
విశ్వ నగరంగా మార్చే క్రమంలోనే...
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్) : హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లి డివిజన్లోని సుందరయ్య పార్కులో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వచ్ఛ హైదరాబాద్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.