visweswara reddy
-
వైఎస్సార్సీపీ పోరుబాటపై బాబు సర్కార్ కుట్రలు
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. వేల కోట్లు దండుకుంటున్న కూటమి సర్కార్పై నిరసన స్వరం వినిపించేందుకు సమాయత్తమవుతోంది. దీంతో వైఎస్సార్సీపీ పోరుబాటపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది.విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా రేపు(శుక్రవారం) వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టనుండగా.. పోలీస్ స్టేషన్కు రావాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి సహా వైఎస్సార్ సీపీ నేతలను పీఎస్కు పోలీసులు పిలిపించారు.వైఎస్సార్ సీపీ పోరుబాటకు వెళ్లకుండా బైండోవర్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పోలీసుల తీరును వైఎస్సార్సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. వైఎస్సార్సీపీ పోరుబాటకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు ప్రజల తరుపున నిరసన తెలిపి, కరెంటు చార్జీలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.ఇదీ చదవండి: కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే! -
నారా లోకేష్ వ్యాఖ్యలు.. వై విశ్వేశ్వర్ రెడ్డి అదిరిపోయే కౌంటర్
-
విచారణకు మేము సిద్ధం.. నువ్వు సిద్ధమా?.. చంద్రబాబుకు విశ్వేశ్వర రెడ్డి సవాల్
-
చంద్రబాబుపై విశ్వేశ్వర రెడ్డి కామెంట్స్
-
వైఎస్ఆర్ జయంతి.. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
-
నారా లోకేష్, చంద్రబాబులకు విశ్వేశ్వర రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర పయ్యావుల కేశవ్దే: విశ్వేశ్వరరెడ్డి
సాక్షి, అనంతపురం: రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తప్పుడు సమాచారం ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్పై కేసు నమోదు చేయాలంటూ ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టర్ను బెదిరించేలా పయ్యావుల వ్యవహరిస్తున్నారని, అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో 30 వేల దొంగ ఓట్లు పయ్యావుల కేశవ్ నమోదు చేయించారు. దొంగ ఓట్లు తొలగిస్తే తప్పేంటి?. కర్ణాటకలో నివసిస్తున్న వారి ఓట్లు ఉరవకొండ నియోజకవర్గంలో ఎందుకు ఉండాలి?. దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్దేనని విశేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: జనాలు లేరు..‘జెండాలూ’ లేవు.. నీరసంగా లోకేశ్ యువగళం -
‘ఆ భయంతోనే చంద్రబాబు అండ్ కో డ్రామాలు’
సాక్షి, అనంతపురం: చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని వైఎస్సార్ సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. రాయలసీమ జిల్లా అభివృద్ధి గురించి బాబు ఏరోజైనా ఆలోచించారా? ఒక్క ప్రాజెక్టునైనా కట్టారా? ఎన్నికలొస్తున్నప్పుడే బాబుకు ప్రాజెక్టులు గుర్తొస్తాయి’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి. వైఎస్సార్ జలయజ్ఞం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరిస్తే చంద్రబాబు వ్యతిరేకించారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు విస్తరణ వల్లే రాయలసీమకు సాగు, తాగు నీటి కష్టాలు తీరాయి. 1996, 1999లో రెండు సార్లు హంద్రీనీవా ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఎందుకు పనులు చేయలేదు?. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే హంద్రీనీవా, గాలేరు-నగరి సహా రాయలసీమ ప్రాజెక్టులకు మోక్షం లభించింది. హంద్రీనీవా కోసం ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది’’ అని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. చదవండి: సంపద పెరిగింది..అప్పులు తగ్గాయి ‘‘40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్ట్ను ఐదు టీఎంసీలకు కుదించి సీమకు అన్యాయం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. కరవు ప్రాంతాలకు కృష్ణా జలాలు వైఎస్సార్ పుణ్యమే. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. సీఎం జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల రైతులకు ఎంతో మేలు జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులను సీఎం జగన్ చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అండ్ కో దొంగ ఓట్ల డ్రామాలు. ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ ఎప్పుడూ దొంగ ఓట్లతోనే గెలుస్తారు’’ అని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. -
ఉరవకొండలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
-
‘కేసీఆర్ ఎలా పుట్టారో మేము అలానే పుట్టాం’
సాక్షి, షాద్ నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ నేతలను తెలంగాణలో ఎలా పుట్టారో అంటున్నారని, కేసీఆర్ ఆయన జిల్లాలో ఎలా పుట్టారో తాము కూడా తమ జిల్లాలో అలానే పుట్టామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం షాదనగర్ మండలం చౌదరి గూడలో జరిగిన జలసాధన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఇంజనీరింగ్ చేసినా.. అమెరికాలో ఇంజనీర్ సదివిన.. కానీ కేసీఆర్ ఇంజనీరింగ్ ప్లాన్ మాత్రం అర్థం కావడం లేదు. మా ప్రాంతానికి నాలుగు నెలల్లో నీళ్లు తెస్తే కేసీఆర్కు గుడి కడతా. మృగశిర పండుగ తరువాత చంద్రశిర పండగ చేస్తాం. ఇచ్చిన మాట తప్పితే... చంద్రశిర ఖండన చేద్దాం’’ అంటూ ధ్వజమెత్తారు. -
జగన్ పాలనలో ఏపీకి సువర్ణయుగమే
-
ప్రజలు టీడీపీ పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు
-
పయ్యావుల కేశవ్ను చిత్తుచిత్తుగా ఓడిస్తా
-
తాడిపత్రిలో జేసీ సోదరుల ఆరాచకపాలన : విశ్వేశ్వర్రెడ్డి
-
అభివృద్ధి రవ్వంత.. దోచేది కొండంత
కూడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగున్నర ఏళ్లలో ప్రజా ధనాన్ని దోచుకుంది కొండంత .. అభివృద్ధి చేసింది గోరంత అని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ధ్యజమెత్తారు. సోమవారం కూడేరు మండల పరిధిలోని చోళసముద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు ‘రావాలి జగన్...కావాలి జగన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీడీ రంగయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం చేపట్టే నవరత్నాల పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు సమస్యలను వారితో ఏకరువు పెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతు అనంతపురం జిల్లా కరువు కోరల్లో చిక్కుకున్నా .. కరువు సహాయక చర్యలు చేపట్టకుండా సీఎం చంద్రబాబు తాను చేసిన గోరంత అభివృద్ధిని కొండంత చేసి చెబుతు ప్రజలను మభ్యపెడుతున్నారుని మండి పడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంగా హంద్రీ నీవా కాలువ ఏర్పాటు చేస్తే నీరు ఇవ్వకుండా ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కూడా నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టేశారన్నారు. కేశవ్తో పాటు ఆయన అనుయాయులకు దోచుకోవడమే సరిపోయిందని విమర్శించారు. కేబినెట్లో ఐటీ దాడులపై చర్చనా? కేబినెట్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా ఐటీ దారులపై చర్చించడం సిగ్గుచేటని అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీడీ రంగయ్య విమర్శించారు. చంద్రబాబు అక్రమంగా సంపాదించిన డబ్బును కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో పంచారన్నారు. ఆయన పాలనంతా అవినీతిమయమే కాబట్టి ఐటీ దాడులు చేస్తే తమ అవినీతి బాగోతం ఎక్కడ బయట పడుతుందోనని బాబు జంకుతున్నారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజశేఖర్ , జడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, నాయకులు మాదన్న, నాగేంద్ర ప్రసాద్, తిమ్మారెడ్డి, గంగాధర్, పెన్నోబులేసు, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విశ్వ పోరాటం.. సంక్షేమ ఆరాటం
