శివనామస్మరణలతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు | Devotees throng temples on Maha Shivratri | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 13 2018 7:55 AM | Last Updated on Mon, Oct 8 2018 4:35 PM

 Devotees throng temples on Maha Shivratri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. తెల్లవారు జామునుంచే భక్తులు శివాలయాలకు పొటెత్తారు. బిల్వార్చనలు, క్షీరాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తీ, శ్రీశైలం, వేములవాడ రాజన్న ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 

♦శ్రీకాళహస్తీశ్వరాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరమేశ్వరుడు  శ్రీజ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరస్వామిగా  భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇవాళ ఇంద్ర విమానం, నందివాహనం, సింహ వాహన సేవలు, అర్ధరాత్రి ఒంటి గంట నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు లింగోద్భవ దర్శనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పొటేత్తడంతో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

♦ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, భీమవరం సోమేశ్వరాలయం, పట్టిసీమ వీరభద్రేశ్వరస్వామి,  పాలకొల్లు శ్రీక్షీరారామలింగేశ్వర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.గోష్పాద క్షేతంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

♦ శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ వంటి కార్యక్రమాలు జరుగునున్నాయి.

♦ తిరుపతి కపిల తీర్థం కపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూలమూర్తికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

♦ విజయనగరంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా పశుపతి నాధేశ్వరీ, ఉమారామలింగేశ్వర స్వామి, జయితి శ్రీమల్లికార్జున స్వామి, పుణ్యగిరిలోని సన్యాసేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పొటేత్తారు. 

♦ వేముల వాడ రాజన్న ఆలయానికి భక్తులు పొటెత్తారు. భక్తులకు ఆలయ సమాచారం కోసం అధికారులు ప్రత్యేకయాప్‌ను రూపొందించారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

♦తూర్పుగోదావరి జిల్లాలోని శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. పంచారమ క్షేత్రాలు ద్రాక్షారమం, సామర్లకోట ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, కోటపల్లి ఛాయాసోమేశ్వరాలయం, ముక్తేశ్వరం, ఉమాకోటిలింగేశ్వరుని ఆలయాల్లో శివరాత్రి సందడి నెలకొంది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

♦ అమరావతిలో వైభవంగా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమరేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కోటప్పకొండలోని తిరునాళ్లకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement