హైదరాబాద్ : విద్యుత్ ఆదాపై అవగాహన పెంచేందుకు ప్రచార సామాగ్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి గురువారం విడుదల చేశారు. విద్యుత్ పొదుపులో ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎస్ తెలిపారు. ప్రజలంతా విద్యుత్ పొదుపు మార్గాలను పాటిస్తే 15 శాతం విద్యుత్ను ఆదా చేయవచ్చని ఆయన అన్నారు. విద్యుత్ పొదుపుపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సి ఉందని మహంతి అభిప్రాయపడ్డారు.