ఉద్యమాల ఖిల్లా...ఉరవకొండ...ప్రజా పోరాటం..అభివృద్ధి కోసం ఆరాటం.. నాలుగన్నరేళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సాగిస్తున్న సమరనాదమిది. ప్రభుత్వం నిధులివ్వకుండా వివక్ష చూపినా..స్థైర్యం కోల్పోక ప్రజలకు అండగా నిలిచారు. సాగు, తాగునీరు, పంటలకు మద్దతు ధర, ఇళ్లు, ఇంటి స్థలాలు, అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో ప్రజా ఉద్యమాలు నిర్మించారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్య పరిష్కరించేలా అలుపెరగని పోరాటం చేశారు. రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం వస్తుందని..అప్పుడే అందరికీ మేలు జరుగుతుందని పేదలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అనంతపురం, ఉరవకొండ: ప్రజా ఉద్యమాలే శ్వాసగా, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నాలుగున్నరేళ్లుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిస్వార్థంగా ప్రజా సంక్షేమం కోసం రోడ్డెక్కిన ఎమ్మెల్యే తీరునచ్చిన వామపక్షాలూ మద్దతు పలికాయి. ఎమ్మెల్యే చేపట్టిన ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచాయి. ఒకే ఒక్కడు జిల్లా నుంచి వైఎస్సార్ సీపీ గుర్తుపై ఇద్దరు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా అధికార పార్టీకి అమ్ముడుబోయారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన విశ్వేశ్వరరెడ్డి మాత్రం ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్రెడ్డి వెంట నడుస్తూ ఉరవకొండ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. సాగు నీటి కోసం అలుపెరగని పోరాటం రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత హంద్రీనీవా తొలిదశ కింద మిగిలి ఉన్న పది శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. తొలిదశలో జిల్లాలో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా...అత్యధికంగా 80 వేల ఎకరాలు ఉరవకొండ నియోజకవర్గంలో ఉంది. ప్రభుత్వం ప్రతిపాదిత ఆయకట్టుకు ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వకపోగా..నీటిని కుప్పంకు తీసుకువెళ్లేందుకు జిల్లాలో డిస్ట్రిబ్యూటరీలను, పిల్ల కాల్వను రద్దు చేసింది. దీంతో ఎమ్మెల్యే విశ్వ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చి డిస్ట్రిబ్యూటరీలు రద్దు చేస్తూ ఇచ్చిన జీఓ నిలుపుదల చేసింది. ఫలితంగా నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీనీవా నీటిని మళ్లించారు. ఇళ్లకోసం ధర్నాలు ఉరవకొండ పట్టణంలోని వైఎస్సార్ హయాంలో 88 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిలో పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వేలాది మందితో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మహాధర్నా చేపట్టారు. పోలీసులు బలవంతంగా ఆయన్ను అరెస్టు చేశారు. ఇంతకు ముందు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులతో కలిసి 32 గంటల దీక్ష, పాత బస్టాండ్ వద్ద 24గంటల దీక్షలు చేపట్టారు. దీంతో పాటు నియోజకవర్గంలోని అన్నీ మండల కేంద్రాల్లో పేదల ఇంటిపట్టాల కోసం ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. అంతేకాకుండా చేనేత కార్మికులకు పాసుపుస్తకాలు, ముద్రరుణాలు ఇవ్వాలని ఉరవకొండ పట్టణంలో చేనేతల ధర్నా, సదస్సులు చేపట్టారు. మైనార్టీ సమస్యలపై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేపట్టిన మైనార్టీ సదస్సు విజయవంతమైంది. ప్రధాన సమస్యలు.. ఎమ్మెల్యే చర్యలు ♦ హంద్రీనీవా తొలిదశ ఆయకట్టులో ఉరవకొండ నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాలున్నాయి. అయితే హంద్రీనీవా ఫేజ్–1 పనులు 2012లోనే పూర్తయి జీడిపల్లి రిజర్వాయర్కు కృష్ణా జలాలు చేరినా..టీడీపీ ప్రభుత్వం ఒక్క ఎకరాకు నీరివ్వలేదు. అంతేకాకుండా రాకెట్ల–ఆమిద్యాల లిఫ్ట్ పనులను కూడా చేపట్టలేదు. ♦ హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలని ఎమ్మెల్యే విశ్వ దశలవారీగా ఎన్నో పోరాటాలు చేశారు. దిగి వచ్చిన ప్రభుత్వం నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జలాలలతో నింపింది. అందువల్లే డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకపోయినా రైతులు చెరువు నీటితో పంటలు సాగు చేస్తున్నారు. ♦ జీడిపల్లి గ్రామంలో రిజర్వాయర్ దగ్గరగా ఉండటంతో ఊట నీరు ఇళ్లలోకి వెళ్లి గ్రామం మొత్తం దెబ్బతింది. తమను ఆదుకోవాలంటూ గ్రామస్తులు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది. ♦ జీడిపల్లి గ్రామానికి పునరావసం కల్పించాలని ఎమ్మెల్యే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఎన్నోమార్లు విన్నవించారు. గ్రామçస్తులతో కలిసి కలెక్టరేట్ను కూడా ముట్టడించారు. ఎమ్మెల్యే పోరాటాలతో స్పందించిన ప్రభుత్వం.. ఆర్ఆర్ యాక్టు కింద జీడిపల్లి గ్రామానికి పునరాసవం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ♦ ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలల్లో పేదలకు ఇంటిపట్టాలు ఇవ్వడానికి రూ.4 కోట్లు వెచ్చించి 140 ఎకరాల స్థలాన్ని వైఎస్సార్ హయాంలో కొనుగోలు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్... నేటికీ పట్టాలు పంపిణీ చేయలేదు. ♦ అర్హులైన పేదలకు ఇంటిపట్టాలు పంపిణీ చేయాలని విశ్వేశ్వరరెడ్డి సుదీర్ఘ పోరాటాలు చేశారు. ఉరవకొండలో వేలాది మందితో రోడ్డుపైనే ఎమ్మెల్యే బైఠాయించి అరెస్టు కావడంతో ప్రభుత్వానికి కనువిప్పు కల్గింది. పట్టాల పంపిణీకి అధికారుల చేత సర్వే చేయించి జాబితాలు సైతం సిద్ధం చేశారు. మిగితా మండలాల్లో కూడా పేదలకు ఇంటిపట్టాల ఇవ్వాలని ఎమ్మెల్యే ఆయా తహసీల్దార్ కార్యాలయల వద్ద ధర్నాలు చేపట్టారు. దీంతో అర్హులను గుర్తించడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. పోరాడి నిధులు సాధించాం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు చేస్తున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఈ ప్రభుత్వం నిధులివ్వడం లేదు. హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు విడుదల కోసం ప్రభుత్వంపై ఎంతో ఒత్తడి చేశా. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉరవకొండకు వచ్చి సాగునీటి కోసం ధర్నా చేపట్టారు. మా పోరాటల ఫలితంగానే రోడ్లు, పెన్నహోబిళం దగ్గర వంతెన, హంద్రీనీవా ద్వారా చెరువులు, డిస్ట్రిబ్యూటరీలకు సాగునీరు, జీబీసీ ఆధునికీకరణ పనులు జరిగాయి. మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే మరింతగా అభివృద్ధి చేస్తా.– వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ -
కరువు రైతుపై కనికరం లేని ప్రభుత్వం
‘‘కరువుతో రైతాంగం విలవిల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో కనీస మానవత్వంచూపాల్సిన ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైంది.’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతపురం రూరల్: ‘‘కరువుతో రైతాంగం విలవిల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో కనీస మానవత్వం చూపాల్సిన ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైంది.’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శరత్చంద్రారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పాల్గొన్నారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వాతావరణ బీమా కింద దాదాపు రూ.300 కోట్ల ప్రీమియాన్ని రైతులు బ్యాంకులకు చెల్లిస్తే అందులో సగం కూడా బీమా రూపంలో రైతులకు అందడం లేదన్నారు. వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి సాధించినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, అదే జరిగితే లక్షల ఎకరాలు ఎందుకు బీళ్లుగా మారుతాయో సమాధానం చెప్పాలన్నారు. తీవ్ర కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి కనిపించకపోవడం శోచనీయమన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు సహజ మరణాలుగా చూపించే ప్రయత్నం చేస్తుండటం సిగ్గుచేటన్నారు. హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు నీరివ్వకుండా కేవలం చెరువులు, కుంటలను నింపి రైతులను మభ్యపెడుతున్నారన్నారు. హంద్రీనీవా నీటిని కుప్పంకు తరలించే ఉద్దేశంతోనే అనంత రైతులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడన్నారు. పీఏబీఆర్ కింద 50వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రూ.500 కోట్లు కేటాయించారని.. టీడీపీ ప్రభుత్వం ఆధునికీకరణ పనులను నత్తనడకన సాగిస్తుండటంతో చాలా చోట్ల నీళ్లు వృథా అవుతున్నాయన్నారు. అదేవిధంగా తుంగభద్ర డ్యాం నీళ్లను తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాలరంగయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగరాజు, రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజినేయులు, మానవ హక్కుల వేదిక బాషా, సరస్వతి, కేవీపీఎస్ నల్లప్ప పాల్గొన్నారు. -
ఏపీ బంద్: అనంతలో విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్
-
హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు టీడీపీ నటిస్తోంది
-
‘రాజీనామాలు చేసే దమ్ము టీడీపీకి ఉందా’
సాక్షి, అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి.. దీక్షలు చేసే దమ్ము టీడీపీ ఎంపీలకు ఉందా అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 24న చేపట్టనున్న రాష్ట్ర బంద్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు టీడీపీ నటిస్తోందని విమర్శల వర్షం కురిపించారు. రైల్వే జోన్ తేలేని దద్దమ్మలు టీడీపీ నేతలని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు కారణమన్నారు. కేంద్రానికి ఆ అవకాశం ఇచ్చింది టీడీపీ అని తెలిపారు. చంద్రబాబు ఇప్పుడు కూడా ఎన్డీయే భాగస్వామి, మిత్రుడే అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాలతో సహా, ప్రజా సంఘాల మద్దతు కోరుతున్నామన్నారు. ఏపీ ప్రయోజనాలను మోదీ వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్టారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్న వేలాది మందిపై కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుది అని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై మోదీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. టీడీపీ, బీజేపీ కలిసి ఏపీకి ద్రోహం చేశాయని, వైఎస్సార్సీపీ ఎంపీల త్యాగం చారిత్రాత్మకమైనదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఉద్యమ సారథి వైఎస్ జగన్ విభజన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటాన్ని వైఎస్సార్సీపీ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోందని వైఎస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రజల మనోభావాలు, వారికి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్లో సుదీర్ఘంగా తమ నేతలు నిరసనలు తెలిపారన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు పదవికి రాజీనామా చేసి అమరణ దీక్ష చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీ ప్రజల హక్కులను కేంద్రం తిరస్కరించడం దుర్మార్గమని మండిపడ్డారు. తప్పును బీజేపీపైకి నెట్టి చంద్రబాబు జారుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్యాకేజీని చూసి అసెంబ్లీ సాక్షికి చంద్రబాబు, మంత్రులు స్వాగతించారని పేర్కొన్నారు. ప్యాకేజీ బాగుందని కేంద్ర మంత్రులను చంద్రబాబు సన్మానించారని గుర్తుచేశారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై స్పందించేలా చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. టీడీపీకి ఏపీ ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నదని విమర్శించారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా ఈ నెల 24న జరిగే ఏపీ బంద్కి వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు. -
చంద్రబాబులో ధర్మం లేదు..పోరాటం లేదు
-
పంటలకు మద్దతు ధర ప్రకటించాలి
అనంతపురం: ‘‘పంటకు మద్దతు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేరుశనగ, పప్పుశనగ తదితర పంటలన్నీ ఇళ్లలోనే మగ్గిపోతున్నాయి. విత్తనం వేసే సమయం వచ్చినా.. పంట అమ్ముకునే పరిస్థితి లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుకు అనుగుణంగా ధరలు అమలు చేస్తున్నామంటూ ప్రభుత్వం మభ్య పెడుతోంది’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే యల్లారెడ్డిగారి విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని పంటలకు సాగు వ్యయం రెట్టింపైనా... కనీస మద్దతు ధర మాత్రం 10 శాతానికి మించి పెంచలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించినా..ఒక్క ఏడాది కూడా రూ.100 కోట్లు కేటాయించలేదన్నారు. రైతుల నుంచి పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బు జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం... నేటికీ చాలామంది రైతులకు ఇంకా చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల టన్నుల వేరుశనగ కొనుగోలు చేస్తామని చెప్పి... 3 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయి. విలేకరుల సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్రబాబు(రాజారాం), పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి పాల్గొన్నారు. పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి కరువు జిల్లా. ప్రతి నాలుగేళ్లలో మూడేళ్లు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి. వేరుశనగ పంట సాగు చేసిన రైతులు సర్వస్వం కోల్పోయారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం గతేడాది ఎకరాకు రూ.21 వేలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈసారి మరింత పెరిగింది. గత ఖరీఫ్లో వేరుశనగ సాగు చేసిన రైతులు రూ. 10–12 వేలు నష్టపోయారు. వ్యాపారుల ముసుగులో టీడీపీ నేతలు క్వింటాలుకు రూ. 3,600 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రూ. 5,500 విక్రయించి సొమ్ము చేసుకున్నారు.– అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ మోసకారి మాటలు ప్రభుత్వం మోసగారి మాటలతో కాలం వెల్లదీస్తోంది. కరువుతో పంటలు పండక రైతులు, కూలీలు వలసలు వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో వెళ్లారంటూ స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పడం సిగ్గుచేటు. దీన్నిబట్టి చూస్తే వారికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు అవినీతి, అక్రమాలపై ఉన్న ధ్యాస... ప్రజల సంక్షేమంపై లేదు. మహరాష్ట్రలో రైతుల స్ఫూర్తితో ఇక్కడా ఉద్యమాలు చేయాల్సి ఉంది.– వెన్నపూస గోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ -
స్థలం ఉన్నా...పట్టాలిచ్చే నాథుడే లేడు
-
రాయదుర్గంలో మంత్రి కాల్వకు గట్టి ఎదురుదెబ్బ
-
కేశవ్.. రైతులపై కక్ష సాధింపా?
ఉరవకొండ: ‘‘ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట.. పదిరోజుల్లో ఇంటికి చేరేది.. ఆ లోపే బూదగవి చెరువు కోసమంటూ నీళ్లొదిలారు. చెరువు నిండడం ఏమోగానీ.. ఆ నీరంతా పొలాల్లో చేరడంతో రైతులు నిండా మునిగారు. లక్షలాది రూపాయల నష్టం జరిగింది.. ఓ ఎమ్మెల్సీకి ఆమాత్రం తెలియదా..? రైతుల కడుపుకొట్టడమే పయ్యావుల కేశవ్ నైజం’’ అంటూ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. బుధవారం బూదగవి వద్ద చెరువుకు సమీపంలో నీటమునిగిన పప్పుశనగ పంటలను ఆయన పరిశీలించారు. వందల ఎకరాల్లో సాగుచేసిన పంట హంద్రీనీవా నీటితో మునిగిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయిందని రైతులు ఎమ్మెల్యే ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓ దార్చిన ఎమ్మెల్యే అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్ల తర్వాత పంట బాగా పడిందని రైతులంతా సంతోషించారనీ, ఎకరాకు కనీసంగా రూ.50 వేల వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో హంద్రీనీవా నీళ్లు వదలాలని ఎమ్మెల్సీ కేశవ్ ఆదేశించడం దుర్మార్గమన్నారు. తమ మాట వినడం లేదనే రైతులపై కక్షట్టి పయ్యావుల కేశవ్ చేతికొచ్చిన పంటలను నీటిపాలు చేశారన్నారు. నీరువదులుతున్నట్లు తెలిసి తాను వారం క్రితమే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రోజులు నీటి సరఫరా నిలపాలని కోరానన్నారు. కానీ కేశవ్ అధికారులు, పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేసి రైతులను దెబ్బతీయాలన్న కుట్రతో చెరువుకు నీళ్లు వదిలించారన్నారు. అధికారులు ఇప్పటికైనా నీటి సరఫరా ఆపితే కనీసం 50 ఎకరాల్లోని పంట అయినా రైతులకు దక్కే అవకాశం ఉందన్నారు. లేని పక్షంలో రైతులతో కలిసి అధికారులపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్య, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ తేజోనాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, ప్రధాన కార్యదర్శి ఈడిగ ప్రసాద్, కిసాన్ సెల్ నాయకుడు కాకర్ల నాగేశ్వరావు, మాన్యం ప్రకాష్, దుద్దేకుంట రామాంజినేయులు, మూలగిరిపల్లి ఓబన్న, గోవిందు, ఆంజినేయులు, రాయంపల్లి ఎర్రిస్వామిరెడ్డి, విడపనకల్లు మండల కన్వీనర్ బసన్న, గడేకల్లు పంపాపతి పాల్గొన్నారు. -
రూ. 250 కోట్ల అవినీతికి టీడీపీ కుట్ర
సాక్షి, అనంతపురం: చంద్రబాబు అసమర్థత వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలను సాధించటంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటాలకు టీడీపీ మద్దతు ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగేదికాదన్నారు. జిల్లాలోని ఉరవకొండ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో రూ. 250 కోట్ల అవినీతికి టీడీపీ నేతలు కుట్ర పన్నారన్నారు. టెండర్ ప్రక్రియలో నిబంధనలు పాటించడం లేదని విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. మరో వైపు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ, బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఎన్డీయేలో కొనసాగుతూనే నిరసన తెలియజేయడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. ప్రజా సంక్షేమం కన్నా రాజకీయ ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని తెలిపారు. -
చంద్రబాబు నాటకాలాడుతున్నారు
సాక్షి, అనంతపురం: కేంద్ర బడ్జెట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వం అసమర్థతపై నిప్పులు చెరిగారు. మోదీ సర్కార్తో యుద్దమంటూ మీడియాకు లీకులిచ్చారని, తర్వాత ఎన్డీఏలో కొనసాగుతామని అధికారిక ప్రకటనలు చేయడం చూస్తే ఆయనకు రాష్ట్రం పట్ట ఉన్న అభిమానం ఏంటో అర్థమౌతోందని అన్నారు. ఓటుకు నోటు కేసులో బయట పడేందుకే ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీపడ్డారని ఆరోపించారు. విభజన హామీలతో పాటు, ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో సైతం విఫలమయ్యారని విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు. తన అవినీతి బట్టబయలు అవుతుందనే చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయానికి తెలుగుదేశం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ న్యాయమైందేనని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే సాధ్యమౌతుందన్నారు. -
'అలా అనడం చంద్రబాబుకు సిగ్గు చేటు'
