k ramakrishna
-
పవన్ కి CPI రామకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్
-
రాష్ట్రంపై ఎన్నాళ్లీ వివక్ష?
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మరోసారి తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వామపక్ష పార్టీలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిపాయి. రాస్తారోకోలు, ప్రదర్శనలు, సభలు జరిపి కేంద్రం తీరుపై భగ్గుమన్నారు. విజయవాడలోని పాత బస్టాండ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్ని రకాలుగా తీరని ద్రోహం చేస్తూనే ఉందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, గత బడ్జెట్లో ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ వంటి కీలక అంశాలను పూర్తిగా విస్మరించారన్నారు. పోలవరానికి నిధులు కేటాయించకుండా, కనీసం రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంపై ఎందుకింత కక్ష? ఎన్నాళ్లీ వివక్ష? అని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ, టీడీపీ కలిసి రావాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర నిర్లక్ష్య, నిరంకుశ వైఖరిని ఎండగడుతూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని నేతలు ప్రకటించా రు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ, టీడీపీ కూడా వీధుల్లోకి రావాలని, అవసరమైతే బంద్ చేయాలని కోరారు. వామపక్షనేతలు వెంక య్య, శంకర్, విల్సన్, వనజ, జి.కోటేశ్వరరావు, బాబూరావు, కృష్ణ, కాశీనాథ్, అమరనాథ్, ఖాదర్ బాషా మాట్లాడారు. విశాఖపట్నంలో సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిరసన తెలిపారు. శ్రీకాకుళం, విజయనగ రం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
దీక్షలు కాదు.. ఏపీ హామీలపై మోదీని ప్రశ్నించండి
ఒంగోలు: పార్లమెంట్ సాక్షిగా ఏపీ అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధాని మోదీని ఎందుకు అడగట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీని పంజాబ్లో ఫ్లైఓవర్పై నిలిపివేశారని.. ఏలూరులో సోము వీర్రాజు దీక్షకు దిగడం హాస్యాస్పదమన్నారు. 20 నిమిషాల పాటు మోదీ రోడ్డుపై ఆగితే ఇంత యాగీ చేస్తున్న బీజేపీ నాయకులు.. ప్రజా సమస్యలపై ఎందుకు వెంటనే స్పందించట్లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులపై కనీసం ఒక్క వినతిపత్రమైనా ప్రధానికి ఇచ్చారా అని నిలదీశారు. రాష్ట్రంలో పొత్తులపై తమ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతోనే తమ పొత్తు ఉంటుందని తెలిపారు. కాగా, ఉద్యోగులను పీఆర్సీ నిరుత్సాహపరిచిందని రామకృష్ణ పేర్కొన్నారు. ఈనెల 11న విజయవాడలో నిరుద్యోగులు, విద్యార్థులతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో నాయకులు పీజే చంద్రశేఖర్, ఎంఎల్ నారాయణ పాల్గొన్నారు. -
న్యాయ రాజధానితోనే అభివృద్ధి
కర్నూలు (అర్బన్): న్యాయ రాజధానిని సాధించుకుంటేనే కర్నూలు జిల్లా అభివృద్ధి చెందుతుందని, వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, సంస్థల నాయకులు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా చారిత్రక త్యాగాలు చేస్తూ వచ్చిన కర్నూలు జిల్లా వాసులు ఇకపై త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు. సోమవారం ఉదయం స్థానిక మెగాసిరి ఫంక్షన్ హాల్లో అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘అధికార వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఏర్పాటు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే టీడీపీ నేతలు అడ్డుతగలడం దారుణమని, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో తక్కువ ధరకు సేకరించిన భూములను ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ అక్కడి అమాయక రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ముసుగులో చేపట్టిన పాదయాత్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని, ఎన్నో త్యాగాలు చేసిన కర్నూలు వాసుల చిరకాల స్వప్నమైన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కలిసి రాని రాజకీయ నేతలంతా కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. రాయలసీమ పౌరుషం చూపిస్తాం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ ..1953 నుంచి చారిత్రక త్యాగాలు చేసిన కర్నూలు వాసులు ఇక త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తామని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ఆశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు ప్రకటిస్తే టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. ఇక్కడి టీడీపీ నేతల్లో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ఇక నుంచి చేపట్టే ఉద్యమాల్లో కలిసి రావాలన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో నిజమైన రైతులు లేరని, ఆ యాత్రలో రియల్ ఎస్టేట్వ్యాపారులు, చంద్రబాబు బినామీలు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని అన్నారు. స్వార్థంతో పేద, మధ్య తరగతి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన భూములతో రూ.కోట్లు సంపాదించేందుకు టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతూ నిజమైన రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. న్యాయ రాజధాని సాధనకు తొలి అడుగు కర్నూలు ఎంపీ డాక్టర్ ఎస్.సంజీవ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధాని సాధన కోసం తొలి అడుగు పడిందని, ఇక పాదయాత్రలు, నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చేపట్టాల్సి ఉందని అన్నారు. జిల్లాలో 95 కిలోమీటర్ల మేర తుంగభద్ర ప్రవహిస్తున్నా తాగేందుకు కూడా నీరు లేని పరిస్థితి ఇక్కడ ఉందన్నారు. న్యాయ రాజధాని ఇక్కడ ఏర్పాటైతే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. సాధన సమితి అధ్యక్షుడు బి.క్రిష్టఫర్ మాట్లాడుతూ.. అమరావతి రైతుల పేరుతో చంద్రబాబు చేయిస్తున్న పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామన్నారు. మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. కరువు కాటకాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సీమ రైతులను ఆదుకోలేని టీడీపీ నేతలు అమరావతి రైతుల నకిలీ ఉద్యమాలకు చందాలు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. న్యాయ రాజధానికి సీపీఐ కట్టుబడి ఉంది సీపీఐ నేత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసే అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో కొనసాగుతున్న పాదయాత్రలు వట్టి బూటకమని, చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో వారంతా కేవలం పాత్రధారులేనని అన్నారు. ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు సీహెచ్ వెంగళరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కర్నూలు నుంచి హైకోర్టు వరకు పాదయాత్రలు చేపడదామన్నారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకుపోయేందుకు ఉద్యోగులంతా వారం రోజులపాటు మాస్ క్యాజువల్ లీవ్ పెట్టేందుకైనా వెనుకాడమన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఐ.విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయ్యేంత వరకు ఉద్యమాలను ఉధృతం చేసే ప్రక్రియలో ఎంతటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధమన్నారు. సదస్సులో డిప్యూటీ మేయర్ రేణుక, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, జాతీయ కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు వి.సిద్ధారెడ్డి, విద్యాసంస్థల అధినేతలు జి.పుల్లయ్య, కేవీ సుబ్బారెడ్డి, ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ కన్వీనర్ శ్రీరాములు, కో–కన్వీనర్ ఆర్.చంద్రప్ప, సీనియర్ న్యాయవాదులు వై.జయరాజు, నాగలక్ష్మీదేవి, విశ్రాంత తహసీల్దార్ రోషన్ ఆలీ తదితరులు మాట్లాడారు. -
రూ.60 పెంచి.. రూ.5 తగ్గిస్తారా?
సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు, పన్నుల పెంపుపై కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరల వ్యత్యాసాన్ని రామకృష్ణ వివరించారు. రూ.60 పెంచి రూ.5 తగ్గిస్తారా? అని ప్రశ్నించారు. ఈ నెల 14న తిరుపతి వస్తున్న హోం మంత్రి అమిత్ షాకు పెట్రోల్ ధరలపై నిరసన తెలుపుతామన్నారు. ఏపీలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పని తీరు సరిగా లేదని ఆరోపించారు. రష్యా విప్లవం విజయవంతమైన రోజును పురస్కరించుకుని లెనిన్ చిత్రపటానికి పార్టీ నాయకులు రామకృష్ణ, జల్లి విల్సన్, రావుల వెంకయ్య, వై.చెంచయ్య, నార్లవెంకటేశ్వరరావు పుష్పాంజలి ఘటించారు. -
రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదు
నెల్లూరు (దర్గామిట్ట): రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. శనివారం ఉదయం నెల్లూరు సంతపేటలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మీద ప్రతిపక్ష నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం, నైతికత లేకుండా బూతులు తిట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ప్రధానమంత్రిని, కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిసి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన కోరాలి అనే ఆలోచనలో ఉన్నారని.. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అనంతరం సీపీఐ నెల్లూరు జిల్లా సమితి సభ్యులు, శాఖ కార్యదర్శుల వర్క్షాపు జరిగింది. -
చట్ట సభల్లో కోటీశ్వరుల ప్రభావం
ఘంటసాల(అవనిగడ్డ)/సాక్షి, అమరావతి: చట్ట సభల్లో కోటీశ్వరుల ప్రభావం పెరిగిపోతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఘంటసాల ఆదిశేషు సంతాపసభ కృష్ణా జిల్లా ఘంటసాల గోటకం కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఘంటసాల ఆదిశేషు నిబద్ధతను గౌరవిస్తూ ప్రత్యేక సంచికను విడుదల చేయడం గర్వకారణమని రామకృష్ణ తెలిపారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జెల్లి విల్సన్ మాట్లాడుతూ నిబద్ధత గల నేత ఆదిశేషు అన్నారు. వామపక్షాలు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది జీతాలనూ ప్రభుత్వమే చెల్లించాలి పంచాయతీ ఉద్యోగులకు మాదిరే మున్సిపల్, నగరపాలకసంస్థల సిబ్బంది వేతనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈమేరకు ఆయన ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. -
'నీతో నీతులు చెప్పించుకొనే స్థితిలో బీజేపీ లేదు'
సాక్షి, విజయవాడ: సీపీఐ రామకృష్ణతో నీతులు చెప్పించుకొనే స్థితిలో బీజేపీ లేదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి పురిఘళ్ల రఘురామ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐ రామకృష్ణ ఆయన పార్టీ వ్యవహారాలు ఆయన చూసుకుంటే మంచిది. చంద్రబాబు రాసిచ్చిన కాపీనే పేరు మార్చి సీపీఐ, కాంగ్రెస్ నేతలు చదువుతున్నారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు చేయాలో బీజేపీకి తెలుసు. బీజేపీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర శాఖ ఇప్పటికే స్పందించింది. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. ఎలాంటి రాజకీయాలు చేయాలో టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ మాకు చెప్పనక్కరలేదు' అంటూ సీపీఐ రామకృష్ణపై ధ్వజమెత్తారు. (దళితులపై చంద్రబాబు కపట ప్రేమ) -
సీపీఐ కార్యదర్శి రామకృష్ణకు ఝలక్
కర్నూలు(సెంట్రల్): అమరావతి విషయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఏకపక్ష నిర్ణయాలపై ఆ పార్టీలో నిరసన స్వరాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుతో కలిసి బస్సు యాత్రలో పాల్గొనడంపై పార్టీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర కార్యవర్గంలో చర్చించకుండా అమరావతి రాజధానిగా ఉండాలని ప్రకటించడాన్ని సీపీఐ సహ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణ ఇప్పటికే తప్పుపట్టారు. ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన చంద్రబాబుతో రామకృష్ణ అంటకాగడంపై విమర్శలు చేశారు. సోమవారం పత్తికొండలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలోనూ రామకృష్ణ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధికి పార్టీ కట్టుబడాలని తీర్మానం చేశారు. అమరావతి రాజధానిగా ఉంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఎవరిని అడిగి బాబు చుట్టూ తిరుగుతున్నారని పలువురు నాయకులు ప్రశ్నించినట్లు సమాచారం. అన్ని జిల్లాల అభివృద్ధే పార్టీ విధానమని, దానికి కట్టుబడి ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య తెలిపారు. -
‘కేంద్రం మతాల మధ్య చిచ్చు పెడుతోంది’
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మత విభజన ద్వారా ఓట్లు పొందేందుకు కేంద్రం ఆరాటపడుతోందని విమర్శించారు. గురువారం భారత కమ్యూనిస్టు నేత నీలం రాజశేఖర్ రెడ్డి 25వ వర్ధంతి కార్యక్రమాల్లో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ బిల్లు ఆమోదంతో మైనార్టీలు అభద్రతా భావంలోకి వెళ్లిపోయారన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మతాల మధ్య కేంద్రం చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశం ఆర్థిక మాంద్యంతో అల్లాడుతుంటే పార్లమెంట్లో కనీస చర్చ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం విషయంలో బీజేపీ అనుకరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు నిరసనలు చేపడుతామని రామకృష్ణ స్పష్టం చేశారు. -
ఆ కంపెనీలకు ఊడిగం చేసేందుకే బ్యాంకుల విలీనం
సాక్షి, విశాఖపట్నం : కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకే బ్యాంకుల విలీనం జరిగిందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ది జరిగిన తర్వాత ఆంధ్రాబ్యాంక్ విలీనం చేయడం దారుణమన్నారు. మహారాష్ట్ర బ్యాంకులను ఎందుకు విలీనం చేయరని ప్రశ్నించారు. ఆంధ్రాబ్యాంకు విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 28న విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాగా, గత నెల 30న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ బ్యాంక్ల విలీన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పది బ్యాంక్లు విలీనమై నాలుగు బ్యాంకులుగా అవతరించనున్నాయి. తొంభై ఆరేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్రాబ్యాంక్ యూనియన్ బ్యాంకులో విలీనం కానుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ సింధ్ బ్యాంక్లు యధాతధంగా కొనసాగుతాయి. ఆంధ్రాబ్యాంక్ విలీనంపై అన్ని వర్గాలనుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. -
రైలురోకో కేసులో కె.రామకృష్ణకు ఊరట
సాక్షి, గుంతకల్లు(అనంతపురం) : రైలురోకో కేసులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జరిమానా విధించి, కేసు కొట్టేశారు. ఈ మేరకు గుంతకల్లు రైల్వేకోర్టు స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ టి.వెంకటేశ్వర్లు సంచలన తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి 2008 జూలై 7న అనంతపురం రైల్వేస్టేషన్లో రైలురోకో చేశారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు రైల్వే యాక్టు ప్రకారం అప్పట్లోనే కేసు నమోదు చేశారు. రైలును అడ్డుకున్నందుకు 174/ఏ కింద, ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్లోకి అక్రమంగా ప్రవేశించినందుకు 147 కింద కేసులు నమోదు చేశారు. బుధవారం కోర్టుకు హాజరైన సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణకు రైల్వే కోర్టు జడ్జి వెంకటేశ్వర్లు రూ.700 ఫైన్ విధించి కేసును కొట్టి వేస్తున్నట్లు వెల్లడించారని న్యాయవాదులు చెన్నకేశవులు, యూనస్ తెలిపారు. -
బాబుకు అనుకూలమన్న భావనే మా కొంపముంచింది!
