న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ విలీనం అయ్యే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఓట్లు చీలకూడదనేదే తమ ఉద్దేశం అని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి. టిఆర్ఎస్తో పొత్తు లేదా సీట్ల అవగాహన ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు పూర్తయిన తరువాత టిఆర్ఎస్ బీజేపీ వైపు వెళుతుందేమోనన్న అనుమానాన్ని ఆ వర్గాలు వ్యక్తం చేశాయి.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్లో టిఆర్ఎస్ విలీనం అవుతుందా? పొత్తా అనే విషయం ఇంకా ఖరారు కాలేదని ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. టిఆర్ఎస్ విలీనం అవుతుందని దిగ్విజయ్ సింగ్ ఎన్నడూ అనలేదన్నారు.
కాంగ్రెస్-టిఆర్ఎస్ విలీనం లేనట్లే!
Published Mon, Mar 3 2014 7:51 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement