర్తి చేయడంతో పాటు కరోనా రోగులకు సహాయపడేలా వినూత్న నిర్ణయం తీసుకుంది ఈ కొత్త జంట. కోవిడ్-19 సంరక్షణ కేంద్రానికి 50 బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇతర వస్తువులను దానం చేసింది. అంతేకాదు ఈ సంక్షోభ సమయంలో స్థానికంగా అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు, కమ్యూనిటీ కిచెన్ ద్వారా బాధితులను ఆదుకున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా సొంత పట్టణాలకు వెళ్లే వలస కార్మికులకు కూడా సాయపడ్డారట. వివరాలను పరిశీలిస్తే..వాసాయిలోని నందాఖల్ గ్రామానికి చెందిన ఎరిక్ అంటోన్ లోబో(28), మెర్లిన్(27) చాలా నిరాడంబరగా పెళ్లి చేసుకున్నారు. కేవలం 22 మంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అలాగే అందరూ ఫేస్ మాస్క్లు ధరించి భౌతిక దూరాన్ని పాటించారు. అనంతరం సత్పాలా గ్రామంలో కొవిడ్-19 ఆస్పత్రికి అవసరమయ్యే 50 బెడ్లను, ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా ఇచ్చి తమ ఔదారాన్ని చాటుకున్నారు. ఇవే కాకుండా దిండ్లు, బెడ్షీట్లు, కవర్లు తదితర వస్తువులను కూడా విరాళంగా ఇచ్చారు. వివాహ దుస్తుల్లోనే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. (కరోనా రోగి ఆత్మహత్య: కానీ అంతలోనే) మహమ్మారి కారణంగా చాలామంది మరణిస్తున్నారు. పాల్ఘర్ జిల్లాలో, సుమారు 90 మంది మరణించారు.1,500 పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందుకే తమవంతు సహకారాన్ని అందించాలని నిర్ణయించుకున్నామని లోబో చెప్పారు. ఒక సాధారణ క్రైస్తవ వివాహానికి సుమారు 2వేల మంది అతిథులు హాజరవుతారు. వైన్, మంచి ఆహారం అన్నీ కలిపి భారీగానే ఖర్చవుతుంది. అందుకే భిన్నంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆసుపత్రులలో రోగులకు మెరుగైన సంరక్షణను అందించడంలో సహాయపడటం ద్వారా తమ ఆనందాన్ని పంచుకోవాలనుకున్నామని చెప్పారు. ఈ ఆలోచనతో మార్చిలో స్థానిక ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్ను సంప్రదించి, దీనికి సంబంధించిన ఏర్పాటు చేసుకున్నామన్నారు. పాల్ఘర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాస్ షిండే ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని వివరించారు. మరోవైపు సమాజానికి ఒక ఉదాహరణగా నిలిచారంటూ ఎరిక్, మెర్లిన్ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే ఠాకూర్ ఈ జంట చేసిన గొప్ప పనికి అభినందనలు తెలిపారు. వాసాయి-విరార్ నివాసితులు సమాజానికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నారనీ, రాబోయే రోజుల్లో ఎక్కువ మంది తమ వంతు కృషి చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నానన్నారు. -
ఆక్స్ఫర్డ్కు ఎన్నారై సోదరుల భారీ విరాళం
లండన్: భారతీయ సంతతికి చెందిన రూబేన్ సోదరులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పార్క్ కాలేజీకి దాదాపు రూ.770 కోట్లు (8 కోట్ల పౌండ్లు) విరాళమిచ్చారు. స్కాలర్ షిప్ కార్యక్రమానికి ఈ నిధులను వెచ్చిస్తారు. డేవిడ్, సీమోన్ రూబేన్లు ముంబైకి చెందిన వారు. ది సండే టైమ్స్ గణాంకాలప్రకారం వీరిద్దరూ 16 బిలియన్ పౌండ్ల సంపదతో బ్రిటన్ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. రూబెన్ ఫౌండేషన్ ఇచ్చిన విరాళం చారిత్రాత్మకమని, పార్క్ కళాశాల ఇప్పుడు రూబెన్ కాలేజీగా మారిందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తెలిపింది. (అలసిపోయాం.. ఇక ఆపండి: జార్జ్ సోదరుడి ఆవేదన) రత్తన్లాల్కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ న్యూయార్క్: ప్రముఖ భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రత్తన్లాల్(75)ను ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వరించింది. 2020 సంవత్సరానికి సుమారు రూ.1.90 కోట్ల విలువైన ఈ బహుమతికి ఆయన్ను ఎంపిక చేసినట్లు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పేర్కొంది. ‘రత్తన్లాల్ 50 ఏళ్లుగా నాలుగు ఖండాల్లో భూసార పరిరక్షణకు, 50 కోట్ల మంది రైతుల జీవనోపాధి పెంపునకు కృషి చేశారు. 200 కోట్ల ప్రజలకు ఆహార భద్రత కల్పించారు. వేలాది హెక్టార్ల భూమిలో సహజ ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలను కాపాడారు’ అని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఆర్గనైజేషన్ కొనియాడింది. -
కరోనా పోరాటంలో ప్రభుత్వానికి అండగా....
సాక్షి, అమరావతి: కరోనా వైరస్పై చేస్తున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అండగా నిలవడానికి సామాన్యుల నుంచి పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు, స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. సీఎం సహాయ నిధికి తమ వంతుగా సాయాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగానే కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వరరావు, వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎ.బాలసుబ్రమణ్యం, ఫార్మర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జే.మోహన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పార్ధసారధి పాల్గొన్నారు. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..) మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వ్యాపారవేత్తలు, స్వచ్ఛందసంస్ధలు,వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు తరపున కరోనా వైరస్పై పోరాడటానికి సీఎం సహాయ నిధికి 64 లక్షల 50వేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ చెక్కులను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్కు అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యానారాయణ రెడ్డి, ఎస్.కృష్ణారెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మురళీకృష్ణారెడ్డి అందజేశారు. (బట్టతల వారికి కరోనా వచ్చే అవకాశం ఎక్కువ, ఎందుకంటే) -
అంతర్జాతీయ టీకా కూటమికి 15 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టీకా కూటమి(గ్లోబల్ అలయన్స్ ఆఫ్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యూనైజేషన్–జీఏవీఐ)కి భారత్ తరఫున 15 మిలియన్ డాలర్ల(రూ. 113.13 కోట్లు)ను విరాళంగా ప్రధాని మోదీ ప్రకటించారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నిర్వహించిన గ్లోబల్ వ్యాక్సిన్ సమ్మిట్ను ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా గురువారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సమావేశంలో దాదాపు 50 దేశాలకు చెందిన అధినేతలు, మంత్రులు, ఐరాస సంస్థల ప్రతినిధులు, వాణిజ్యవేత్తలు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. విపత్తులపై అంతర్జాతీయ సహకారానికి ఉన్న పరిమితులను కరోనా మహమ్మారి ఎత్తి చూపిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘బహుశా తొలిసారి ప్రపంచ మానవాళి ఒక స్పష్టమైన ఉమ్మడి శత్రువుతో పోరాడుతోంది’ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ టీకా కూటమి.. ఒక అంతర్జాతీయ సంస్థ మాత్రమే కాదని, అది ఒక సంఘీభావ ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు. ఇతరులకు సాయం చేయడమంటే మనకు మనం సాయం చేసుకోవడమేనన్న విషయాన్ని ఈ సంస్థ మరోసారి గుర్తు చేస్తోందన్నారు. భారత్ వైద్య సదుపాయాలు ఎక్కువగా లేని అత్యధిక జనాభా ఉన్న దేశమని, అందువల్ల టీకా ప్రాముఖ్యత భారత్కు బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమని చెప్పే వసుధైక కుటుంబం భావన భారత సంస్కృతిలోనే ఉందని, ఈ కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో అదే భావనను భారత్ ఆచరిస్తోందని చెప్పారు. ఈ మహమ్మారిపై పోరాటం కోసం దాదాపు 120 దేశాలతో భారత్ తన దగ్గరున్న ఔషధాలను పంచుకుందన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదట ప్రారంభించిన పథకాల్లో పిల్లలు, గర్భిణులు అందరికీ టీకా ఇచ్చే ‘మిషన్ ఇంద్రధనుష్’ ఒకటని మోదీ గుర్తు చేశారు. టీకాల తయారీలోనూ భారత్ ముందుందని, ప్రపంచంలోని చిన్నారుల్లో దాదాపు 60% మందికి భారత్లో ఉత్పత్తి అయిన టీకాలే అందడం తమకు గర్వకారణమని చెప్పారు. -