సాక్షి, అమరావతి: సీపీఐ, సీపీఎం, జనసేన, బీఎస్పీలు కలిసికట్టుగా పొత్తు పెట్టుకున్నా తాము సంఘటితం కాలేకపోయామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. దీనికి తోడు టీడీపీ విధానాలను విమర్శించడంలో తాము వెనకబడడం వల్ల చంద్రబాబుకు తమ కూటమి అనుకూలమన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని, ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును తాము సాధించలేకపోయామని విశ్లేషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా గంపగుత్తగా వైఎస్సార్సీపీకి పడిందన్నారు. పార్టీ రాష్ట్ర నేతలు రావుల వెంకయ్య, హరినాథరెడ్డి, జల్లి విల్సన్తో కలిసి ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. టీడీపీని మట్టికరిపించడంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయం సాధించారన్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీపీఐ ఓటమికి దారితీసిన పరిస్థితులను సమీక్షించినట్టు తెలిపారు. పుల్వామా దాడి, సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత దేశంలో పరిస్థితి మారిపోయిందని, ఈ రెండు సంఘటనలను బీజేపీ బాగా ఉపయోగించుకోగలిగిందని, జాతీయవాదం పేరిట జనాన్ని తమ వైపు తిప్పుకోవడంలో మోదీ, అమిత్ షా విజయం సాధించారని చెప్పారు. కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని తమ పార్టీ అభిప్రాయపడిందని, ఇందులో భాగంగా త్వరలో విజయవాడలో అన్ని కమ్యూనిస్టు పార్టీల నేతలతో సదస్సు నిర్వహించనున్నట్టు వివరించారు. కాగా, కాబోయే సీఎం వైఎస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్టు రామకృష్ణ తెలిపారు. సీపీఎం నేత మధుకు ఆహ్వానం వైఎస్ జగన్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును ఆహ్వానించారు. జగనే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్టు తెలిపారు. -
వామపక్షాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి
సాక్షి, విజయవాడ : భారతదేశంలో వామ పక్షాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయని, ఎర్ర జెండా పార్టీల పునరేకీకరణ జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. పునరేకీకరణ కోసం జూన్ నెలలో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీపీఐ పార్టీ తరపున అభినందనలు తెలియజేశారు. గడిచిన ఐదేళ్లలో నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. పుల్వామా ఘటనను సూడో నేషనలిజంగా చేశారని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించే కార్యవర్గ సమావేశాలలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో వామపక్షాలు, జనసేన, బీఎస్పీ నాలుగు పార్టీలు కలిసినా ఎన్నికల్లో విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి లొంగిపోయిందని ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలకు రాష్ట్రంలో అధికారం చేపడతామని సవాలు చేసే ధైర్యం లేదన్నారు. -
‘చంద్రబాబు బరితెగించారు.. అందుకే ఇలా’
సాక్షి, విజయవాడ : ‘దున్నే వాడిదే భూమి’ అనే నినాదాన్ని ‘కంపెనీలకే భూమి’ అన్న చందంగా సీఎం చంద్రబాబు మార్చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని బరితెగించి.. పారదర్శకత లేకుండా కంపెనీలకు వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రముఖ రచయిత తెలకపల్లి రవి రచించిన ‘అమరావతి అడుగులెటు..?’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి పి. మధు, సీపీఎం వర్గసభ్యుడు వై. వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఎంబీ భవన్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..2013 భూసేకరణ చట్టం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ చేయడం ఇదే ప్రథమని అన్నారు. అమరావతిలో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగిందని దుయ్యబట్టారు. ఇష్టారీతిన కంపెనీలకు వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టడం అనేక వివాదాలకు కారణమవుతోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తోందని.. అధికారంలోకి వస్తే తమకు కావాల్సిన వారికి భూములను కట్టబెట్టవచ్చని భావిస్తున్నారని విమర్శించారు. అన్నీపరిశీలించిన తర్వాతే.. ప్రజలు ఆశించిన పాలనను చంద్రబాబు అందించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ప్రభుత్వ తీరుతో కేంద్రం నుంచి సరైన సహకారం లభించలేదని.. రైతుల నుంచి పూలింగ్ ద్వారా భూమిని తీసుకోవడం వివాదంగా మారిందని పేర్కొన్నారు. రైతుల భూమితో ప్రభుత్వం.. సింగపూర్ కంపెనీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే.. రైతు కూలీలు ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మేధావులు, రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, ప్రపంచ బ్యాంకు నివేదికలను కూడా పరిశీలించి తెలకపల్లి రవి అమరావతి అడుగులెటు..? పుస్తకం రచించారని పేర్కొన్నారు. అమరావతి ప్రణాళిక, ప్రచారం, ప్రజాందోళన తదితర పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి పుస్తకాన్ని వెలువరించారని తెలిపారు. -
రాజాలకు పెరుగుతున్న మద్దతు
సాక్షి, వెంకటగిరి: అధికార టీడీపీలో వివక్షకు గురై ధిక్కార స్వరం వినిపించిన రాజా కుటుంబీకులకు పట్టణంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదివారం స్థానిక రాజా ప్యాలెస్లో రాజా కుటుంబీకుడు సర్వజ్ఞ కుమార యాచేంద్రను పట్టణంలోని పలువురు కలిసి సంఘీభావం తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ పటిష్టతకు కృషి చేసిన రాజా కుటుంబీకులను పార్టీ అధిష్టానంతోపాటు స్థానిక ఎమ్మెల్యే కె.రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేయడంతో ఆ పార్టీపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తుందని, రాజకీయంగా రాజాలు తీసుకునే నిర్ణయానికి తాము మద్దతుగా ఉంటామని పలువురు సంఘీభావం తెలియజేశారు. -
చంద్రబాబుకు వామపక్షాల ఝలక్
సాక్షి, అమరావతి: రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు హాజరుకాకూడదని సీపీఎం, సీపీఐ నేతలు నిర్ణయించుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. హోదా కోసం ఆందోళన చేసినప్పుడు తమ పార్టీల కార్యకర్తలను చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించిందని గుర్తు చేశారు. అప్పుడు పెట్టిన కేసులు ఇంతవరకు ఎత్తివేయలేదని, తమ కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పోరాటం చేయాల్సిన సమయంలో చేయకుండా మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో చంద్రబాబు చేస్తున్న హడావిడి రాజకీయ ప్రయోజనం కోసమేనని సీపీఐ, సీపీఎం తీవ్రంగా ఆక్షేపించాయి. సీఎం ఆవేళ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించకుండా హోదాయే కావాలని పోరాటానికి దిగి ఉంటే అంతా మద్దతు పలికేవారమంటున్నాయి. ప్రధాని రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును తిట్టిపోతే రేపు బాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిపై దుమ్మెత్తిపోస్తారు... వీటితో ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు కొందరు తమను ఆహ్వానించిన మాట నిజమేనని, తాము రాలేమని స్పష్టం చేసినట్టు తెలిపారు. -
మోసం చేయడానికే.. ‘అన్నదాత సుఖీభవ’
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం సీఎం చంద్రబాబు నాయుడు స్తోత్రంలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇది మధ్యంతర బడ్జెటో లేక పూర్తిస్థాయి బడ్జెటో టీడీపీ నాయకులకే అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ రాబోయే ప్రభుత్వానికి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర బడ్జెట్పై మాట్లాడారు. ఇది కేవలం ఎన్నికల బడ్జెటే అంటూ తేల్చిచెప్పారు. బడ్జెట్లో అంకెల గారడీ తప్ప నిజంగా ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధికి సరైన మార్గాలు లేవన్నారు. ప్రజలు చాలా తెలివైన వారని, బాబు మాయ మాటలను నమ్మరని స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయని చంద్రబాబు.. రైతులను మరోసారి మోసగించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టారని మండిపడ్డారు. రూ.2.26 లక్షల కోట్ల బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపులు సరిగా లేవని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కుదించిన రైతు రుణమాపీలో ఇంకా రూ.8,200 కోట్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. గత సెప్టెంబర్ నాటికి రైతుల అప్పులు రూ.1.37లక్షల కోట్లకు చేరాయని ఆయన అన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఇళ్ల మంజూరు కేవలం రూ.4,099 కోట్ల రూపాయల కేటాయింపులతో ఎలా సాధ్యమని రామకృష్ణ ప్రశ్నించారు. -
చంద్రబాబూ.. ఇలాగేనా వ్యవహరించేది?
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతల కనుసన్నల్లో కోడి పందాలు జరుపుతూ.. వేల కోట్లు బెట్టింగ్కు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచ్చలవిడిగా కోడి పందాలు, వేలకోట్ల బెట్టింగ్లు జరుగుతుంటే హోంమంత్రి పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలిగేలా టీడీపీ నేతల పాలన ఉందని విమర్శించారు. మాజీ సీఎం కూతురు, ప్రతిపక్ష నేత చెల్లెలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందిపోయి, ఆమె రాజకీయం చేస్తుందని చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. షర్మిల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక మహిళగా పోలీసు స్టేషన్కు వెళ్లి షర్మిల ఫిర్యాదు చేశారంటే ఆమె ఎంత బాధపడిఉంటుందో అర్థమవుతుందన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు.. షర్మిల వ్యవహారంలో ఇలానేనా వ్యవహరించేదని విమర్శించారు. -
సాయంత్రంలోపు ప్రభుత్వం స్పందించకపోతే..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఫైర్ అయ్యారు. మాటలగారడీతో చంద్రబాబు నాలుగేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను అర్థరాత్రి అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. వాళ్లేమైనా టెర్రరిస్టులా.. ఆ సమయంలో అరెస్ట్ చేయాల్సిన అవరసరం ఏముందని ప్రశ్నించారు. కరెంట్ తీసేసి, దీక్షా శిబిరాన్ని భగ్నం చేయడమేంటని నిలదీశారు. ఈ రోజు సాయంత్రంలోపు అగ్రిగోల్డ్పై ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నా.. బకాయిలు ఎందుకు చెల్లించకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ సమస్యను నాలుగేళ్లుగా ప్రభుత్వం నాన్చుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిచాలని.. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో అగ్రిగోల్డ్ భాదితులు తగిన గుణపాఠం నేర్పుతారని వ్యాఖ్యానించారు. -
జగన్ను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు?
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం ఘటనపై తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సంస్కారం కాదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సీపీఐ ఏపీ కార్యదర్శి కే రామకృష్ణ హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రతిపక్ష నేతపై ఇలాంటి దాడి జరుగుతుందని ఊహించలేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. జగన్పై దాడి జరిగిన ఐదు గంటల తర్వాత ముఖ్యమంత్రి మంత్రి స్పందించటం సరికాదన్నారు. మీడియా సమావేశంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సభ్యత కాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఎంతో, ప్రతిపక్ష నేత కూడా అంతేనని చెప్పారు. సీఎం చంద్రబాబు.. వైఎస్ జగన్ను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కనీసం ఫోన్లో పరామర్శించే తీరిక చంద్రబాబుకు లేదా అని అడిగారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని వైఎస్సార్ సీపీ అంటోంది. విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటనపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలి. వైఎస్ జగన్పై దాడి చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలి. వైఎస్ జగన్ హత్యాయత్నం వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాలి. సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు వైఎస్ జగన్ హత్యాయత్నం కేసులో ఎందుకు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నార’ని అన్నారు. -
‘నాలుగేళ్లలో 2.49 లక్షల కోట్ల రూపాయల అప్పు’
సాక్షి, విజయవాడ: నాలుగేళ్లలో 2 లక్షల 49 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. సెప్టెంబర్ 15న విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించనున్ననూతన ప్రత్యామ్నాయ మహా గర్జన సభకు సంబంధించిన ప్రచార గీతమాలికను సోమవారం ఆయన అవిష్కరించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ కార్యవర్గసభ్యులు శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సెప్టెంబర్ 15న ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ మహా గర్జనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలపునిచ్చారు. ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం అనేక సదస్సులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. రాయలసీమ వెనుకబాటుతనం, అక్కడి కరువు పరిస్థితులపై మంగళవారం వైఎస్సార్ జిల్లాలో సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడువి కేవలం ప్రచార ఆర్భాటలు మాత్రమేనని.. వాటి ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజధానిని నిర్మించకుండా ముంబై వెళ్లి బాండ్లను విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాజధానిలో సెంట్ భూమి కొనుక్కొని, ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యనించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. మార్చురీలో పోస్టుమార్టంకు కూడా డబ్బులు వసూలు చేసేంతలా అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి విలయం తాండవం చేస్తుంటే.. చంద్రబాబు డ్యాష్ బోర్డులో అది కనబడకపోవడం సిగ్గుచేటన్నారు. అది జ్ఞాన భేరి ఎలా అవుతుంది.. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అధర్మ పాలన చేస్తూ ధర్మ పోరాటం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వేలాది ఎకరాల భూములు లాక్కొని ఒక్క పరిశ్రమైనా నిర్మించారా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు చేసేది నిజమైన పోరాటం కాదని అన్నారు. ప్రశ్నించే హక్కు లేకుండా విద్యార్థులను అరెస్ట్ చేస్తే అది జ్ఞాన భేరి ఎలా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. ముంబై వెళ్లి బాండ్ల లిస్టింగ్పైన చూపే శ్రద్ద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీద పెట్టాలని సూచించారు. -
మోదీ ఎడమచెయ్యి ఇస్తేనే.. ఎగిరి గంతులు!!
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన తుస్సుమన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మోదీ ఎడమ చెయ్యి ఇస్తేనే చంద్రబాబు ఎగిరి గంతులేశారని, అదే పొరపాటున కుడి చెయ్యి ఇస్తే ఆయన కింద నిల్చేవాడే కాదని ఎద్దేవా చేశారు. గుంటూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పర్యటనతో భూగోళం బద్దలవుబోతున్నట్టు ఎల్లో మీడియా ప్రచారం చేసిందని,చివరికీ ఏం జరిగిందో అందరూ చూశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా చంద్రబాబు మోసపూరిత మాటలు, మోసపూరిత పర్యటనలు మానుకోవాలని హితవు పలికారు. -
మహానాడులో భోజనాలు తప్ప ఇంకేమీ లేదు!
సాక్షి, విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న తహశీల్దార్ల కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు చేపట్టబోతున్నట్టు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. టీడీపీ మహానాడులో భోజనాలు బాగా జరిగాయి తప్ప ఇంకేం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనను ప్రధానమంత్రి అని పొగిడించుకున్నారని, అది పొగడ్తల మహానాడు అని విమర్శించారు. చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ డబ్బున్న వాళ్ళ కోసమే కానీ, పేదల కోసం కాదని, బాబు పాలనలో పేదల సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. చంద్రబాబు 20 లక్షల మందికి ఇళ్లు ఇస్తామన్నారు కానీ ఎక్కడా ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. 13 జిల్లాల్లో ఒక్క ఎకర కూడా భూమి పంపిణీ సీఎం చంద్రబాబు చెయ్యలేదన్నారు. అందుకే ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి 18న నిరసన చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. వెయ్యి రూపాయల భృతి నిరుద్యోగులకు ఏం సరిపోతుందని ఆయన అన్నారు. నెలకు రూ. 3600 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పదో తరగతి పాస్ అయినవారికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి విషయంలో 10 లక్షల మంది వరకు అంటూ కటాఫ్ పెట్టడం సమంజసం కాదన్నారు. -
ప్రత్యేక హోదాకు ‘మా’ మద్దతు: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ఢిల్లీ వేదికగా పోరాటం కొనసాగుతోంది. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇదివరకే పలు కార్యక్రమాలు రూపొందించిన ప్రత్యేక హోదా సాధన సమితి తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మద్దతు కోరింది. ఆదివారం మా అధ్యక్షుడు శివాజీ రాజా సహా కార్యవర్గాన్ని సీసీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నెలకొన్న పరిస్థితులను మా బృందానికి వివరించాం. ప్రత్యేక హోదా ఉద్యమానికి అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారని రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమ సెగ ఢిల్లీని తాకిందని, మలిదశ ఉద్యమం ఉప్పెనలా ఉంటుందని సీపీఐ స్పష్టం చేసింది. -
ఓటు వేసింది బిర్యానీ తినడానికా?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో లంచగొండి ప్రభుత్వం నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాగుపడ్డారని.. పేదవాడికి ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వలేదని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వేజోన్ కోసం విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబును ఢిల్లీ రమ్మంటే రాలేదని వెల్లడించారు. ప్రజలు ఆయనకు ఓటు వేసింది ఎందుకు? బిర్యానీ తినడానికా? అని ప్రశ్నించారు. ఏపికి ప్రధాని నరేంద్ర మోదీ అన్యాయం చేస్తున్నారని, సీఎం చంద్రబాబును పూచికపుల్లలా చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఇంత నష్టం జరగడానికి చంద్రబాబు, వెంకయ్య నాయుడు కారణమన్నారు. -
వైఎస్ఆర్సీపీపై టీడీపీ విమర్శలు విడ్డూరం
తిరుపతి కల్చరల్ : ప్రత్యేక హోదా కోసం వచ్చే ఏప్రిల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఆ పార్టీ ప్రకటిస్తే.. అది రాజకీయ నాటకమంటూ తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించడం విడ్డూరమని, అసలు టీడీపీ ఏం చేస్తుందో స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం, విభజన చట్టంలోని హామీల అమలుకు ప్రతిపక్ష పార్టీలు ఉద్యమిస్తుంటే.. బీజేపీని ప్రశ్నించాల్సిన అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామా విషయాన్ని డ్రామా అని చంద్రబాబు చెప్పడం చూస్తే ు మోదీని ఎదిరించే ధైర్యంలేదని తేలిపోయిందన్నారు. -
చంద్రబాబు చేతకానితనం వల్లే..!
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వామపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. చంద్రబాబు చేతకానితనం వల్లే విభజన హామీలు అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. విభజన హామీలపై సుప్రీంకోర్టుకు వెళతానంటూ సీఎం వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశాయి. మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించాయి. విభజన హామీలపై సోమవారం విజయవాడలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు మాట్లాడుతూ.. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కన్నా.. ప్రత్యేక ప్యాకేజీ మిన్న అని స్వయంగా చంద్రబాబే అనారని, తెలుగుదేశం అధికార దాహానికి ఏపీ ప్రయోజనాలు పణంగా పెట్టారని మధు మండిపడ్డారు. ప్రధాని మోదీ ఏడాదికిపైగా చంద్రబాబుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని, ఇంటర్వ్యూ కోసం బతిమిలాడుకున్న వ్యక్తి ఏం పోరాటం చేస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు పోయే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. హైకోర్టు విభజన కోసం తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేసి.. వచ్చే జూన్ నాటికి అది సాకారమయ్యేలా హామీ తెచ్చుకున్నారని, ఈపాటి తెగువ కూడా టీడీపీ ఎంపీలకు ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. ఆనాడు ప్యాకేజీ ప్రకటనను వ్యతిరేకించి ఉంటే.. ఈనాడు ఈ దుర్గతి పట్టేది కాదని అన్నారు. అప్పుడే విభజన హామీల కోసం ఎందుకు పట్టుబట్టలేదని చంద్రబాబును ప్రశ్నించారు. సుప్రీంకోర్టు అంటూ చంద్రబాబు ఇప్పుడు కొత్త డ్రామా ఆడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. ఈ నెల 24న గుంటూరుజిల్లా పెదగొట్టిపాడు గ్రామ సందర్శిస్తామని పి.మధు, కె.రామకృష్ణ తెలిపారు. దళితులపై దాడులు దారుణమని, ఈ దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
పార్టీపై ఉన్న శ్రద్ధ బాబుకు రాష్ట్రంపై లేదు
అనంతపురం రూరల్: ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీలోనికి చేర్చుకుని వారికి పదవులు కట్టబెడుతున్న చంద్రబాబు... ఆ మాత్రం శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై చూడపం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆదివారం అనంతపురంలోని ప్రెస్క్లబ్లో ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సీట్ల పెంపుకోసం కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న చంద్రబాబు...హోదా కోసం ఒక్క కేంద్రమంత్రిని ఇంతవరకూ కలిసిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో పెట్టుబడు కోసం వివిధ కంపెనీలు రూ.16 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు చెబుతున్న చంద్రబాబు... ఈ మూడేళ్ల కాలంలో ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశాలు తిరిగితే రాష్ట్రానికి పెట్టుబడులు రావాని.. ప్రత్యేక హోదాతోనే వస్తాయని హితవు పలికారు. అనంతరం సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోదాపై హామీలు గుప్పించిన ప్రధాన మంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్లు పచ్చి అపద్ధాలతో నవ్యాంధ్ర ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ నేతలంతా ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. పట్టిసీమ నుంచి పోలవరం వరకు జరిగిన పనులపై సీబీఐ చేత విచారణ జరిపితే అవినీతి అక్రమాలు నిగ్గు తేలుతాయన్నారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపిన టీడీపీతో వచ్చే ఎన్నికల్లో పవన్కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అదే జరిగితే రాష్ట్ర ప్రజలు ఆయన్ను క్షమించరన్నారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఈనెల 20న తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి జనసేన పార్టీ అధ్యక్షుడు భాగస్వామి కావాలని కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, నిద్రపోయిన పాలకులను నిద్రలేపి ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసమే అసెంబ్లీని ముట్టడిస్తున్నామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ, ప్రత్యేకహోదాతో రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు యువతకు లభించే ఉపాధి ఆవకాశాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తీసుకువస్తామన్నా నాయకులు నేడు మాట మార్చి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అలాంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం అసన్నమైందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ, ఉపాధి హామి కూలీలకు కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నా.. కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటవుతాయన్న విషయం అందరూ గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కేవీ రమణ మాట్లాడారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు దాదా గాంధీ, ఏఐటీయూసీ నాయకులు రాజారెడ్డి, లింగమయ్య, శ్రీరాములు, కసాపురం రమేష్, రమణ, జాఫర్, మైనుద్దీన్, ఆర్పీఎస్ఎస్ శ్రీరాములు, మహిళా సమాఖ్య కార్యదర్శి పద్మావతి, చిరుతల మల్లికార్జున, విద్యార్థి సంఘం నాయకులు లింగారెడ్డి, జాన్సన్, ఆంజనేయులు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
వెంకయ్యా... ఇప్పుడేమంటావయ్యా
అమరావతి: కేంద్ర ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా అంశాన్ని మరిచిపోరని ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేతలు కె.రామకృష్ణ, చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ విషయంలో కేంద్రం తీరుతో గాయపడిన హృదయాలు ఇంకా బాధపడుతున్నాయని పేర్కొన్నారు. గురువారమిక్కడ వారు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఘనత తమదేనంటూ సన్మానాలు, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అంటూ సన్మానాలు చేయించుకున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు కేంద్రం చేసిన ప్రకటనపై ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు చేయాల్సిందంతా చేశామని, ఇంక చేసేదేమీలేదని పార్లమెంట్లో కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్సింగ్ లోక్సభలో చెప్పడం దుర్మార్గమని వారు దుయ్యబట్టారు. హామీ ఇచ్చారు... హోదా ఇవ్వండి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ యువజన సంఘం గురువారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. విభజన వేళ కేంద్రం, ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కే. వేణుమాధవ్ డిమాండ్చేశారు. -
వారిద్దరితో ఇద్దరు దొంగలు సినిమా చేస్తే...
గుంటూరు : బీజేపీ ప్రత్యేక హోదా సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా... కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు ఎందుకు సన్మానాలు చేయించుకుంటున్నారో అర్థం కావడం లేదని సీపీఐ నేత కె.రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం గుంటూరులో కె.రామకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ప్రధాని మోదీని ప్రత్యేక హోదా అడగలేని పిరికి పందలు అంటూ కేంద్రమంత్రి వెంకయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబును ఎద్దేవా చేశారు. వెంకయ్య, చంద్రబాబును పెట్టి ఇద్దరు దొంగలు సినిమా చేస్తే హిట్ అవుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే టీడీపీ - బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని రామకృష్ణ తెలిపారు. -
'ఆంగ్ల వ్యామోహం వీడి తెలుగుకు రండి'
హైదరాబాద్: ప్రాచీన హోదా పొందేందుకు తెలుగు భాషకు అన్ని అర్హతలున్నాయని మద్రాసు హైకోర్టు స్పష్టం చేయడంపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2008 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం అతి ప్రాచీన భాషల్లో తెలుగును చేర్చింది. అయితే, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2009లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా కల్పించారని స్పష్టం చేస్తూ ఆ పిటిషన్ ను కొట్టేసింది. ఈ కేసును రవీంధ్రనాధ్ అనే న్యాయవాది వాదించారు. కోర్టు తీర్పుపట్ల హర్షం వ్యక్తం చేసిన రామకృష్ణ ఇప్పటికైనా తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేయాలని కోరారు. ఆంగ్ల భాషా వ్యామోహాన్ని విడిచిపెట్టి విస్మరిస్తున్న ప్రాచీన తెలుగుకు న్యాయం చేయాలని అన్నారు. ఉత్తరప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు అభినందనకరం : కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు భాషకు ప్రాచీన భాష హోదాను సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడం శుభపరిణామమని జగదీశ్వరరెడ్డి అన్నారు. -
'అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించాలి'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. అమరావతిలో ఉద్యోగాల భర్తీలను సీఆర్డీఏకు అప్పగిండచం దుర్మార్గమని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్లు కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు కట్టబెట్టేందుకు కుట్ర జరగుతుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అంబేడ్కర్ ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించాలని రామకృష్ణ ఈ సందర్భంగా చంద్రబాబును డిమాండ్ చేశారు. -
ఆప్కో వస్త్రాల సరఫరాలో రూ.100 కోట్లకుపైగా అవినీతి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెంటనే కరవు మండలాలు ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం విజయవాడలో డిమాండ్ చేశారు. కరవుతో రాయలసీమలోని గ్రామాలన్నీ ఖాళీ అవుతున్నాయని ఆయన తెలిపారు. ఆప్కో వస్త్రాల సరఫరాలో రూ. 100 కోట్లకుపైగా అవినీతి జరిగిందని రామకృష్ణ ఆరోపించారు. -
'ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి'
కడప : ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అమరావతి చుట్టు తిరుగుతూ రాయలసీమను పట్టించుకోవడం లేదని సీపీఐ నాయకులు మండిపడ్డారు. శుక్రవారం కడపలో ఆ పార్టీ నాయకులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ... చివరికి తాను రాయలసీమ ద్రోహి కాదని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఈ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని చంద్రబాబు సర్కార్పై బీవీ రాఘవులు, కె. రామకృష్ణ నిప్పులు చెరిగారు. -
అమరావతి పేరుతో అరచేతిలో వైకుంఠం...
విజయవాడ(గాంధీనగర్): రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడ లెనిన్ సెంటర్లో భారతీయ ఖేత్మజ్దూర్ యూనియన్(బీకేఎంయూ) జాతీయ మహాసభ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామీణ పేదలు సత్యాగ్రహం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకీ రైతు ఆత్మహత్యలు, వలసలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వలసలు, ఆత్మహత్యలపై మాట్లాడే తీరిక లేదని మండిపడ్డారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబును కోరారు. భూ బ్యాంక్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీకేఎంయూ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేంద్రనాథ్ ఓఝా మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలు 200 రోజులకు పెంచి రూ. 300 రోజువారీ కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సత్యాగ్రహంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్, అధ్యక్షుడు ఆవుల శేఖర్, సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. -
'మోదీపై ఉన్న భయంతోనే మాట్లాడటం లేదు'
హైదరాబాద్ : హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మౌనం వహించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం హైదరాబాద్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రోహిత్ మృతిపై అందరూ స్పందిస్తున్నారు... కానీ చంద్రబాబు, కేసీఆర్ మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న భయంతోనే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడటం లేదని కె.రామకృష్ణ విమర్శించారు. -
'వెంకయ్యవి మాటలే తప్ప.. నిధులుండవు'
విజయవాడ: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి మాటలు కోటలు దాటుతున్నా రాష్ట్రానికి మాత్రం కేంద్రం నుంచి ఇప్పటివరకు ఒనగూరిన ప్రయోజనం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. గురువారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్రం అరకొరగా నిధులు ఇచ్చి సరిపెడుతోందని ఆరోపించారు. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.100 కోట్లు ఇచ్చిందని, రూ.2 వేల కోట్లు ఖర్చుపెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని రామకృష్ణ పేర్కొన్నారు. పోలవరానికి అరకొర నిధులు విదిల్చి ఎప్పటికి పూర్తిచేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల మాటను మరిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజా ఉద్యమాలతో నిలదీస్తామని ప్రకటించారు. -
జేసీ దివాకర్రెడ్డికి అసెంబ్లీలో ఏం పని ?
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం అనంతపురంలో మండిపడ్డారు. కాల్మనీ కేసులో ఆరోపణలున్న టీడీపీ నేతలను విచారించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన సభలో ప్రతిపక్షం లేకుండానే బిల్లులు ఆమోదించుకోవడం సరికాదని ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంలో ఇద్దరిదీ తప్పేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం తప్పని అన్నారు. రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదంటూ చంద్రబాబు సర్కార్పై నిప్పులు చెరిగారు. అలాగే అనంతపురం లోక్సభ సభ్యుడు, టీడీపీ నాయకుడు జేసీ దివాకరరెడ్డిపై కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్కు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం పని అని ఎంపీ జేసీ దివాకర్రెడ్డిని రామకృష్ణ ఈ సందర్బంగా ప్రశ్నించారు. -
చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసే ప్రతిపార్టీతో కలుస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒంగోలులో స్పష్టం చేశారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో కె.రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ.... ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ దీక్ష చేస్తుంటే... ఆయన ఆరోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాజధాని శంకుస్థాపన కోసం ఈ నెల 22న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. అలాగే ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని చంద్రబాబు సర్కార్కు సూచించారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కె. రామకృష్ణ హెచ్చరించారు. -
'ధైర్యముంటే లోక్సభకు పోటీ చేయండి'
విజయవాడ (గాంధీనగర్) : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ధైర్యం ఉంటే రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో ఎక్కడినుంచైనా పోటీచేసి గెలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సవాల్ విసిరారు. విజయవాడలో రెండు రోజులపాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలను ఆదివారం ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు రాష్ట్రంలో బలముందంటున్న వెంకయ్యనాయుడు ఏపీలో తనకిష్టమొచ్చిన ఏ లోక్సభ స్థానం నుంచైనా ఎంపీగా గెలిచి చూపించాలన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతిచ్చినా ఆయన గెలవలేడని ఎద్దేశా చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను పక్కాగా మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు అమలుచేయాలని కోరుతూ అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. పార్టీ పిలుపు మేరకు అక్టోబర్ 5న పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు రాష్ట్రాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాగా ప్రత్యేక హోదాపై జరుగుతున్న మోసాన్ని ప్రజలు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్ది చేపట్టిన దీక్షకు అనుమతి నిరాకరించడం సరికాదని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నిషేధిత ప్రాంతమైన ఎమ్మెల్యే క్వార్టర్స్లో, ఢిల్లీలోని ఏపీ భవన్లో దీక్ష చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై అఖిలపక్షం వేయడానికి ఎందుకు జంకుతున్నారో స్పష్టం చేయాలని కోరారు. -
చంద్రబాబు భూ పిశాచిలా వ్యవహరిస్తున్నారు
అనంతపురం : రాజధాని భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ గురువారం అనంతపురంలో నిప్పలు చెరిగారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు భూపిశాచిలా వ్యవహరిస్తూ రైతుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించమని.... ప్రత్యేక హోదానే కావాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువు, ప్రత్యేక హోదాపై ఆగస్టు 22, 23 తేదీలల్లో కడపలో రాష్ట్ర స్థాయి సభలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు మండలాలను ప్రకటించాలని ఆయన చంద్రబాబు సర్కార్ను డిమాండ్ చేశారు. అలాగే కరువు పీడిత గ్రామాలకు నీటిని సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రాయలసీమలోని కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చార్జీషీటులో చేర్చినందున నిష్పక్షపాతంగా విచారణ జరగాలన్నారు. దోషులు ఎంతటివారైన కఠినంగా శిక్షించాలన్నారు. ప్రత్యేక హోదాపై ఆగస్టు 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న బంద్కు తాము సానుకూలంగానే ఉన్నామన్నారు. వామపక్ష పార్టీలతో చర్చించి ఆ తర్వాత సంఘీభావం ప్రకటిస్తామని కె.రామకృష్ణ చెప్పారు. -
చంద్రబాబు మోసం చేస్తే... మోదీ ముంచాడు
కర్నూలు : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తే.... నమో అంటూ ప్రధాని నరేంద్ర మోదీ నట్టేట ముంచాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం కర్నూలు జిల్లా డోన్కు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కె. రామకృష్ణ మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు బలిదానాలకు సిద్ధమైన పాలకులు స్పందించడం లేదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. -
హోదా సాధించకుంటే ఎంపీలకు 'ఘన సన్మానం'
రాజమండ్రి : ఆగస్టు 10వ తేదీలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యులకు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజమండ్రి నగరంలో ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రా ఎంపీలు 10వ తేదీలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకొని రావాలని ఆయన ఆకాంక్షించారు. ఒక వేళ ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోతే వారికి ఘన సన్మానం చేస్తామని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడాలని రామకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 10 తేదీ లోపు ప్రత్యేకహోదా సాధించకుంటే ఈ నెల 11న రాష్ట్ర బంద్కు చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ఆద్మీపార్టీ, బీసీ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. -
తేల్చుకోవాల్సింది చంద్రబాబే
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ విజయనగరం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్ర మంత్రి పదవులను వదులుకోవాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. మొదటి రోజు శ్రీకాకుళం, విజయనగరంలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుకు కేంద్రంలో రెండు మంత్రి పదవులు కావాలో.. ప్రత్యేక హోదా కావాలో తేల్చుకోవాలన్నారు. బాబు హోదాపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరో చెప్పాలని డిమాండ్ చేశారు. -
'మంత్రి పదవుల కోసమే బాబు నోరు మెదపడం లేదు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో సీపీఐ బస్సు యాత్ర నిర్వహిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే 11వ తేదీన బంద్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్ల ప్యాకేజీ అన్న బీజేపీ... ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రి పదవులకోసమే చంద్రబాబు నోరు మెదపడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పోరాటాన్ని ఆహ్వానిస్తున్నామని రామకృష్ణ తెలిపారు. -
'పవన్ కల్యాణ్ మాతో కలిసి పోరాడాలి'
కాకినాడ: ఓటుకు కోట్లు కుంభకోణంపై ఆలస్యంగా స్పందించిన జనసేన నేత పవన్ కల్యాణ్ అన్ని విషయాలు మాట్లాడలేదని సీపీఐ నాయకుడు కె. రామకృష్ణ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవమానానికి గురయ్యారనే విషయంపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అవినీతిపై పవన్ మాట్లాడారని గుర్తుచేశారు. అయితే ఆయన మద్దతిచ్చిన వాళ్లు ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయారని అన్నారు. ఏపీకీ ప్రత్యేక హోదాపై పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి పోరాడాలని రామకృష్ణ సూచించారు. -
బాబువి నీతిమాలిన రాజకీయాలు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకులతో మాట్లాడారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు ఇవ్వజూపి అడ్డంగా దొరికిపోయినా కూడా చంద్రబాబుకు సిగ్గురాలేదన్నారు. తాజాగా ప్రకాశం, కర్నూలు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్థానిక ప్రజా ప్రతినిధులను డబ్బుతో కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీకి తగినంత బలం లేకపోయినా ఎమ్మెల్సీ అభ్యర్థులను పోటికి పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు’ కేసును పక్కదారి పట్టించేందుకే సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలకు ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్షన్ 8పై ఢిల్లీలో ఆందోళన చేస్తామని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశాలన్నింటిపై చర్చించేందుకు ఈ నెల 28న విజయవాడలో 10 వామపక్ష పార్టీలతో సమావేశం కానున్నట్లు ప్రకటించారు. -
బంధం బలపరుచుకునేందుకే బాబు ఢిల్లీ పర్యటన
అనంతపురం : చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు కేవలం బీజేపీతో ఉన్న బంధాన్ని మరింత బలపరుచుకోవడానికే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... జూన్ 2వ తేదీన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తుందని... ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుందని ఆయన వివరించారు. 109, 110 జీవోలను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్బంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మూడు రోజులకే వెయ్యి కోట్లిస్తే నెల రోజులకు ...
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారం దక్కగానే భూముల పిచ్చి పట్టుకుందని, దానికి రైతులను బలిచేయడమే కాకుండా ప్రభుత్వ భూములను సైతం ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. యోగా గురువు జగ్గీ వాసుదేవ్కు చంద్రబాబు కట్టబెట్టనున్న కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురం అటవీ భూములను పార్టీ శ్రేణులతో కలిసి రామకృష్ణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గీ వాసుదేవ్ మూడురోజుల పాటు యోగా పాఠాలు నేర్పినందుకు సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టటానికి చంద్రబాబు సిద్ధమయ్యారని, అదే నెల రోజులు యోగా నేర్పితే విజయవాడ కూడా రాసిస్తారని ఎద్దేవా చేశారు. భూముల పిచ్చితో ల్యాండ్బ్యాంక్ ఏర్పాటుకు 10 లక్షల ఎకరాలు సేకరించడానికి చంద్రబాబు పూనుకున్నట్లు విమర్శించారు. అటవీ భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రామకృష్ణ వెంట మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, రాష్ట్ర రైతుసంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్రెడ్డి తదితరులున్నారు. -
'పట్టిసీమ పేరుతో పోలవరం వివాదాస్పదం చేశారు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శనివారం అనంతపురంలో మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిందని ఆయన ఆరోపించారు. పట్టిసీమ పేరుతో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు వివాదాస్పదం చేశారని విమర్శించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.... ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హంద్రీ - నీవా ప్రాజెక్టుకు తక్షణమే రూ. 1800 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్ను అభినందించిన రామకృష్ణ
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అభినందించారు. ఆదివారం అనంతపురంలో కె.రామకృష్ణ మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ నేతల అరెస్ట్పై వైఎస్ జగన్ బాగా స్పందించారని తెలిపారు. తమపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు... అలాగే తమ అరెస్ట్కు నిరసనగా వైఎస్ జగన్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం అభినందనీయమన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అసెంబ్లీలో వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదని... ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు కె.రామకృష్ణ వివరించారు. ప్రత్యేక హోదా అంశంపై సీపీఐ రామకృష్ణ అనంతపురం జిల్లాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు ఉపసంహరించుకుని... ఆయన్ని విడుదల చేయాలన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చారు. ఆ క్రమంలో ఇదే అంశంపై వైఎస్ జగన్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అలాగే వైఎస్ జగన్పై అసెంబ్లీలో అధికార పక్ష సభ్యులు వ్యక్తిగత ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం అనంతపురంలో జిల్లా కరువుపై పల్లె రఘునాథరెడ్డి నివాసాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్బంగా పల్లె రఘునాథరెడ్డితో భేటీ అనంతరం కె.రామకృష్ణ విలేకర్లతో మాట్లాడారు. -
'అనంతకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి'
అనంతపురం: అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు సర్కార్ను సీపీఐ నేత కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురం నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి నివాసాన్ని కె.రామకృష్ణ ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. జిల్లాలో కరువు రైతులు తీసుకున్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
సీపీఐ రామకృష్ణకు బెయిల్ నిరాకరణ
అనంతపురం: అనంతపురంలో అరెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు బెయిల్ ఇచ్చేందుకు స్థానిక కోర్టు మంగళవారం నిరాకరించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ సీపీఐ మార్చి 11న రాష్ట్రంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడించి...తమ నిరసన తెలపాలని సీపీఐ నిర్ణయించింది. అందులోభాగంగా 11వ తేదీన నిరసన చేపట్టిన కె.రామకృష్ణ పోలీసులు అనంతపురంలో అరెస్ట్ చేసి... పోలీసు స్టేషన్కు తరలించారు. అయిన తరపు న్యాయవాది బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే రామకృష్ణకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. -
'డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్రప్రభుత్వాన్ని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ అంశంపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలో సీపీఐ నాయకులు, కార్యకర్తులు ఆందోళనకు దిగారు. దీంతో రామకృష్ణతోపాటు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ... అఖిలపక్షాన్ని స్వయంగా ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఇదే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. మంత్రుల ఇళ్ల ఎదుట కూడా నిరసనలు తెలుపుతామని రామకృష్ణ పేర్కొన్నారు. -
మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న మోదీ ప్రభుత్వం
సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ యర్రగొండపాలెం: మోదీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని సీపీఐ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఆ పార్టీ జిల్లా మహాసభల సందర్భంగా బుధవారం స్థానిక కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. మత సామరస్యానికి చిహ్నమైన భారతదేశంలో సంఘ్పరివార్ మతోన్మాదంతో రెచ్చిపోతోందన్నారు. బీజేపీ దూకుడుకు ఢిల్లీ ఎన్నికలు బ్రేక్ వేశాయన్నారు. ఈ పరిణామానికి అన్నీ రాజకీయ పార్టీలు సంతోషపడ్డాయని, కానీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాత్రం బాధపడ్డారన్నారు. దేశం అభివృద్ధి కావాలంటే మోదీ నాయకత్వం అవసరమని ఆయన చెప్పడం వింతగా ఉందన్నారు. పెట్టుబడిదారులకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని రామకృష్ణ విమర్శించారు. విదేశీ బ్యాంకుల్లోని నల్లడబ్బును వంద రోజుల్లో వెనక్కి తెప్పిస్తామని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నల్లకుబేరుల పేర్లను బయట పెట్టమంటే ద్వైపాక్షిక ఒప్పందం ఉందని, అందుకు తాము పేర్లు బయటపెట్టలేమన్నారని అన్నారు. ఎన్నికల సమయంలో మోదీని ప్రధానిగా చేయటానికి కార్పొరేట్ కంపెనీలు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని ఆయన వివరించారు. మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రత్యేక విమానంలో అదానీ కంపెనీ వారు ఉన్నారన్నారు. విదేశాల్లో మైనింగ్ వస్తే ఇక్కడ భారతీయ స్టేట్ బ్యాంకు వారిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి రూ.61 వేల కోట్ల రుణాలు ఇప్పించారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని విమర్శించారు. రాజధాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మోదీ హామీ ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం రూ.23,500 కోట్లు ప్రతిపాదనలు పంపితే రూ.350 కోట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబునాయుడు కేంద్రాన్ని నిలదీయటానికి సుముఖంగా లేరన్నారు. సిగ్గులేకుండా మోదీ జపం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబునాయుడు విస్మరించారన్నారు. ముందుగా సీపీఐ జిల్లా 14వ మహాసభల జెండాను సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు టీసీహెచ్ చెన్నయ్య ఎగురవేశారు. ప్రతినిధుల సభకు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్డీ సర్దార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కే అరుణ, సహాయ కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, ఎంఎల్ నారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్ పాల్గొన్నారు.