ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయనగరం లోక్సభ సభ్యురాలు బొత్స ఝాన్సీ ఇంటిని గురువారం ఉదయం సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు ముట్టడించారు. బొత్స ఝాన్సీ తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అయితే ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా అప్పటికే ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
దాంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే సమైక్యవాదులు,పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఇరువైపులా తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి యనని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.