పోయిన ప్రాణం తిరిగొచ్చింది: పండ్ల వ్యాపారి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని పళ్ల వ్యాపారి ఫూల్ మియా చోటూ మరోసారి తన కళ్లను తానే నమ్మలేకపోతున్నాడు. దాదాపు రూ.30వేల విలువైన తన మామిడి పళ్లను దోచుకుపోయారని కన్నీటి పర్యంతమైన అతడు ఇపుడు ఆనందంతో కంటతడి పెట్టాడు. దోచేసే మనుషులతో పాటు, సాయం చేసే మహానుభావులు కూడా ఉన్నారని ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. (సిగ్గు..సిగ్గు.. వీధి వ్యాపారిని దోచేసిన జనం!) వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జగత్పురి ప్రాంతంలో చోటూ బండి మీద పళ్లు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన దిగ్బ్రాంతికర ఉదంతంలో జనాలు మామిడి పళ్లను అందినకాడికి దోచుకుని వెళ్లిన వైనం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చాలా మంది దాతలు మానవత్వంతో స్పందించారు. దీంతో అతని బ్యాంకు ఖాతాలో దాదాపు రూ. 8లక్షలు జమ అయ్యాయి. దీనిపై చోటు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా వుంది. ఇపుడిక సంతోషంగా ఈద్ పండుగ జరుపుకుంటాను.. బిడ్డలని చూసుకుంటా’నని చోటూ చెప్పాడు. అంతేకాదు తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపాడు. కొంతమంది కాని పనిచేసినా, చాలామంది మానవత్వంతో స్పందించడం ఆనందంగా వుందన్నాడు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు) (కరోనా : భారీ సంపదనార్జించిన బిలియనీర్లు) -
ఆన్లైన్ హుండీ
-
సహాయం కోసం వేలం
కరోనా వల్ల ప్రపంచం ముందుకు వెళ్లకుండా ఆగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రభావం అందరి మీదా పడింది. ఈ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎవరికి తోచిన స్థాయిలో వారు సహాయం చేస్తున్నారు. సినిమా స్టార్స్ కుడా విరాళాలు ఇస్తూ, ఫ్యాన్స్ని సహాయం చేయమని పిలుపునిస్తూ ఉన్నారు. తాజాగా నిత్యా మీనన్ కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాలకు సహాయం చేయదలచుకున్నారు. అందుకోసం ఓ భిన్నమైన దారిని ఎంచుకున్నారు. గతంలో ఓ ఫ్యాషన్ షో కోసం తాను వేసుకున్న డిజైనర్ డ్రెస్ని వేలం వేస్తున్నారు నిత్య. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ఓ ఫౌండేషన్ ద్వారా పలు గ్రామాలకు సహాయం చేయాలనుకుంటున్నారు. (ఓ రైటర్ కథ) -
సీఎం సహాయనిధికి విశాఖ పోర్ట్ ట్రస్ట్ భారీ విరాళం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ. 75,00,000 విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్ని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కే. రామమోహన్ రావు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ని కలిసి అందజేశారు. చదవండి: భీమవరం ఎమ్మెల్యే రూ. 1.82 కోట్ల విరాళం కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగానే ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రూ. 50,00,000 విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో హోం మంత్రి సుచరిత సమక్షంలో సీఎం వైఎస్ జగన్ని కలిసిన ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రామచంద్రా రెడ్డి, ప్రతినిధులు తులసి విష్ణుప్రసాద్, ఎంవీ రావు, ఎంఎస్ఎన్ రెడ్డి, విజయ్ విరాళం చెక్కును అందజేశారు. చదవండి: సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ కోటి విరాళం -
సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ కోటి విరాళం
సాక్షి, అమరావతి: కరోనా (కోవిడ్-19) వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1 కోటి విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లలిత జ్యువెలర్ సీఎండీ కిరణ్కుమార్ బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో విరాళం చెక్కును అందచేశారు. ►అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు డాక్టర్ జీ. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ లలిత, రమణా రెడ్డి, మనోహరి రూ. 50,00,000 విరాళం ఇచ్చారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి సమక్షంలో డాక్టర్ శ్రీనివాస్రెడ్డి కుటుంబ సభ్యులు గుద్దేటి నరసింహారెడ్డి (గుండ్లకుంట), డాక్టర్ ఎంఎల్ నారాయణరెడ్డి (జమ్ములమడుగు) విరాళం చెక్కును సీఎం జగన్కు అందచేశారు. ►కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఇండియన్ బ్యాంక్ రూ. 30,00,000 విరాళం అందించింది. విరాళానికి సంబంధించిన డీడీని సీఎం జగన్కు ఇండియన్ బ్యాంక్ డీజీఎం ప్రసాద్ అందించారు. ►అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూ. 17,00,000 విరాళం ప్రకటించింది. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం రామకృష్ణ విరాళానికి సంబంధించిన డీడీని ముఖ్యమంత్రి అందచేశారు. ►మరోవైపు ముఖ్యమంత్రి సహాయనిధికి అసోసియేషన్ ఆఫ్ ఫార్మర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు (ఏపీ, తెలంగాణ) రూ. 6,15,000 విరాళం ఇచ్చింది. -
అంతుచిక్కని ఆశ్చర్యం...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన కరోనా వైరస్ సహాయ నిధి ‘పీఎం కేర్స్’కు కార్పొరేట్ దిగ్గజాలు, సెలబ్రిటీలు, మధ్య తరగతి ప్రజలు తమవంతు ఆర్థిక సహాయాన్ని అందజేయడం విశేషం. కార్మికులకు జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవంటూ చేతులెత్తేసిన కంపెనీలు కూడా ‘పీఎం కేర్స్’కు ఆర్థిక సహాయం అందజేయడం అంతుచిక్కని ఆశ్చర్యం. (ప్లాస్మా చికిత్స తీసుకున్న వైద్యుడు మృతి) ఫిట్నెస్ స్టార్టప్ కంపెనీ ‘క్యూర్ ఫిట్’ మే 4వ తేదీన జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవంటూ 800 మంది ఉద్యోగులను తీసివేసింది. పలు చోట్ల తన ఫిట్నెస్ సెంటర్లను మూసివేసింది. తీసివేసిన ఉద్యోగుల సహాయార్థం కేవలం రెండు కోట్ల రూపాయలను కేటాయించింది. అదే ‘పీఏం కేర్స్’కు ఐదు కోట్ల రూపాయలను విరాళంగా అందజేసింది. ప్రధాని మోదీకి సన్నిహితులు, రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 500 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఫేస్బుక్, సిల్వర్ లేక్ కంపెనీ భారీ ఎత్తున ముకేశ్ జియో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఉత్సాహంతో ఆయన అతిగా స్పందించారనుకుందాం. ఆయన తన కంపెనీల్లో ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత విధించారు. తన హైడ్రోకార్బన్ వ్యాపారంలో ఉద్యోగులకు పనితీరు ఆధారంగా జరిపే చెల్లింపులను ఈసారి వాయిదా వేశారు. (కార్చిచ్చులా కరోనా) కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకారం ‘పీఎం కేర్స్’కు వచ్చే నిధులన్నీ ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ కిందకు వస్తాయట. పార్లమెంట్ చట్టం ప్రకారంగానీ, మరే ఇతర చట్టం కిందగానీ ‘పీఏం కేర్స్’ ఏర్పడలేదు. అలాంటప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణలు చెబుతున్నారు. కార్మికుల కడుపుకొట్టి సహాయ నిధికి సహాయం చేయడంలో అర్థమేముందీ!? (వైట్హౌస్కి కరోనా దడ) -
