అనంతపురం : చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు కేవలం బీజేపీతో ఉన్న బంధాన్ని మరింత బలపరుచుకోవడానికే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... జూన్ 2వ తేదీన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తుందని... ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుందని ఆయన వివరించారు. 109, 110 జీవోలను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్బంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.