సాక్షి, విజయవాడ : విభజన హామీలు నెరవేర్చనందుకు ప్రధాని నరేంద్రమోదీపై కోర్టుకు వెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం చాలా సిగ్గు చేటు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్రంలో టీడీపీ మంత్రులు ఇద్దరు ఉన్నారని వారు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. స్వలాభం కోసమే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్ పేరు చెబితే వణుకు : అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ పేరు చెబితేనే చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి వైఎస్ఆర్ అని చెప్పారు. వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు చెబుతుంటే చంద్రబాబు మైకు లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. హంద్రీనీవాపై చిత్తశుద్ధి లేదు : విశ్వేశ్వరరెడ్డి హంద్రీనీవాను పూర్తి చేసే చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చంద్రబాబు ఆయన మంత్రులు కలిసి హంద్రీనీవాను దోపిడీ ప్రాజెక్ట్గా మార్చేశారని ధ్వజమెత్తారు. డిస్టిబ్యూటరీ పనులు నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
గొంతెండుతున్నా పట్టించుకోరా?
- రిజర్వాయర్లో నీరున్నా ప్రజలకు ఎందుకివ్వరు? - ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి - పీఏబీఆర్ వద్ద రక్షిత నీటి పథకం ప్రారంభానికి యత్నం - అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత -ఎమ్మెల్యే అరెస్ట్, విడుదల కూడేరు : ప్రజల గొంతెండుతున్నా ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. సర్కారు వైఫల్యంతోనే జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తుతోందన్నారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నిర్వహణలో నిర్లక్ష్యం, ఉరవకొండ నియోజకవర్గంలోని 90 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు పీఏబీఆర్ వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన సమగ్ర గ్రామీణ రక్షిత నీటి పథకం ప్రారంభోత్సవంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వానికి నిరసనగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి శనివారం ఆందోళన చేపట్టారు. సుమారు 500 మంది ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పీఏబీఆర్ వద్ద రక్షిత నీటి పథకాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు. అప్పటికే అక్కడ మోహరించిన ఆత్మకూరు, ఉరవకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పది మంది ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ పోలీసులు కలిపి సుమారు 150 మంది ప్రధాన గేటు వద్దనే వారిని అడ్డుకున్నారు. ప్రజల తాగునీటి ఇబ్బందులు తీర్చడం కోసమే రక్షిత పథకాన్ని ప్రారంభించడానికి వచ్చామని చెబుతున్నా..పోలీసులు విన్పించుకోలేదు. అడ్డొచ్చిన ఆందోళనకారులను పక్కకు నెట్టేసి ఎమ్మెల్యేను బలవంతంగా కూడేరు పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అంతకుముందు పీఏబీఆర్ వద్ద ఎమ్మెల్యే విశ్వ విలేకరులతో మాట్లాడారు. కరువును జయిస్తామని గొప్పలు చెబుతున్న సీఎం చంద్రబాబు.. ప్రజలకు కనీసం గుక్కెడు తాగునీరు అందించలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోనే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనంతపురం జిల్లా అని, ఈ వేసవిలో అనేక గ్రామాల్లో గుక్కెడు నీరు లభించక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో 90 గ్రామాలకు నీరందించేందుకు రూ.56 కోట్లతో ఏర్పాటు చేసిన పథకం ప్రారంభానికి నోచుకోలేదన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ పథకం ప్రారంభానికి అధికారులు చొరవ చూపడం లేదన్నారు. ఎస్ఈని నిలదీసిన ఎమ్మెల్యే ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరాంనాయక్ను ఎమ్మెల్యే విశ్వ నిలదీశారు. ‘శ్రీరామరెడ్డి పథకంలో రెండు మోటార్లు ఉండగా.. కొంతకాలం నుంచి ఒక్కదాన్నే వాడుతూ వచ్చారు. ఇప్పుడు అదీ చెడిపోయింది. దాదాపు వెయ్యి గ్రామాల ప్రజలు నీరు లేక అల్లాడుతున్నారు. ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా? ఉరవకొండ తాగునీటి పథకాన్ని ప్రారంభించాలని మంత్రి దేవినేని ఉమా ఆదేశించినా మీరెందుకు పట్టించుకోలేదు? వేసవి పూర్తయ్యాక నీరిస్తారా? ప్రజల కన్నీటి కష్టాలు ప్రభుత్వానికి, మీకు పట్టవా?’ అని నిలదీశారు. శ్రీరామరెడ్డి పథకం మోటారు ఎప్పటిలోగా సరిచేసి, నీరిస్తారని అడగ్గా.. శనివారం సాయంత్రంలోపు పూర్తి చేస్తామని ఎస్ఈ చెప్పారు. అలాగే ఉరవకొండ తాగునీటి పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణయ్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు రాజశేఖర్, దేవేంద్ర, మాదన్న, తిప్పయ్య, బసవరాజు, వెంకటేశులు, రామ్మోహన్, అయ్యమ్మ, క్రిష్టప్ప, గంగాధర్, విజయభాస్కర్ రెడ్డి, Ô¶ శ్రీకాంత్రెడ్డి, రామచంద్రారెడ్డి, రామచంద్ర, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
మద్ధతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం
విడపనకల్లు(అనంతపురం జిల్లా): మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించాలంటూ అనంతపురం జిల్లా విడపనకల్ లో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. వైస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. మిర్చి రైతు పట్ల ప్రభుత్వ వైఖరిని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ప్రజలతో పాటు భోజనాలు చేశారు. అనంతరం తహశీల్దారుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మద్ధతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రూ. 5 వేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు అది ఏమైందని ప్రశ్నించారు. మిర్చికి మద్దతు ధర కోసం అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రస్తావిస్తే ప్రభుత్వం కనీసం చర్చకు కూడా రాలేదని పేర్కొన్నారు. రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి దుర్భరమైన జీవనం సాగిస్తున్నా చంద్రబాబు కంటికి కనిపించక పోవడం దారుణమన్నారు. -
‘జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు వికృతానందం’
అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదని, ఆయన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని వైఎస్సార్ సీపీ నాయకులు విశ్వేశ్వర్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మెప్పుకోసమే జేసీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయనకు మతిస్థిమితం తప్పిందని మండిపడ్డారు. తమ నాయకుడు వైఎస్ జగన్ పై నోరుజారితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. జేసీ దివాకర్ రెడ్డి ఊసరవెల్లి అని, ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళతారని ఎద్దేవా చేశారు. జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు వికృతానందం పొందారని దుయ్యబట్టారు. కర్నూలు జిల్లాలో సోమవారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో దళిత ఎమ్మెల్యే ఐజయ్యకు మైకు ఇచ్చేందుకు ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధంకావాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించింది చంద్రబాబేనని గుర్తు చేశారు. -
కరువు మండలాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి
ఉరవకొండ : కరువు మండలాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రెయిన్గన్లతో పంటలు కాపాడి కరువును పాలదోలానని సన్మానాలు చేయించుకున్న వుుఖ్యవుంత్రి చంద్రబాబు ఆఖరుకు నిజాన్ని ఒప్పుకుని జిల్లాలో 63 వుండలాలను కరువు ప్రాంతాలు ప్రకటించారన్నారు. విడపనకల్లు వుండలం కడదరబెంచి గ్రావుంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రవుంలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో ఎమ్మెల్యే వూట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 250 కరువు మండలాలను ప్రకటించి, చేతులు దులుపుకోకుండా వెంటనే సహాÄýæుక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా రైతాంగం దుస్ధితిని ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లడానికి గత నెలలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వేలాది వుంది రైతులతో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, ప్రభుత్వానికి కనువిప్పు కల్గించారని గుర్తు చేశారు. వేరుశనగ పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ.20 వేల ఇన్పుట్ సబ్సిడీను అందించాలన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా తీవ్ర వర్షాభావంతో నల్లరేగడి భూవుుల్లో రైతులు శనగ విత్తనాలు కూడా వేయలేకపోయారన్నారు. చంద్రబాబు రైతుల దుస్ధితిని అర్ధం చేసుకుని రుణవూఫీను విడతల వారీగా కాకుండా ఒకే సారి అవులు చేసి, కొత్తగా బ్యాంకుల్లో రుణాలు వుంజూరు చేయించాలన్నారు. అలాగే కరువు పరిస్ధితుల దష్ట్యా విద్యార్థుల ఫీజులన్నీ రద్దు చేసి, బకాయిపడ్డ స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ను చెల్లించాలని డివూండ్ చేశారు. -
మా ఎమ్మెల్యేలు చేసిన తప్పేంటి?
-
రైతు ద్రోహి చంద్రబాబు
-
రైతు ద్రోహి చంద్రబాబు
అనంతపురం అగ్రికల్చర్ : వేరుశనగ ఎండిపోయిన విషయం తనకు తెలీదని అసమర్థ ముఖ్యమంత్రిగా అంగీకరించిన చంద్రబాబు వారం రోజులు తిరక్కుండానే పంటను రక్షించి కరువును జయించినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా క్రమశిక్షణ సంఘం సభ్యుడు తోపుదుర్తి భాస్కర్రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తదితరులు శనివారం కూడేరు, ఆత్మకూరు మండలాల్లో పంట పొలాలకు వెళ్లి వేరుశనగ స్థితిగతులను తెలుసుకున్నారు. మొదట కూడేరు మండలం ముద్దలాపురంలో రైతు మల్లికార్జునరెడ్డికి చెందిన వేరుశనగ పొలాన్ని చూశారు. 75 రోజులవుతున్నా రెండు, మూడు ఊడలు కూడా లేవని రైతు వాపోయాడు. అనంతరం ఆత్మకూరుకు చెందిన రైతు విశ్వనాథరెడ్డి పొలాన్ని చూశారు. రోగాలతో సగం వేరుశనగ ఎండిపోగా, మిగతా సగం ఒకట్రెండు ఊడలు మాత్రమే దిగడాన్ని చూశారు. ఎకరాకు రూ.18 నుంచి రూ.20 వేల దాకా ఖర్చు చేశామని, ఆదుకోవాలని పలువురు రైతులు ఈ సందర్భంగా నేతలకు విన్నవించారు. పంట పరిశీలన తర్వాత ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పుష్కరాల్లో మునిగితేలిన చంద్రబాబుకు జిల్లాలో ఎండిపోయిన పంటలు, కరువు పరిస్థితులు కనిపించకపోవడం దారుణమన్నారు. హైటెక్ సీఎంగా చెప్పుకుంటున్న వ్యక్తి పంటలు ఎండిపోయిన విషయాన్ని తెలుసుకోలేకపోవడం, ఆ నెపాన్ని మంత్రులు, అధికారులు, మీడియాపై వేయడం శోచనీయమన్నారు. జిల్లా పర్యటన ముగించుకున్న తర్వాత రైతులకు భరోసా ఇస్తారని ఆశిస్తే..అందుకు విరుద్ధంగా ప్రకటన చేశారన్నారు. వచ్చే పరిహారం కూడా రాకుండా చేసేలా రెయిన్గన్ల ద్వారా నాలుగురోజుల్లోనే పంటను కాపాడినట్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వంపై ఆధారపడవద్దని రైతులకు పరోక్షంగా సంకేతాలిచ్చారన్నారు. ఫసల్బీమాను వర్తింపజేయడంలోనూ దారుణంగా విఫలమయ్యారన్నారు. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... నీళ్లు లేకున్నా రక్షకతడుల పేరుతో నాలుగు రోజుల పాటు సినిమా షూటింగ్లా హడావిడి చేసి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. సీఎంలా కాకుండా కనికట్టు మాంత్రికుడిగా బోగస్ లెక్కలతో రైతులను బురిడీ కొట్టించారని మండిపడ్డారు. జిల్లాలో వేరుశనగ పంట నిలువుగా ఎండిపోయిందని, ఎకరాకు రెండు బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని వివరించారు. ఈ విషయం తెలిసీ రెయిన్గన్ల ద్వారా హడావుడి∙చేయడం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రాకుండా ఎగ్గొట్టడానికేనన్నారు. బీమా నిబంధనల ప్రకారం రెండో దశ కింద తప్పనిసరిగా పరిహారం రావాల్సి ఉంటుందన్నారు. అయితే రక్షకతడి మాటున పరిహారం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. తోపుదుర్తి భాస్కరరెడ్డి మాట్లాడుతూ వర్షాలు లేవు, కుంటలు, చెక్డ్యాంలలో నీళ్లు కూడా లేవు, కానీ రెయిన్గన్ల ద్వారా పంటను కాపాడినట్లు గొప్పలు చెబుతూ రైతులను వంచనకు గురిచేశారని మండిపడ్డారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ పంట ఎండిపోయింది, పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిసీ రెయిన్గన్లతో డ్రామా నడిపారని విమర్శించారు. వర్షం రావడంతో పంట కాస్తంత పచ్చదనం సంతరించుకున్నా దిగుబడుల పరంగా ఏమీ లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏమి చేసినా రైతును జరిగిన నష్టాన్ని పూడ్చలేమని, ప్రభుత్వం ఆదుకోకుంటే వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని నేతలు హెచ్చరించారు. ముందుగా డబ్బు కడితే తర్వాత అకౌంట్లలో జమ చేస్తామంటూ మభ్యపెట్టి చివరకు ఒక్క రెయిన్గన్ కూడా ఇవ్వలేదని రైతులు నేతల దృష్టికి తీసుకువచ్చారు. పంట పరిశీలనలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు సీపీ వీరన్న, మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, మామిళ్లపల్లి అమరనాథరెడ్డి, కూడేరు జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, ఆత్మకూరు మాజీ జెడ్పీటీసీ మధుసూదన్, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి కోసం పోరుబాట
= ఆయకట్టుకు హంద్రీ–నీవా నీరందే వరకూ ఉద్యమిస్తాం = ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జీడిపల్లి(బెళుగుప్ప) : హంద్రీ–నీవా ఆయకట్టుకు సాగునీటిని అందించే వరకూ రైతుల పక్షాన పోరాడతామని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. గురువారం బెళుగుప్ప మండలం జీడిపల్లి వద్ద వందల మంది రైతు కుటుంబాలు, హంద్రీనీవా ఆయకట్టు సాధనసమితి, పార్టీ నాయకులతో కలిసి ఆయన సామూహిక పుష్కర స్నానాలు చేశారు. సాగునీరు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కృష్ణమ్మకు సామూహిక తర్పణాలు వదిలారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జీడిపల్లి రిజర్వాయర్ వరకు 80 శాతం హంద్రీ–నీవా సాగునీటి పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పూర్తి చేశారని, 20 శాతం పనులు పూర్తి చేయకుండా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సాగునీటిని మొదటిదశ ఆయకట్టుకు అందిస్తే వైఎస్సార్ను అందరూ గుర్తుంచుకుంటారన్న అసూయతోనే ఆ నీటిని కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్లేందుకు రెండోదశ పనులు శర వేగంగా చేపట్టారన్నారు. వరుసగా ఐదేళ్లుగా జీడిపల్లికి నీరు వస్తున్నా, సాగునీరు మాత్రం ఎకరం పొలానికి కూడా అందించలేదన్నారు. ఆయకట్టు రైతులకు మద్దతుగా ఇప్పటికే నిరసన దీక్షలు, ధర్నాలు, జల జాగరణలు చేపట్టి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామన్నారు. హంద్రీనీవా పథకంలో ఈ ప్రాంతానికి సంబంధించిన 36వ ప్యాకేజీలో రూ.93 కోట్ల పనులకు సంబంధించి రూ.56 కోట్ల పనులను పెండింగ్ పెట్టారన్నారు. ఎలాంటి జీఓలను అనుసరించకుండానే రూ.336 కోట్లకు ప్రభుత్వ ప్రతిపాదనలు పెంచుకొని ప్రజాధనాన్ని దోచుకోవడానికి టీడీపీ నాయకులు పన్నాగం పన్నారన్నారు. ఇప్పటికే జీడిపల్లి రిజర్వాయర్ కింద ఉన్న జీడిపల్లి గ్రామానికి రెండుసార్లు వచ్చిన సీఎం.. జీడిపల్లి పునరావాసం కింద ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీటిని అందించి, జీడిపల్లికి పునరావాసం కల్పించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణయ్రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి దుద్దేకుంట రామాంజనేయులు, మండల అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, బెళుగుప్ప సింగిల్విండో అధ్యక్షుడు శివలింగప్ప, సర్పంచ్ రామేశ్వరరెడ్డి, మండలాధ్యక్షులు యశోదమ్మ, హంద్రీనీవా ఆయకట్టు సాధనసమితి నాయకులు రాకెట్ల అశోక్, తేజోనాథ్, పార్టీ నాయకులు, ఆయకట్టు సాధనసమితి సభ్యులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలు గాలికి
విడపనకల్లు: ప్రజాసమస్యల ను గాలికి వదిలే సి కృష్ణా పుష్కరాల పేరిట హంగు, ఆర్భాటాలకు మాత్ర మే ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విడపనకల్లులో విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రుణమాఫీ చేయకుండా మభ్యపెడుతున్నారంటూ ప్రభుత్వ తీరుపై రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు మండిపడుతున్నారన్నారు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. ఎంతో మంది పత్తి రైతులు నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి నష్ట పోయినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇంత వరకు ఒక్క నిరుపేదకు కూడా పక్కాగృహం నిర్మించి ఇవ్వలేదని ప్రభుత్వానికి చురకలంటించారు. -
నేడు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జలజాగరణ
► హంద్రీ-నీవా ఆయకట్టుకు నీరివ్వకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోరుబాట ► బెళుగుప్పలో నేటి సాయంత్రం 5 గంటల నుంచి దీక్ష అనంతపురం: హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం మొదటిదశ ఆయకట్టుకు నీరివ్వకుండా.. సీఎం సొంత నియోజకవర్గం కుప్పానికి తీసుకుపోవడాన్ని నిరసిస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పోరుబాట పట్టారు. ఉరవకొండ నియోజకవర్గ రైతులతో కలిసి శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఎనిమిది వరకూ బెళుగుప్ప మండల కేంద్రంలో ‘జలజాగరణ’ దీక్షకు దిగుతున్నారు. హంద్రీ-నీవా మొదటి దశ కింద 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చే సమయానికే మొదటి దశ పనులు 90 శాతం పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఈ పనులపై దృష్టి సారించి ఉంటే గత రెండేళ్ల నుంచే మొదటి దశ ఆయకట్టు భూములు పంటలతో కళకళలాడేవి. కానీ సీఎం చంద్రబాబు ఆయకట్టు విషయాన్ని పక్కన పెట్టేసి.. తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీటిని తీసుకుపోవడానికి ప్రధాన కాలువపైనే దృష్టి సారించారు. దీంతో పాటు తమ వారికి లబ్ధి చేకూర్చడానికి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేశారు. రెండోదశలో రూ. 50 కోట్ల పనుల విలువను రూ. 300 కోట్లకు పెంచారు. గతేడాది జీవో 22ను విడుదల చేస్తూ.. ఆయకట్టు పనుల జోలికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఉరవకొండ నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. మొదటి దశలో కర్నూలు జిల్లా పరిధిలోని 25 వేల ఎకరాలు పోనూ మిగిలిన ఆయకట్టంతా జిల్లాలోనే ఉంది. అత్యధికంగా ఉరవకొండ నియోజకవర్గంలో 75 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జీడిపల్లి రిజర్వాయర్ కూడా బెళుగుప్ప మండలంలోనే నిర్మించారు. ప్రాజెక్టు కోసం వేల ఎకరాలను ఇక్కడి రైతులు ఇచ్చారు. రిజర్వాయర్ నిర్మాణంతో జీడిపల్లి వాసులు తీవ్రంగా నష్టపోయారు. వారికి ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడి తేవడంతో పాటు రాకెట్ల, ఆమిద్యాల ఎత్తిపోతల పథకాన్ని గతేడాది ఆగస్టులోగానే పూర్తి చేస్తామని ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది. అయితే ఇంత వరకూ అతీగతీ లేదు. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి : విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ శనివారం సాయంత్రం బెళుగుప్పలో చేపడుతున్న జలజాగరణ దీక్షకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, ప్రజలు తరలిరావాలి. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరాం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తదితరులు హాజరవుతున్నారు. -
నేడు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జలజాగరణ
అనంతపురం: వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నేటి నుంచి రెండురోజులపాటు జలజాగరణ కార్యక్రమం జరుగనుంది. ప్రభుత్వం మెడలు వంచైనా సరే హంద్రీనీవా పథకం ద్వారా చెరువులను నింపడంతో పాటు మొదటి దశ ప్రతిపాదిత అయకట్టుకు సాగునీటిని పోరాడి తెచ్చుకుందాం అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. జలజాగరణ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నాయకులు హాజరు కానున్నారు. జలజాగరణకు నియోజకవర్గంలోని అన్ని మండలాలతోపాటు జిల్లాలోని వివిధ మండలాలనుంచి రైతులు తరలిరానున్నారు. శుక్రవారం సాయంత్రం వైఎస్సార్సీపీ నాయకులు జలజాగరణ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. జలజాగరణను విజయవంతం చేయాలని కోరుతూ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వారంరోజులుగా నియోజకవర్గంలోని వజ్రకరూరు, ఉరవకొండ, విడపనకల్లు, బెళుగుప్ప, కూడేరు మండలాల్లో విసృతంగా పర్యటించి రైతులు, మహిళలు, యువకులు తదితరులను కలుసుకుని జలజాగరణకు సంఘీభావం తెలపాలని కోరారు. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణకు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, పీఏబీఆర్ నుంచి ఉరవకొండ నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీరు అందించే పైపు లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న డిమాండ్లతో జలజాగరణకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బెళుగుప్ప మండలంలో 26,500 ఎకరాలకు సాగునీటిని మొదటిదశలోనే అందించాల్సి ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో అనంత కరువును శాశ్వతంగా నివారించాలన్న లక్ష్యంతో చంద్రబాబునాయుడు ఐదు టీఎంసీలతో తాగునీటి పథకంగా రెండుసార్లు శంఖుస్థాపన చేసి వదిలేసిన హంద్రీనీవా పథకాన్ని 40 టీఎంసీలకు పెంచారన్నారు. రెండుసార్లు జీడిపల్లి రిజర్వాయర్కు నీటిని కూడా తీసువచ్చారని గుర్తుచేశారు. -
చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు అనుమతి నిరాకరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి (ఉరవకొండ), అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురం నగరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వీకే భవన్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక సదస్సుకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ దీక్ష చేస్తారని తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు సదాశివారెడ్డి, రమణారెడ్డి మద్దతు తెలిపారు. -
'బాబు శ్వేతపత్రం విడుదల చేయాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు. హంద్రీ నీవా నీటి వినియోగంపై చంద్రబాబుకు స్పష్టత లేదని ఆరోపించారు. గత ఏడాది 12 టీఎంసీల నీటిని వృధా చేశారని విమర్శించారు. ఈ ఏడాది కూడా నీటిని వృధా చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో మూడున్నర లక్షల ఆయుకట్టుకు హంద్రీ నీవా నీరు ఇవ్వాల్సిందే అని చంద్రబాబు ప్రభుత్వాన్ని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. అనంత అవసరాలు తీరకుండానే మరో ప్రాంతానికి నీటిని తరలిస్తే ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హంద్రీ - నీవా ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. అనంతకు అన్యాయం జరుగుతున్నా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం స్పందించడం లేదని విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
'టీడీపీకి వ్యతిరేకంగానే ఓటు వేస్తారు'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు.. టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేయనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనైతికంగా గెలిచేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. నైతిక విలువలకు ప్రాముఖ్యం ఇచ్చి మెజారిటీ ఉన్న చోటనే వైఎస్సార్సీపీ పోటీకి సిద్ధమైంది. అధికార దుర్వినియోగం, అవినీతి సొమ్మును పెట్టేందుకు టీడీపీ సిద్ధమైంది' అని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. ఉవరకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం లేదని సీఎం చంద్రబాబు తీరుతో మరోసారి రుజువైందన్నారు. టీడీపీ గెలవని జిల్లాలను అభివృద్ధి చేసేది లేదంటూ అధికార పార్టీ నేతలే బహిరంగంగా చెప్పడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
'వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్ష కట్టింది'
అనంతపురం: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అధికార టీడీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా (వైఎస్సార్సీపీ) మండిపడ్డారు. సోమవారం ఆయన అనంతపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి (ఉరవకొండ) తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ సమావేశంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రొటోకాల్ పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలను కలిసిన అధికారులను బదిలీ చేస్తామంటూ టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని చాంద్ బాషా మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షంపై దాడులు చేయటం ఎంతవరకు సమంజసం అని చాంద్బాషా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. 'ఏదో ఒక రూపంలో ప్రజలకు సాయం చేస్తే చాలు' అనే కోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. -
ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అరెస్ట్
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు సోమవారం అనంతపురం నగరంలో చేపట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. పోలీసుల ఏకపక్ష తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ సహా 500 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నగరంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు వైఎస్ఆర్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని విశ్వేశ్వర రెడ్డి, శంకర్ నారాయణలు ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడటంలో చంద్రబాబు విఫలమయ్యారని, వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులను చేస్తూ ఆ పార్టీ నేతలు గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రసాద్ రెడ్డి హత్య కేసును పక్కనపెట్టి, తమపై అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబొస్తే జాబొస్తుందన్న మాటలేమయ్యాయి?: వైఎస్సార్సీపీ
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సూటిప్రశ్న సాక్షి, హైదరాబాద్: బాబొస్తే.. జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి టీడీపీ సర్కారును సూటిగా ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్రెడ్డి, చాంద్బాషా, జయరామయ్య, చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు. బాబు వచ్చారు.. కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించే పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు. కాంట్రాక్ట్ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 50 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను సగానికి సగం తొలగించారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీలను నెరవేర్చడం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని చెప్పి చేయకపోగా 30 వేలమందిని తొలగించారని ఎమ్మెల్యే చాంద్ బాషా మండిపడ్డారు. ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీ క్యాలెండర్కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రగల్భాలు తప్ప నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమిచ్చిన పాపాన పోలేదని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్రెడ్డి దుయ్యబట్టారు. బాబుకు, ఆయన పరివారానికి జాబులొచ్చాయి కానీ ఓటేసిన వారికి ఉద్యోగాలు రాలేదని మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎద్దేవా చేశారు. -
జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయి'
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాబు నెరవేర్చలేదన్నారు. సభలో ప్రతిపక్షం నిరుద్యోగ సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగాలు రాకపోగా...దాదాపు 50 వేల మంది ఉన్న ఉద్యోగాలను కోల్పోయారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంతో చర్చకు రాలేకే తమ వాయిదా తీర్మానాలను తిరస్కరించారని విమర్శించారు. ప్రాధాన్యత గల అంశాలను సభలో చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. -
జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయి
-
రైతుల బాధలు గాలికొదిలి.. విదేశాలకు చక్కర్లు!
-
మాటలు చాలు.. నిధులివ్వండి
ఉరవకొండ నుంచి సాక్షిప్రతినిధి : హంద్రీ-నీవాను పూర్తి చేసి, వంద టీఎంసీల నికర జలాలు కేటాయించి కష్టకాలంలోనైనా ‘సీమ’ రైతాంగానికి దన్నుగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించిన 25 గంటల నిరసన దీక్ష తొలిరోజు బుధవారం విజయవంత ంగా సాగింది. జిల్లా నుంచే కాకుండా ‘సీమ’ జిల్లాల నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, వ్యవసాయ, రైతుసంఘాల ప్రతినిధులు, పలు కుల, ప్రజా సంఘాల నేతలు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు, ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. హంద్రీ-నీవాపై గతంలో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ఎండగడుతూ, ప్రాజెక్టు నిర్మాణానికి పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కీర్తిస్తూ...ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న మరో మోసాన్ని ఎత్తిచూపుతూ నేతల ప్రసంగాలు సాగాయి. హంద్రీ-నీవాను పూర్తి చేసేందుకు బడ్జెట్లో వెయ్యికోట్ల రూపాయలను కేటాయించి పనులను పూర్తి చేసి, ఈ ఖరీఫ్ నుంచే సాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉరవకొండ పాతబస్టాండ్లో బుధవారం 25 గంటల దీక్షకు దిగారు. తొలుత ర్యాలీగా వచ్చిన విశ్వ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్రెడ్డితో కలిసి పాలభిషేకం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. పుంగనూరు ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విశ్వకు పూలమాల వేసి దీక్ష ప్రారంభింపజేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ అధ్యక్షతన సభ సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు.‘రాయలసీమకు కృష్ణా జలాలను మళ్లించాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. ఫలితం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాతే అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవాపై ఆశలు రేకెత్తాయి. రైతుల కష్టాలు తెలిసిన వారు కాబట్టే ముఖ్యమంత్రి అయిన మూన్నెళ్లలో టెండర్లు పిలిచి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. ప్రస్తుతం నీళ్లయితే కాలువల్లో కన్పిస్తున్నాయి. ఆనందంగా ఉంది. అయితే ఉప కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో నీళ్లున్నా ప్రయోజనం లేదు. పైగా ఎత్తిపోతల ద్వారా వచ్చిన ఈ 13 టీఎంసీల నీరు ఎంతో విలువైనవి. వీటితో 1.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించొచ్చు. కానీ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరించారు. ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ బడ్జెట్లో వందకోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో ఎలా ప్రాజెక్టును పూర్తి చేస్తారో చంద్రబాబు చెప్పాలి. రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జిల్లాలో కూడా భారీగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో రైతాంగాన్ని ఆదుకోవల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. అయితే చంద్రబాబు మాత్రం ఇటీవల శ్వేతపత్రం విడుదల చేశారు. హంద్రీ-నీవాను ఓ అనాలోచిత ప్రాజెక్టుకు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు అయిన వ్యయం మేర అరుునా రైతులకు ఆదాయం రాదని వ్యంగంగా మాట్లాడారు. 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు. ఇలాంటి జిల్లాపై ఆయనకు ఏపాటి బాధ్యత ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుంది. పైగా వైఎస్ కష్టంతో మూడేళ్లుగా వస్తున్న కృష్ణా జలాలను కొత్తగా ఈ ఏడాదే వీళ్లే తెచ్చినట్లుగా టీడీపీ నేతలు కాలువల్లోకి దిగి గంగమ్మ పూజలు చేస్తున్నారు. కొంచమైనా వీరికి సిగ్గుందా.. అని అడుగుతున్నా! ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదంటే డబ్బుల్లేవంటున్నారు. మరి కోస్తాలో 1300 కోట్ల రూపాయలతో పట్టిసీమను ఎలా నిర్మిస్తున్నారు? సీమలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందంటే వెయ్యికోట్లు ఇవ్వలేరా? జిల్లాలో ఐఐటీ, సెంట్రల్ యూనివర్శిటీ, ఏయిమ్స్ నిర్మిస్తానంటున్నావు.. ఢిల్లీకి వెళ్లి జీతాల్లేవంటావు. ఎన్నిరోజులు ఇలా ప్రజలను మోసం చేస్తావు.. ఆడబిడ్డల మెడలో బంగారు తాడు కూడా లేదు. నువ్వు చెప్పిన రుణమాఫీతో అందరూ మోసపోయారు. ఈ ఖరీఫ్లో సాగునీరు అందించాలి. ప్రభుత్వం కళ్లు తెరిపించడం కోసమే 25 గంటల దీక్షకు దిగాను’ అని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట చౌదరి, రాష్ట్ర కార్యదర్శి, సీపీ వీర న్న జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మైనుద్దీన్, ట్రేడ్యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాటి హుస్సేన్పీరా, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి జయరాంనాయక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబోలేశు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చింతా సోమశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండిపరశురాం, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యద ర్శులు నదీమ్ అహ్మద్, మీసాల రంగన్న, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, ట్రేడ్యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు సాలోన్బాషా, యువజనవిభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయ్ యాదవ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పామిడి వీరాంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి వైటీ గోవర్దన్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఆలమూరు రాజీవ్రెడ్డి, కార్యదర్శి వజ్ర భాస్కర్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగారెడ్డి. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి, జిల్లా కార్యదర్శి అంకిరెడ్డి ప్రమీల జిల్లా కార్యదర్శి, సూర్యనారాయణరెడ్డి, యువజనవిభాగం నగర అధ్యక్షుడు మారుతీ నాయుడు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రిలాక్స్ నాగరాజు, వలిపిరెడ్డి శివారెడ్డి, రాప్తాడు జెడ్పీటీసీ రవీంద్రారెడ్డి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కష్ణా జలాల కోసం నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్యతో పాటు చాలా మంది ముఖ్యమంత్రుల హయాంలో దశాబ్దాలుగా ఉద్యమాలు చేసినా ఫలితం లేదన్నారు. వైఎస్ సీఎం అయిన తర్వాతే బహత్తర ప్రాజెక్టు సాధ్యమైందన్నారు. వైఎస్ హయాంలో రూ.3,600 కోట్లు ఖర్చు చేశామని, ఆయన చనిపోయిన తర్వాత రోశయ్య, కిరణ్పై ఒత్తిడి తెచ్చి మరో రూ.2,140 కోట్లు రాబట్టామని తెలిపారు. ఫలితంగా మూడేళ్లుగా నీళ్లు వస్తున్నాయన్నారు. ఇప్పుడు తామేదో నీళ్లు తెచ్చినట్లు టీడీపీ నేతలు నీళ్లలోకి దిగి ఫొటోలకు ఫోజులివ్వడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు జరిగిన రహస్య ఒప్పందంతోనే చంద్రబాబు విజయవాడలో రాజధాని నిర్మిస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి విమర్శించారు. హంద్రీ-నీవా పూర్తి చేస్తే రాయలసీమ ప్రజల దప్పిక తీరడంతో పాటు వ్యవసాయానికి ప్రాణం వస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కొత్త ప్రాజెక్టులు ఎలాగూ చంద్రబాబు నిర్మించలేరని, కనీసం చివరి దశలోని హంద్రీ-నీవాను పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సూచించారు. సభలో ఎమ్మెల్యేలు అత్తార్ చాంద్బాషా, జయరాం, ఐజయ్య, మణిగాంధీ, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పత్తికొండ సమన్వయకర్త రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై. మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదంపై న్యాయవిచారణ జరిపించాలి: విశ్వేశ్వర రెడ్డి
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుకొండ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బస్సు డ్రైవరే ప్రమాదానికి కారణమని సీఎం వ్యాఖ్యానించడం బాధాకరమని విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ప్రమాదంపై రవాణా శాఖ కమిషనర్ నిష్పాక్షికంగా విచారణ చేస్తారన్న నమ్మకం లేదని సందేహం వ్యక్తం చేశారు. న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. -
"బస్సు ఘటనపై విచారణ జరిపించాలి'
-
'బస్సు ఘటనపై విచారణ జరిపించాలి'
అనంతపురం: మడకశిర ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని ఉరవకొండ వైఎస్సార్ సిపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద ఘటన బాధాకరమని విశ్వేశ్వరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో సహాయ చర్యల్లో పాల్గొనాలని జిల్లా వైస్సార్ సిపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. భాదిత కుటుంబాలను పరామర్శించేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘటనా స్థలికి రానున్నట్టు ఆయన తెలిపారు. -
కౌలు రైతుల పై కరువు ప్రభావం ఉంది : విశ్వేశ్వరరెడ్డి
-
మోదీ..భారత్ అంటుంటే...చంద్రబాబు మాత్రం...
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రహస్య అజెండా ఉందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం ఉదయం 'సాక్షి' హెడ్లైన్ షోలో మాట్లాడుతూ మోదీ భారత్...భారత్ అంటుంటే... చంద్రబాబు మాత్రం సింగపూర్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు రహస్య అజెండాపై చర్చ జరగాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌతమ్ డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేకూర్చాలని చంద్రబాబుకు లేదని టీడీపీ ఎమ్మెల్సీ రామ్మోహన్ అన్నారు. -
'జన్మభూమి'ని బహిష్కరించిన ఎమ్మెల్యే
అనంతపురం : ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి... అధికారంలో వచ్చిన టీడీపీ ప్రభుత్వం... ఆ హామీలను తుంగలోకి తొక్కిందని ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం పూడేరులో నిర్వహించిన జన్మభూమి - మాఊరు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు. అలాగే అదే జిల్లాలోని ఉరవకొండ మండలం టెక్సానుపల్లిలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. గ్రామంలోని సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నతాధికారులను నిలదీశారు. దాంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆగ్రహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో ఒకరినొకరు తోసుకున్నారు. మరింత ఆగ్రహించిన ఇరుపార్టీల వారు దాడులు చేసుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. -
ఈ హామీలు ఎలా నెరవేరుస్తారు?
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాలకు భారీ స్థాయిలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని వైఎస్ఆర్ సిపి అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి, కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషాలు ప్రశ్నించారు. రాజధానిపై శాసనసభలో లోతైన చర్చ జరగలేదని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదపడేలా రాజధాని ఉండాలని వారన్నారు. అనంతపురం జిల్లాకు త్రాగు, సాగు నీటి సరఫరాపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని వారు కోరారు. ** -
'కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. శివరామకృష్ణన్ నివేదిక మేరకే ఏపీలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అనంతపురంలో స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్ తో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీపీ సీఈసీ సభ్యులు మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని అంతకుముందు వైఎస్ఆర్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఎయిమ్స్, ట్రి పుల్ ఐటీ, ఇండియన్ సర్వీసెస్ సెంటర్, సెంట్రల్ యూనివర్సిటీ నెలకొల్పాలన్నారు. హిందూపురం ప్రాంతంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. -
చంద్రబాబును కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
అనంతపురం: అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైవీ విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్ బాషా కలిశారు. ఈ సందర్భంగా వారు అనంతపురానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు... చంద్రబాబును కోరారు. కాగా నాయుడి జిల్లా పర్యటన తొలి రోజు ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. ఎక్కడా ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. ముందుగా నిర్ణయించుకున్న విధంగా చెప్పాల్సింది చెప్పారు. రాష్ట్రం కష్టాల్లో ఉందని, ప్రజలు సహకరించాలని ప్రతి చోటా చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సమయం పడుతుందని, ఓపికతో ఉండాలని కోరారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలన్నీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నా.. రాష్ట్ర విభజన జరగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. మనకు అప్పులు మిగిలాయి. వనరులు కూడా కొద్దిగానే ఉన్నాయి. ఉన్నవాటిని ఉపయోగించుకుని అన్ని హామీలనూ ఒకొక్కటిగా నెరవేరుస్తా. నేను ఒక్కటే చెబుతున్నాను. నాకు మీ సహకారం ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడం పెద్ద కష్టమేమీ కాదు’ అని అన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
కదిరిలో చాంద్బాషా, ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి
అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. కదిరిలో చాంద్ బాషా, ఉరవకొండ నుంచి విశ్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపును విజయం సాధించారు. ఇక గెలుపొందిన టీడీపీ అభ్యర్థుల వివరాలు: *అనంతపురం అర్బన్- వి.ప్రభాకర్ చౌదరి *తాడిపత్రి-జేసీ ప్రభాకర్ రెడ్డి *గుంతకల్లు-జితేందర్ గౌడ్ *కళ్యాణదుర్గం-ఉన్నం హనుమంతరాయ చౌదరి *పెనుకొండ-వీకే పార్థసారధి *హిందూపురం-బాలకృష్ణ *మడకశిర-ఈరన్న *పుట్టపర్తి-పల్లె రఘునాథ్ రెడ్డి *ధర్మవరం-వరదాపురం సూరి *రాప్తాడు-పరిటాల సునీత *అనంతపురం ఎంపీగా- జేసీ దివాకర్ రెడ్డి *హిందూపురం ఎంపీగా- నిమ్మల కిష్టప్ప