కోవిడ్ నియంత్రణ కోసం ఎస్ఎఫ్సీ విరాళం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా ఇంతవరకు ఎప్పుడు ఎదుర్కొని సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ విధించడంతో ఆయా ప్రభుత్వాలు అనేక సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అనేక సంస్థలు, సామాన్యులు కూడా అండగా నిలుస్తున్నారు. మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో చాలా కంపెనీలు, సంస్థలు పీఎం కేర్కి, సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళాలు అందిస్తున్నాయి. (సీఎంఆర్ఎఫ్కు భారీగా విరాళాలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ - తెలంగాణ విభాగం) తమ వంతు బాధ్యతగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల రూపాయలను అందజేసింది. కోవిడ్-19 నియంత్రణలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా కార్పొరేషన్ తరఫున ఈ విరాళం అందజేసినట్లు కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వేముల శ్రీనివాసులు తెలిపారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును శ్రీనివాసులతో పాటు కార్పొరేషన్ ఎగ్జికూటివ్ డైరెక్టర్ దేవానంద్ శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు అందజేశారు. అదేవిధంగా, ఎస్ఎఫ్సీ ఉద్యోగులు, సిబ్బంది సైతం ముందుకొచ్చి తమ ఒకరోజు వేతనం 3.8 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్ను అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ మంత్రి కేటీఆర్కు అందజేశారు. (కస్టమ్స్ అండ్ సెంట్రల్ జీఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ రూ.70 లక్షల విరాళం) -
కరోనా: సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
సాక్షి, తాడేపల్లి: కరోనా మమ్మారిపై చేస్తోన్న యుద్దంలో చాలా మంది ప్రభుత్వాలకు అండగా నిలబడుతున్నారు. తాము చేయగలిగినంత సాయం చేస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే కోవిడ్-19 నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీస్ మేనేజిమెంట్ అసోసియేషన్ బుధవారం రూ. 2,56,00,000 విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ మేనేజిమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ప్రతినిధులు ఆలూరు సాంబశివారెడ్డి, ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, మిట్టపల్లి కోటేశ్వరరావు, దాడి రత్నాకర్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్కు అందించారు. (కరోనా : సీఎం సహాయనిధికి విరాళాలు) దీనికి తోడు నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గ నాయకులు, అభిమానులు కోటి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ( రూ. 1,00,29,000) విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును,డీడీని ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందించారు. సివీఎస్ కృష్ణమూర్తి చారిటీస్ ఇరవై ఐదు లక్షలు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించింది. వీరితో పాటు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, నియోజకవర్గ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డాక్టర్లు, నాయకులు రూ. 89,86,222 విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్కు అందజేశారు. (సీఎం సహాయ నిధికి వాణిజ్య సంఘాల విరాళాలు) -
రూ. 200 చెల్లిస్తే నాతో డ్యాన్స్ చేయొచ్చు : హీరోయిన్
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, కూలీలు, నిరాశ్రయల సహాయార్ధం హీరోయిన్ శ్రియ సరన్ నడుం బిగించారు. ఇందుకోసం ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్న ఆమె.. వినూత్నంగా విరాళాలు సేకరిస్తున్నారు. www.thekindnessproject.inలో కేవలం 200 రూపాయలు చెల్లించి రిసిప్ట్ను మెయిల్ చేసి వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. శనివారం సాయంత్రం 8 గంటలవరకు ఈ అవకాశం ఉందని, ఆదివారం విజేతలను ప్రకటిస్తామని పేర్కొంది. లక్కీడ్రాలో విజేతలుగా నిలిచిన వారు (వీడియో కాల్ )లో తనతో కలిసి డ్యాన్స్, యోగా చేసే అవకాశం సొంతం చేసుకోవచ్చని తెలపింది. మీరిచ్చే విరాళాలు అన్ని నిరుపేదలకు చేరుతాయని, ఈ మంచి పనిలో అందరం భాగస్వాములం అవుదాం అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పిలుపునిచ్చారు. (ఒకే ఇంట్లో వేరు వేరుగా ఉన్నాం ) View this post on Instagram I Have teamed up with The Kindness Foundation and Chennai Task Force to help with their covid relief efforts They’re addressing those who are most vulnerable: destitute elderly, daily wage laborers, the homeless, orphans, and disabled - Will be offering two lucky winners a chance to dance, do some yoga, or whatever floats your boat to brighten up your quarantine - all you have to do to enter is donate Rs. 200 and email your receipt to give@thekindnessproject.in The contest will run until Saturday at 8pm, and winners will be contacted on Sunday You can swipe right for details or head to The Kindness Foundation page 🤩🤩🤩🤩 let’s have some fun together and do some good too! A post shared by Shriya Saran (@shriya_saran1109) on May 2, 2020 at 5:45am PDT ఇంకా కొన్ని రోజుల వరకు మనం వైరస్తో పోరాడాల్సి ఉందని, ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే మరింత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది. అందరూ సరక్షితంగా ఉండాలని..లక్షణాలు కనిపిస్తే వెంటనే స్వీయ నిర్భంధంలోకి వెళ్లాల్సిందిగా కోరింది. శ్రియ నటించిన నరగసూరన్ అనే తమిళ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరవింద్ స్వామి ముఖ్య పాత్ర పోషించారు. ఇక రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశ్చివ్ను రెండేళ్ల క్రితం శ్రియ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులు స్పెయిన్లోని బార్సిలోనాలో ఉంటున్నారు. -
సీఎంఆర్ఎఫ్కు భారీగా విరాళాలు
సాక్షి, హైదరాబాద్/నందిగామ: కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు మంగళవారం సీఎంఆర్ఎఫ్కు విరాళాలు అందించారు. ► తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున రూ.10 కోట్లను సీఎంఆర్ఎఫ్ కు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, సెక్రటరి ఎన్. శ్రీనివాసరావు, మెంబర్ ఒ.ఎన్. రెడ్డి సీఎం కేసీఆర్కు చెక్కును అందించారు. ఈ ఐదుగురు వ్యక్తిగతంగా మరో రూ.2.50 లక్షలు విరాళం అందించారు. ► గ్రీన్ కో గ్రూప్ రూ.5 కోట్ల విలువైన లక్ష పీపీఈ కిట్లు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ను గ్రీన్ కో గ్రూప్ ఎం.డి అనిల్ చలమలశెట్టి సీఎం కేసీఆర్కు అందించారు. ► మైత్రా ఎనర్జీ గ్రూప్ రూ.2.50 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ను ఎం.డి.విక్రమ్ కైలాస్, డైరెక్టర్ వివేక్ కైలాస్ సీఎం కేసీఆర్కు అందించారు. ► తెలంగాణ స్టేట్ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రూ.2 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ను ప్రెసిడెంట్ లక్ష్మీనరసింహారావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు అందించారు. ► శ్రీ రామచంద్ర మిషన్ రూ.1.50 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును జాయింట్ సెక్రటరి వంశీ చలగుల్ల, డా.శరత్ కుమార్ ముఖ్యమంత్రికి అందించారు. ► ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్ రూ.1 కోటి సీఎంఆర్ఎఫ్కు విరాళం అందించిం ది. దీనికి సంబంధించిన చెక్కును ఎం.డి.వెంకటేశ్వర రెడ్డి సీఎం కేసీఆర్కు అందించారు. ► కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సీఎంఆర్ఎఫ్కు రూ.7.41లక్షలు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సీఎం కేసీఆర్కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ► రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతి వనం నిర్వాహకులు సీఎం ఆర్ఎఫ్కు రూ.1.50 కోట్ల విరాళాన్ని అందజేశారు. కన్హా శాంతి వనం జాయింట్ సెక్రటరీ వంశీ, డా.శరత్ మంగళవారం హైదరాబాద్లోని సీఎం కేసీఆర్కు చెక్కు అందజేశారు. ► సీఎంఆర్ఎఫ్కు మంగళవారం 13 మంది దాతలు రూ.1.15 కోట్ల విరాళాలు అందజేశారు. విరాళాలకు సంబంధించిన చెక్కులను మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ రూ.30లక్షలు, పీపుల్ టెక్ ఐటీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, చిరిపాల్ పాలీ ఫిల్మ్ రూ.25లక్షలు చొప్పున విరాళం ఇచ్చాయి. -
విత్తన పరిశ్రమ విరాళం రూ.9 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐఐ) సభ్య కంపెనీలు రూ.9 కోట్ల విరాళం ప్రకటించాయి. ఈ మొత్తంలో పీఎం కేర్స్ ఫండ్కు రూ.1.97 కోట్లు అందించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్స్కు రూ.2.44 కోట్లు విరాళం ఇచ్చాయి. పీపీఈ, ఆహార పంపిణీ, అవగాహన కార్యక్రమాలకు మిగిలిన మొత్తాన్ని వెచ్చిస్తున్నాయి. సభ్య కంపెనీలైన మహీకో, రాశి, సింజెంటా, క్రిస్టల్, కోర్టెవా కంపెనీలు ఒక్కొక్కటి రూ.1 కోటి ఖర్చు చేస్తున్నాయి. బీఏఎస్ఎఫ్, బేయర్, బయోసీడ్, ఎంజా జేడెన్, హెచ్ఎం క్లాస్, ఐఅండ్బీ, జేకే, కలాశ్, నిర్మల్, నోబుల్, ర్యాలీస్, రిజ్వాన్, సీడ్వర్క్స్, సవాన్నా, టకీ, టకీట కూడా సాయానికి ముందుకు వచ్చాయి. కాగా, మొత్తంగా బేయర్ ఇండియా రూ.7.2 కోట్లు, డీసీఎం శ్రీరామ్ రూ.10 కోట్లు, జేకే గ్రూప్ రూ.10 కోట్లు వెచ్చిస్తున్నాయి. -
పీఎం కేర్స్కు బజాజ్ ఫిన్సర్వ్ 10 కోట్లు
ముంబై: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ అనే ప్రత్యేక నిధికి బజాజ్ ఫిన్సర్వ్, ఆ సంస్థ ఉద్యోగులు సంయుక్తంగా రూ.10.15 కోట్ల విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వైరస్ నివారణకు రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు గతంలోనే బజాజ్ గ్రూపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎంఆర్ఎఫ్ రూ.25 కోట్లు: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ సైతం కరోనా వైరస్ నివారణ చర్యలకు మద్దతుగా రూ.25 కోట్లను ప్రకటించింది. కోల్ ఇండియా రూ.221 కోట్లు: ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా కరోనా వైరస్ నివారణ కోసం భూరీ విరాళాన్ని ప్రకటించింది. పీఎం కేర్స్ ఫండ్కు రూ.221 కోట్లను అందించినట్టు తెలిపింది. -
ఆకలితో ఎవరూ బాధపడ కూడదు
ఈ కరోనా కష్టకాలంలో వలస కార్మికులు, దినసరి కూలీల కష్టాలను తీర్చేందుకు మన వంతు సాయం చేయాలంటున్నారు తమన్నా. తన వంతుగా ముంబై మురికివాడల్లోని దాదాపు పదివేల మంది వలస కార్మికులు, దినసరి కూలీలకు ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆహారాన్ని అందిస్తున్నట్లుగా చెబుతున్నారు తమన్నా. ‘‘ఈ కరోనా మహమ్మారి కారణంగా లక్షల మంది జీవితాలు ఊహించని విధంగా దెబ్బతిన్నాయి. వ్యాక్సిన్ దొరికే వరకు సామాజిక దూరం, దేశవ్యాప్త లాక్డౌన్ విధివిధానాలను పాటించడమే కరోనా నిర్మూలనకు సరైన మార్గాలు. ప్రస్తుతం మనందరి జీవితాలపై కరోనా ప్రభావం చాలా ఉంది. తిరిగి మనందరి జీవితాలు సరైన మార్గంలోకి రావడానికి వారాలు లేదా కొన్ని నెలలు కూడా పట్టొచ్చు. ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీలు ఈ కష్టకాలంలో జీవనపోరాటం చేస్తున్నారు. వారిని వారు పోషించుకోవడమే వారికి పెద్ద సవాల్గా మారింది. అలాంటివారు ఆకలితో బాధ పడకూడదని ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి నా వంతుగా నేను సాయం చేస్తున్నాను. మనందరం ఆ కష్టజీవులకు అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు తమన్నా. -
కరోనా : వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ భారీ విరాళం
సాక్షి, ముంబై: కరోనా పై పోరులో ముందుండి పోరాడుతున్న వారు, రైతులు, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రపంచ రీటైల్ దిగ్గజం వాల్మార్ట్ ఫౌండేషన్ , ఫ్లిప్కార్ట్ ముందుకొచ్చాయి. ఆరోగ్య సంరక్షణ కార్మికులకు కీలకమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ), రైతులకు, చిన్నవ్యాపారాలకు అవసరమైన సహాయ సామగ్రిని, నిధులను అందించే సంస్థలకు నిధులు అందివ్వనున్నామని శనివారం ప్రకటించాయి. భారతదేశంల కోవిడ్-19 పోరాటానికి తమ మద్దతు అందిస్తామని, ఇందుకు 38.3 కోట్ల విరాళాలను అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి అదనంగా సుమారు 8 కోట్ల రూపాయలను స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ప్రకటించింది. (వాల్మార్ట్లో 50 వేల ఉద్యోగాలు ) ప్రభుత్వేతర సంస్థలు (ఎన్ జీఓలు) పబ్లిక్ హెల్త్ కేర్ కార్మికులకు పంపిణీ చేయడానికి ఎన్ 95 మాస్క్ లు, మెడికల్ గౌన్లు లాంటి పీపీఈలను అందించడంపై దృష్టి సారించినట్టు ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి ఇప్పటికే 3లక్షల మాస్క్ లు, పది లక్షలమెడికల్ గౌన్లను అందించిన సంస్థ బలహీన వర్గాలకు మద్దతు ఇస్తున్న గూంజ్, శ్రీజన్ అనే స్వచ్ఛంద సంస్థకు తాజా 7.7 కోట్లను అదనంగా ఇస్తోంది. ఈ నిధులను రైతులు, గ్రామీణ సూక్ష్మ వ్యాపారాలకు అవసరమైన నిధుల సహాయంతో పాటు ఆహారం మందులు, పరిశుభ్రతకు అవసరమైన వస్తువుల పంపిణీకి ఉపయోగించనున్నారు.భారతదేశంలోని కస్టమర్లు, భాగస్వాములు కరోనాకు తీవ్రంగా ప్రభావితం మయ్యారని, ఈ సమయంలోవారికి తమ మద్దతు వుంటుందని వాల్మార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు కాథ్లీన్ మెక్ లాఫ్లిన్ పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థల కృషికి మద్దతు ఇవ్వడానికి మనమందరం కలిసి రావాలన్నారు. కరోనా సంక్షోభంలో బాధితులను ఆదుకునేందుకు తమ బృందం 24 గంటలు కృషి చేస్తోందని, ఈ విషయంలో తమ నిబద్ధతలో భాగంగానే అత్యవసర సహాయక చర్యలపై భారతదేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ రంగాలతో కలిసి పనిచేస్తున్నామని ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు. చదవండి : క్యూ4లో అదరగొట్టిన హెచ్డీఎఫ్సీ -
కరోనా : సంకల్పం ముందు ఏదైనా దిగదిడుపే
లండన్ : కరోనాతో ప్రపంచం గడగడలాడిపోతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఆయా దేశాల్లోని సెలబ్రిటీలు, ప్రజలు తమ వంతుగా విరాళాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్రిటన్లోని బెడ్ఫోర్డ్షైర్లో నివాసముంటున్న 99 ఏండ్ల రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ టామ్ మూర్ (99) కరోనా బాధితులకు వైద్యం కోసం ఏదైనా సహాయం చేయాలని భావించారు. అయితే మూర్కు రెండేండ్ల క్రితమే తుంటి ఎముక విరిగిపోవటంతో వికలాంగులు వాడే ఊతకర్ర సాయంతో మాత్రమే నడువగలరు. అది కూడా పది పదిహేను అగుడు దూరం మాత్రమే. కానీ ఆయన సంకల్పం ముందు అతనికున్న వైకల్యం కూడా చిన్నబోయింది. తన నివాసం చుట్టూ 25 మీటర్ల దూరం ఏర్పరచుకున్న గార్డెన్లో 100 సార్లు నడవాలని నిశ్చయించుకున్నారు. అలా నడవమే గాక తన మిత్రులు, సన్నిహితులకు జాతీయ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) కోసం తోచినంత విరాళం చేయాలని కోరాడు. ఏప్రిల్ నెలలోనే ఆయన తన 100వ జన్మదినం జరుపుకోనున్న టామ్ మూర్ పుట్టిన రోజు నాటికి 100 రౌండ్లు తిరుగుతానని చాలెంజ్ చేశారు.(కరోనా; త్వరలోనే సాధారణ స్థితికి) తన గార్డెన్ ఏరియాలో రోజు నడుస్తూనే.. దాంతో వచ్చే విరాళాలను ఎన్హెచ్ఎస్కు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆయన చేస్తున్న పని అక్కడి స్థానిక మీడియా దృష్టిలో పడటంతో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. ప్రస్తుతం మూర్ పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అంతేకాదు మూర్ చేస్తున్న పనిని మెచ్చి లక్షల మంది ఆయన ప్రారంభించిన నిధుల సేకరణకు విరాళాలు అందజేశారు. ఇప్పటివరకు మూర్కు 12 మిలియన్ పౌండ్లు( దాదాపు రూ. వంద కోట్లకు పైగా) విరాళాలు సమకూరాయి. మూర్కు ప్రమాదం జరిగినప్పుడు ఎన్హెచ్ఎస్ ఆయనకు ఎంతో సేవ చేసింది. ఆ సంస్థ చేసిన సేవలకు కృతజ్ఞతగా ఎన్హెచ్ఎస్కు ఏదో విధంగా సహాయపడాలనుకున్నారని మూర్ అల్లుడు కొలిన్ ఇన్గ్రామ్ తెలిపారు. ఇప్పుడు మూర్ 100వ జన్మదినం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుండడం విశేషం. (గూగుల్ ట్రెండింగ్స్లో మద్యం తయారీ) -
‘ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలి’
సాక్షి, సిద్దిపేట : మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని.. ఎంత మందికి సహాయం చేశామన్నదే పది కాలాల పాటు నిలుస్తుందని, ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో దాతలు తమ దాతృత్వాన్ని చాటుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కుకునూరుపల్లి, సిద్దిపేట కాటన్ మార్కెట్ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని ఆటోడ్రైవర్లు, రజకులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను ప్రబలకుండా చేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయని చెప్పారు. దీంతో ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బంది అయినా.. ప్రాణం కన్నా ఏదీ ముఖ్యం కాదని, ఈ విపత్కర పరిస్థితిలో ప్రాణాలు కాపాడుకోవడమే ప్రధానమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే రాష్ట్రంలో కొంత మేరకు మెరుగైన పరిస్థితి నెలకొందని చెప్పారు. లాక్డౌన్ కారణంగా రోజు వారీ కూలీలు, ఇతర చేతి వృత్తి పనుల వారికి ఉపాధి కరువైందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 12 కేజీల బియ్యం ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. సమస్యను అర్థం చేసుకుని ప్రముఖ కంపెనీల యజమానులు, వ్యాపారస్తులు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల నాయకుల ముందుకు వచ్చి నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, బియ్యం, ఇతర సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. ప్రజలకే కాకుండా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి సహాయ నిధులకు కూడా తమ వంతు విరాళం ఇవ్వడం సంతోషకరం అని పేర్కొన్నారు. ఇదే సహకారం ఇక ముందు కూడా ఉండాలని, పేదలకు సాయం అందించేందుకు దాతలు ముందురు రావాలని కోరారు. లాక్డౌన్ను పొడిగించడాన్ని మేధావులు, వైద్యులు స్వాగతిస్తున్నారన్నారు. అ యితే సామాన్య ప్రజలకు స్థానిక నాయకులు అవగాహన కల్పించాలని సూచించారు. -
ఫెఫ్సీకి కల్యాణి జ్యువెలర్స్, సోనీ టీవీ రూ. 12 కోట్ల విరాళం
తమిళనాడు: కరోనా మహమ్మారి కారణంగా సినీ కార్మికులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు వారికి సాయం అందించడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఈనేపథ్యంలో కల్యాణి జ్యువెలర్స్, సోనీ టీవీ సంస్థలు సంయుక్తంగా కలిసి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(ఫెఫ్సీ) సభ్యులను ఆదుకునే విధంగా రూ. 12 కోట్లను విరాళంగా అందించారు. ఈ విషయాన్ని ఫెఫ్సీ జాయింట్ సెక్రెటరీ శ్రీధర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఖుషీతో, నటుడు ప్రభు సహకారంతో సోనీ టీవీ, కల్యాణి జువెలర్స్ సంస్థలు ఫెఫ్సీకి రూ. 12 కోట్లను విరాళంగా అందించినట్లు తెలిపారు. ఈ మొత్తంలో రూ. 2 కోట్ల 70 లక్షలను సినీ కార్మికుల కోసం కేటాయించినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని సంఘ సభ్యులు 1800 మందికి తలా రూ. 1,500 విలువ చేసే బిగ్ బజార్ కూపన్ను అందించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత సినీ కార్మికుల సమాఖ్య కార్యదర్శి, దర్శకుడు ఉన్నికృష్ణన్కు కల్యాణి జువెలర్స్, సోనీ టీవీ సంస్థలకు కృజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. -
సీసీసీకి వైజయంతీ మూవీస్ రూ. 5 లక్షలు విరాళం
కరోనా నియంత్రణకు ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తాజాగా కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి మరో రూ. 5 లక్షలు విరాళం ప్రకటించింది. ఇంతకముందే కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు అందజేసిన విషయం తెలిసిందే. ఫలితంగా ఇప్పటివరకు వైజయంతీ మూవీస్ అందజేసిన కరోనా విరాళం మొత్తం రూ. 25 లక్షలకు చేరుకుంది. చిత్ర పరిశ్రమకు వెన్నెముక అయిన దినసరి వేతనంతో పనిచేసే కార్మికులను ఆదుకోవడానికి సీసీసీకి రూ. 5 లక్షలు అందజేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వైజయంతీ మూవీస్ సంస్థ ప్రకటించింది. (మీకు అమ్మ, అక్కాచెల్లెళ్లు లేరా..) సినీ కార్మికులను ఆదుకోవడానికి సీసీసీని ఏర్పాటు చేయడాన్ని తాము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామనీ, చిత్రసీమలోని మిగతా ప్రముఖులంతా ఈ మంచి పనికి తోడ్పాటునివ్వాలని కోరింది. ప్రజలందరూ ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని, కరోనాపై రాజీలేని పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు అందరూ సహకరించాలని వైజయంతి సంస్థ విజ్ఞప్తి చేసింది. (పుష్ప: విలన్గా బాలీవుడ్ అగ్ర నటుడు) -
చెస్ స్టార్స్ విరాళం రూ. 4 లక్షల 50 వేలు
చెన్నై: కరోనాపై పోరాటానికి మద్దతుగా భారత అగ్రశ్రేణి చెస్ క్రీడాకారులు తమవంతుగా చేయూతనిచ్చారు. ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్తోపాటు గ్రాండ్మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఆదిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అభిమానులతో ఆన్లైన్లో 20 బోర్డులపై చెస్ గేమ్లు ఆడారు. చెస్.కామ్–ఇండియా వెబ్సైట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత చెస్ స్టార్స్తో ఆడిన వారు స్వచ్ఛందంగా కొంత మొత్తం విరాళంగా ఇచ్చారు. ఓవరాల్గా ఈ టోర్నీ ద్వారా చెస్ స్టార్స్ మొత్తం ఆరు వేల డాలర్లు (రూ. 4 లక్షల 50 వేలు) సమకూర్చారు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేశారు. -
సీఎం సహాయనిధికి విరాళాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి చేపడుతున్న కార్యక్రమాల కోసం తమవంతు సాయంగా ప్రముఖులు, పలు కంపెనీల ప్రతినిధులు శనివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు అందించారు. రాంకీ ఎన్విరో ఇంజనీరింగ్ లిమిటెడ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎమ్.గౌతమ్ రెడ్డి, ఆళ్ల శరణ్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. సైంట్ కంపెనీ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి, సీఈఓ బి.కృష్ణా సీఎంఆర్ఎఫ్కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. రాజా ధనరాజ్గిర్ ఎస్టేట్స్ చైర్మన్ అరుణ్ మహేందర్ గిర్ కోటి రూపాయల చెక్కును సీఎంకు విరాళంగా ఇచ్చారు. -
కరోనా విరాళం
బ్రహ్మానందం – 3 లక్షలు (’సీసీసీ మనకోసం’కి) చదలవాడ శ్రీనివాస్ – పది లక్షలా పదకొండు వేల నూట పదకొండు రూపాయిలు (’తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి’ కోసం ) తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ – 25 లక్షలు (తెలంగాణ ప్రభుత్వానికి) రాజమౌళి, డీవీవీ దానయ్య – 10 లక్షలు. (‘సీసీసీ మన కోసం’కి). -
కరోనాపై పోరు.. సీసీసీకి బ్రహ్మానందం విరాళం
లాక్డౌన్ వేళ ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) మన కోసం’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థకు పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. తాజాగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సీసీసీ ట్రస్ట్కు సాయం అందించేందకు ముందుకు వచ్చారు. సీసీసీకి రూ. 3 లక్షల విరాళం అందజేయనున్నట్టు ఆయన శుక్రవారం ప్రకటించారు. కాగా, సీసీసీ సంస్థకు చిరంజీవి చైర్మన్గా ఉండగా.. సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్ శంకర్, సీ కల్యాణ్, దాము సభ్యులుగా ఉన్నారు. సీసీసీ ద్వారా 24 క్రాప్ట్స్లో పనిచేస్తున్న నిరుపేద సినీ కార్మికులకు నిత్యావసరాలు, ఇతర సాయం అందజేస్తున్నారు. -
సాయిప్రణీత్ విరాళం రూ. 4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పోరాటానికి మద్దతుగా భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి ఆటగాడు, హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ తనవంతుగా రూ. 4 లక్షలు విరాళం ఇచ్చాడు. గతేడాది ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకం నెగ్గిన సాయిప్రణీత్... ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 లక్షలు... తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 1 లక్ష వితరణ చేశాడు. కరోనా కట్టడి కోసం ఇప్పటి వరకు బ్యాడ్మింటన్ క్రీడాంశం నుంచి చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ (రూ. 26 లక్షలు), పీవీ సింధు (రూ. 10 లక్షలు), శ్రీకృష్ణప్రియ (రూ. 5 లక్షలు), కశ్యప్ (రూ. 3 లక్షలు) విరాళాలు ఇచ్చారు. హాకీ ఇండియా (హెచ్ఐ) ఇప్పటికే పీఎం–కేర్స్ రిలీఫ్ ఫండ్ కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించగా... తాజా ఒడిశా సీఎం సహాయనిధికి రూ. 21 లక్షలు ఇచ్చింది. చెస్ క్రీడాకారుల దాతృత్వం కోవిడ్–19పై పోరాటానికి చెస్ క్రీడాకారులందరూ ఏకమయ్యారు. ఆన్లైన్ టోర్నీల్లో పాల్గొనడం, విరాళాల ద్వారా రూ. 3 లక్షలకు పైగా నిధుల్ని సమకూర్చారు. తమిళనాడుకు చెందిన చెస్ కోచ్ ఆర్బీ రమేశ్కు చెందిన చారిటబుల్ ట్రస్ట్ ‘చెస్ గురుకుల్’కు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ రూ. 2 లక్షలు, కార్తికేయన్ మురళి రూ. 25,000 విరాళం ఇచ్చారు. -
సీఎంఆర్ఎఫ్కు విరాళాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా మంగళవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)కు విరాళాలు అందజేశారు. కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులు మొత్తం రూ.75 లక్షల రూపాయల నగదు, రూ.1కోటి విలువైన మందులు, వైద్య పరికరాలను విరాళంగా ప్రకటించారు. ఇందులో కరీంనగర్ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రూ.50 లక్షల చెక్కును సంస్థ ప్రతినిధులు పొన్నంనేని గంగాధర్రావు, ప్రెసిడెంట్ శ్రీధర్ ముఖ్యమంత్రికి అందించారు. మార్వాడీ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ తరఫున రూ.25 లక్షల చెక్కును ఆ సంస్థ యజమానులు గోపీ మహేశ్వరి, రాజేశ్ అగర్వాల్, ముఖేశ్ పర్వాల్ ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్కు మరో రూ.6.80 కోట్ల విరాళాలు ప్రగతిభవన్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు రూ.6.80 కోట్ల విలువ చేసే చెక్కులను 25 మంది దాతలు అందజేశారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో విజ్ రియల్టర్స్ కోటి రూపాయల చెక్కును అందజేసింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్సైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పెన్నా సిమెంట్స్, రత్నదీప్ ప్రైవేటు లిమిటెడ్ రూ.1 కోటి చొప్పున చెక్కులను సీఎంఆర్ఎఫ్కు అందజేశారు. సుజన చారిటబుల్ ట్రస్టు రూ.50 లక్షలు రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి సీఎం సహాయ నిధి పేరిట కేటీఆర్కు చెక్కును అందజేశారు. దొడ్ల డెయిరీ లిమిటెడ్, ఫిలింనగర్ కల్చరల్ సెంటర్, వశిష్ట కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, గాయత్రి గ్రానైట్స్ రూ.25 లక్షల చొప్పుల విరాళం అందజేశాయి. అగ్రసేన్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ.21 లక్షలు, నీరూస్ ఎన్సెంబుల్స్ రూ.20 లక్షలు, రిజెనెసిస్ ఇండస్ట్రీస్ రూ.10లక్షలు అందజేసింది. హైదరాబాద్లోని పీఓటి మార్కెట్లో వృత్తి పనిచేసే స్వర్ణ కారులు 39 మంది రూ.7.32లక్షల చెక్కులను మంత్రి కేటీఆర్కు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ విరాళం అందజేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు రూ.50వేల చొప్పున విరాళాన్ని చెక్కు రూపంలో పంపించారు. ఫ్రీడం ఆయిల్ రూ.2.5కోట్ల విరాళం ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్స్ తయారీదారు జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా) సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల చెక్కును అందజేసింది. కరోనాపై కేంద్రం, రాష్ట్రాలు జరుపుతున్న పోరాటానికి సంఘీభావంగా ఇప్పటివరకు రూ.2.5 కోట్ల విరాళాన్ని అందజేసిట్లు సంస్థ ఎండీ ప్రదీప్ చౌదరి ప్రకటించారు. -
కరోనా విరాళం
కృష్ణంరాజు, శ్యామలా దేవి – 10 లక్షలు (‘ పీయం కేర్స్’కు) (శ్యామలా దేవి పుట్టినరోజు ఏప్రిల్ 13న. ఈ సందర్భంగా 4 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే కృష్ణం రాజు, శ్యామల కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తీ, సాయి ప్రదీప్తీ తమ పాకెట్ మనీ నుంచి తలా రెండు లక్షలు తీసి 6 లక్షలను విరాళంగా ప్రకటించారు.) కె.కె. రాధా మోహన్ – 3 లక్షలు (సీసీసీ మనకోసం) వీకే నరేష్ – 11 లక్షలు ( ‘సీసీసీ మనకోసం’కి 1 లక్ష, ‘మా’లో 100 మంది సభ్యులను దత్తత తీసుకుని ఒక్కో సభ్యుని కుటుంబానికి 10 వేలు సాయం. ఇప్పటికే 58 కుటుంబాలకు వారి వారి బ్యాంకు ఖాతాలో 10 వేలు చొప్పున డిపాజిట్ చేశారు). ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త, దినేశ్ గుప్త, ఆదిత్య గుప్తలు కరోనాపై యుద్ధానికి – 31 లక్షలు విరాళం -
ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. ► తెలంగాణ ఐకేపీ వీఓఏలు 1,72,61,000 రూపాయలను విరాళంగా అందించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఐకేపీ వీఓఏల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎల్.రూప్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు మంచికట్ల కోటేశ్వర్, ప్రధాన కార్యదర్శి మారిపెల్లి మాధవి, కోశాధికారి తిరుపతిలు ఈ విరాళాన్ని సీఎం కేసీఆర్కు అందించారు. ► రాష్ట్ర మహిళా సమాఖ్యలకు చెందిన స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ తరుఫున స్త్రీనిధి అధ్యక్షురాలు ఎస్.అనిత కోటి రూపాయల చెక్కును సీఎం కేసీఆర్కు అందించారు. ► తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ అధ్యక్షుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి సీఎంకు అందించారు. ► తెలంగాణ బ్రీడర్స్ అసోసియేషన్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ జి.రంజిత్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ► యూనిక్ ట్రీస్ రూ.25 లక్షల విరాళం అందించింది. యూనిక్ ట్రీస్ అధ్యక్షుడు రామ్ దేవ్ చెక్కును సీఎంకు అందించారు ► తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు (టెస్కాబ్) కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవిందర్ రావు, వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ఈ కోటి రూపాయల్లో 88 లక్షల రూపాయలు బ్యాంకు విరాళం కాగా, 8.5 లక్షలు బ్యాంకు ఉద్యోగులు, 3.5 లక్షల రూపాయలు రవిందర్ రావు అందించారు. ► డీసీసీబీలు, సింగిల్ విండోలు కలిపి 76 లక్షల రూపాయలు అందించాయి. డీసీసీబీ చైర్మన్లు ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున, సింగిల్ విండో చైర్మన్లు 5వేల రూపాయల చొప్పున, ఉద్యోగులు ఒక రోజు వేతనం చొప్పున అందించారు. ► రెడ్డీస్ ల్యాబ్స్ 5 కోట్ల రూపాయల విలువైన మందులు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీశ్, ఎండీ జీవీ ప్రసాద్ ముఖ్యమంత్రికి అందించారు. ► ఎమ్ఎస్ఎన్ ల్యాబ్స్ 5 కోట్ల రూపాయల మందులు, ఇతర మెడికల్ సామగ్రి అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ను ల్యాబ్స్ చైర్మన్ ఎమ్.సత్యనారాయణ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ► ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని దాతలు ‘గుడ్ సమరిటాన్స్ ఆఫ్ ఖమ్మం’పేరిటి ఏర్పడి రూ. రెండు కోట్ల విరాళాలు సేకరించారు. ఇందులో రూ. కోటి 75 లక్షలు విరాళాలు రాగా, రూ. 25 లక్షలను మమత వైద్య విద్యా సంస్థలు అందించారు. రెండు కోట్ల రూపాయల చెక్కును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎంకు అందించారు. ► అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఎ.జలంధర్ రెడ్డి రూ.50 లక్షలు, డీఈసీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండీ అనిరుధ్ గుప్తా 50 లక్షల రూపాయల చెక్కును సీఎంకు అందించారు ► కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ కె.అనిల్ కుమార్ 50 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. ► ఎస్ఎల్ఎంఐ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీ బి.వెంకటరెడ్డి రూ.25 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు. ► శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ ఎండీ ఎం.రవీందర్ రెడ్డి రూ.25 లక్షల చెక్కును సీఎం కేసీఆర్కు అందించారు. ► సీల్ వెల్ కార్పొరేషన్ ఎండీ బంగారు సుబ్బారావు రూ. 25 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. ► జీవీకే బయో తరపున కంపెనీ వైస్ చైర్మన్ సంజయ్రెడ్డి రూ.5 కోట్లు, సాగర్ సిమెంట్స్, వెల్జన్ డెనిజన్స్, రహేజా కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ కోటి రూపాయల చొప్పున చెక్కులను మంత్రి కేటీఆర్కు అందజేశారు. ► శ్రీ ఆదిత్య హోమ్స్, తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ అర్చ్ డైకోసిస్ ఎడ్యుకేషన్ సొసైటీ, కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, తెలంగాణ స్పిన్నింగ్ అండ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ రూ.50 లక్షల చొప్పున విరాళాన్ని మంత్రి కేటీఆర్కు అందజేశాయి. ► పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, యూనిక్ ఇన్ప్లేటబుల్స్ లిమిటెడ్, జీఎస్జీ బిల్డర్స్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, సప్తగిరి కాంఫర్ ప్రైవేట్ లిమిటెడ్, సరళ ప్రాజెక్ట్ వర్క్స్ లిమిటెడ్, వెలిజన్ హైడ్రాయిర్ లిమిటెడ్, దివ్య శక్తి పేపర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రెండ్ సెట్ బిల్డర్స్, ఎలగన్స్ డెవలపర్స్ రూ.25 లక్షల చొప్పున విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంత్రి కేటీఆర్కు అందజేశాయి. ► ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.31 లక్షలు సీఎంఆర్ఎఫ్కు ప్రకటించగా, గ్రీన్ సిటీ ఎస్టేట్, సూర్య శంకర రెడ్డి గుండేటి, నిజాం క్లబ్ రూ.15 లక్షల చొప్పున విరాళాన్ని కేటీఆర్కు అందజేశారు. ► సాకేత్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేష్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్, ధనలక్ష్మీ ఐరన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హారిక, హాసిని క్రియేషన్స్, ఏ.శ్రీనివాస్, జై రాజ్ ఇస్పాత్ లిమిటెడ్, దేవ శ్రీ ఇస్పాత్ లిమిటెడ్, హైదరాబాద్ జింఖానా క్లబ్, నవ తేజ్ ఇన్ ఫ్రా లిమిటెడ్, ఆర్ బీవీ ఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ, వీరమణి బిస్కెట్ ప్రైవేట్ లిమిటెడ్, డాల్ఫిన్ ఫుడ్స్, సంజీవని చారిటబుల్ ట్రస్ట్ రూ.10 లక్షల చొప్పున విరాళాలకు సంబంధించిన చెక్కులను మంత్రి కేటీఆర్ కి అందించారు. -
ఆటకు సై
ఒలింపిక్స్కు దగ్గూ జ్వరం. ఐపీఎల్కు ఒళ్లునొప్పులు. అండర్–17 మహిళల కప్కు గొంతునొప్పి. కోట్ల మంది క్రీడాభిమానులకు ఐసొలేషన్. ‘మీ ఆటలు సాగవు..’ అంటోంది కరోనా. ‘నీ ఆటల్నే కట్టిపెట్టు’ అంటున్నారు క్రీడాకారిణులు. ఓడించేందుకు అటువైపు ఎత్తుగడలు. గెలిచి తీరేందుకు ఇటువైపు సర్వశక్తులు. వైరస్పై యుద్ధానికి బరి ఉండకపోవచ్చు. స్పోర్ట్స్ ఉమెన్ ఇచ్చే విరాళాల పోరాట స్ఫూర్తికి తిరుగుంటుందా! ఈషాసింగ్ ముప్పై వేలు గన్లో బులెట్ మాత్రమే ఉంటుంది. ఆ బులెట్ వెళ్లి టార్గెట్కు తగిలేలా గురి చూసి ట్రిగ్గర్ నొక్కడం మాత్రం షూటర్ చేతిలో ఉంటుంది. ఈషా సింగ్ షూటర్. వయసు పదిహేను. పి.ఎం. రిలీఫ్ ఫండ్కి 30 వేల విరాళం ఇచ్చింది. ‘నా సేవింగ్స్ నుంచి ఇస్తున్నాను’ అని ట్వీట్ చేసింది. కరోనా సంహారానికి విరాళం ఇవ్వడం ద్వారా తన గన్ ట్రిగ్గర్ నొక్కిన అతి చిన్న వయసు క్రీడాకారిణి ఈషా.. హైదరాబాద్లోని బోల్టన్ స్కూల్ విద్యార్థిని. వయసెంత అని కాదు, దాచుకున్న మొత్తం ఇచ్చేయడం భారీ విరాళం కాదంటారా?! హిమాదాస్.. నెల జీతం హిమాదాస్ (20) స్ప్రింటర్. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన 49 మంది ‘టాప్ స్పోర్ట్స్పర్సన్స్’లో హిమ ఒకరు. కరోనాను పరుగెత్తించేందుకు ఆమె కూడా తను ఇవ్వగలినంత ఇచ్చారు. తన ఒక నెల జీతాన్ని అస్సాం ప్రభుత్వానికి ఇచ్చారు. గౌహతిలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో హెచ్.ఆర్.ఆఫీసర్గా ఉన్నారు హిమ. సింధు ఐదు ప్లస్ ఐదు తెలుగు రాష్ట్రాల క్రీడాజ్యోతి పి.వి.సింధు (20) ఏపీ, తెలంగాణ సీఎంల రిలీఫ్ ఫండ్కు పది లక్షల రూపాయలు ఇచ్చారు. 2016 రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన ఈ బాడ్మింటన్ చాంపియన్.. కరోనాపై పోరులోనూ చాంపియనేనని తన విరాళం ద్వారా నిరూపించుకున్నారు. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటంతో ఆమె అభిమానులు నిరుత్సాహపడినప్పటికీ ఆమె మాత్రం... ‘‘ముందు జీవితం. తర్వాతే ఈవెంట్స్’’ అన్నారు. మిథాలీ పది లక్షలు రైట్ హ్యాండ్ బాట్స్ఉమన్, వన్డే ఇంటర్నేషనల్ టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ (37) కరోనాకు ముక్కు పగిలే షాటే ఇచ్చారు. ప్రధాని ఫండ్కి 5 లక్షలు, తెలంగాణ సీఎం ఫండ్కి 5 లక్షలు. ‘కొద్దిగా మాత్రమే ఇవ్వగలుగుతున్నాను’ అని ట్వీట్ కూడా చేశారు మిథాలి. పదిలో, ఐదులో లేదు విలువ. ‘ఇవ్వడం’లో ఉంది. భారత మహిళా క్రికెట్ జట్టులోని ఈ సీనియర్ హ్యాండ్.. ఆటలో తనకెదురైన సమస్యల్ని గుండె నిబ్బరంతో డీల్ చేశారు. కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వాలకైనా, ప్రజలకైనా కావలసింది అలాంటి నిబ్బరమే. దీప్తి శర్మ లక్షన్నర బ్యాటింగ్లో లెఫ్ట్ హ్యాండ్, బౌలింగ్లో రైట్–ఆర్మ్ ఆఫ్ బ్రేక్ ప్రావీణ్యాలు గల టీ20 వరల్డ్ కప్ టీమ్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ (22) కరోనాకు లెఫ్ట్ అండ్ రైట్ వాయించడానికి తన వైపు నుంచి వెస్ట్బెంగాల్ స్టేట్ ఎమర్జెన్సీ ఫండ్కి 50 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అది కాకుండా, పి.ఎం. రిలీఫ్ ఫండ్కి, యు.పి. రిలీఫ్ ఫండ్కి కలిపి లక్ష రూపాయలు ఇచ్చారు. దీప్తి ఆగ్రాలో పుట్టారు. తండ్రి రైల్వేస్లో చేశారు. అలా ఆమెకు యు.పి.తోనూ, పశ్చిమ బెంగాల్తోనూ అనుబంధం ఉంది. ప్రియాంక పది వేలు ప్రస్తుతం బెంగాల్ జట్టుకు యు–19 కోచ్గా ఉన్న భారత జట్టు మాజీ క్రికెట్ ప్లేయర్ ప్రియాంక రాయ్ (32) బెంగాల్ కరోనా రిలీఫ్ ఫండ్కి పది వేల రూపాయలు ఇచ్చారు. బ్యాటింగ్లో రైట్ హ్యాండ్, బౌలింగ్లో లెగ్ బ్రేక్, కోచింగ్లో.. ‘హెడ్స్ అండ్ షోల్డర్స్, నీస్ అండ్ టోస్’లా ఉండే ప్రియాంక.. విరాళం మాత్రమే ఇచ్చి ఊరుకోలేదు. లాక్డౌన్లో ప్రజలెవ్వరూ ఇళ్లలోంచి రాకుండా మోటివేట్ కూడా చేస్తున్నారు. పూనమ్ రెండు లక్షలు ఇటీవలి ఉమెన్ టి20 వరల్డ్ కప్లో దుమ్ము రేపిన స్పిన్నర్ పూనమ్ యాదవ్ (28) కరోనా కొమ్ములు వంచడం కోసం పి.ఎం.–కేర్స్ ఫండ్కి, యు.పి. సీఎం ఫండ్కి కలిపి 2 లక్షల రూపాయలను ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో ఎదురైన తట్టుకోలేని పరిస్థితులకు నిరుత్సాపడి క్రికెట్ను వదిలేసినప్పుడు తండ్రే ఆమెలో ఫైటింగ్ స్పిరిట్ నింపి, మళ్లీ క్రికెట్లోకి పంపించారు. ఆర్మీ ఆఫీసర్ ఆయన. పూనం జీవితంలోంచి ఇప్పుడు మనం తీసుకోవలసింది ఇదే. కరోనాపై ఆర్మీ స్పిరిట్తో పోరాడాలని. మేరీ కోమ్ కోటీ లక్ష కరోనాకు ఇవ్వవలసిన పంచ్నే ఇచ్చారు బాక్సర్ మేరీ కోమ్ (37). రాజ్యసభ సభ్యురాలు కూడా అయిన కోమ్ ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ నుంచి కోటి రూపాయలను కరోనాపై పోరుకు విడుదల చేశారు. రాజ్యసభ సభ్యురాలిగా తన ఒక నెల జీతాన్ని పి.ఎం. నేషనల్ రిలీఫ్ ఫండ్కు ఇచ్చేశారు. రీచా.. మనూ.. అపూర్వీ ఉమెన్ టి20 వరల్డ్ కప్లో భారత జట్టు ఆల్ రౌండర్ పదహారేళ్ల రీచా ఘోష్ లక్ష, ఎయిర్ గన్ షూటింగ్ ఒలింపియన్ మనూ భాకర్ (18) లక్ష, షూటర్ అపూర్వీ చండేలా (27) 5 లక్షలు.. విరాళంగా అందించారు. టెన్నిస్ తార సానియా మీర్జా (33) ప్రతిరోజూ దినసరి కార్మికులకు ఆహార దినుసులు పంపిణీ చేస్తున్నారు. ఎవరు ఎంత ఇచ్చారని కాదు. క్రీడారంగంలోనైనా, మరే రంగంలోనైనా విరాళంగా మహిళలు ఇచ్చే ప్రతి రూపాయి కూడా అమూల్యమైనదే. క్రీడల్లో ఆ విరాళం మరింత విలువైనది. ఈవెంట్లలో పురుషులకు వచ్చినంత రెమ్యునరేషన్ మహిళలకు రాదు. అయినా వారు తాము ఇవ్వగలిగినంత ఇస్తున్నారంటే.. ఇచ్చే ఆ మనసును చూడాలి. ఏప్రిల్ 6 సరిగ్గా ఈరోజునే నూట ఇరవై నాలుగేళ్ల క్రితం 1896 ఏప్రిల్లో గ్రీసు రాజధాని ఏథెన్స్లోని పనాథినైకో స్టేడియంలో తొలి ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుకలు జరిగాయి. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగిన ఆ ఒలింపిక్స్లో 14 దేశాలు పోటీపడ్డాయి. 241 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో మహిళలు లేరు. ఆ తర్వాతి (1900) ఒలింపిక్స్ నుంచి మహిళల ప్రవేశం మొదలైంది. తొలి ఒలింపిక్స్ మొదలైన ఏప్రిల్ 6ను 2014 నుంచి ఐక్యరాజ్య సమితి ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్’గా గుర్తిస్తోంది. -
పేద సినీ కార్మికులకు సహాయం
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్లు నిలిచిపోవడంతో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం’ (సీసీసీ) ప్రారంభించారు. నటీనటుల సహా పలువురు దాతల నుంచి సీసీసీకి విరాళాలు వెల్లువెత్తాయి. ముందే ప్రకటించినట్లు ఈ ఆదివారం నుంచి 24 శాఖల్లోని పేద కార్మికులకు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్ బృందం నిత్యావసరాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ –‘‘సినీపరిశ్రమలోని ప్రతి కార్మికుడి ఇంటికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నాం. అందులో భాగంగా ఆదివారం స్టూడియోస్ విభాగం కార్పెంటర్స్కి సరుకులు అందించాం. నిరంతరం సాగే ప్రక్రియ ఇది. ప్రతి నెలా సరుకులు కార్మికుల ఇంటికే చేరతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త అయిన చిరంజీవిగారితో సహా దాతలందరికీ కృతజ్ఞతలు. ‘సీసీసీ మనకోసం’ కమిటీ సభ్యులైన తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్ , బెనర్జీ.. ఇలా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దర్శకుడు మెహర్ రమేష్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది’’ అన్నారు. -
ఇంగ్లండ్ క్రికెటర్ల దాతృత్వం
లండన్: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోన్న కోవిడ్–19పై పోరు కోసం ఇంగ్లండ్ పురుషులు, మహిళా క్రికెటర్లు ముందుకొచ్చారు. తమ వేతనాల్లో కోతను భరించేందుకు సిద్ధమయ్యారు. కరోనాకు సహాయం అందించేందుకు క్రికెటర్లు ముందుకు రావాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కోరగా దానికి వారు అంగీకరించారు. దీని ప్రకారం ఈసీబీతో సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న పురుష, మహిళల క్రికెటర్లకు రానున్న మూడు నెలల జీతాల్లో 20 శాతం కోత పడనుంది. దీంతో కేవలం పురుష క్రికెటర్ల వేతనాల కోత నుంచి లభించే మొత్తం 5,00,000 పౌండ్ల (రూ. 4 కోట్ల 68 లక్షలు)కు సమానం కానుంది. అలాగే మహిళా క్రికెటర్ల ఏప్రిల్, మే, జూన్ నెల జీతాల నుంచి కూడా విరాళాన్ని సేకరించనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఓవరాల్గా ఎంత మొత్తం చారిటీ కోసం విరాళమివ్వాలనే అంశంపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఆటగాళ్లంతా విరాళమివ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని మహిళా జట్టు కెప్టెన్ హెథర్నైట్ తెలిపింది.