
వై.విశ్వేశ్వర రెడ్డి - అత్తర్ చాంద్ బాషా
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాలకు భారీ స్థాయిలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని వైఎస్ఆర్ సిపి అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి, కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషాలు ప్రశ్నించారు. రాజధానిపై శాసనసభలో లోతైన చర్చ జరగలేదని చెప్పారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదపడేలా రాజధాని ఉండాలని వారన్నారు. అనంతపురం జిల్లాకు త్రాగు, సాగు నీటి సరఫరాపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని వారు కోరారు.
**